ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్కగా కర్నూలు అవతరించబోతోంది. ఏప్రిల్ నాటికి పార్క సామర్ధ్యం మేర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సౌరఫలకాల ఏర్పాటు పూర్తి కాబోతుంది. ఇప్పటికే 90% వరకు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్ల పూర్తయ్యాయి.

తమిళనాడులోని రామనాధపురంలో అదానీ సంస్థ నిర్మించిన సోలార్ పార్కే(648 మెగావాట్లు) ఇప్పటి వరకూ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. కర్నూలు పార్క సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కావడంతో దాని కంటే పెద్దది కాబోతోంది.

కర్నూల్ సోలార్ పార్కులో సన్ ఎడిసన్ అనే సంస్థ 2015 నవంబరులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండరును దక్కించుకుంది. యూనిట్ విధ్యత్ కు రూ.4.64 ధరను ఆ సంస్థ కోట్ చేసింది. దేశంలోనే ఇప్పటి వరకు అదే తక్కువ ధర. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్ ఎడిసన్ సౌర విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సన్ ఎడిసన్ నుంచి ఈ బాధ్యతను గ్రీన్ కో అనే సంస్థ తీసుకుంది.

సౌర విద్యుత్ యూనిట్ల పనులను ముమ్మరం చేసిన గ్రీన్ కో ఏప్రిల్ నాటికి 500 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని నెలకొల్పబోతోంది. 2015 డిసెంబరులో అదే ధర(యూనిట్ రూ. 4.64 పైసలు)కు సాఫ్ట్ బ్యాంకు కర్నూలు సౌర పార్కులోనే 350 మెగావాట్ల సౌర విద్యుత్ టెండరును చేజిక్కించుకుంది. టెండరు దక్ష్కించుకున్న దగ్గర నుంచీ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలన్న తపనతోనే ఫ్ట్ బ్యాంకు పని చేస్తూ వస్తోంది.

kurnool solar park 25032017 2

kurnool solar park 25032017 3

kurnool solar park 25032017 4

kurnool solar park 25032017 5

kurnool solar park 25032017 6

Advertisements

Advertisements

Latest Articles

Most Read