భారీ సినీ తారాగణం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ తారలు అమరావతి ప్రజలను అలరించనున్నారు. మార్చి 20 నుంచి 26వ తేదీ వరకు ఈ (సీసీఎల్) సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

క్రికెట్ అభిమానులతో పాటు, సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు కాబోతున్న క్రికెట్ పండుగకు ఇందిరా గాందీ స్టేడియం వేదిక కానుంది. కార్యక్రమ నిర్వహణ బాధ్యత "విబ్రీ మీడియా"కు అప్పగించారు. క్రికెట్ పండుగను రాజకీయాలకు అతీతంగా అత్యంత ప్రతిషాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెండితెర అగ్రతారలు, క్రికెట్ తారలు పాలుపంచుకోనున్నారు. ఆ తారలతో అగ్రిమెంటు పనులు కూడా దాదాపు పూర్తయినట్లే. ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

రాజకీయాలతో వేడెక్కిన విజయవాడను కొద్ది రోజులు ఆ వాతావరణానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో, ప్రజలకు పూర్తి స్థాయి వినోదం పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఏ సినీ క్రికెట్ లీగ్ లో పాల్గొనని మహేష్ బాబును తీసుకువచ్చేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మహేష్ బాబుతో పాటు జూనియర్ ఎన్టీయార్ ను కూడా లీగ్ కు ఆహ్వానిస్తున్నటుగా తెలుస్తోంది. ఇపుడు ఈ ఇద్దరు అగ్ర హీరోలను కార్యక్రమానికి తీసుకువచ్చి జనాలకు వినోదం, ఆనందం పంచాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

నాగారున, వెంకటేశ్, శ్రీకాంత్, అఖిల్, తరుణ్. నితిన్, సచిన్, గిల్క్రిస్ట్, పాంటింగ్, కలిస్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ తారలు క్రికెట్ లీగ్ లో సిక్లర్ల రికారులను బద్దలు కొట్టనున్నారు. వీరితోపాటు మరికొందరు సినీతారలు, క్రికెట్ ఆటగాళ్లు పాల్గొంటారు. క్రికెట్ గ్రూపలకు అంబాసిడరుగా కొందరు హీరోయిను విచ్చేసి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read