గన్నవరం విమానశ్రయంలో త్వరలో దుర్గగుడి నమూనా రాజగోపురాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దుర్గగుడి రాజగోపురం నమూనా మోడల్ తయారు చేసి సియం దృష్టికి తీసుకువెళ్లి అనుమతులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దుర్గగుడి ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఇప్పటికే ఒక నమూనా తయారు చేసినట్లు తెలిసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దుర్గగుడి బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఎయిర్ పోర్ట్ లో అమ్మవారి రాజగోపుర నమూనను ఏర్పాటు చేయనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read