తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ నెల 30న విజయవాడ, తిరుపతికి రానున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి విజయవాడ, తిరుపతికి కేసిఆర్ వస్తున్నారు. శ్రీవారికి రూ.5 కోట్ల కానుక‌లు చెల్లిస్తారు. 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని, 4.650 కిలోల ఐదు పేటల కంఠాభరణాన్ని కెసిఆర్ తిరుమల వచ్చి స్వయంగా స్వామివారికి వాటిని బహుకరిస్తారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక మొక్కు కుడా కెసిఆర్ బహుకరిస్తారు.

ఈ నెల 30వ తేదీ ఉదయం తిరుమల చేరుకొని, స్వామి వారిని దర్శించుకుని, కానుకలు సమర్పిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి, విజయవాడ చేరుకొని, దుర్గమ్మ దర్శనం చేసుకుని, మొక్కు తీర్చుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుని కలుస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read