కనకదుర్గ గుడివద్ద నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. శనివారం కలెక్టర్ కుమ్మరిపాలెంవద్ద ఫైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశలువారీగా జరిగిన పనుల్లో భాగంగా తుదిగా వింగ్స్, స్పైన్స్ బిగింపు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
మొదటి దశ పనుల్లో భాగంగా పైల్స్, పిల్లర్ల నిర్మాణం, తరువాత ఫిల్లర్ క్యాప్స్ నిర్మాణం జరిగిందని చివరిదశ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. చివరిదశ పనుల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు విధించటం జరిగిందని, నాలుగునెలల్లో ఫ్లైఓవర్ ప్రయాణీకులకు అందుబాటులోనికి వస్తుందన్నారు. ఫ్లైఓవర్ పనుల్లో భాగస్వాములు అయిన ప్రతిఒక్కరికీ కలెక్టర్ బాబు.ఎ అభినందనలు తెలిపారు.
Advertisements