విజయవాడలో తొలిసారి నేవీ షో జరగనుంది. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ విన్యాసాలను నిర్వహించేందుకు విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చిన నావికాదళం సిబ్బందితో పన్నమి ఘాట్ సందడి సందడిగా మారింది.

విన్యాసాల సమయమిదే.
ఫిబ్రవరి 2:
పన్నమిఘాట్ వద్ద సాయంత్రం 4 గంటలకు విన్యాసాలు ప్రారంభం కానున్నాయి.
చేతక్, జెమినీ, జెట్ స్కీ, పారా సెయిలింగ్ ప్రదర్శన, ఆయిల్ రిగ్గు ధ్వంసం, జల క్రీడలు, హెలికాప్టర్ల నుంచి సిబ్బంది దిగుతూ విన్యాసాలు, సూర్యాస్తమయ విన్యాసాలు చేస్తారు.

ఫిబ్రవరి 3:
సాయంత్రం 4 గంటలకు పన్నమిఘాట్ వద్ద నావికా దళం చీఫ్ వైస్ అడ్మిరల్ ఎ.కె.జైన్ పర్యవేక్షణలో విన్యాసాలు జరగనున్నాయి. మొదటి రోజున జరిగే విన్యాసాలు తిరిగి ప్రదర్శిస్తారు. గంటన్నర పాటు విన్యాసాలు ఉంటాయి

ఫిబ్రవరి 4:
ముఖ్యమంత్రి చంద్రబాబు, నావికా దళానికి చెందిన అత్యున్నత అధికారుల సమక్షంలో సాయంత్రం 4 గంటలకు విన్యాసాలు జరుగుతాయి. రెండున్నర గంటల పాటు విన్యాసాలు, అతిథుల ప్రసంగాలు ఉంటాయి. బాణా సంచా కాల్చటంతో విన్యాసాలు ముగుస్తాయి.

ఫిబ్రవరి 5:
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేవీ బ్యాండ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు బ్యాండ్ ప్రదర్శిస్తారు. 36 మంది నిపుణులైన నావికా సిబ్బంది పాల్గుంటారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read