కనకదుర్గ గుడి టోల్ గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటరు వరకు రోడ్డును మరమ్మతులు చేస్తున్న దృష్యా 10 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10 రోజుల పాటు ఎటువంటి వాహనాల రాకపోకలను అనుమతించరని తెలిపారు.

మళ్లింపులు ఇలా
విధ్యధరపురం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనచోదకులు బి.ఆర్.పి. రోడ్డు, వి.జి. చౌక్, చిట్టినగర్, సొరంగం మీదుగా వెళ్లాలి. వయా ఎర్రకట్ల, సొరంగం ద్వారా, వయా వై.వి.రావు ఎస్టేట్, పాల ఫ్యాక్టరీ పైవంతెన, సితార కూడలి మీదుగా విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి.

గోల్లపూడి వైపు నుంచి ప్రయాణికులు, పాదచారులు సితార, పైవంతెన, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, వి.జి. చౌక్, పంజా సెంటరు, పశ్చిమ బుకింగ్, లో బ్రిడ్జి మీదుగా చేరుకో వాలి

గోల్లపూడి నుంచి పైవంతెన, వై.వి.రావు ఎస్టేట్,పైపుల రోడ్డు మీదుగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు చేరుకోవాలి.

ఈ ట్రాఫిక్ మళ్లింపులు 10 రోజులు ఉంటాయని. ప్రజలు వీటిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read