ఇప్పటికే, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం పేరుతో 6,117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహా బృంద నాట్యం గిన్నిస్‌ బుక్ ఆఫ్ రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్ళి అదే ఇందిరా గాంధీ స్టేడియంలో, వేరొక గిన్నీస్ రికార్డు ప్రదర్సన జరిగింది. జడ కోలాటం అనే. సంప్రదాయ నృత్యాన్ని, గిన్నీస్ రికార్డు వరకు తీసుకెళ్లారు సాంఘిక సంక్షేమ, గరుకుల పాఠశాల విద్యారులు.

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం రాత్రి జడల కోలాటాన్ని నిర్వహించారు. 2500 మంది. 125 బృందాలుగా. 125 వృత్తాల్లో. 125 జడలు అల్లి రికార్డును నెలకొల్పారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి 411 పాఠశాలల విద్యార్ధులు జడ కోలాటంలో పాల్గొన్నారు. 36 నిమషాల పాటు, జడ కోలాటం ఆడి రికార్డు నెలకొల్పారు. కోలాటం ఆడుతూ, వివిధ రకాలలో జడలు అల్లటం, జడలు విప్పటం లాంటివి చేసారు.

లయ బద్ధంగా సాగిన ఈ ఆట కనువిందు చేసింది. స్టేడియం కోలాట శబ్దాలతో మారు మోగింది. ఈ క్రింది వీడియోలో మీరు చూడవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read