tdp balaram 28032016

పార్టీ ఫిరాయిస్తున్న నేతలతో ఏనాటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ పార్టీ సీనియర్ నేత, 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలంటే, తనతో సంప్రదిస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానివల్ల ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చంద్రబాబునాయుడితో తనకున్న సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవాలని, 30 ఏళ్లకు ముందు తామెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉందనిపించిన వేళ, కొన్నిసార్లు ముందుగానే అడుగువేయాల్సి వస్తుందన్నారు. తానెన్నడూ తప్పు చేయలేదని, తనపై అన్ని కేసులనూ కొట్టేశారని గుర్తు చేశారు.

జిల్లాలో కిడ్నాప్ అయిన వారి గురించి ప్రశ్నించగా, ఎవరో ఎక్కడో సన్యాసుల్లోకి వెళ్లి కలిస్తే, వారి సమాచారం తనకెలా తెలుస్తుందని అన్నారు. క్యాడర్‌ను నిలుపుకునేందుకు కొన్ని సార్లు పరిధులు దాటాల్సి వస్తుందని అంతమాత్రాన నేరాలు చేసినట్టు కాదని అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేనని కరణం బలరాం తెలిపారు.

Advertisements

జగన్ పార్టీలో చేరడం లేదు:కరణం బలరాం Last Updated: 28 March 2016