collector yeruvaka 17092016 1

విషయం ఉన్నవాళ్ళు, వాళ్ళ  పనితోనే  సమాదానం  చెప్తారు... అర్ధం  కాలేదా  ? సచిన్ టెండూల్కర్  విమర్శకులకి , తన బ్యాట్ తోనే సమాదానం చెప్పేవాడు... విషయంలోకి  వస్తే, జూన్  20, 2016లో, నర్సాపురం మండలం చిట్టవరంలో, ప‌ద్మ‌శ్రీ మంగిన వెంక‌టేశ్వ‌ర‌రావు పొలంలో,  “ఏరువాక” కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  ప్రారంభించారు. పొలంలో వరినాట్లు యంత్రం స్వయంగా నడిపి నాట్లు వేశారు.

ఇంకేముంది, ఎప్పటిలాగే విషప్రచారం  మొదలుపెట్టింది  “సాక్షి”... జనాలని  తప్పుదోవపట్టించి, అదోరకమైన  ఆనందం పొందింది.. దానికతోడు, కులపిచ్చ వెబ్ మీడియా...” నారుపోసి.. నీళ్లు మరిచి” అనే శీర్షికను  ఆగష్టు నెలలో ప్రచురించింది.. స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలో నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చిందని ఒక ఐటెం రాసింది...

కట్ చేస్తే, సాక్షి అడ్డంగా దొరికిపోయింది... సాక్షి  రాసే  ప్రతి అక్షరం విషపు రాతలే, అని మరోసారి  రుజువైంది...ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకలెక్టర్, నర్సాపురం MLA బండారు మాధవ నాయుడు స్వయంగా  ఆ పొలంలో వరిపంట కోత కోసి చూపించారు...చంద్రబాబు వరినాట్లు వేసిన పొలం, ఎంత పచ్చగా ఉందో చూపించారు...ఇప్పుడు మూడో పంటకు సిద్దమవుతుంది ఆ పొలం... 

ఏమి చేస్తాం, కొన్ని జీవితాలు అంతే , పచ్చగా ఉంటే చూడలేవు... అందుకే, సాక్షి గూబ గుయ్యిమనేలా సమాధానం చెప్పారు...

ఇంకా డౌట్ ఉంటే , ఈ ఫోటోలు చూడండి...

collector yeruvaka 17092016 2

collector yeruvaka 17092016 3

collector yeruvaka 17092016 4

tollywood heroes 29072016

హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ లు గురించి....అది హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, హరిత హారం అని తెలంగాణా ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే, ఒక్కొక్కడు ఎగబడి, మొక్కలు నాటుతూ ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసి, లెక్చర్లు ఇచ్చారు..

సరే, మంచి పనికి సహకిరించారు, దాంట్లో తప్పేమీ ఉందిలే అనుకున్నాం...కాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వనం-మనం అంటే, ఒక్కడు కాకపొతే, ఒక్కడు కుడా కన్నెత్తి ఇటు చూడలా...మరి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావామో, చంద్రబాబు అంటే లెక్కలేని తనమో...

వైజాగ్ లో స్టూడియో లు కట్టుకోవటానికి, ఫిలిం ఛాంబెర్లు ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావలి....అక్కడిదాకా ఎందుకు, వీళ్ళ సినిమాలు కలెక్షన్ రావాలి అంటే, ఆంధ్రావాడు కావాలి...ప్రభుత్వం ఒక సామాజిక కార్యక్రమానికి పిలుపు ఇస్తే, ఒక్కడు అంటే ఒక్కడు ముందుకు రాలేదు అంటే, వాళ్లకి కాదు, వాళ్ళను ఇంకా ఆదరించి, అభిమాన హీరోలుగా ఆరాధించే మనకు ఉండాలి...

ఎవ్వడు ముందుకి వచ్చినా, రాకపోయినా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి, తమ రాష్ట్రము పట్ల అభిమానం ఉంది...అందుకే ఇవాళ వాడవాడలా, పెద్ద, చిన్నా అందరం కలిసి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తీ చేసుకున్నాం...మీలాగా ఫోటోలు  సోషల్ మీడియాలో పెట్టుకోము, ఇంతటితో దులుపుకుని వెళ్లిపోము....ఆ మొక్కకి, మేమే రోజు నీళ్ళు పోస్తాం, దేగ్గరుండి పెంచుతాం, పెద్దది చేస్తాం, మా రాష్ట్రాని హరితాంధ్రప్రదేశ్ చేసుకుంటాం...మీ నాటకాలు మీరు హైదరాబాద్లో ఆడుకోండి టాలీవుడ్ హీరోలు..

krishna pushkaralu 6 10072016

పవిత్ర కృష్ణవేణి, ఉత్తరవాహినిగా పేరుగాంచి తీరం వెంబడి వున్న పుణ్యక్షేత్రాలో అత్యంత ప్రసిద్దమైన పుణ్యక్షేత్రంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం పుష్కరయాత్రికులకు స్వాగతం పలుకుతోంది.

పూర్వం ఈ పుణ్యక్షేత్రాన్ని రావూరు అని పిలిచేవారు. కృష్ణానదికి ఆనుకుని క్రౌంచాద్రి అనే పర్వతం వుంది. శ్రీమన్నారాయణుడు భక్తులను తరింపజేయడానికి ఆ కొండపై కొలువుండి అక్కడకు వచ్చే ఆవుల పాలు తాగుతూ కొన్నాళ్లకు గ్రామంలోని ఒక బ్రాహ్మణోత్తమునకు కలలో కనిపించి క్రౌంచాద్రిపై తాను ఒక గుహలో కొలువై ఉన్నానని, గుహకు దగ్గరలో రావిచెట్టు వుంది, దాని వద్ద నేలను తవ్వినట్లయితే ద్రవ్యం దొరుకుతుంది. ఆ ధనముతో తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించినట్లు చెబుతారు.

స్వామివారి ఆజ్ఞప్రకారం గుహవద్ద తవ్వగా అక్కడ ధనం లభించింది. దానితో స్వామివారి గుహ వద్ద నుంచి కొండ దిగువ భాగానికి కొండరాళ్లను పగులగొట్టించి దారిచేయునపుడు, స్వామి వారు కనిపించి నేను ఈ పర్వతమందు ఆవహించియున్నారని , శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించినట్లు సెలవిచ్చారట.

అంతట బ్రాహ్మణుడు ఆ గుహనందు చూడగా నిరాకార ఆకారంలోగల శ్రీ స్వామివారిని తిలకించి విగ్రహరూపంలో స్వామివారిని మలిచారని , అక్కడ శిల్పులు ఉలిపెట్టి కొట్టగా ఆ ప్రదేశం నుంచి రక్తం కారిందని చెబుతారు. అంతట స్వామివారు బ్రాహ్మణునితో నేను నిరాకార నిరంజనుడను , నాకు ఆకారంతో పనిలేదు, నా వక్షస్థలంపై గాయపరిచినారు. కావున నిత్యం గాయంపై గంధము వుంచమని ఆజ్ఞాపించాడట. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నిత్యం మంచి గంధం శ్రీ స్వామివారికి సమర్పిస్తున్నారు.

క్రౌంచాద్రి పర్వతం చుటూ 8 మంది ఆంజనేయులను ప్రతిష్టించి అష్టదిగ్గజము గావించారు. స్వామివారి సన్నిధిన ఉత్తరంగా కొండపైన కాలభైరవ క్షేత్రం వుంది. దీనికి దిగువన వున్న ఉత్తర వాహిని నందు గల పంచలింగములకు , స్వామివారికి దేవతలు , బుషులు , నిత్యం పూజలు జరుపుతారని ప్రతీతి. కృష్ణానది ఈ క్షేత్రం వద్ద ఉత్తరవాహినిగా పిలువబడుతోంది. ఈ క్షేత్రానికి మరోపేరు బంధవిరామ క్షేత్రం.

గోమాత నుంచి తన వృత్తాంతమును తెలుసుకుని పశ్చాత్తాపముతో పాప విముక్తి పొందుటకు ఈ వైకుంఠపురం పుణ్యక్షేత్రానికి వచ్చి ఉత్తరంగా ప్రవహించు కృష్ణవేణిలో స్నానమాచరించి వెంకటేశ్వరస్వామిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించగా వారికున్న బంధము విడిపోయింది. అందువలన ఈ క్షేత్రాన్ని బంధవిరామ క్షేత్రంగా పిలుస్తారు. వారి విగ్రహాలు క్రౌంచాద్రి పర్వతంపై ఒక గుహలో వున్నాయి.

ఈ క్షేత్రం అమరావతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ మార్గమధ్యంలో వుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి విజయవాడ నుంచి అమరావతికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం కలదు.

krishna pushkaralu 7 11072016

అనాదిగా ఆంధ్రప్రదేశంలో నాగారాధన ఉన్నదన్న విషయం అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశానికి నాగభూమి అనే పేరు కూడా ఉన్నది. ముఖ్యంగా నేటి దివితాలూకా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇదే విస్తీర్ణంలో కృష్ణకు ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతం కూడా కలుపుకొని ఉన్న ప్రదేశాన్నంతా ఒకప్పడు నాగభూమిగా వ్యవహరించే వారు. స్థలపురాణం - ఇంద్రాది దేవతల ప్రార్థన మేరకు లోపా ముద్రతో కలసి అగస్త్య మహర్షి వారణాసి నుండి అయిష్టంగానే బయలు దేరి మేరువుతో సంఘర్షించి లోకోపద్రవము కలిగిస్తూ ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని నిరోదించి వింధ్య పర్వతాన్ని చూచి తాను దక్షిణ దేశ పుణ్య తీర్థ యాత్రలకు వెళుతున్నాను కనుక నీవు కొంచెం తగ్గి వుంటే దక్షిణ దేశంలోకి ప్రవేశిస్తాను. మరల నేను వచ్చేంత వరకు ఆ విధంగానే వండమనగా మునిశక్తికి బయపడి వింధ్య పర్వతం తలొగ్గింది.

లోపాముద్ర సహితుడై అగస్యుడు దక్షిణావనిలో ప్రవేశించి అక్కడే వుండిపోయాడు. వింధ్య పర్వతానికి శాశ్వతంగా గర్వభంగం చేశాడు. దక్షిణ దేశంలో శిష్యులతో , భర్తతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణానది తీరంలోని కుమారక్షేత్రానికి (మోపిదేవి) వచ్చారు. తన దివ్యదృష్టితో దాని మహత్యాన్ని గాంచారు. పాములు ముంగీసలు కలిసి ఉన్నాయి. ఒక చోట దివ్వ తేజస్సుతో ప్రకాశించే పుట్టను చూశారు. ఒకానొక అల్పదోష పరిహారము కోసం సుబ్రహ్మణ్యస్వామి ఉరగ రూపమును ధరించి ఇక్కడ ఒక శ్రేష్టమైన వల్మీకంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ అంశం గ్రహించి సుబ్రమణ్యస్వామిని కొలిచి తరించవలెనని అనుకున్నాడు. తాను దివ్వదృష్టితో చూచిన ఈ విషయాన్ని తన వారితో చెప్పాడు. పడగవలే ఉండే శివలింగాన్ని ఆ పుట్టపై ప్రతిష్టించాడు. నాగకుమార ద్వయం ఏకరూపమై నిలిచిన పుణ్యక్షేత్రం ఇది.

మొట్టమొదటగా ఈ స్వామిని అర్పించినది మహర్షి అగస్త్యుల వారు. అగ్రస్త్య మహర్షి చేత పూజింపబడిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యాన్ని అవగతం చేసుకున్నదేవతలు, మునులు తమ శక్త్యాను సారం స్వామి వారికి అర్చన విధులు గావించేవారు. ప్రశాంతమైన ఈ పుణ్యభూమిలో మునులు తపస్సు చేసుకోసాగారు.ఈ కాలంలో పుట్టకు గుడిలేదు. భక్తుల సందడి లేదు. లౌకికపు వైభవం లేదు. దేవతాది గణం చేత పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగం కొన్నాళ్లు కాలగర్భంలో తన ఉనికిని విస్మరింపు చేసి పుట్టలోనే అంతర్గతంగా ఉంది.

పవిత్రమైన ఈ పుట్టకు దగ్గరలో కొంత మంది కుమ్మరులు నివాసం ఉండే వారు. వారిలో వీరారపు పర్వతాలు అనే వ్యక్తి మహాభక్తుడు. అతనికి స్వప్నంలో కుమారస్వామి కనపడి పుట్టలో నుండి లింగాన్ని తీసి ప్రతిష్టించమని ఆదేశించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని లింగ ప్రతిష్ట చేశాడు. తర్వాత తనకు తోచిన రీతిలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికరమైన వస్తువులను మృత్తికతో నేర్పుగా కాల్చి వాటిని శ్రీ స్వామి వారికి సమర్పిస్తూ ఉండేవాడు. గుర్రము , నంది, కోడి , గరుత్మంతుడు మొతలైన మట్టి విగ్రహాలు తయారు చేసి సమర్పించాడు. వాటిని ఈ నాటికి మన తరం కూడాచూడవచ్చు.

తర్వాతి కాలంలో దేవరకోట ప్రభుతువలు స్మామి వారి మహిమలు విని భక్తుల సహకారంతో ఆలయ మంతా పాదులు కట్టించి స్వామివారికి సేవలలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తగా తమ దేవాలయ పాలన గావించారు. ఇటీవల కాంలో మరల దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా దేవాదాయ శాఖ వారు తీర్చిదిద్దారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తూర్పు దిశగా ఉన్నది. గర్భగుడిలో ఆరు లేక ఏడు పాము చుల మీత (ఇదే పావనపట్టం) ఆశ్వరుటు (లింగం) ఉన్నాడు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పావన పట్టం కింద అందరికి కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంది. అర్చన అభిషేకాదులపుడు ఆ రంధ్రంలో పాలు పోస్తారు. ఆలయ ప్రదక్షణ మార్గంలో దక్షిణం వైపున ఉన్న పుట్ట నుండి గర్భగుడి లోకి లోపలి దారి ఉన్నట్లు భక్తుల విశ్వాసం. దేవతా సర్పం ఈ మార్గం గుండా పయనిస్తుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో అర్చకులు పూజా కార్యక్రమాలు , అభిషేకాలు చేస్తుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి భక్తులు అనేక విధాలుగా మొక్కుకుంటారు. చెవి పోగులు కుట్టిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. పొంగలి నివేదిస్తారు. కళ్యాణం జరిపిస్తారు. అన్న ప్రాసన , అక్షరాభ్యాసం , స్వామి వారి సన్నిధిలో జరిపించుకుంటారు. శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు , మహాన్యాస పూర్వ వారాభిషేకాలు శాస్తోకంగా నిర్వహిస్తుంటారు. మహిళల చీర మొక్కుబడులు , పిల్లల ఉయ్యాల ఊపు మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

ఈ ఆలయానికి ఆగ్నేయ దిశగా స్వామి వారి కళ్యాణ మండపం ఉంది. దీనిని చల్లపల్లి రాజా వారి వంశస్థులు నిర్మించారు. కళ్యాణ మండప స్థంభము మీద ఉన్న శిలాఫలకం పై శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్, బహుదూర్ చల్లపల్లి రాజా వంశస్థులు , కోయంబతూరు వాస్తవ్యులు డి. జయవర్థన వేలు , వారి ధర్మపత్తి రాజ్యలక్ష్మి దంపతులచే భక్తి పూర్వకంగా సమర్పించబడినది.

krishna pushkaralu 5 09072016

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

 

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరు, వరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ , పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో , ఎక్కడ పల్లం ఉందో , ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందో, చెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోను, నర్మదానదికి వృషభరాశి, సరస్వతీ నదికి మిధునరాశి, యమునానదికి కర్కాటరాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణానదికి కన్యారాశి, కావేరి నదికి తులారాశి, భీమానదికి వృశ్చికరాశి, పుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకరరాశి, సింధునదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతి, సింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12 శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.