కర్నాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఒడించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శ్రీవారిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు రాత్రి 8.40 గంటలకు చేరుకోగానే తిరుమల జేఈవో కె.ఎస్‌ శ్రీనివాసరాజు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. అతిథిగృహంలో ఆయనకు టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లను చేశారు. ఆయనకు పెద్ద ఎత్తున భధ్రతా ఏర్పాట్లను చేయడంతో మీడియాను కూడా దరిదాపుల్లోకి పంపలేదు. ఆయన వెంట స్థానిక బిజెపి నేతలు భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్‌ ఉన్నారు. అమిత్ షా ఈ రోజు ఉదయం, తిరుమల శ్రీ వారని దర్శించుకున్నారు....

alipiri 11052018 1

అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, క్రిందకు వచ్చిన అమిత్ షాకు, అలిపిరి వద్ద నిరసనల సెగ ఎదురైంది... అమిత్ షా వచ్చే క్రమంలో, అలిపిరి వద్ద ఆందోళనతో నిరసన తెలపటానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అక్కడకు చేరుకున్నారు... మమ్మల్ని మోసం చేసారు అంటూ ప్లెకార్డులు పట్టుకుని, నిరసనన తెలియ చేస్తున్నారు... అమిత్ షా గో బ్యాక్ అంటూ ఆందోళన.. అయితే, పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలో పాల్గునటంతో, తిరుమల నుంచి కిందకు రావటానికి అమిత్ షా మరికొంత సమయం తీసుకుంటున్నారు... కింద అందరినీ క్లియర్ చేసే దాకా, అమిత్ షా కిందకు రారు అంటూ, అమిత్ షా సెక్యూరిటీ, తిరుపతి పోలీసులుకు సమాచారం అందించారు...

alipiri 11052018 1

దీంతో పోలీసులు, అలిపిరి వద్ద ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని, అమిత్ షా కు మా నిరసన తెలియచేస్తామని ఆందోళన కారులు చెప్తున్నారు.. అయితే, అక్కడ వాతావరణం ఉద్రిక్తితకు దారి తియ్యటంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. వారిని అక్కడ నుంచి పంపించి, క్లియరెన్స్ ఇచ్చే దాకా, అమిత్ షా తిరుమల నుంచి కిందకు వచ్చే అవకాసం కనిపించటం లేదు... మొత్తానికి, తెలుగుదేశం పార్టీ, మరో సారి, ఢిల్లీ నేతలకు చుక్కలు చూపిస్తుంది... అమిత్ షా లాంటి పవర్ఫుల్ నేతకు, ఆంధ్రోది దమ్ము ఏంటో చూపిస్తున్నారు... వీరిని చూసైనా, పవన్, జగన్, ఇప్పతకైనా మోడీ పై పోరాడాలి...

అన్నీ అనుకున్నట్టే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నాయి... కర్ణాటక ఎన్నికలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు... అలా చెప్పినట్టు గానే, ఈ రోజు కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియగానే, ఆంధ్రా అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు... మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని, ఎగతాళి చేసింది ఈయనే... ఇలా ఆంధ్రా పై అడ్డగోలుగా వాదించినందుకు, బహుమానంగా, రాజ్యసభ ఇచ్చి సత్కరించారు అమిత్ షా... అందుకే ఆ విశ్వాసం చూపిస్తూ, ఆంధ్రా పై మరింతగా విరుచుకు పడుతున్నాడు జీవీఎల్... సరిగ్గా కర్ణాటక ఎన్నికల ప్రచార హడావిడి ముగిసిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ పై వ్యాఖ్యలు చేసారు...

gvl 10052018 2

ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని రోజుల్లోన్నే అనూహ్య పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు... రాజకీయంగా అన్ని పార్టీలు, ఈ అనూహ్య పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు... చంద్రబాబు నాయుడు అవినీతి చేసారని, దాని అంతు చూస్తాం అంటూ పాత పాటే పాడారు... జనవరి నెల నుంచి, ఇదే మాట చెప్తూ, సిబిఐ అని, లోకేష్ ని లోపల వేస్తాం అంటూ, హడావిడి చెయ్యటం, సాక్షి వాడు ఇదే వార్త బ్యానేర్ ఐటెం వెయ్యటం, చింతలబస్తీ బ్యాచ్, బీహార్ బ్యాచ్ ఆనంద పడటం, చూస్తూనే ఉన్నాం... చంద్రబాబు మరింతగా, మోడీ పై విరుచుకు పడుతున్నారు కాని, ఎక్కడా ఈ ఉడత ఊపులకు వెనక్కు తగ్గలేదు...

gvl 10052018 3

అంతే కాదు, జీవీఎల్ న‌ర్సింహారావు మాట్లాడుతూ, ఆంధ్రాలో రాబోయే ఆరు నెల‌ల్లో భాజ‌పాకి మ‌హ‌ర్ద‌శ రాబోతోంద‌ని, ఆంధ్రప్రదేశ్ ని ఏలేది మేమే అంటూ, జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నామని, ఎడ్యూర‌ప్ప‌పై ఏ అభియోగాలు లేవ‌ని, ఆయన చాలా క్లీన్ అని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసాం అంటూ, చెప్పుకొచ్చారు.. కర్ణాటక రాష్ట్రంలో భాజ‌పా అధికారంలోకి వ‌చ్చాక సిద్ధరామయ్య పై విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ఎడ్యూర‌ప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిప‌రుడు అయిపోతారా అంటూనే, జగన్ కూడా ఇదే బాపతు అనే విధంగా, మాట్లాడి వీరి బంధాన్ని బయట పెట్టారు.. మొత్తానికి, జీవీఎల్ మాటలు వింటుంటే, గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది... వీళ్ళు ఆంధ్రాలో చేసేది ఏమి లేదు, కనీసం చంద్రబాబుని టచ్ కూడా చెయ్యలేరు.. ఎందుకో ఈ గాంభీర్యం...

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, లాస్ట్ మినిట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు... ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే.. అయితే అంతకు ముందే, కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రసంగిస్తూ... కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని తాను చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. అలా చెప్తూనే, ఏపీకి అన్యాయం చేసిన పార్టీకి సహకరించొద్దని మాత్రమే చెప్పానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మనకు అన్యాయం చేసిన వారికి మాత్రం ఓటు వెయ్యొద్దన్నారు. అయితే ఏపీలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదని సీఎం జోస్యం చెప్పారు.

karnataka cbn 10052018 2

అవినీతి కేసుల పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందని, లేదంటే ఎన్నికల తరువాత కలుపుకోవాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కేంద్రంతో పోరాడుతుంటే వైసీపీ నాపై పోరాడుతోందని, బీజేపీతో లాలూచీ పడుతున్న వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రమంటే మోదీకి ఎందుకంత చిన్నచూపని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌, భాజపా రెండు పార్టీలు ద్రోహం చేశాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి తన కష్టార్జితమని వ్యాఖ్యానించారు.

karnataka cbn 10052018 3

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై తాను పోరాడుతుంటే వారితో లాలూచీపడ్డ పార్టీలు తనను విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకున్నా.. లేకున్నా అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.
2014 ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దానిని నిర్మించి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొన్ని నెలలు క్రితం జరిగిన సంఘటన ఇది... త్వరలోనే శ్రీకాకుళంలో ధర్నా చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ధర్నా చేయడం ఏమిటి అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేసాయి... సాధారణంగా ప్రతిపక్షాల వాళ్లు ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉంటారు... అయితే ఏపీ సీఎం ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఎందుకలా.. అంటే, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ఏపీ సీఎంకు ఆగ్రహం వచ్చింది. ఈ విషయంలో జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని ఆయన చెప్పారు. అక్కడ ప్రజల్లో, అధికారుల్లో చలనం తేవడమే లక్ష్యంగా శ్రీకాకుళంలో తను ధర్నాను చేపట్టబోతున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు.

cbn employees 1002018

అయితే ముఖ్యమంత్రి చేసిన ఈ హెచ్చరికను అక్కడి అధికారులు నిజం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం గోపాలపురంలో మరుగుదొడ్లు నిర్మించుకోడానికి ముందుకురాని వారి ఇళ్ల ఎదుట ఆందోళనకు దిగారు అక్కడి అధికారులు. ఈ గ్రామంలోని 54 కుటుంబాలవారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోడానికి ముందుకు రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ కుటుంబాల్లో మార్పు రాలేదు. దీంతో తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీడీవో తిరుపతిరావు, ప్రత్యేకాధికారి రాంబాబు బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. ఎంత చెప్పినా వారిలో మార్పు లేకపోవడంతో మండుటెండలో సుమారు గంటపాటు వారి ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

cbn employees 1002018

దీంతో గ్రామస్థులు స్పందించి.. ఆ 54 కుటుంబాలతో చర్చించారు. మూడు రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులు హామీ ఇవ్వడంతో అధికారులు ఆందోళన విరమించారు. దీనిపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి చంద్రబాబు చేసిన ఈ హెచ్చరిక భవిష్యత్తులో బాగానే వర్కౌట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అందరినీ కదిలింపజేయడానికి శ్రీకాకుళంలో ధర్నా అని ప్రకటించారు చంద్రబాబు, ఇది వరకూ ఇదే విషయంలో కలెక్లర్ల ఆఫీసు ముందు ధర్నాకు దిగుతా అని హెచ్చరించారు.. మొత్తానికి, చంద్రబాబు ఏదైతే ప్లాన్ చేసారో, అధికారులు కూడా ధర్నాలతో, ప్రజలకు అవగాహన కలిగించి, ప్రజలకు మంచి చేస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read