కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలానికి మహర్దశ పట్టనుంది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కీలకమైన ఓర్వకల్ లో సుమారు 1,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు సుమారు 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ముందుగా కర్నూలుకు తలమానికంగా మారిన జైరాజ్ ఇస్సాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. రూ. 3వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ఫ్యాక్టరీలో దాదాప 1,100 మందికి ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ పరిశ్రమకు అనుబంధంగా మరి కొన్ని పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. నంద్యాలలో రూ. 60 కోట్ల పెట్టబడితో ఏర్పాటు కానున్న ఆత్యాధునిక ఉదయానంద ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది.

kurnool 10052018

అంతే కాకుండా కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో రూ.30 కోట్లతో పుట్టు గొడుగుల పరిశ్రమ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డ పంటకు ప్రసిద్ది. ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టితో పాటు గిట్టుబాటు ధరలు లేక ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 30 కోట్లతో భారత్ ఉల్లిగడ్డల కోల్డ్ స్టోరేజి గోదాము నిర్మాణానికి అనుమతిచ్చారు. ఉల్లిగడ్డలు ధరలు లేని సమయంలో ఇక్కడ నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించుకునేందుకు వీలుగా ఈ కోల్డ్ స్టోరేజి రైతులుకు బాగా ఉపయోగ పడనుంది. పోలిశెట్టి కంజల్స్ పేరుతో డాక్టర్ రవిబాబు అనే పారిశ్రామికవేత్త రూ. 5.5 కోట్లతో మినరల్ సోడియం సెల్ఫ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.

kurnool 10052018

స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం మారనుంది. ఇక్కడ 34 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంతంలో దేశంలోనే రెండవ అతి పెద్ద పవర్ గ్రిడ్ ఓర్వకల్ సమీపంలోనే ఉంది. దేశంలోనే పెద్ద పవర్ గ్రిడ్ రాయచూర్లో ఉండగా, రెండవ అతి పెద్ద పవర్ గ్రిడ్ ఇక్కడ ఉండడం విశేషం. అంతేకాకుండా అతీ ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నుంచి అటు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి వంటి మహానగరాలు సమాన దూరంలోనే ఉన్నాయి. ఇక్కడ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలోనే విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతోంది. సుమారు 1500 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ హబ్గా మార్చేందుకు కూడా స్థల సేకరణ జరుగుతోంది. ఆరవిందో,హెట్రో వంటి ఔషధ కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ సీడ్ కంపెనీలు కూడా ఇక్కడ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.

kurnool 10052018

పరిశ్రమలను ఆకర్షించాలంటే అందుకు కనీస మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. ఇందుకు ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయల కోసం ఎపిఐఐసి రూ. 500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతానికి చేరువలోనే తుంగభద్ర, కృష్ణా నది ఉండడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మల్యాల ఎత్తిపోతల పథకం ఉండడం, హంద్రీ-నీవా కాలువ ఉండడంతో నీటి సౌకర్యానికి ఇబ్బందులు లేవు. నేరుగా కాల్వల ద్వారా నీటి సదుపాయాలను పొందే అవకాశాలు ఉన్నాయి. 100 మంది పారిశ్రామికవేత్తలతో నేడు సీఎం ఒప్పందాలు... పది కోట్ల లోపు పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. వీరితో చర్చించి పెట్టుబడులు పెట్టుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేసేందుకు ఈ సమావేశం కీలకంగా మారింది.

ఈ ఏడాది జులై నెలాఖరు నాటికి పంచాయతీల ఎన్నికలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. 2013 జులైలో మూడు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నూతన పాలకవర్గాలు ఆగస్టు 2న ప్రయాణస్వీకారం చేశాయి. వారి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 1తో ముగియనుంది. ఈ లోగానే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. అయితే ప్రభుత్వం దీనిపై తీసుకునే నిర్ణయమే అంతిమం.

election commission 09052018 2

ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొద్దికాలం కిందట ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని రాష్ట్ర ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలో తాజా ఉత్తర్వులను వెలువరించింది. మే 15న గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా చిత్రాలతో ఉన్న ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి. జూన్‌ 15న పోలింగ్‌బూత్‌ల వివరాలను ప్రదర్శించాలి. 25 నాటికి గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లను నిర్దేశించాలి. ఎన్నికల విధుల్లో ఉండాల్సిన ఉద్యోగుల పూర్తి, వ్యక్తిగత వివరాలను కంప్యూటరీకరణ చేయాలి. రెవెన్యూ డివిజన్‌ల వారీగా మూడుదశల్లో జరగాల్సిన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి సర్పంచి, వార్డుసభ్యుల ఓటింగ్‌కు అవసరమైన తెల్ల, గులాబి రంగు బ్యాలెట్ పేపర్లను, చెరగని ఇంకును సిద్ధం చేసుకోవాలి. జూన్‌ 30 నాటికి ఆయా పోలింగ్‌బూత్‌ల వారీగా బందోబస్తు, శాంతి భద్రతల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తదుపరి జులై 31వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్‌ తేదీలను ప్రకటించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

election commission 09052018 3

ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాప్పటికీ గ్రామాల్లో రాజకీయాల ఆధారంగానే అభ్యర్థులు పోటి చేయడం రివాజుగా వుంది. గ్రామాల్లో ఖర్చు చేసే విధులు, అమలయ్యే పథకాలు ఎంపికలో సర్పంచులే కీలకపాత్ర వహిస్తుండడంతో ప్రతి రాజకీయ పార్టీ మెజార్టీ సర్పంచులను కైవసం చేసుకునేందుకు ఎత్తుగడలు వేయడం సహజం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలక మండళ్లుంటునే గ్రాంటులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, లాస్ట్ మినిట్ ఎపిసోడ్ లు నడుస్తున్నాయి... ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి అనేక బాధ్యతలు అప్పగించిన, అమిత్ షా, చివరి నిమిషంలో చేసే పనుల బాధ్యత కూడా జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారు.. దీనికి సంబంధించి, కొద్ది సేపటి క్రితం, జగన్ కు అమిత్ షా ఫోన్ చేసినట్టు వైసిపీ వర్గాలు చెప్పాయి.. రాజకీయ విషయాలు మాట్లాడుకున్నారు అని పైకి చెప్తున్నా, కర్ణాటకలో చేయివలసిన కొన్ని పనుల గురించి, జగన్ సహాయం కోసం, అమిత్ షా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గాలి జనార్దన్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ లో వైస్ జగన్ మొత్తం బీజేపీ అభ్యర్థుల కు కావలిసిన ఎన్నికల ఖర్చు చేసే విదంగా అమిత్ షా తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే..

jagan 09052018 2

అయితే, ఇప్పుడు ఎన్నికల వేళ చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు చేసే పనులు కూడా, జగన్ వర్గానికి అప్పచెప్పారు... ఈ పనులు చెయ్యటంలో, జగన్ పార్టీకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందని, అందుకే వారిని ఉపయోగించుకుంటున్నారు అని తెలుస్తుంది... ఇప్పటికే వైసిపీకి చెందిన కొంత మంది బెంగుళూరులో ఉంటున్నారు.. వారితో పాటు, ఇక్కడ నుంచి కొంత మందిని అక్కడకు పంపించారు.. అయితే, ఎన్నికల వేళ, బయట మనుషులు అక్కడ ఉండటానికి అవకాసం లేదు.. అయినా సరే, అక్కడ కొంత మ్యానేజ్ చేసి, ఇక్కడ నుంచి వెళ్ళిన వారిని, అక్కడే ఉంచి, చివరి నిమిషంలో చెయ్యవలసిన కార్యక్రమాలు చెయ్యనున్నారు..

jagan 09052018 3

అయితే ఈ పనులు అన్నీ జగనే స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం... ఎలాగూ శుక్రవారం జగన్ కోర్ట్ కి పోవాలి.. దీని కోసమని చెప్పి, గురువారం ఉదయమే లోటస్ పాండ్ చెక్కేస్తాడు.. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి, లోటస్ పాండ్ లో కూర్చుని, ఈ పనులు పర్యవేక్షణ చెయ్యనున్నారు... అలాగైనా అమిత్ షా ను ప్రసన్నం చేసుకోవటానికి, ఈ కార్యక్రమం ఎలాగైనా సక్సెస్ అవ్వాలని, జగన్ భావిస్తున్నారు... ఇప్పటికే విజయసాయి రెడ్డి, కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో ఉండి, అన్నీ సెట్ చేసి వచ్చారనే వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అమిత్ షా ఫోన్ తో, జగనే స్వయంగా రంగంలోకి దిగారు.

15వ ఆర్థిక సంఘం విధివిధానాల పై అమరావతిలో జరిగిన మీటింగ్ తో, దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు మార్చాలంటూ దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు రెండుసార్లు సమావేశమయ్యాయి. ఒకటి కేరళలో, రెండోది ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనాభా, భర్త్ రేట్ ప్రాతిపదికన నిధుల పంపకం జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. అలాగే సంక్షేమ పథకాలను కూడా సమీక్ష చేయాలని దక్షిణాది రాష్ట్రాలు సూచించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక సంఘం బుధవారం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. సభ్యులుగా అరవింద్‌ విర్మాని, సుర్జిత్‌ ఎస్‌ భల్లా, సంజీవ్‌ గుప్తా, పినాకి చక్రవర్తి, సాజిద్‌, నీలకంఠ మిశ్రా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నదాంట్లో ఏ మేరకు నిజం ఉందన్నదానిపై ఈ కమిటీ అధ్యాయనం చేసి నివేదిక తయారు చేసి కేంద్ర ఆర్థిక సంఘానికి అందజేయనుంది.

amaravati meeting 09052018 2

ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

amaravati meeting 09052018 3

గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటిసారి ఈ సమావేశం జరగ్గా, రెండో సమావేశానికి అమరావతి ఆతిధ్యం ఇచ్చింది.
2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. అయితే, ఈ లోపే కేంద్ర ప్రభుత్వం దెబ్బకు లైన్ లో పడింది... కేంద్ర ఆర్థిక సంఘం బుధవారం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది... ఈ అభ్యంతరాలు అన్నీ ఆ కమిటీ సమీక్షించి, కేంద్రానికి నివేదిక ఇస్తుంది...

Advertisements

Latest Articles

Most Read