ఒకడు అంటాడు, చంద్రబాబు ఎవరు, కర్ణాటకలో బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వటానికి అని... ఇంకొకడు, ఆంధ్రా విషయాలు కర్ణాటకలో ఎందుకు, చంద్రబాబుది దిగజారుడు రాజకీయం అని... ఇక మన జగన్ పార్టీ అయితే, ఎవరన్నా బీజేపీని తిడుతుంటే చాలు, వాళ్ళ మీద దాడులు చేస్తుంది... ఇన్నీ చేసి, ఈ రోజు బీజేపీ ఏమి చేసిందో చూడండి.. మేము, ఆంధ్ర రాష్ట్రానికి ఇవి చేసాం, అవి చేసాం అంటూ కర్ణాటకలోని న్యూస్ పేపర్స్ లో పెద్ద పెద్ద యాడ్ లు ఇచ్చింది... మరి మొన్నటి వరకు, ఆంధ్రా విషయాలు తీసుకువచ్చి, కర్ణాటకలో ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటున్న బీజేపీ, ఈ రోజు, చేసింది ఏంటి ? సరే ఆ యాడ్ ఒకసారి పరిశీలిస్తే, ఒక్కటంటే ఒక్కటి కూడా, విభజన హామీల గురించి ప్రస్తావన లేదు... అన్ని రాష్ట్రాలకి, ఎలా అయితే చేసారో, ఆ పనులు గురించే గొప్పగా రాసారు...

modi add 09052018 1

ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన సంపూర్ణ అభివృద్ధికి, అన్ని అంచనాలను అధిగమించి నిరంతర కృషి చేస్తున్న మోడి ప్రభుత్వం అంటూ, ఒక పెద్ద పేజి యాడ్ ఇచ్చారు... ఇన్నాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ అబద్ధాలు అయితే ప్రచారం చేసారో, అవే అబద్ధాలు అక్కడ కూడా రాసారు... ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ గా భావిస్తున్న స్పెషల్ స్టేటస్ మీద ఒక్క మాట లేదు.. పోనీ స్పెషల్ ప్యాకీజీ మీద ఒక్క మాట లేదు.. పోలవరం ప్రాజెక్ట్ కు డబ్బులు ఎంత ఇచ్చారో లేదు... అమరావతి నిర్మాణానికి ఎంత ఇచ్చారో లేదో.. రైల్వే జోన్ విషయం లేదు... ఇలా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఆందోళనలు చేపడుతున్న ఒక్క విషయంలో కూడా, ఏమి మాట్లాడలేదు...

modi add 09052018 1

మరి, తెలుగు వారు ఎందుకు బీజేపీ ఓటు వెయ్యాలి ? కమలం గుర్తు బటన్ నొక్కండి, గెలిపించండి అని, ఆంధ్రా వారిని అడిగే హక్కు బీజేపీ పార్టీకు ఉందా ? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది, కర్ణాటక ఎన్నికల్లో, ఓడించండి అని చంద్రబాబు పిలుపు ఇస్తే, కర్ణాటకతో మీకు ఏమి సంబంధం అని ఏడ్చినా రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు ఏ సంబంధం ఉందని, ఆంధ్రప్రదేశ్ కు ఇది చేసాం, అది చేసాం అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ? ఎందుకంటే కర్ణాటకలో దాదాపుగా కోటి మంది తెలుగు వారు ఉన్నారు.. వారిలో మెజారిటీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు.. అందుకే, ఆంధ్రా వాడి పేరు తలుచుకుంటేనే బీజేపీ నాయకులకు తడిచిపోతుంది.. అందుకే, దేశం మొత్తాన్ని ఎలా మభ్య పెడుతున్నారో, అలాగే ఆంధ్రా వారిని కూడా, కర్ణాటకలో మభ్య పెడదాం అనుకుంటున్నారు.. అయ్యా, మేము చాలా తెలివి గల వాళ్ళం... 125 ఏళ్ళు ఉన్న పార్టీకి, కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు.. మీరు ఎంత...

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో వందశాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు లభించింది. ఇది చెప్పింది చంద్రబాబు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోని పత్రికలు కావు... నీతి ఆయోగ్‌ ... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయానా చైర్మన్‌గా ఉన్న నీతి ఆయోగ్‌, ఈ విషయం చెప్పింది. నీతిఆయోగ్ సూచికల్లో ఏపీ పలు ర్యాంకులను నమోదుచేసుకుంది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016లో 56.2 స్కోరుతో ఏపీకి 7వ ర్యాంకు లభించింది. అలాగే పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016లో ఏపీకి 10వ ర్యాంకు, హెల్త్ ఇండెక్స్ 2018లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు లభించింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016లో 56 శాతం స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది.

aprank 09050018 2

అంతేగాక గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు, 80 శాతం శివారు గ్రామాలన్నీ రహదారులకు అనుసంధానం, 30,500 కి.మీ మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వివరాలు వెల్లడించారు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా విజన్‌ను మార్పు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. ఇప్పటి వరకూ ఎంతో బాగా పనిచేసినా, సూక్ష్మస్థాయిలో పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

aprank 09050018 3

‘విభజనలో మనకు అన్యాయం జరిగింది. ఎక్కడో ఉండాల్సిన వాళ్లం కింది వరుసకు వచ్చాం. విభజనతో సమస్యల్లో ఉన్నామనుకుంటే కేంద్రం సహకరించటం లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆనాడు ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకున్నాం. మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే కేంద్రంతో విభేదించాం. మనం గట్టిగా అడగకపోతే ఇంకా నష్టపోతామనే ప్రశ్నిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా నియంత్రణకు నాడు తన హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామని, జనాభా నియంత్రణలో కేరళతో పోటీ పడ్డామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఇంకా నష్టపోతామని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా ప్రాతిపదికగా తీసుకుందని చెప్పారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, పార్లమెంటు సీట్లు కూడా దక్షిణ భారతదేశంలో తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. అటు విభజన వల్ల ఇటు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాల వల్ల మనం తీవ్రంగా నష్టపోతామని తెలిపారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చి అమలుచేయలేదని, దీంతో ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్ర సర్కారు నుంచి సాయం అందకుండాపోతుండడంతో చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం చేయకపోతే ఈ పరిస్థితుల్లో ఏపీ ఎలా ఎదుగుతుందని నిలదీశారు.

prakash raj 08052018 2

మరో పక్క పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు... ప్రకాశ్ రాజ్ కొన్ని సూచనలు చేశారు. ఆయనతో ఎంతమంది వస్తారు... ఆయన ఆలోచన పరంగా ఎంతమంది వచ్చి చేరతారు అనే విషయాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ముంచేసే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనలా పార్టీ పెట్టి తాను రాజకీయం చేయలేనని.. మంచి చేయాలని వస్తున్న పవన్‌ను ఆహ్వానిద్దామన్నారు. మంచి చేసే వాళ్లు ఎవరికీ పోటీ కాదు కదా అన్నారు. న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

prakash raj 08052018 3

ముందు ప్రమాదకరంగా మారిన బీజేపీని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనాల్లో చైతన్యం తీసుకురావాలని.. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు. మోదీలా అబద్ధాలు చెప్పే ప్రధానిని ఎక్కడా చూడలేదన్నారు. అవినీతి కంటే మతతత్వం మరింత ప్రమాదకరమని సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. హిందూత్వవాదులు తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రశ్నించడం మొదలుపెట్టగానే నాకు సినిమాలు, యాడ్స్‌ తగ్గాయని ఆయన అన్నారు. ఆరెస్సెస్‌ విధానాలే మోడీ, బిజెపి విధానాలని ఆయన అన్నారు. నల్లధనం వెనక్కుతెస్తామన్న హామీ ఏమైంది? ఆయన ప్రశ్నించారు. తానెప్పుడూ ఏ పార్టీకి, ఎప్పుడూ ప్రచారం చేయనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఎపి ప్రజల హక్కుఅని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి, 2019 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఓటుకు నోటు కేసు పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసు పై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా కొందరు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే నిన్నటి వ్యవహారమని అన్నారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

kcr 09052018

కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం నిన్న పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు. ఇటీవల భారత రాజకీయ అంశాలను గమనిస్తే ప్రధానంగా ఏపీకి ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని రేవంత్‌ రెడ్డి అన్నారు. కర్ణాటకలో భాజపాను ఓడించాలని పిలుపునివ్వడంతో మోదీ ఆయన్ను టార్గెట్‌ చేశారన్నారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై తాము పోరాడుతున్నామని, తాను కాంగ్రెస్‌ సభల్లో పాల్గొంటూ కేసీఆర్‌ సర్కారు ఎన్ని కోట్ల రూపాయల అనినీతికి పాల్పడిందో వివరిస్తున్నానని తెలిపారు.

kcr 09052018

రాష్ట్ర ప్రజల్లో ఆలోచన కలుగజేస్తూ చైతన్యం తీసుకొస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం విలాసవంతమైన జీవితం కొనసాగించడానికి ఇటువంటి ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో వివరించి చెబుతున్నానని అన్నారు. దీంతో మోదీ, కేసీఆర్ ఈ విషయాలను జీర్ణించుకోలేకపోతున్నారని, మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్‌ నిన్న సమీక్ష జరిపారని అన్నారు. మోడీ, కెసిఆర్ తో కలిసి, చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న భాజపా.. ఆంధ్రప్రదేశ్‌కు తాము చేసిన అన్యాయం తాలూకు ఫలాలు పరోక్షంగా ప్రజాతీర్పుపై ఉండవచ్చన్న భావనతో ఏమాత్రం సంబంధం లేని అంశమైన ఓటుకు నోటు కేసును ప్రస్తావించడం కుట్రకాక మరేంటని ప్రశ్నించారు. భాజపా కనుసన్నల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసుపై సమీక్ష చేపట్టిందని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read