కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కాషాయ జెండా ఎగరువేయలాని మోడీ, షా తహతహలాడుతున్నారు. ఇందుకోసం వీరు ఎంచుకున్న మార్గంలో, ఇప్పటి వరకు ఎదురు లేదనే చెప్పాలి. ఎవరిని టార్గెట్ చేసినా, వారిని నయానో, భయానో, న్యాయంగానో, అన్యాయంగానో ఓడించి పక్కన కూర్చోబెడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని చెప్పి మరీ కొట్టారు, బెంగాళ్ లో మమతకు చుక్కలు చూపించారు, తెలంగాణాలో ఎదురు లేదు అనుకున్న కేసీఆర్ ఇలాకలో, నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు, కర్ణాటకను కైవసం చేస్తుకున్నారు, రేపో మాపో మధ్యప్రదేశ్, రాజస్తాన్ ని కూడా లాగేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తరువాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణా, వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి రావటానికి చూస్తుంది.

nani 04082019 2

అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనీసం 30-40 సీట్లు గెలిచే టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ మొదలు పెట్టింది. ముందుగా చంద్రబాబుని తప్పించి, వారి పని ఈజీ అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే, చంద్రబాబుకి వేసిన స్కెచ్ లు అవసరం లేదు. రాత్రికి రాత్రి పార్టీని క్లోజ్ చెయ్యొచ్చు. కాని వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా, ప్రతి రోజు విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. 60 రోజులకే, జగన్ ప్రభుత్వం అన్నిట్లో విఫలం అయ్యింది అంటున్నారు. దీనికి తోడు, జగన్ చేసే పనులు కూడా బీజేపీకి కలిసి వస్తున్నాయి. అయితే, బీజేపీ ఎన్ని మాటలు అంటున్నా, వైసీపీ నుంచి మాత్రం అసలు రియాక్షన్ అనేది లేదు. ఎందుకో అందరికీ తెలిసిన విషయమే.

nani 04082019 3

అయితే ఇందుకు భిన్నంగా, ఈ రోజు వైసీపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బీజేపీ పై మండి పడ్డారు. పోలవరంలో నవయుగని తప్పించటం పై, పార్లమెంట్ లో, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఈ రోజు మంత్రి పేర్నినాని మాట్లాడుతూ, కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ లో ఇలా మాట్లాడిందని, పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, బాధ్యతాయుత పదవిలో ఉంటూ, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కక్షసాధింపు ధోరణిలో ఉన్నాయని నాని ఆరోపించారు. అయితే ఏకంగా పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటననే, ఏపి మంత్రి కక్ష సాధింపు, రాజకేయం అంటున్నారు అంటే, బీజేపీతో వైసీపీకి నెమ్మదిగా గ్యాప్ పెరుగుతుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అవకాసం కోసం, వైసీపీని రెచ్చగోడుతున్న బీజేపీ, ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దీని పై సోమవారం సమీక్ష చేస్తామని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఎలాంటి స్నేహం ఉందొ అందరికీ తెలుసు. అయితే జగన్ మోహన్ రెడ్డి సియం అయిన తరువాత, అది వ్యక్తిగతం దాటి, ఏకంగా రెండు రాష్ట్రాల దాకా వెళ్ళింది. ప్రమాణస్వీకారం కూడా చెయ్యకుండా, జగన్ మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన సెక్రటేరియట్ భవనాలను కేసీఆర్ కు భేషరతుగా అప్పచెప్పారు. ఇప్పుడు తాజాగా ఏకంగా గోదావరి జలాలు మళ్ళించటానికి, మన ఆంధ్రప్రదేశ్ చేత, తెలంగాణా భూభాగంలో ప్రాజెక్ట్ కట్టించి, చెరి సగం పంచుకుందాం అంటున్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్నీ ఇచ్చేస్తున్నారు కాని, తెలంగాణా నుంచి మాత్రం మనకు రావలసిన లక్ష కోట్ల ఉమ్మడి ఆస్థులు, విద్యుత్ బకాయలు మాత్రం, రావాటం లేదు. కేసిఆర్ గురించి తెలిసిన వారు, జగన్ ను హేచ్చిస్తున్నారు కూడా.

kcr 04082019 2

తన పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి సోనియా గాంధీని, దళిత సియం అంటూ ప్రజలను, కేసీఆర్ ఎలా మోసం చేసారో చెప్తున్నారు. నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తా అని జగన్ తో ఎంత చెప్పినా, జగన్ మాత్రం వినటం లేదు. కారణం ఏంటో తెలియదు కాని, కేసీఆర్ ఏది చెప్తే అది అన్నట్టు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. 2014 నుంచి, అంటే ఏపి విభజన జరిగిన దగ్గర నుంచి, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు ఖర్చులు అన్నీ తెలంగాణా ప్రభుత్వమే పెట్టుకుందని, రూల్స్ ప్రకారం, ఏపి కూడా తన వాటా ఇవ్వాలని, మొన్నటి దాక చంద్రబాబుని అడగే ధైర్యం లేదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని, ఈ ఖర్చుల్లో, ఏపి వాటా అడుగుతుంది తెలంగాణా ప్రభుత్వం.

kcr 04082019 3

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయం నుంచి, ఇప్పటి వరకు, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు 42:58 నిష్పత్తి ప్రకారం ఖర్చులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం కోరుతుంది. దీని ప్రకారం, 58 శాతం వాటాతో, ఆంధ్రప్రదేశ్ 290 కోట్లు కట్టాలని, తెలంగాణా ప్రభుత్వం అంటుంది. రాజ్ భవన్ లో అయిన ఖర్చులో ఏపి వాటా రూ.25 కోట్లు, హైకోర్టు నిర్వహణ ఖర్చులో, ఏపి వాటా రూ.230 కోట్లగా తేల్చి, ఏపి రాష్ట్ర ఆర్థిక శాఖకు వివరాలు పంపించారు. అంతే కాదు, తెలంగాణా నుంచి విద్యుత్ వాడుకున్నందుకు రూ.2,406 కోట్లు ఇవ్వాలని కూడా కోరారు. ఇదంతా బాగానే ఉంది. తెలంగాణా ప్రభుత్వం రూల్స్ ప్రకారం అడుగుతుంది. మరి మన ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది ? మన విద్యుత్ బకాయలు 5 వేలు కోట్లు ఇవ్వాలని ఎందుకు తెలంగాణాను అడగరు ? ఇలాంటి విభజన హామీలు, ఏపికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయినా ఏపి ప్రభుత్వం మాత్రం, తెలంగాణాను అడగటం లేదు అనే అభిప్రాయం ఉంది. చూద్దాం ఏపి ప్రభుత్వం, తెలంగాణాను రావాల్సిన బకయాలు గురించి అడుగుతుందో, లేక తెలంగాణా ఇవ్వమన్న డబ్బులు ఇచ్చేస్తుందో.

మన దేశంలో ఒక వ్యవస్థని మరో వ్యవస్థ గౌరవించుకోవటమే ఇప్పటి వరకు చూసాం. పలానా వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే, మరో వ్యవస్థలోని వ్యక్తులు, వేలు ఎత్తి చూపించటం ఎప్పుడూ లేదు. అలాంటిది ఇప్పుడు ఒక రాష్ట్ర స్పీకర్, దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభ చైర్మెన్ పైనే, వేలు ఎత్తి చూపించారు. నిజానికి వెంకయ్య నాయుడు రూల్స్ పాటించే విషయంలో చాలా ఖటువగా ఉంటారు. సొంత పార్టీ నేతలను, ఏకంగా కేంద్ర మంత్రులనే సభలో హెచ్చరించటం చూస్తూ వచ్చాం. అలాగే పార్టీ ఫిరాయింపులు అసలు ప్రోత్సహించే వారు కాదు. దాని పై గట్టిగా మాట్లాడింది కూడా వెంకయ్యే. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఒక ఎంపీ పై అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం కుడా తీసుకున్నారు. అయితే మొన్నీ మధ్య నలుగురు తెలుగుదేశం ఎంపీలు బీజేపీలో చేరారు.

tammineni 04082019 2

ఆ సమయంలో వారు, ఉన్న ఆరుగురిలో, నలుగురు మెజారిటీ సభ్యులు కాబట్టి, వెంకయ్య అనర్హత వేటు నుంచి తప్పించుకోవటానికి, పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అది రూల్ బుక్ లో కరెక్ట్ అయ్యింది. నైతికంగా అది సరైన చర్య కాకపోయినా, బీజేపీతో పాటు, ఆ నలుగురు టిడిపి ఎంపీలు, విలీనం అనే పధ్ధతిలో పార్టీ మారటంతో, వెంకయ్య కూడా ఏమి చెయ్యలేక పోయారు. అయితే, ఇప్పుడు ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, వెంకయ్యను తప్పుబట్టారు. నేను కనుక వెంకయ్య స్థానంలో ఉంటే అలా చెయ్యను అని, వారి పై అనర్హత వేటు వేసే వాడిని అని అన్నారు. నైతిక విలువల లేకుండా, ఫిరాయింపులు నేను ప్రోత్సహించను అంటూ వెంకయ్య నాయుడుని డైరెక్ట్ గా టార్గెట్ చేసారు ఏపి స్పీకర్.

tammineni 04082019 3

అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్న పరిస్థితిని మాత్రం, ఆయనకు అనుకూలంగా చెప్పుకున్నారు. సభలో వారిని కంట్రోల్ చెయ్యలేదు కాని, వారిని తన చాంబర్ కు పిలిచి హెచ్చరించాని చెప్పారు. అలాగే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో, 45 ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడూ ఇస్తున్నారు అని అడిగినందుకు, తెలుగుదేశం సభ్యులని సస్పెండ్ చెయ్యటం నైతికమా ? అలాగే చంద్రబాబుకి అసలు మైక్ ఇవ్వకుండా, చెయ్యటం నైతికమా ? నీ యమ్మ అన్న మంత్రిని,బులెట్ దిగిందా అన్న మంత్రిని, ఏకంగా బాడీ షేమింగ్ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని, స్పీకర్ ఒక్క మాట కూడా వారించలేదు. ఇది నైతికమా ? వెంకయ్య నాయుడు రూల్స్ ప్రకారం వ్యవహరించక తప్పని పరిస్థితి అది. నిజంగా వెంకయ్య నాయుడు గారు చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే, 13 రోజుల పాటు రెండు పదవుల్లో (ఢిల్లీ ప్రత్యెక ప్రతినిధిగా) ఉన్న విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యక పోవటం. ఇప్పుడు ఏపి స్పీకర్ గారు నైతికత గురించి పాఠాలు చెప్పిన తరువాత అయినా, వెంకయ్య గారు విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వేస్తారని కోరుకుందాం.

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుభాకోణం గుర్తుందా ? నాటి కేంద్రంలోని కాంగ్రెస్ హయంలో ఈ స్కాం జరిగింది. ఆశ్చర్యం ఏమి లేదు, అది కూడా మన వైఎస్ఆర్ గారికి లింక్ అయిన కేసు. కాకపొతే దీంట్లో వైఎస్ జగన్ కాని, విజయసాయి రెడ్డి కాని లేరు. అయితే ఈ ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ స్కాం కేసు చాలా రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజగా ఐటి జరిపిన దాడుల్లో, ఏకంగా హైదరాబాద్ లోనే ఈ గుట్టుకి సంబంధించి మరో లింక్ దొరికింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంకి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఐటి అధికారులకు, హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ ప్రమేయం ఉందని ఆధారాలతో సహా తేల్చారు. దీనికి సంబంధించి, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సోదాల్లో, హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీకు లింక్ ఉన్నట్టు ఐటి అధికారులు కనుగొన్నారు.

augusta 04082019 2

హైదరాబాద్ కి చెందిన అల్పా జియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పోయిన వారం ఐటి అధికారులు సోదాలు జరిపారు. అయితే ఆ సోదాల్లో అనూహ్యంగా నాలుగు విదేశీ ఖాతాల గుట్టు బయటపడింది. అవన్నీ పరిశీలన చేస్తే, లెక్కలు చూపించని మూడుకోట్ల 10లక్షల విలువ చేసే బంగారంతో పాటు, 45లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ప్రకటన చేసారు. అల్పా జియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆళ్ల దినేష్ కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నారు. దినేష్ ను పట్టుకోవటానికి ముందు చాలా జరిగింది. సిబిఐ ద్వారా ఐటీ రాడార్ కు చిక్కిన దినేష్, దుబాయ్ లోని రాజీవ్ సక్సైనా కంపెనీలకు ఓవర్ ఇన్ వాయిస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు చేసిన అధికారులు నాలుగు విదేశీ బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ విదేశీ బ్యాంకు ఖాతాలు ఎవరివనే కొణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

augusta 04082019 3

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ ఆగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మొత్తం 3600 కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తుంది. దీని పైనే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ డీల్ కు సంబంధించి మధ్యవర్తిగా ఉన్న రాజీవ్ సక్సేనా అనే వ్యక్తిని సిబిఐ అధికారులు ఇటీవల దుబాయ్ లో పట్టుకుని, భారత దేశానికి తీసుకు వచ్చారు. విచారణలో భగంగా, సిబిఐకి రాజీవ్ సక్సేనా ఇచ్చిన సమాచారంతో, ఐటీ బృందం హైదరాబాద్ లోని దినేష్ ఆళ్ల పై సోదాలు చేసింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ వెలుగులోనికి వచ్చిన క్రమంలోనే నాటి ఏపి ఉమ్మడి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనుగోలు చేయించిన ఆగస్టా హెలికాప్టర్ పై కూడా వివాదం నడిచింది. అది కూడా ఇప్పుడు సిబిఐ విచారణలో ఉంది.

Advertisements

Latest Articles

Most Read