వైసీపీ నాయకుల పంచాయతీ ఏకంగా సచివాలాయానికి చేరింది. ప్రజల సమస్యలు తీర్చాల్సిన సచివాలయంలో, పార్టీ సెటిల్మేంట్ లు చేసుకుంటూ, అక్కడే కొట్టేసుకుంటున్న సంఘటనలు చూసి, అక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు ముక్కన వేలు వేసుకుంటున్నారు. ఆగష్టు 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఇప్పటికే గ్రామ వలంటీర్ల ఎంపిక పరీక్ష విధానం, ఇంటర్వ్యూ ద్వారా చేసారు. అయితే ఇదేదే పేరుకు పెట్టినా, మొత్తం వైసీపీ కార్యకర్తలతోనే నింపేసరనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల వైసిపీ నేతలు చెప్పిన వారికే గ్రామ వలంటీర్లగా ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. అయితే, ఇదే ఇప్పుడు వైసిపీ నాయకుల మధ్య కూడా చిచ్చు పెట్టింది.

secretariat 07082019 2

దీంతో గ్రామ వలంటీర్ల వివాదాలు ఇప్పుడ ఏకంగా సచివాలయంలోనే కొట్టుకునేలా చేసాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నియోజకవర్గం ఎర్రగొండపాలెంలోని త్రిపురాంతకం మండలంలోని ఒక గ్రామం నుంచి కొంత మంది వైసీపీ నాయుకులు నిన్న సచివాలయం వచ్చారు. గ్రామ వలంటీర్‌ల ఎంపిక విషయంలో వారి మధ్య మాట మాట పెరిగి, కొట్టుకునే దాకా వెళ్ళింది. వచ్చిన వారు రెండుగా విడిపోయి, బాహాబాహీకి దిగారు. గ్రామ వలంటీర్‌ పోస్టల విషయంలో, ఇద్దరి మధ్య సయోధ్య కుదరకు ఇరు వర్గాలు ఏకంగా సచివాల్యంలోనే గొడవకు దిగాయి. రోడ్డు మీద లాగా, సెంటర్ లో లాగా, అరుపులు, కేకలు, తోపులాటలతో సచివాలయం మారుమోగింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

secretariat 07082019 3

వారిని వారించి, బయటకు పంపించి వేయటంతో, వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే సందర్భంలో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వారిని కూడా భద్రతా సిబ్బింది బయటకు పంపించి వేయటంతో, ఎంతో దూరం నుంచి, పని మీద వచ్చిన వారు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వివాదం పై, విద్యాశాఖ మంత్రి మాత్రం ఏమి స్పందించలేదు. అయితే అక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు మాత్రం, ఇలా పార్టీ గొడవులు, సచివాయలం వరకు రావటం ఇదే మొదటి సారని అంటున్నారు. సహజంగా ఇలాంటివి పార్టీ కార్యాలయాల్లో చూసుకుంటారని, అలాంటిది ఈ సెట్టేల్మేంట్ లు సచివాలయంలో చెయ్యటం, మళ్ళీ బహిరంగంగా కొట్టుకోవటం ఏంటని వాపోతున్నారు.

మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నో పనులు చేసినా, డబ్బులు లేకపోయినా, అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించినా, ఆయన ఎప్పుడూ చూడని ఓటమి చూడాల్సి వచ్చింది. దీని పై అనేక వాదనలు కూడా నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం, అవేమి కాకుండా, నిజంగా తప్పు ఎక్కడ జరిగింది అనేదాని పై సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గుంటూరు పార్టీ ఆఫీస్ లో, వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వైసీపీ బెదిరింపులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టటం, సంక్షేమ కార్యక్రమాలు ఆపెయ్యటం, ఇలా అన్ని సమస్యలు కార్యకర్తలు చంద్రబాబుతో చెప్పుకున్నారు.

cbn 07802019 2

తరువాత చంద్రబాబు ప్రసంగిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రెండు నెలల్లోనే మొత్తం అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు అన్నారు. మన హయంలో ఇసుక దోపిడీ చేసాం అంటూ, ఊరు ఊరు తిరిగి విష ప్రచారం చేసారని, అయితే ఇప్పుడు ఇసుక ఎలా ఉందొ చూసారు కదా, మన హయంలో ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది ? ఎవరిదీ దోపిడీ అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే రైతు రుణ మాఫీ సగంలో ఉందని, మనం డబ్బులు బ్యాంక్ లు వేసి, వెయ్యమంటే, ఎలక్షన్ కమిషన్ చేత ఆపించారని, అవి విడుదల చెయ్యాలని కోరారు. అవి విడుదల చెయ్యకపోతే ఉద్యమం చేస్తామని, కోర్ట్ కు వెళ్తామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ప్రభుత్వం తరుపున రైతులకు ఇచ్చిన బాండ్లను చంద్రబాబు ప్రస్తావించారు.

cbn 07802019 3

అయితే ఈ సందర్భంలో ఒక కార్యకర్త మాట్లాడుతూ, "సార్.. మీరు రాష్ట్రం కోసం గత 5 ఏళ్ళలో ఎంతో చేసారు, అయినా ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఇంకా ఎందుకు సార్ వాళ్ళ కోసం తాపత్రయం, పార్టీని చూసుకోండి చాలు" అని అనగా, చంద్రబాబు ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. నేను అలా ఎప్పుడూ అనుకోను, ప్రజల కోసం మనం పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు నా కష్టాన్ని కూడా గుర్తుంచుకోకుండా, నన్ను ఓడించారని బాధ లేదు, వాళ్ళ కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడే తత్త్వం నాది అని అన్నారు. వైసిపీ నేతలు ఎన్ని అవమానాలు చేసినా, ప్రజల కోసమే భారిస్తున్నాని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఇంకా ఆ ఓటమి నుంచి బయటకు రావాలని, ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చెయ్యాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, ప్రజల కోసం నిరనతరం పని చెయ్యాలని చంద్రబాబు అన్నారు.

అమరావతి అంటేనే మొన్నటి వరకు ఒక ఎమోషన్. ఆంధ్రుడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నాం, ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీని కడుతున్నాం అంటూ గర్వంగా చెప్పుకున్న క్షణాలు. అందుకు అనుగుణంగానే, అక్కడ రైతన్నల త్యాగాలు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 33 వేల ఎకరాలు, ప్రభుత్వానికి ఇచ్చారు అక్కడ రైతులు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా, ఇది ఎలా సాధ్యం అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఒక ఎకరా బూమి సమీకరించాలి అంటే, ప్రభుత్వాలకు మామూలు తల నొప్పులు కాదు. అలాంటిది కేవలం చంద్రబాబు మీద నమ్మకంతో అక్కడ ప్రజలు, ఒక్క మాటకు విలువచ్చి, 33 వేల ఎకరాలు ఇచ్చేసారు. పనులు మొదలయ్యాయి. కాని ఈ లోపే ఎన్నికలు రావటం, చంద్రబాబు ఓడిపోవటం జరిగిపోయింది.

amaravati 07082019 2

జగన్ మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. అయితే మొదటి నుంచి అమరావతి అంటే వ్యక్తిరేకత చూపించే జగన్, సహజంగానే అమరావతిని పట్టించుకోవటం ఆపేశారు. 40 వేల మంది కార్మికులతో సందడిగా ఉండే రాజధాని ప్రాంతం, ఇప్పుడు బోసి పోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ప్రభుత్వం రాజధాని కట్టక మానుతుందా అనుకునే ప్రజలకు, నిన్నటితో పూర్తీ క్లారిటీ వచ్చేసింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసారు. ఈ సందర్భంగా, మాకు అసలు ఇప్పుడే అమరావతి వద్దు అని తేల్చి చెప్పేశారు. అమరావతికి మేము మీ నుంచి రూపాయి కూడా అడగం అని చెప్పి, ఆ డబ్బులు నవరత్నాలకు ఇవ్వండి అని ప్రధానికి తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 5 వేల కోట్లు ఇవ్వమని అడిగారు.

amaravati 07082019 3

అయితే అమరావతి ఇప్పుడే వద్దు అని కారణం చెప్తూ, అక్కడ పెద్ద స్కాం జరిగింది అనే అనుమానం మాకు ఉంది. విచారణ జరిపిస్తున్నాం. విచారణ పూర్తీ అయిన తరువాత, మిమ్మల్ని రాజధానికి డబ్బులు అడుగుతాం అని జగన చెప్పారు. ఇలా అనుమానం వచ్చి, విచారణ అయ్యే దాకా ఆగాలి అంటే అసలు అయ్యే పనేనా ? ఇలా అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు విచారణ అయ్యే దాకా, ఆయన సియంగా తప్పుకోవచ్చు కదా ? అసలు అమరావతి నిర్మాణానికి, విచారణకు సంబంధం ఏముంది ? నిర్మాణం చేస్తూనే, విచారణ జరుపుకోవచ్చు కదా ? ఎవరైనా రూపాయి ఇవ్వండి అని అడుగుతారు కాని, కేంద్రం దగ్గరకు వెళ్లి, మాకు ఆ ప్రాజెక్ట్ కు డబ్బులు ఇవ్వద్దు అంటే ఎలా ? అసలకే కేంద్రం గీసి గీసి డబ్బులు ఇస్తుంది. అలాంటిది, మనం ముందే వద్దు అంటే, ఎలా ? ఇలా అయితే అమరావతి సంగతి ఏంటి ? 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు శాస్వతం, జగన్, చంద్రబాబు శాస్వతం కాదు. చంద్రబాబు చేసారు కాబట్టి నేను చెయ్యను అనే జగన్ ధోరణి, రాబోయే ప్రభుత్వాలు తీసుకుంటే, ప్రజలు ఎంతో నష్టపోతారు.

బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, సుష్మా స్వారాజ్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆమె వయసు 67 ఏళ్ళు. అయితే ఆమె హటాత్తుగా చనిపోవటంతో, అందరూ షాక్ లో ఉన్నారు. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో, ఆమె నలతగా ఉందని చెప్పటంతో, కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెను ఎమర్జెన్సీ వార్డ్ కు తీసుకు వచ్చే లోపే, ఆమె చనిపోయారని డాక్టర్లు చెప్పారు. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సూరి ఉన్నారు. సుష్మా చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఆమె కిడ్నీలుకు కూడా దెబ్బ తినటంతో, ఆమె కోనేళ్ళుగా డయాలసిస్‌ చేయించుకున్నారు. 2016లో ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

sushma 07082019 2

మరో పక్క ఆరోగ్యం బాగోకపోవటంతో, ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చెయ్యలేదు. మంత్రిగా ఉండగా కూడా ఆమె ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉండేవారు. ప్రతి ఒక్కరికీ ఓపికగా సమాధానం చెప్పే వారు. ట్విట్టర్ లో ఆమె మార్కు సెటైర్ లు కూడా పడుతూ ఉండేవి. అయితే, ఇదే క్రమంలో నిన్న ఆమె చనిపోయే ముందు కూడా, ఆమె చివరి ట్వీట్లో ప్రధాని మోడీకి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు. ఆర్టికల్ 370 రద్దు పై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ట్వీట్ చేసారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్‌లో పేర్కుంటూ మోడీకి థాంక్స్ చెప్పారు. ఆమె తరువాత భోజనం చేస్తూ కూడా టీవీ చూస్తూ గడిపారని కుటుంబ సభ్యులు చెప్పారు.

sushma 07082019 3

సుష్మాస్వరాజ్‌ మరణ వార్తా పై చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అలాగే ప్రధాని మోడీ, సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వెంకయ్య నాయుడు, అద్వానీ కూడా ఆమె పార్ధివదేహాన్ని చూసి, కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. సుష్మ స్వరాజ్ కు మన తెలుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. విభజన సమయంలో, సోనియా గాంధీని పెద్దమ్మ అని తెలంగాణా వాదులు అనుకున్న వేళ, నన్ను కూడా మీ చిన్నమ్మని అనుకోండి అంటూ సుష్మా తెలంగాణా ప్రజలను కోరారు.

Advertisements

Latest Articles

Most Read