‘జగన్‌ను చంపాలనే ఆలోచన నాకు లేదు. ఆయన్ని గాయపరిస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. పార్టీకి లాభం జరుగుతుందని భావించే దాడి చేశా’ అని నిందితుడు శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ‘నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని జగన్‌తో పంచుకొనే అవకాశం లభించలేదు. ఇప్పుడీ ఘటన ద్వారా నేను రాసిన లేఖతో వైసీపీ అధినేతకు అన్నీ అర్థమవుతాయి. నేను అనుకున్నది నెరవేరినట్లే’ అని కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందేల కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావులో ఏ కోశానా భయం, ఆందోళన కనిపించడం లేదని అతడ్ని గురు, శుక్రవారాల్లో విచారించిన పోలీసులు అంటున్నారు.

jagan 28102018 2ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ‘నా వెనుక ఎవరూ లేరు. ఎవరూ ప్రేరేపించలేదు. బుద్ధిపూర్వకంగానే దాడి చేశా’ అని అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అంత కరుడుగట్టిన వ్యక్తిత్వం శ్రీనివాస్ కు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్‌ వేశారు. నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు కోర్టు 6 రోజులు అనుమతి ఇచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని ఆయన కుటుంబసభ్యులను మరోసారి విచారించారు.

jagan 28102018 3శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతా పుస్తకాలలోని లావాదేవీలపై ఆరా తీశారు. ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్టు సిట్‌ అధికారులకు సమాచారం అందింది. అయితే, శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ ఖాతాలను పరిశీలించే పనిని సోమవారానికి వాయిదా వేసుకొన్నారు. ఇప్పటికే అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం వారితో మరొకసారి మాట్లాడనున్నారు. లేక రాసిన రేవతి పతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని కూడా శ్రీనివాసరావు చెప్పే వివరాలతో పోల్చనున్నారు. గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు ఎందుకు మార్చాడు? వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? నగదు పరిస్థితి, ఇతర లావాదేవీలు ఏంటి? ఈ అంశాలపై సిట్ పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్సులో బీజేవైఎం మహా అధివేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు గడ్డ పై మాట్లాడిన మాటలు, చంద్రబాబుని ఉద్దేశించేనా అనే అనుమానం కలుగుతుంది. ‘‘కాంగ్రెస్‌తో వెళుతున్న పార్టీలను ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు. తర్వాత పశ్చాత్తాప పడక తప్పదు. కాంగ్రెస్‌ మోసం చేసిందంటూ మీరు మీటూ ఉద్యమం చేయక తప్పదు’’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌తో ఏ పార్టీ కలుస్తుందో ఆ పార్టీ పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

rajnadh 28102018 2

బీజేపీ బలాన్ని ఎదుర్కోలేక విపక్షాలు ఒక్కటవుతున్నాయని చెప్పారు. ఎన్ని కూటములు కట్టినా మోదీని ఎదుర్కోలేరని చెప్పారు. ఇదే సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా పాల్గున్నారు. తెలంగాణలో, ఆంధ్రలో పేదల కోసం పనిచేసే ప్రభుత్వాలు లేవని చెప్పారు. కేవలం కుటుంబ పాలన సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు వేల కోట్ల నిధులు కేంద్రం సమకూర్చుతోందన్నారు. కృష్ణా, పెన్నా, తుంగభద్రా నదులను అనుసంధానం చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లోని చివరి గ్రామాలకు నీటిని అందిస్తామని ప్రకటించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో వారం రోజులుగా పెట్రోల్‌ ధరలు తగ్గుతున్నాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

rajnadh 28102018 3

అయితే రాజ్‌నాథ్‌సింగ్‌ అన్న మాటలు చంద్రబాబుని ఉద్దేశించే అనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే, నిన్న చంద్రబాబు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్నారా అని విలేకరులు అడిగితే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మోసం చేసింది, అదే సందర్భంలో రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చింది, కాని కేంద్రంలో బీజేపీ వచ్చింది. వీళ్ళు, కాంగ్రెస్ కంటే ఎక్కువ సహాయం చేస్తామని నమ్మించి మోసం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక మాట అంటుంది. అప్పుడు తెలంగాణా ఇస్తాం అని చెప్పి ఇచ్చాం, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నాం, ఇస్తాం అంటుంది. ఈ సందర్భంలో, 25 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న మా రాష్ట్రానికి, కలిసి వచ్చే పార్టీలతో , కేంద్రం పై పోరాటం చెయ్యటం తప్ప, మాకు వేరే ఆప్షన్ లేదు, అది డెమోక్రాటిక్ కంపల్షన్ అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంలో, నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్న మాటలు, చంద్రబాబుని ఉద్దేశించే అనే అభిప్రాయం కలుగుతుంది.

ఆపరేషన్ గరుడ... ఈ ప్లాన్ మొట్టమొదట బయట పెట్టింది, సినీ హీరో శివాజీ.. అన్నీ కాకపోయినా, ఆయన చెప్పిన దాంట్లో, 90 శాతం నిజం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద దాడి మినహా, శివాజీ చెప్పిన ప్రతి పాయింట్ నిజం అయింది. గవర్నర్ జోక్యం చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరగటం, కులాల మధ్య గొడవలకి ప్లాన్ చెయ్యటం, చంద్రబాబుకు నోటీసులు, తెలుగుదేశం నాయకుల పై ఐటి దాడులు, జగన్ పై అటాక్, ఇవన్నీ గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం మొదులు పెట్టిన దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ, జనసేన, జగన్, కెసిఆర్ కుమ్మక్కు కళ్ళారా చూస్తున్నాం.

sivaji 28102018 2

అయితే జగన్ పై దాడి తరువాత, శివాజీ చెప్పినవన్నీ జరుగుతున్నాయి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే శివాజీ పై ఎదురు దాడి చేస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు, బీజేపీ నేతలు. దీంతో శివాజీ వారి పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా, వైసీపీ ఎమ్మెల్యే రోజా పై, జీవీఎల్ పై శివాజీ మండిపడ్డారు. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆమెపై పరువు నష్టం దావా కూడా వేయగలనని... కానీ, ఇప్పటికీ ఆమెను గౌరవిస్తున్నానని అన్నారు. తాను మాట్లాడాలనుకుంటే... రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలనని చెప్పారు. తాను పల్నాడు ప్రాంతానికి చెందినవాడినని... బూతుల్లో పీహెచ్డీ ఏదైనా ఉంటే అది మా పల్నాడులోనే ఉంటుందని చెప్పారు. 'రోజమ్మా... దయచేసి నా జోలికి రావద్దు. నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తే... కచ్చితంగా పరువు నష్టం నోటీసులు పంపిస్తా' అని హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

sivaji 28102018 3

రాష్ట్రంలో జగబోతున్న భయంకర పరిణామాల గురించే తాను 'ఆపరేషన్ గరుడ'కు సంబంధించిన వీడియోను విడుదల చేశానని శివాజీ అన్నారు. అందులో తాను బీజేపీ, వైసీపీ, జనసేనల పేర్లను కూడా ఉచ్ఛరించలేదని చెప్పారు. తన వీడియోను చూసి ఈ పార్టీల నేతలంతా... ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తనను విచారించి మొత్తం సమాచారాన్ని లాగాలని వైసీపీ, బీజేపీ నేతలు అంటున్నారని... 20 నిమిషాలకు పైనున్న తన వీడియోలో తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పానని... ఇంకా ఏమి కావాలని ప్రశ్నించారు. విచారణ సంస్థలన్నీ కేంద్రం పరిధలోనే ఉన్నాయని, తనపై విచారణ జరుపుకోవచ్చని అన్నారు. తనను అరెస్ట్ చేసినా అభ్యంతరం లేదని తెలిపారు. ఒక వేళ తనను అరెస్ట్ చేస్తే... మూడు నెలల్లోగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, చంద్రబాబు అంతు తేలుస్తాం, చుక్కలు చూపిస్తాం అంటున్న జీవీఎల్ ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని అన్నారు. ఏ కుట్ర పన్నారో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా పడేస్తామని అంటున్నారో, పోలీసులు నాతో పాటు, ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని అన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో, దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, ఏపి పోలీసులు, జగన్ మోహన్ రెడ్డికి మూడు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు మూడంచల బధ్రత ఇవ్వటంతో పాటు, ఈ మూడు పనులు కూడా జగన్ చెయ్యాలని, ఏపి పోలీస్ కోరింది. జగన్‌ పాదయాత్రలో ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందితోపాటు సొంత అనుచరులు కూడా ఆయనకు రక్షణగా ఉంటుంటారు. అయితే వారిని దాటుకుని యాత్రలో తన దగ్గరికి వచ్చేవారికి జగన్‌ ముద్దులు పెట్టి, నెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదిస్తుంటారు. అలాంటి వారిలో దాదాపు ఆయన అభిమానులు లేదా వైసీపీ వాళ్లు ఉంటారని పోలీసులు ఇన్నాళ్లుగా భావించారు. అయితే, విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆయన అభిమాని చేసిన కత్తి దాడితో ఒక్కసారిగా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.

jagan 28102018 2

అలాంటి అతి సమీప కలయికలను, సెల్ఫీలను ఆయన పాదయాత్రలో ఇకముందు అనుమతించరాదని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటిదాకా సెక్యూరిటీ సిబ్బందితో ఆయన పాదయాత్రలకు రక్షణ కల్పిస్తుండగా, వారికి రోప్‌ పార్టీ, సివిల్‌ పోలీసులను జతచేసి..మూడు అంచెల్లో భద్రతా వలయం నిర్మించాలని నిశ్చయించినట్టు తెలిసింది. జగన్‌ అభిమాని ఆయన భుజంపై కోడికత్తితో దాడి చేసిన అనంతరం ఆయన పార్టీ నేతలతోపాటు బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరుగుతోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకొన్నారు.

jagan 28102018 3

సేల్ఫీలు వద్దు, ఎవరిని పడితే వారికి ముద్దులు పెట్టద్దు, పలకరింపులన్నీ రోప్‌ ఇవతలి నుంచే ఉండేలా చర్యలు తీసుకోండి అంటూ, ఏపి పోలీసులు జగన్ ను కోరారు. అదే సందర్భంలో ఆయనకు బద్రత కూడా పెంచనున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏపి పోలీస్ మీద నమ్మకం లేదు అని చెప్పినా, అవన్నీ మాకు అనవసరం, రాజకీయ నాయకులు ఎన్నో అంటూ ఉంటారు, మా బాధ్యత మేము చేస్తాం, అందుకే దాడి జరిగిన తరువాత, జగన్ సెక్యూరిటీ పై సమీక్ష చేసి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం, బద్రత పెంచటం ఒక ఎత్తు, అలాగే జగన్ కూడా మా సూచనలు పాటించాలి అని, పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. తమ పరిధిలో జరగని దానికి తాము నిందలు అనుభవిస్తున్నామని, ఒక వేళ పాదయాత్రలో ముద్దులు, సెల్ఫీల కోసం వచ్చేవారు ఎవరైనా దాడి చేసి ఉంటే ఇంకెన్ని అనేవారోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారయణకు కూడా సెక్యూరిటీ పెంచనున్నారు.

Advertisements

Latest Articles

Most Read