నిన్న నిజామాబాద్‌లో, మహబూబ్ నగర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అయితే చంద్రబాబు మోడీతో వైరం పెట్టుకున్న తరువాత, ఆయన తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది ఇదే ప్రధమం కావటం, అదీ ఎన్నికల ప్రచారం కావటంతో, అందరూ మోడీ ప్రసంగం పై ఆసక్తి చూపించారు. మోడీ, చంద్రబాబు పై విమర్శలు చేస్తారని, కాంగ్రెస్ తో కలిసినందుకు, ఎన్టీఆర్ సెంటిమెంట్ వాడతరాని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ వేదికగా, చంద్రబాబు చేస్తున్న జాతీయ ఫ్రంట్ పై విమర్శలు గుప్పిస్తారని అందరూ అనుకున్నారు. కాని, మోదీ కాంగ్రెస్ పైనే విమర్శలు చేశారు. ప్రజాకూటమి మాట ఎత్తకుండా మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

modi kcr 28112018 2

టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన అంటూ విమర్శించే హక్కు ఎక్కడిదంటూ .. సోనియా, రాహుల్‌ విమర్శలను మోదీ తప్పుబట్టారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా మోదీ తన ప్రసంగం ముగించారు. యూపీఏ ఉప్పు తిన్న వ్యక్తి.. కేసీఆర్‌ అని, చంద్రబాబు దగ్గర పని చేసారని, మోదీ బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు అనే మాట చెప్పింది ఇక్కడే. అయితే మోడీ ప్రసంగం పై అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే మొన్న అమిత్ షా కూడా, ఎక్కడా చంద్రబాబు ప్రస్తవాన తేలేదు. దీనికి అసలు కారణం ఏంటో విశ్లేషిస్తే, మోడీ జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రభావం అసలు కనపడుకుండా చేస్తున్నారు. తెలంగాణాలో కూటమి గెలుపు తధ్యం అని తెలిసిన తరువాత, కూటమి పై విమర్శలు చేస్తే, రేపు అదే సక్సెస్ ఫార్ములా అని చంద్రబాబు జాతీయ స్థాయిలో చూపిస్తారు. అందుకే అసలు కూటమి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు చెయ్యకూడదు అనేది మోడీ-షా ఎత్తుగడ. చంద్రబాబుని విమర్శ చేస్తే, మోడీ కూటమిని విమర్శించారు అనే ప్రచారం జాతీయ స్థాయిలో వస్తుంది. రేపు కూటమి గెలిస్తే, మోడీ కూటమితో డీ కొని ఓడిపోయారు అనే ఫోకస్ వెళ్తుంది. అందుకే మోడీ, అసలు చంద్రబాబుని పట్టించుకోలేదు.

modi kcr 28112018 3

మరో పక్క కేసీఆర్ మాత్రం, చాలా ఫూలిష్ గా, తెలంగాణా యుద్ధం కాంగ్రెస్ పార్టీతో అని చెప్పకుండా, చంద్రబాబుతో యుద్ధం అన్నట్టు, తెలంగాణా ఎన్నికలని మార్చేసారు. 13 సీట్లలో పోటీ చేసే చంద్రబాబుని కాకుండా, ఉత్తం కుమార్ రెడ్డిని ఫోకస్ చేసుకుంటే, కేసీఆర్ కు ఎన్నికల ప్రచారం ఈజీ అయ్యేది. చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, చంద్రబాబు ఏమి చేసారు, కేసీఆర్ ఏమి చేసారు అనే చర్చ వస్తుంది. చంద్రబాబు హైదరాబాద్ కి ఏమి చేసారో ప్రపంచం మొత్తం తెలుసు. మరో పక్క, కేసీఆర్ ఎంత తిట్టినా, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ని ఎక్కడా విమర్శించలేదు. చంద్రబాబు అలా చేస్తే, కేసీఆర్ అనుకున్న పాచిక పారేది. ఆంధ్రోడు మనల్ని తిడుతున్నాడు అంటూ ప్రజల్లో మరింత సెంటిమెంట్ రగిలించే వారు. చంద్రబాబు పై మోడీ విమర్శలు చెయ్యక పోవటం కాని, చంద్రబాబు కేసీఆర్ పై విమర్శలు చెయ్యకపోవటం కాని చూస్తే, సరైన రాజకీయం తెలిసినవాడు చేసే పని ఇది అని అర్ధమవుతుంది. కాని కేసీఆర్ మాత్రం, చంద్రబాబుని తిడుతూ, అసలు అజెండా పక్కన పెట్టేసారు. ప్రజలకి నువ్వేమి చేసావో చెప్పాలి కాని, చంద్రబాబు ఏమి చేసాడో కాదు కదా.

'నువ్వు కొట్టినట్టు నటించు - నేను ఏడ్చినట్టు నటిస్తాను' అనే సామెత విన్నారా ? దీని గురించి బెస్ట్ ఉదాహరణ కావలి అంటే, నిన్న తెలంగాణాలో మోడీ-కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే అర్ధమైపోతుంది. ఇంతకంటే ముందు మనం మరో విషయం చెప్పుకోవాలి.. మోడీ గారు గుజరాత్ లో ఎన్నికల వేళ చేసిన ప్రచార సభలు 34, కర్నాటకలో 21, ఛత్తీస్గఢ్ 7, మధ్య ప్రదేశ్ 11. అదే తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి.. అంటే ఇక్కడే అర్ధమవుతుంది, కేసీఆర్ తో ఉన్న అవగాహన ఎలాంటిదో. మోడీ ఎక్కువ ప్రచారం చేస్తే, ఓట్లు చీలేది కేసీఆర్ దగ్గర నుంచే. అందుకే పాపం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టకుండా, బీజేపీ జాగ్రత్త పడుతుంది. మళ్ళీ అసలు విషయానికి వద్దాం. నిన్న మోడీ, కేసీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తే వీళ్ళు ఎంత కామెడీనో అర్ధమవుతుంది.

governer 28112018

కేసీఆర్ సారు...మోదీ సారు రహస్య అవగాహన నేపధ్యంలో ఏమి మాట్లాడతారు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకుంది.... తెలంగాణ లో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఏకారణంగానో చూస్తే...డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..ఇంటికో ఉద్యోగం... దళితులకు మూడెకరాల భూమి...నిరంకుశత్వం... నిర్భంధం... ఏక పక్ష ధోరణి...ఫామ్ హౌస్ పాలన..రైతుల ఆత్మహత్యలు..రైతులకు బేడీలు...టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దందాలు...ఇవి ముఖ్యంగా కొన్ని... నిజంగా కేసీఆర్ ని గద్దె దించాలనుకుంటే...టీఆర్ఎస్ ని ఓడించాలనుకుంటే.....వీటి మీద విమర్శచేయాలి..ప్రశ్నించాలి... ఘనత వహించిన మోదీ గారు...ఇవన్నీ విడచి పెట్డి కేసీఆర్ కు ఏది మంచిందో అదే చేసారు.

governer 28112018

అప్పు చేసో సప్పు చేసో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంటే దానిమీద మాట్లాడతారు... పూజలు ..యాగాలు గురించి మాట్లాడతారు.. కుటుంబ పాలన గురించి మాట్లాడతారు...మనదేశంలో వ్యక్తులకే కాదు కుటుంబాలకు కూడా ఆరాధకులుంటారు... ఈ విమర్శలు అన్నీ కేసీఆర్ విజయవంతంగా తిప్పి కొట్టగలిగిన వే... పైగా కాంగ్రెస్ తో అవగాహన అంటారు...ఎంత అవగాహన లోపం ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడరు...ఇద్దరి మధ్య అవగాహన ఉంటే తప్ప.. మోదీ గారు బంతిపూల యుద్దం చేస్తారు...కేసీఆర్ ఎంతో ఆవేదనతో..ఆవేశంగా కనకాంబరాలతో కొడతాడు... ఎంత బాగా రక్తి కట్టించారు...మెలోడ్రామా ని.. బీజేపీ కేడరు చస్తున్నారు...విశ్లేషణ చేయలేక సమర్దించలేక..ఊరకే ఉండలేక... మోదీ విపక్షాలకే కాదు స్వపక్షానికి కూడా ఝలక్ ఇవ్వగలరు... అయితే జనం మీరనుకున్నంత ... కేసీఆర్ ..మోదీ స్నేహాన్ని చాన్నాళ్ళనుండి గమనిస్తున్నారు... మోదీ ...కేసీఆర్... మీ కధ ముగిసింది...కలచెదిరింది...కధ మారింది...ఫామ్ హౌసే మిగిలింది...

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, కేసీఆర్ ప్రధాన అజెండాగా తీసుకుంది చంద్రబాబుని. చంద్రబాబుని ఒక శత్రువుగా, ఒక బూచిగా తెలంగాణా సమాజానికి చూపిస్తున్నారు. చంద్రబాబు కూడా ముందుగా తెలంగాణా ఎన్నికలకు వెళ్ళద్దు అనే అనుకున్నారు. కాని కేసీఆర్ పదే పదే కావాలని, చంద్రబాబుని ఎదో శత్రువుగా చూపిస్తున్నారు. ఇవన్నీ తిప్పికొట్టటానికి చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. అసలు కేసీఆర్ చంద్రబాబుని ఎందుకు తిడుతూన్నాడు ? చంద్రబాబు ప్రచారాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలుసుకుంటే, తెలంగాణా ఉద్యమం నడిచిందే నీళ్లు - నిధులు - నియామకాల కోసం... వీటిలో కేసీఆర్ తెలంగాణాలో ఏమి చేసారు ? ఆంధ్రాలో చంద్రబాబు ఏమి చేసారు అనే చర్చ మొదలైతే ? అదే కేసీఆర్ భయం..

telangana 27112018 2

నీళ్లు : చంద్రబాబు వచ్చి, పట్టిసీమ కట్టి డెల్టాకు నీళ్లిచ్చి, కృష్ణ నీళ్లు రాయలసీమకిచ్చి , పురుషోత్తపట్నంతో ఉత్తరాంధ్రకు నీళ్లిచ్చి, వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసాడో చెపుతాడు... భగీరథ కాకతీయ పేరుతో కేసీఆర్ ఎంత దోచుకున్నాడో తెలంగాణా సమాజానికి కనిపిస్తూనే ఉంది.. అలాగే కేసీఆర్ ఎగువ రాష్ట్రంగా ఉండి, చంద్రబాబు నీళ్లు ఆపుతున్నాడు అని అంటే, రైతులు నమ్ముతారా ? ఈ మాటలు వింటే, రైతులు కేసీఆర్ కు ఓట్లేస్తారా?.... నిధులు : వేల కోట్ల లోటు బడ్జెట్టుతో, ఆదాయం లేని, రాజధాని లేని రాష్ట్రంలో, తాను అద్భుతంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురుంచి చెపుతాడు. శుభ్రమైన పరిసరాల్లో ఆహారం పెట్టె అన్న కాంటీన్ల గురించి చెపుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసిన రోడ్ల గురుంచి ఇతర మౌలిక సదుపాయాల గురుంచీ చెపుతాడు, అప్పుడు హైదరాబాద్ రోడ్లు గురించి ప్రజలు ఆలోచించరా ?. రాజధాని భూసేకరణనీ, మల్లన్న సాగర్ భూదోపిడీనీ పోలుస్తాడు. టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నాడో అవినీతిని ఎలా తగ్గించగలిగాడో చెపుతాడు. ఇవన్నీ విన్న ప్రజలకి, కేసీఆర్ ఎన్ని రకాలుగా విఫలం అయ్యాడో అర్ధం కాదా ? కేసీఆర్ కి ఇంకా ఓటేస్తారా?

telangana 27112018 3

నియామకాలు : ఖజానా ఖాళీ అయినా, ఎన్ని వేల మందికి ఉద్యోగాలిచ్చాడో చెపుతాడు, ఎన్ని సార్లు డీఎస్సీ ఇచ్చింది చెప్తాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ కి ఏ విద్యార్థయినా నిరుద్యోగయినా ఓటేస్తాడా? అలాగే...కియా లాంటి వేల కోట్లు పెట్టుబడి పెట్టె కంపినీలని తెచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించిన విషయం చెపుతాడు. మరిన్ని లక్షల మందికి స్వయంఉపాది చూపించిన విషయం చెపుతాడు. ఇది విన్నాక, కేసీఆర్ తెచ్చిన ఒక్క కంపెనీ ఏంటి అని ప్రజలు ఆలోచించరా ? ఏ తెలంగాణా యువకుడన్నా ఫార్మ్ హౌస్ లో నాలుగేళ్ళ నుంచీ పడుకున్న కేసీఆర్ కి ఓటేస్తాడా? భావోద్వేగాలు వదిలేసి...వాస్తవిక దృక్పధంతో చంద్రబాబు చెప్పే మాటలు కనీసం 70 శాతం మంది తెలంగాణా ప్రజానీకం వింటది. ఒక నిర్ణయం తీసుకుంటది. కేసీఆర్ అడ్రస్ గల్లంతవుతది. అందుకే చంద్రబాబు ప్రచారాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు... అయినా, చంద్రబాబు రేపు తెలంగాణాలో అడుగు పెడుతున్నారు. బరాబర్ వస్తున్నాడు కేసీఆర్.. తెలంగాణాలో సామాజిక ఆర్ధిక మార్పులకు తెలుగుదేశం ఎలా కారణమో చెప్తాడు... గాజులు అమ్మే హైదరాబాద్ లో, సైబెరాబాద్ సిటీ సృష్టించాను అని చెప్తాడు... నీ దొరల అహంకారం గురించి, నీ కుటుంబం చేసిన దోపిడీ గురించి చెప్తాడు.. ఢిల్లీ అహంకారులతో, ఎలా కుమ్మక్కు అయ్యావో చెప్తాడు.. కాంగ్రెస్ తో ఎందుకు కలిసారో చెప్తాడు... బంగారు తెలంగాణా కావలి అంటే, ఏమి చెయ్యాలో చెప్తాడు... బరాబర్ వస్తాడు... రేపే వస్తున్నాడు... ఖమ్మం గడ్డ మీద అడుగు పెడుతున్నాడు...

దేశంలోని ప్రతి వ్యవస్థని మోడీ సర్కార ఎలా నిర్వీర్యం చేస్తుందో చూస్తున్నాం. ఆ కోవలోదే గవర్నర్ వ్యవస్థ కూడా. గవర్నర్ ని అడ్డం పెట్టుకుని, కొన్ని రాష్ట్రాలలో దొడ్డి దారిని అధికారంలోకి వచ్చింది బీజేపీ, రావటానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఇప్పుడు తాజాగా, అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా రావటానికి చూసి భంగ పడింది. ఈ విషయం జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్వయంగా చెప్పారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నర్ సత్యపాల్ మలిక్.. వారంరోజుల్లోనే మరోసారి వివాదానికి తెరలేపారు. కేంద్రం చెప్పినట్లు తాను చేయలేనని, ఒకవేళ అలా చేస్తే చరిత్రలో అవినీతిపరుడిగా మిగిలేవాడినంటూ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మాలిక్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

governer 28112018

‘అప్పటి పరిస్థితుల్లో నేను దిల్లీ(కేంద్రం) వైపు చూసుంటే.. భాజపా మద్దతిస్తున్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజాద్‌ లోన్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ బలవంతంగా పిలవాల్సి వచ్చేది. కేంద్రం సాయంతో సజాద్‌ లోన్ ఎలాగొలా తన బలాన్ని నిరూపించుకునేవారు. అప్పుడు చరిత్రలో నేను అవినీతిపరుడిగా, నిజాయతీలేని వాడిగా మిగిలిపోయేవాడిని. కానీ నేను దాన్ని జరగనివ్వలేదు. అసెంబ్లీని రద్దు చేశాను. నన్ను తిట్టాలనుకునేవారు తిట్టండి కానీ నేను సరైన పనే చేశాను’ అని గవర్నర్‌ మాలిక్‌ చెప్పుకొచ్చారు. అంతేగాక.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒమర్‌ అబ్దుల్లా సీరియస్‌గా ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు.

governer 28112018

గతవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్టు గవర్నర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో తాను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధమంటూ... పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముందుకొచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. గవర్నర్ అకస్మిక నిర్ణయంపై అటు జమ్మూ కశ్మీర్‌లోనూ, ఇటు ఢిల్లీలోనూ ప్రత్యర్ధి పార్టీ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. గవర్నర్ నిర్ణయం ‘‘అప్రజాస్వామికమనీ, రాజ్యాంగ విరుద్ధమని’’ ఆరోపిస్తూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. అయితే రాష్ట్ర ప్రయోనాలను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ బీజేపీ గవర్నర్‌ను వెనకేసుకొచ్చింది.

Advertisements

Latest Articles

Most Read