పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లు ఆమోదానికి శాసనమండలిలో ప్రతికూల వరిస్థితులు తలెత్తడంతో భవిష్యత్తు కార్యచరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి ని సారించింది. జగన్ శాసనమండలిలో బిల్లులపై ఎదురైన పరిస్థితులకు దీటుగా స్పందించేందుకు వీలుగా తన మంత్రివర్గ సహచరలు, పార్టీ ముఖ్యకార్యకర్తలతో మంత్రాంగం చేసారు. ఈ విషయంపై ఆయన ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించే అంశంపై పలువురు కీలకమైన సూచనలు చేసారంటున్నారు. ఆయన అక్కడ నుంచే ఇక తన కార్యకలపాలు చవట్టేందుకు సంసిద్ధమయ్యారంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలనే పట్టుదలను ఆయన స్పష్టీకరిస్తున్నారు. ఆయన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్ర నాద్, బొత్స సత్యనారాయణ, మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ముఖ్యమంత్రి సహచరులు విజయసాయిరెడ్డి, వైవిసుబ్బారెడ్డి తదితరులు ఈ విషయంలో టిడిపి శాసనమండలిలో అనుసరించిన వ్యుహన్ని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారంటున్నారు.

jagaan 25012020 2

సమావేశంలో మండలిలో చోటు చేసుకున్న పరిణామాలను అనుసరించి కీలక సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు పలువురు న్యాయనివుణలతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలు స్తోంది, న్యాయస్థానాలను ఆశ్రయించి రాజధానుల అంశానికి ఇబ్బంది కలిగించాలని ఇంకా విపక్షం భావిస్తున్న అంశాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నారంటున్నారు. శాసనమండలిలో చోటు చేసు కున్న అంశాలకు అనుగుణంగా ఆయన అస్సలు మండలిని రద్దు చేయాలనే ఆలోచనకు వచ్చారంటున్నారు. మండలిని రద్దు చేయ కుండానే నిర్దిష్ట వ్యవధిని తీసుకుని ఆకర్ష కార్యక్రమం ద్వారా విపక్షం ఎంఎల్‌సిలను తమ పార్టీలో కలుపుకోవచ్చుననే కొందరి సహ చరుల ప్రతిపాదన పట్ల జగన్ సై అన్నట్టు తెలుస్తుంది.

jagaan 250120203

ఇందులో భాగంగా, కొంత మంది మంత్రులు, నిన్నటి నుంచి, టిడిపి, పీడీఎఫ్ ఎమ్మెల్సీల పై గురి పెట్టారని వార్తలు వస్తున్నాయి. విపక్ష ఎమ్మెల్సీలను, తమ వైపు తిప్పుకుని, మండలిని మరోసారి సమావేశ పరిచి, ప్రస్తుతం ఉన్న మండలి చైర్మెన్ పై, అవిస్వాసం పెట్టి, ఆయన్ను దించేసి, ఆయన స్థానంలో తమకు అనుకూలమైన వారిని పెట్టి, సెలెక్ట్ కమిటీని రద్దు చెయ్యటం కాని, లేక సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వారం, పది రోజుల్లో వచ్చే విధంగా చేయాలని, వైసీపీ ప్లాన్ గా తెలుస్తుంది. అయితే ఈ విధానం వల్ల, జగన్ వైఖరి ప్రజలకు ఎక్ష్పొజ్ అవుతుందని, విపక్షాలకు పోయేది ఏమి ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు కాకపొతే, మూడు నెలలకు అయినా జగన్ అనుకున్నది చేస్తారని, కాకపొతే, ఇప్పటికే టిడిపి ఏమి చెయ్యగలుగుతుంది, ఎలా పోరాడింది అనే విషయం ప్రజలు గమనించారని, ఇప్పుడు జగన్ విపక్ష ఎమ్మెల్సీలను లాగితే, తాను చెప్పిన మాటలకే, తాను వ్యక్తిరేకంగా చేస్తున్నారని, ప్రజలకు అర్ధమవుతుందని, అలా కాకుండా శాసనమండలి రద్దు చేసినా, జగన్ కే నష్టం అని టిడిపి చెప్తుంది.

తనపై ఉన్న కేసులవిచారణ ముంచుకొస్తుండటంతో రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డిలో తత్తరపాటు, కలవరం మొదలయ్యాయని, ఆకంగారులోనే తానేం నిర్ణయాలు తీసుకుంటున్నాడో తెలియని అయోమయావస్థలో ఆయన ఉన్నాడని టీడీపీ సీనియర్‌ నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ముఖ్య మంత్రి అయిన మే30 నుంచి జనవరి 25 (2020)వరకు 30శుక్రవారాలు వస్తే, ఒక్కవారమే జగన్‌ కోర్టుకు హాజరయ్యాడని, ఇకపై తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ందేనని సీబీఐ న్యాయస్థానం స్పష్టంచేయడంతో జగన్‌ హానీమూన్‌ అంకం ముగిసినట్లే నని వర్ల ఎద్దేవాచేశారు. 2012లో జగన్‌ సీబీఐ, ఈడీలు ఛార్జ్‌షీట్లు వేస్తే ఇప్పటివరకు విచారణ సాగుతూనే ఉండటం సుప్రీంఆదేశాలకు విరుద్ధమని వర్ల తెలిపారు. ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయనేతలు కేసుల్లో ఉన్నప్పుడు సదరు కేసుల విచారణ ఏడాదిలో పూర్తవ్వాలని, అవసరమైతే రోజువారీ విచారణజరపాలని 2014లో సుప్రీంకో ర్టు స్పష్టంచేసిందని, ఒక్క జగన్‌కేసులవిచారణలో తప్ప, అన్ని కేసుల్లో సుప్రీం ఆదేశాలు అమలయ్యాయని వర్ల పేర్కొన్నారు. ప్రధాని మోదీకూడా నేరచరిత ఉన్న రాజకీయ నేతలపై ఏడాదిలోనే విచారణపూర్తిచేసి వారిని శిక్షిస్తామని చెప్పారన్నారు.

జగన్మోహన్‌రెడ్డి కోర్టులను నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆయన అనేకకేసుల్లో ముద్దాయినన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడని వర్ల తెలిపారు. కోర్టుకు హాజరవ్వకుండా ఉండటానికే జగన్‌ శుక్రవారం నాడు పనులు పెట్టుకుంటున్నాడన్నారు. అన్నిరకాల అవినీతులకు మూలమైన సీఎం కార్యాలయాన్ని వదిలేసి, ఏసీబీవారు రెవెన్యూకార్యాలయాలపై దాడులుచేస్తే ఉపయోగం ఉండదన్నారు. జగన్‌తోటి ముద్దాయి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలోని బెల్‌గ్రిడ్‌లో పోలీస్‌ నిర్బంధంలో ఉన్నాడని, ఆయన్ని ఆదేశం నుంచి రప్పించడానికి 22మంది వైసీపీఎంపీలు పలుమార్లు కేంద్ర విదేశాంగశాఖా మంత్రి జైశంకర్‌ను, కేంద్రహోంశాఖ కార్యదర్శిని కలిశారని,ఇంతకంటేఘోరం ఇంకెక్కడాఉండబోదని వర్ల అభిప్రాయపడ్డారు. వాన్‌పిక్‌ కేసులో రస్‌అల్‌ఖైమా కంపెనీని మోసగించిన నేరానికి సదరు కంపెనీ ఫిర్యాదుతో ప్రసాద్‌ని నిర్బంధించడం జరిగిందని, గతేడాది జూలై 30న ఆయన్ని సెర్బియాలో నిర్బంధించడం జరిగిందన్నారు. ముఖ్యమ ంత్రి తెలివితేటలన్నీ తనతోటి ముద్దాయిలను విడిపించుకోవడానికి, తనకేసుల విచారణ కు ఎలాంటి లాయర్లను నియమించుకోవాలన్న ఆలోచనలకే సరిపోతున్నాయన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ను విడిపించడానికి వైసీపీఎంపీలు, విజయసాయిరెడ్డిలు పలుమార్లు ఎందుకు కేంద్ర విదేశాంగమంత్రిని ఎందుకుకలిశారనే దానిపై రాష్ట్రప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. నిమ్మగడ్డను భారత్‌కు రప్పించడంకోసం ఇద్దరు తెలుగుహీరోలు కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారన్నారు. జగన్‌కేసుల విషయంలో సీబీఐ ఆరుదేశాల కు లెటర్‌ ఆఫ్‌ రెగోలేటరీ ఇచ్చిందని, మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయాదేశాల్లో జగన్‌ ఏంచేశాడనే వివరాలను సీబీఐకోరిందన్నారు. ఆరుదేశాల నుంచి సమాచారం రానుండటంతో జగన్‌లో తత్తరపాటు, కలవరం అధికమయ్యాయన్నారు. జగన్‌పై సీబీఐ 11ఛార్జ్‌షీట్లు, ఈడీ 5ఛార్జ్‌షీట్లు నమోదు చేసిందని, 120 (బీ) నేరపూరిత కుట్రకుపాల్పడటం, 420 (మోసం చేయడం), 409 (నమ్మకద్రోహం), 477 (అకౌంట్ల తారుమారు) వంటి అనేకనేరాలకు పాల్పడ్డట్లు స్పష్టంచేయడం జరిగిందని వర్ల వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు ప్రజలనుంచి కాజేసిన 25వేల ఎకరాలను అప్పగిస్తే, ఆయన జగన్‌కు చెందిన సాక్షిలో రూ.834కోట్లు పెట్టుబడి పెట్టాడన్నారు. నిమ్మగడ్డ దొరికితే తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ఆయన్ని విడిపించడానికి జగన్‌, విజయసాయిరెడ్డిలు కేంద్రమంత్రిచుట్టూ ప్రదక్షిణలు చేశారని వర్ల దుయ్యబట్టారు బినామీ యాక్ట్‌ కింద జగన్‌పై కేసునమోదు చేయాలి.

జగన్‌కు ఉన్న ఆస్తులన్నీ ఆయన బినామీలపేరుతోనే ఉన్నాయని, ఇథోపియా ఇన్‌ఫ్రా, కేప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, హరీశ్‌ఇన్‌ఫ్రాల పేరుతో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ ఉందని, ఆ మూడు జగన్‌ బినామీ కంపెనీలా అని వర్ల నిలదీశారు. అలానే తాడేపల్లిలోని నివాసం, బెంగుళూరులోని ప్యాలెస్‌లు కూడా జగన్‌ తనబినామీల పేరుతోనే ఉంచాడ న్నారు. ఈ విధంగా ప్రజలనుంచి కొట్టేసిన ఆస్తులు, భూములను బినామీలపేరుతో ఉంచి అనుభవిస్తున్న జగన్‌పై కేంద్రం బినామీయాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్‌చేశారు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా జగన్‌ తనఆస్తుల ప్రకటన ఎందుకు చేయడంలేదో సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్‌ పోడియంని చుట్టుముట్టిన టీడీపీ సభ్యుల్ని ఎత్తి బయటపడేయాలన్న ముఖ్యమంత్రి, మండలిలో లారీ ఎక్కినట్లుగా ఛైర్మన్‌బల్లపైకి ఎక్కిన తనమంత్రులను ఏంచేస్తాడో చెప్పాలని వర్ల ప్రశ్నించారు. (అసెంబ్లీలో జగన్‌మాట్లాడినమాటల్ని, మండలిలో మంత్రులుచేసిన వీరంగాన్ని వీడియో రూపంలో వర్ల విలేకరులకు ప్రదర్శించారు.) తన నిర్ణయం (3రాజధానులు) తప్పని జగన్‌కు తెలుసునని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే తత్తరపాటులో భాగంగా తప్పటడుగు లు వేస్తున్నాడన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఉండగా, ప్రజల్ని ఓడించడానికి ఢిల్లీ నుంచి ముకుల్‌రోహత్గీని ఎందుకు తీసుకొచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

ఇన్నాళ్ళు ప్రశాంతంగా, ఎలాంటి అహింస లేకుండా, అమరావతి ఉద్యమం సాగుతుంది. భూములు ఇచ్చిన రైతులు, గత 35 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడా అదుపు తప్పలేదు. అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమంలో, వాళ్ళు దెబ్బలు తిన్నారే కాని, ప్రభుత్వ ఆస్తులుని ఏమి చెయ్యలేదు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమాన్ని, హింసాత్మికం చెయ్యటానికి, నిజమైన పైడ్ ఆర్టిస్ట్ లు బయలు దేరారు. ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలిలో, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు ముక్కల రాజధాని వద్దని, తెనాలి మున్సిపల్‌ కార్యాలయం దగ్గర, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వచించాయి. తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని, గత కొన్ని రోజులుగా, నిరసన చేపడుతున్నారు. అయితే ఈ రోజు అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, వీరంగం సృష్టించారు. తమకు ఈ రాష్ట్రంలో, ఏదైనా చేసే లైసెన్స్ ఉంది అనే విధంగా, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు.

tenali 25012020 2

ముందుగా, దీక్షా శిబిరం పై, వైసీపీ కార్యకర్తలు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. తరువాత, దీక్షా శిబిరానికి నిప్పు పెట్టరు. దీంతో వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు, వారిని ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగింది. అక్కడ దీక్షలో ఉన్న మహిళలకు కూడా గాయాలు అయ్యాయి. దీక్షా శిబిరానికి మంటలు వ్యాపించకుండా, మంటలు ఆర్పి వేసారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ క్రమంలోనే, తెనాలి తెదేపా పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుద్దూస్‌ను కూడా, వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అక్కడు రాగా, ఆయన పై కూడా, కోడి గుడ్లు వేసి దాడి చేసారు. ఈ క్రమంలో అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా ఉన్నారు.

tenali 25012020 3

మండలిలో బిల్ ఓడిపోవటంతో, వైసీపీ ఉన్మాది చేష్టలు బయట పడుతున్నాయని, ఇవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయని, టిడిపి అంటుంది. దాడి పై, నారా లోకేష్ ట్విట్టర్ లో స్పండించారు. "రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా YS Jagan Mohan Reddy గారు మరింత దిగజారారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే వైకాపా రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారు.రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేసారు. తెనాలిలో వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరు.రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్ గారు." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా...లేక జగనోకసి, అంటే జగన్‌ కసిలో ఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవాసులపై కసి తీర్చుకోవడానికే జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అధికారంలోకి రావడానికి ఒక్కఛాన్సంటూ బతిమాలి, వరమిచ్చిన ప్రజలపై, రాష్ట్రంపై తన భస్మాసుర హస్తాన్ని పెట్టాలని చూస్తున్నాడని, ఆయన బారినుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. మండలి రద్దు, పునరు ద్ధరణ అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండవన్న యనమల, అసెంబ్లీలో ఆర్టికల్‌-169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు.

అసెంబ్లీ పంపిన తీర్మానంపై కేంద్రం బిల్లుని తయారుచేసి లోక్‌సభకు పంపుతుందని, తరువాత అది రాజ్యసభకు, రాష్ట్రపతి ముందుకు వెళుతుందన్నారు. ఆర్టికల్‌ 174-2 (బీ) కింద అసెంబ్లీని రద్దుచేసే అధికారం గవర్నర్‌కు ఉందని, ప్రజల ఆలోచనలకు వ్యతిరేంగా వెళుతోన్న ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉందన్నారు. ప్రభుత్వం మండలిని రద్దుచేస్తే, గవర్నర్‌ అసెంబ్లీని రద్దుచేయడంద్వారా ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరిపక్షమో తేలుతుం దని యనమల స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించే అధికారం రాష్ట్రాలకు ఉండబోదని, పీపీఏల విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్లిన ప్రభుత్వా నికి ఎలాంటిపరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసునన్నారు. ఆర్టికల్‌-257ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని, కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే, ఆర్టికల్‌-356కింద చర్యలు తీసుకునే అధికారం కూడా వారికి ఉందన్నారు. బిల్లుని సెలెక్ట్‌ కమిటీకి పంపేవిషయంలో, తనకున్న విచక్షణాధికారంతో ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నాడని, ఆయన అధికారాలను ప్రశ్నించేహక్కు ఎవరికీ ఉండదని, ఛైర్మన్‌ న్యాయబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాడని యనమల తెలిపారు.

బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న సాక్షి...ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేయడం, కౌన్సిల్‌ తిరస్కరించడం, శాఖల తరలింపుని హైకోర్టు తప్పపట్టడం జరిగినా కూడా సాక్షి మీడియాలో ఇంకా తప్పుడువాదనలు చేస్తూనే ఉన్నారని మాజీమంత్రి మండిపడ్డారు. బిల్లుని సెలెక్ట్‌కమిటీకి పంపలేదని రాయడం, బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న జగన్‌ సొంతమీడియాకే చెల్లిందన్నారు. బుర్రలేనిమంత్రులంతా అసెంబ్లీలో గంటలో ఆమోదించిన బిల్లుని మండలి గుడ్డిగా ఆమోదించాలా అని రామకృష్ణుడు ప్రశ్నించారు. సెలెక్ట్‌కమిటీలో 9 నుంచి 15మంది సభ్యులుంటారని, వారంతా ప్రజాభిప్రాయాలు తీసుకుంటారని, అందుకు అవసరమైన కాలవ్యవధిని మండలే నిర్ణయిస్తుందని యనమల పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయం కోరడం తప్పా...? అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రిజెక్ట్‌చేశారంటున్న మంత్రులంతా మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండలి బిల్లుని ప్రజాభిప్రాయం కోరమని చెప్పింది తప్ప ఎక్కడా దాన్ని తిరస్కరించలేదని యనమల స్పష్టంచేశారు. ఎస్సీకమిషన్‌, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో కూడా ఇలానే తప్పుడు ప్రచారంచేశారన్నారు. వాటిని ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, ఎస్సీ కమిషన్‌ బిల్లులో బీసీకమిషన్‌ బిల్‌ మాదిరే కేటగిరీలు చేయాలని సూచించామని, ఇంగ్లీషు మీడియం బిల్లులో తెలుగు బోధనను ఎంపికచేసుకనే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని సూచించామన్నారు. ఆ రెండుబిల్లులను ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, వాటిని తిప్పిపంపా క తిరిగి పెద్దలసభకు పంపేముందు మనీబిల్లులుగా మార్చారన్నారు. 3రాజధానుల బిల్లు మనీబిల్లా..ఆర్డినరీ బిల్లా అని హైకోర్టుకూడా ప్రశ్నించిందన్నారు.

దేశరాజధాని ఏదంటే ఢిల్లీ అని చిన్నపిల్లాడు కూడా చెప్తాడని, రాజ్యాంగంలో కేపిటల్‌ అనేపదం లేకుంటే, ఆర్టికల్‌ 239 (ఏ) ప్రకారం నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ అనేపదం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. రాజ్యాంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి దాని గురించి ఏంతెలుసునన్నారు. మామూలు చదువే చదవని వ్యక్తికి, రాజ్యాం గం చదివేంతజ్ఞానం ఎక్కడనుంచి వస్తుందని యనమల ఎద్దేవాచేశారు. తప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదన్నారు. టీడీపీ హాయాంలో తరచూ దావోస్‌పర్యటనకు వెళ్లి, పెట్టుబడులు రాబట్టామని, ఈప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవన్నారు. రేపో, ఎల్లుండో న్యాయస్థానంలో జగన్‌కేసులపై వాదనలు ప్రారంభమ వుతాయని, ఏ1, ఏ2, ఏ3లంతా ఒకరితర్వాత ఒకరు కోర్టుబోనులో నిల్చోవడం ఖాయమని యనమల తేల్చిచెప్పారు. ఫెమా, మనీలాండరింగ్‌ మోసాలకు గాను జగన్‌కు శిక్షపడటం ఖాయమని, ప్రజాధ నాన్ని దోచుకొని, 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తిని ఇన్‌కెమరాద్వారా విచారించడం సరికాదన్నారు. అత్యాచారకేసుల విచారణలో మాత్రమే ఇన్‌కెమెరా విధానాన్ని అవలం భిస్తారని, జగన్‌ కేసులవిచారణలో బహిరంగవిచారణే జరపాలని, న్యాయస్థానాలు ఈదిశగా పునరాలోచించాలని యనమల విజ్ఞప్తిచేశారు. హిట్లర్‌, ముస్సోలినీల మాదిరి గా తాను అనుకున్నదే జరగాలన్న ఉక్రోషం జగన్‌లో కనిపిస్తోందన్నారు.

Advertisements

Latest Articles

Most Read