ప్రస్తుతం దేశం అంతా, ట్రాఫిక్ చాలాన్ల గోల నడుస్తుంది. అధిక ఫైన్ ల రూపంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పై, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక విధంగా ఈ ఫైన్లు మంచిదే అయినా, ముందు మంచి రోడ్లు వేసి, తరువాత ఫైన్లు తీసుకోండి అనే వారు కూడా ఉన్నారు. నిన్న ఢిల్లీలో, ఒక టు వీలర్ కు, ఫైన్ల రూపంలో 47 వేలు రూపాయలు ఫైన్ వెయ్యటంతో, బండి రేటు కూడా అంత లేదు అంటూ, విరక్తి చెందిన ఆ వ్యక్తి, పోలీసుల ముందే బండి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గత నాలుగు రోజులుగా ఇలాంటి సంఘటనలో ఎన్నో, ఈ దేశంలో జరుగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా, కొంత మంది మాత్రం వీటిని సమర్ధిస్తున్నారు. అయితే ఈ కొత్త ఫైన్ల విధానం ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు రాలేదు. త్వరలోనే మన రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త ఫైన్ లు రానున్నాయి. అయితే ఈ తరుణంలో, మన రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

auto 07092019 2

ఆటో నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు అంటూ, వచ్చిన చలాన్ చూసి ఆ ఆటో డ్రైవర్ అవాకయ్యాడు. కొంచెం సేపు విషయం ఏంటో అర్ధం కాక, తల బాదుకున్నాడు. చివరకు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఎక్కడైనా చక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ లేకపోతే జరిమానా వేస్తారు కాని, ఆటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి జరిమానా వెయ్యటం, మన రాష్ట్రంలో ఇప్పుడే వింటున్నాయి. ఆటో డ్రైవర్ కి హెల్మెట్ లేకపోవటంతో, జరిమానా విధించారు అని తెలియటంతో, అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడ పోలీసులు నిర్వాకం బయట పడటంతో, ఈ విషయం వైరల్ అయ్యింది.

auto 07092019 3

విజయవాడలోని మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీసులు ఒక ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదు అంటూ, ఈ-చలానా పంపించి అందర్నీ ఔరా అనిపించారు. ఏపీ16టిఎస్‌8597, నంబరు గల ఆటో పై ఐదు ఈ-చలానాలు ఉన్నాయి. ఆటో యజమాని ఈనెల 3న ఏపీ ఆన్‌లైన్‌లో ఆ అపరాధ రుసుమును కట్టటానికి అని వెళ్ళాడు. అయితే వాటిలో ఒక చలానా రూ.135 హెల్మెట్‌ ధరించని కారణంగా వేశామంటూ పేర్కొనడంతో అది చూసి ఆశ్చర్యపోయారు. ఆటో నడుపుకునే నాకు, ఆటో నెంబర్ పై, హెల్మెట్ లేకపోవటం ఏంటి అంటూ ఆశ్చర్య పోయాడు. ఈ క్రమంలో విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్‌ పోలీసుల నిర్వాకం బయటపడింది. అయితే ఈ విషయం పై స్పందించిన అధికారులు, అప్పుడప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయని, ఒకటి పెట్టబోయి, ఇంకోటి పెట్టి ఉంటారని, ఇలాంటివి మా ద్రుష్టికి రాగానే సరి చేస్తామని అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలను ఏదో ఒక విధంగా లోపల వెయ్యటానికి, వైసిపీ ప్రభుత్వం, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. తాజగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ, కధ నడుస్తుంది. మొన్నటి వరకు, కోడెల పై వరుస కేసులు పెట్టించి, ఎలా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు చింతమనేని పై అలా టార్గెట్ సెట్ చేసారు. అధికారంలో ఉండగా, చింతమనేని దూకుడుతో, కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కాని అయన నియోజకవర్గ ప్రజలు మాత్రం, ఆయన దూకుడు ఎప్పుడూ ప్రజల కోసమే అని, ఆయన స్వార్ధానికి ఎప్పుడూ వాడుకోలేదని, ఆయనకు మద్దతు పలికేవారు. అయితే, ఇప్పుడు ఆయన ఓడిపోయారు, పార్టీ కూడా అధికారం కోల్పోయింది. మొన్నటి వరకు జిల్లా అంతటా ఆధిపత్యం చెలాయించిన చింతమనేని, నిప్పుడు వైసిపీ టార్గెట్ చేసింది. గత మూడు నెలలుగా చింతమనేని పై స్కెచ్ వెయ్యగా, ఇన్నాళ్ళకు ఆయన పై కేసు పెట్టె ఒక ఆధారం దొరికింది.

chintamaeni 06092019 2

ఇసుక ఇబ్బందుల కోసం, ఆగష్టు 30న అన్ని కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది. ఇందులో భగంగా చింతమనేని కూడా ధర్నాకు సిద్ధం అయ్యారు. దీంతో పోలీసులు దుగ్గిరాలలోని చింతమనేని నివాసంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చింతమనేనిని బయటకు వెళ్ళనివ్వకుండా చూసారు. ఎప్పటికప్పుడు పై అధికారుల ఆదేశాలు అనుసరిస్తూ, చింతమనేనిని నిలువరించారు. అయితే, మరో రెండు రోజుల తరువాత, మళ్ళీ చింతమనేనిని టార్గెట్ చేసారు. పెదవేగి స్టేషన్‌లో చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. దీంతో ఆయన, లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఎక్కడికక్కడ వెతుకుతూ, ఏలూరు నగర కూడళ్ళలోను, కోర్టు వద్ద, దుగ్గిరాల సమీపంలోనూ పెద్దఎత్తున మొహరించారు.

chintamaeni 06092019 3

అయితే చింతమనేని అదృశ్యం అవ్వటంతో, పోలీసులు ఖంగుతిన్నారు. తేరుకుని చింతమనేని ఎక్కడకు వెళ్ళిపోయారో తీవ్ర స్థాయిలో ఆరా తీశారు. ఎంత వెతికినా అయన ఆచూకీ మాత్రం తెలవలేదు. ఇదే క్రమంలో, రాజకీయ నేతల అండదండలతో, మరికొంత మంది వచ్చి చింతమనేని పై కేసులు పెట్టారు. దీంతో చింతమనేనిని ఎలా అయినా పట్టుకోవాలి అంటూ, పోలీసు వర్గాలపై ఒత్తిడి పెంచారు. ప్రభాకర్‌ ని అరెస్టు చేయడానికి పోలీసులుసరిగ్గా వ్యవహరించలేదని, ఏలూరు రూరల్‌ సీఐ మూర్తిపై డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ గురువారం సస్పెన్షన్‌ వేటు విధించారు. రాజకీయ ఒత్తిళ్ళకు, సిఐ బలయ్యారు. అయితే జరుగుతున్న పరిణామాల పై, పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో సహా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మరికొందరి నేతలు ప్రయత్నించగా, పోలీసులు ఎవరూ వాళ్ళని కలవటానికి ఇష్ట పడలేదు. దీంతో, టిడిపి నేతలు పోలీసుల ఏకపక్ష వైఖరిని తప్పు బట్టారు.

స్పీకర్ స్థానం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ, ఎన్నో మాటలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, ఆయన బయట మాత్రం, తన మాటలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయితే, వారి పై అనర్హత వేటు వెయ్యలేదు అంటూ వెంకయ్య నాయుడు వైఖరినే తప్పుబట్టిన తమ్మినేని, ఆయన విషయం వచ్చే సరికి మాత్రం, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్నటి మొన్న గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఒక స్పీకర్ స్థానంలో ఉంటూ, ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఉండటం పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థ పార్టీ వ్యవస్థలాగా మాట్లాడటం కూడా విమర్శలకు తావుచ్చింది.

tammineni 06092019 2

అయితే ఇప్పుడు మరోసారి తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఈసారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు టార్గెట్ గా రాజకీయ విమర్శలు చేసారు. సహజంగా స్పీకర్ స్థానంలో ఉంటూ, ప్రతిపక్ష నాయకుడి పై రాజకీయ విమర్శలు చెయ్యరు. గతంలో కోడెల ఇలా చేసరాని, అందుకే మేము వ్యవస్థను మార్చేస్తున్నాం అని చెప్తున్న జగన్ గారు, ఈ వైఖరి పై ఏమి చెప్తారో మరి. ఈ రోజు శ్రీకాకుళంలో, పలాసలో జగన్ మోహన్ రెడ్డి సభలో తమ్మినేని పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద రోజుల పాలనలో జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా చేసారని, రాజకీయాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి భారత రాజకీయ చరిత్రలో ఒక్క జగన్ మాత్రమేనని కితాబిచ్చారు.

tammineni 06092019 3

జగన్ మోహన్ రెడ్డి రాకతో పలాస ప్రాంతం పునీతమైందని వ్యాఖ్యానించారు. పలాస ప్రజలు వెనుకబడిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, జగన్ తనను ఏకంగా శాసన సభాపతిగా చేశారని హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పై పొగడ్తలు అయిన తరువాత, చంద్రబాబుని టార్గెట్ చేసారు. చంద్రబాబు-కరువు కవల పిల్లలు అంటూ, స్పీకర్ గా ఉంటూ, ప్రతిపక్ష నాయకుడికి పై రాజకీయ విమర్శలు చేసారు. జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఒక పక్క సీమలో, ఉత్తరంద్రలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, స్పీకర్ గారు మాత్రం, చంద్రబాబుని విమర్శిస్తున్నారు. అలాగే జూన్, జూలై నెలలో వర్షాలు లేక, ఖరీఫ్ లేట్ అయిన సంగతి తెలిసిందే. ఆగష్టు నెలలో కూడా, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు పడి, మనకు వరదలు వచ్చాయి. మరి జగన్ మోహన్ రెడ్డి గారు, ఎవరితో కవలు పిల్లలో ? ఏది ఏమైనా, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారు, రాజకీయ విమర్శలు చెయ్యకుండా ఉంటే, ఆ స్థానానికి గౌరవం వస్తుంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, నిందితుడు మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండు రోజుల్లోనే, ఆ వార్త కనుమరుగు అయిపోతుంది అనుకోండి అది వేరే విషయం. అయితే హైప్రొఫైల్ కేసుల్లో ఈ సీరియల్ మరణాలు కొత్త కాదు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు అందరూ చనిపోయారు. మొన్న వైఎస్ వివేక నిందితుండు ఆత్మహత్య చేసుకోగానే, అందరికీ పరిటాల రవి కేసు గుర్తుకు వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాసిన లేఖల్లో, చేతి రాత తేడా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, రెండు రోజుల్లో అందరూ ఆ వార్త మర్చిపోయారు. ఇప్పుడు ఇలాంటి వార్త మరొకటి సంచలనం సృష్టిస్తుంది. అయితే, ఈ వార్త మాత్రం ఇప్పుడు సంచలనం ఎందుకు అయ్యింది అంటే, ఇది జగన్ మోహన్ రెడ్డికి చెందిన కేసు కాబట్టి.

kodikatti 06092019 2

జగన్ మోహన్ రెడ్డి పాదయత్రలో ఉండగా, జగన్ పై కోడి కత్తితో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న కోడి కత్తి శీను, సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో చంపేందుకు పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీను, తనపై జైలర్, జైలు వార్డెన్ దాడి చేశారనీ, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వెంటనే ఈ విషయాన్ని శ్రీనివాస్ కేసు వాదిస్తున్న లాయర్ అబ్దుల్ సలీం దృష్టికి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న లాయర్ సలీం మాట్లాడుతూ, శ్రీనివాస ని జైలులోనే చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

kodikatti 06092019 3

శ్రీనివాస్ భద్రత పై కోర్ట్ లో పిటీషన్ వేస్తామని లాయర్ సలీం తెలిపారు. జైలులో శ్రీనివాస్ పై దాడి చేసారని, గాయాలయ్యాయని, ఈ దాడి, పై జైలు అధికారుల పై సెక్షన్ 307 కింద కేసులు పెడతామని అన్నారు. శ్రీనివాస్ కు రాజమండ్రి జైల్లో భద్రత లేదనీ, విశాఖ జైలుకు బదిలీ చేయాలని కోర్టును కోరతామని లాయర్ సలీమ్ తెలిపారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కేసు, రాజమండ్రి జైలులో ఉన్న శ్రీనివాస్ చేసిన ఈ ఆరోపణలతో మరింత కలకలం రేగింది. హై ప్రొఫైల్ కేసుల్లో జరుగుతున్న విషయాలు గమనిస్తున్న ప్రజలు, ఈ ఆరోపణల పై కూడా ఏదో జరగబోతుంది అనే ఆలోచనకు వచ్చారు. ఎవరి పైన అయినా దాడి చెయ్యటం, చంపటం నేరం. మొన్న కోడి కత్తి శీను, జగన్ ను గుచ్చటం అయినా, ఈ రోజు శీను ఆరోపిస్తున్నట్టు తన పై జరిగిన దాడి అయినా, ఏదైనా సరే తప్పే అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read