బీజేపీ స్టైల్ అఫ్ ఫంక్షనింగ్ చాలా వేరుగా ఉంటుంది. మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, వెనకాల నుంచి చేసేది చేస్తూనే ఉంటారు. చివరకు వాళ్ళు ఏమి చేసారో, పూర్తిగా దిగితే కాని అర్ధం కాదు. ఇదే ఫార్ములా చంద్రబాబు పై ఉపయోగించారు. దాదపుగా మూడేళ్ళ పాటు చంద్రబాబుతో మంచిగా ఉన్నట్టు చేస్తూ, జగన్ తో కలిసి రాజకీయ గేమ్ ఆడారు. చంద్రబాబు తప్పు తెలుసుకునే సారికి చాలా సమయం అయిపొయింది. అప్పుడు మిత్రుడు అయిన చంద్రబాబు, గట్టిగా అడగటం మొదలు పెట్టగానే శత్రువు అయిపోయాడు. ఇక అందరితో కలిసి, చంద్రబాబుని దించే వరకు బీజేపీ నిద్రపోలేదు. ఇప్పుడు జగన్ ది అదే పరిస్థితి. మంచిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు కాని, బీజేపీ వల్ల, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదు. మెడలు వంచుతా అన్న జగన్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు.

shah 07092019 2

మరో పక్క పోలవరం టెండర్లు విషయంలో కాని, విద్యుత్ ఒప్పందాల రద్దు విషయంలో కాని, ఇలా ఏ విషయంలో కూడా జగన్ కు సహకరించటం లేదు. పైకి మాత్రం, హలో విజయ్ గారు, అంటూ ప్రధాని మోడీ కూడా, సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి బీజేపీ గేమ్ ఆడుతుందో, లేక జగన్, విజయసాయి రాష్ట్రం విషయంలో కాంప్రోమైజ్ అవుతున్నారో కాని, కేంద్రం మాత్రం జగన్ కు షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది. మొన్నటి మొన్న ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించాలి, తెలంగాణా నుంచి డిప్యూటేషన్ పై పంపించండి అంటే, కేంద్రం తిరస్కరించింది. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా జగన్ ప్రభుత్వానికి సహకారం ఇవ్వటం లేదు. అటు కేసీఆర్ తెలంగాణా నుంచి పంపించటానికి ఒప్పుకున్నా కేంద్రం మాత్రం, నిబంధనలు చూపించి నో అంది.

shah 07092019 3

ఇప్పుడు తెలంగాణకే చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌కు కూడా కేంద్రం అంగీకరించే అవకాశం కనిపించటం లేదు. స్టీఫెన్ రవీంద్ర విషయంలో ఉన్న ‘సూపర్‌ టైమ్‌’ స్కేల్‌ నిబంధనే ఇక్కడ కూడా కారణమని చెబుతున్నారు. సూపర్‌ టైమ్‌స్కేల్‌ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్‌ పై పంపించాలి అంటే ఎంతో అసాధారణ పరిస్థితి ఉండాలి. శ్రీలక్ష్మి, స్టీఫెన్‌ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితు లు లేవని కేంద్రం భావిస్తుంది. అయితే వీరిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటానికి, స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. శ్రీలక్ష్మిని ఢిల్లీ తీసుకు వెళ్లి మరీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి లాబీయింగ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా చెయ్యని ప్రయత్నం లేదు. ఇన్ని చేసినా, కూడా కేంద్రం కనీసం సహకరించటం లేదు. స్టీఫెన్ కు ఇప్పటికే నో చెప్పారు. రేపో మాపో శ్రీలక్ష్మి విషయంలో కూడా నో చెప్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల్లో ఓటమి తరువాత, మొదటి సారి, జిల్లాల పర్యటనకు వెళ్లారు. ముందుగా, తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఎన్నికల ఓటమి పై సమీక్షలు శ్రేణుల్లో ధైర్యం నింపారు. చాలా రోజుల తరువాత, తమ అధినేత, తమతో ఎక్కువ సేపు గడపటంతో కార్యకర్తలు కూడా సంతోష పడ్డారు. ఓటమికి గల కారణాలు, పార్టీలోని ఇబ్బందులు, ఇలా అనేక విషయాల పై చర్చించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల నేతలతో రెండు రోజులు పాటు చంద్రబాబు అన్ని విషయాలు చర్చించారు. నేతలు , కార్యకర్తలు కూడా చంద్రబాబు ముందు అన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. పార్టీ తప్పులతో పాటు, ఏంచేస్తే తిరిగి పార్టీకి పునరుత్తేజం కలుగుతుందో ఏకరువు పెట్టారు.

cbn 07092019 2

ఈ సమీక్షలో కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు, తోటత్రిమూర్తులు లాంటి నేతలు కూడా డుమ్మా కొట్టారు. దీంతో అలాంటి నేతలను ఇంకా బుజ్జగించటం అనవసరం అని, ఈయన స్థానంలో కొత్త నేత ఎంపికకు చంద్రబాబు ఓకే చెప్పారు. జిల్లాలో జరుగుతోన్న పరిణామాల పై సీనియర్‌ నేతలతో వన్ టు వన్ రహస్య సమావేశమై చంద్రబాబు చర్చించారు. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు, క్యాడర్‌లో ఉత్తేజం నింపారు. ప్రభుత్వం కావాలని అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదే సమయంలో గడచిన అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉండి, కార్యకర్తల దూరంగా, వారి అభిప్రాయాలు వినిపించే అవకాసం లేదని అభిప్రాయానికి ఆయన కూడా అంగీకరించారు.

cbn 07092019 3

ఈ రెండు రోజులు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా ఇన్నాళ్లకు తమ అధినేతతో సమయం దొరికింది అని, అభిప్రాయాలను పంచుకున్నామని, మనసు విప్పి అన్ని కష్టాలు అధినేతతో పంచుకున్నామని, చంద్రబాబు స్పందించిన తీరుతో సంతోషంగా ఉన్నామని అన్నారు. తమకు అధికారం లేకున్నా పార్టీని దర్జాగా నడిపిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో సమీక్ష చేసిన చంద్రబాబు వెళ్తూవెళ్తూ మనసులో మాట బయటపెట్టారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో భేటీ తర్వాత తానేం కోల్పోయానో అర్థమైందని బహిరంగంగా పేర్కొన్నారు. తూర్పుగోదావరి నుంచి సంతోషంగా వెళ్తున్నట్టు వెల్లడించారు. సీఎంగా తీరిక లేకపోవడంతో జిల్లాలో పార్టీకి, క్యాడర్‌కు చెయ్యాల్సిన పనులు చేయలేదని తనకు అర్థం అయ్యిందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అధినేతలో వచ్చిన మార్పు చూసి కార్యకర్తలు సంతోష పడ్డారు.

స్వరూపానంద లాంటి స్వాములు, జగన్ మోహన్ రెడ్డి కోసమే మా శారదా పీఠం పని చేసింది, మా పీఠంలో ప్రతి మొక్క వైఎస్ జగన్ సియం అవ్వటం కోసమే పని చేసింది అని ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో, ఈ స్టేట్మెంట్ పెద్ద దుమారమే రేపింది. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తూ, ప్రభుత్వానికి తగు రీతిలో సూచనలు ఇవ్వకుండా, ఇలా వ్యక్తి భజన చెయ్యటం, ఎలాంటి ధర్మం అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే వైసిపీ మాత్రం, దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంది. జగన్ మోహన్ రెడ్డి పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉందని, కానీ ఆయన హిందూ వ్యతిరేకి కాదని, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్సనం అని వైసిపీ ప్రచారం చేసుకుంది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ, అటు బీజేపీ, ఇటు కొంత మంది స్వాములు కూడా గళం విప్పుతున్నారు.

kamala 07092019 2

తాజగా స్వామి కమలానందభారతి, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం రెండు మతాలను తృప్తిపరిచేలా జగన్ ప్రభుత్వ పరిపాలన సాగుంతుందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానందభారతి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న పలు అంశాల పై తన అభిప్రాయాలను తెలిపారు. లౌకిక ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి, అన్ని మతాలను ఒకేలా చూడాలని, ప్రభుత్వాలు అలా నడవాలని అన్నారు. పాస్టర్లకు, మసీదుల్లో పనిచేసేవారికి జీతాలు ఇస్తున్నారని, ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కాని, దేవాదాయ, ధర్మాదాయ శాఖలాగే వారికి కూడా ఒకదాన్ని ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలని సలహా ఇచ్చారు.

kamala 07092019 3

ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై సంచలన ఆరోపణలు చేసారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా క్రైస్తవ మత వ్యాప్తి చేసే కుట్రదాగి ఉందని స్వామి కమలానందభారతి ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై పోరాటం చేస్తామని అన్నారు. అలాగే దేవాదాయ శాఖలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయకూడదు అని అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి, అక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టాలు కూడా ఉన్నాయని, దేవాదాయ ధర్మాదాయ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉందన ఆయన తెలిపారు. దేవాలయాల భూములను అప్పనంగా పంచి పెట్టాలని చూస్తున్నారని, వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రయత్నిస్తే కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచటాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. అధిక ఖర్చు, రాజకీయ పునరావాసం తప్ప, దీని వల్ల ఉపయోగం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు.

ఆంధ్రుల రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ ప్రకటనలు కొనసాగుతున్నాయి. మొన్నటిదాకా అమరావతిలో వరదలు వస్తాయి, అమరావతి పై ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ గందరగోళ ప్రకటనలు చేసిన బొత్సా, ఇప్పుడు మళ్ళీ మరొక ప్రకటన చేసారు. చంద్రబాబు హయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చంద్రబాబు గజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటూ బొత్సా ప్రశ్నించారు. గజిట్ ఇవ్వకుండా చంద్రబాబు కావాలని చేసారని, చంద్రబాబుకి అమరావతి మార్చే ఆలోచన ఉండబట్టే, గజిట్ ఇవ్వలేదని బొత్సా అన్నారు. అయితే, ఇక్కడ బొత్సా వ్యాఖ్యల పై కౌంటర్ లు గట్టిగా పడుతున్నాయి. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సాకు ఆమాత్రం కూడా తెలియదా, లేక అధికారులు కూడా కనీసం చెప్పరా, బొత్సా వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్సనంగా నిలుస్తున్నాయి.

botsa 07092019 1

ఏపి రీ ఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం రాష్ట్ర విభజన అయిన తేదీ నుండి పది సంవత్సరాల వరకు హైదరాబాద్ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి రాజధానిగా ఉన్నది అనేది అందరికీ తెలిసిందే. విభజన చట్టంలో ఉన్న రాజధానిని కాదని అమరావతిని నియమిత కాలానికి ముందే గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తే ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసి వస్తుంది. మనం హైదరాబాద్ నుంచి పరిపాలన చెయ్యకపోయినా, కొన్ని వెసులుబాటులు ఉంటాయి. విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల విభజన జరగకుండా హైదరాబాదును రాజధానిగా వదులుకోవటం రాష్ట్రానికి మంచిదికాదు. అందువల్లనే అనధికారికంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

botsa 07092019 1

బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడైన రాజకీయనాయకుడిగా, మంత్రిగా కూడా వుండి బాధ్యతారాహిత్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గజిట్ నోటిఫికేషన్ ఎందుకు చెయ్యలేదని చంద్రబాబుని ప్రశ్నించడం హాస్యాస్పదం. భారత ప్ర భుత్వం లో ప్రతి రాష్ట్రం కి అధికారిక రాజధాని పెరు ఒకటి ఉంటది. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ పేరుతో నే జరుగుతాయి. అమరావతి ని రాజధానిగా ప్రకటించి దానికి అధికారిక ముద్ర ఇస్తే ఇప్పుడు ఉమ్మడి రాజధాని గా ఉన్న హైద్రాబాద్ రాజధాని గా ఉండటం కుదరదు. అందుకని అమరావతి ని తాత్కాలిక రాజధాని గా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం కి తెలియచేశారు. నాటి నుండి భారత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని అమరావతి పెరు తో నడుస్తున్నాయి. సచివాలయం పెరు లో కూడా ఇంటరీమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అన్నారు. తాత్కాలిక రాజధాని అన్ని తాత్కాలికమే అని వైసీపీ విమర్శలు చేస్తుంటే నాటి టీడీపీ ప్రభుత్వం వారికి ప్రజలకు సరిగా వివరించలేకపోయింది. ఇప్పుడు అధికారికం గా వైసీపీ అదే విమర్శ చేస్తుంటే ఇప్పుడు సరిగా చెప్పలేక పోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read