పారదర్శకానికి ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్న రోజులు ఇవి. దేశం మొత్తం ప్రభుత్వాలు, పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఆన్లైన్ లో పెడుతూ ప్రజలకు అందుబాటులో పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తారనే పేరు ఉండేది. ప్రతిదీ డాష్ బోర్డు కు అనుసంధానం అయి ఉంటాయి. రియల్ టైంలో, డేటా అంతా అప్డేట్ అవుతూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. అయితే ప్రభుత్వాలు కొన్ని మాత్రం రహస్యంగా ఉంచుతూ ఉంటాయి. అవి అందరూ అర్ధం చేసుకోవాల్సిందే. అందుకే రహస్య జీవోలు వదులుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు ఎంత రియల్ టైం పాలన చేసినా, పరిపాలనలో భాగంగా కొన్ని రహస్య జీవోలు విడుదల చేసే వారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇది ఆక్షేపించేది.

go 02092019 2

రియల్ టైం పాలన అంటూనే, రహస్య జీవోలు ఇస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎదో దాస్తుంది అంటూ, తమ సొంత మీడియాలో విపరీతమైన ప్రచారం చేసి, ప్రజలకు ఎదో జరిగిపోతుంది అనే భ్రమ కల్పించే వారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇదే విషయం పై తన పాదయాత్రలో ప్రస్తావిస్తూ, చంద్రబాబు రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని, పరిపాలనలో రహస్యం అంటూ ఏమి ఉండదని, అన్ని విషయాలు ప్రజలకు చెప్పాలని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి, ప్రజలకు ఆ రహస్య జీవోల్లో ఉన్నది ఏమిటో చెప్పాలి అంటూ రాజకీయ అంశంగా మార్చి, ప్రచారం చేసే వాళ్ళు. ఇదే విషయన్ని ప్రశాంత్ కిషోర్ టీం కూడా, సోషల్ మీడియాలో తిప్పేది.

go 02092019 3

అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయి, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మేము పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. అయితే అప్పట్లో ప్రభుత్వం చేసిన విధంగానే, ఇప్పుడు కూడా రహస్య జీవోలు విడుదల అవుతున్నాయి. అయితే పరిపాలనలో కొన్ని రహస్య జీవోలు సహజం. కాని, ఇక్కడ మాత్రం, అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే, 47 రహస్య జీవోలు జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రహస్య జీవోలు విడుదల చెయ్యటం పై మాత్రం, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా, అన్ని రహస్య జీవోలు ఎందుకు వాదులుతున్నారో చెప్పాలని, అసలు ఆ జీవోల్లో ఏముందో ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు. పోర్ట్ లపై వచ్చిన ఒక రహస్య జీవో, పెద్ద రాద్ధాంతం అయ్యింది. బందర్ పోర్ట్, తెలంగాణాకు ఇస్తూ, రహస్య జీవో విడుదల చేసారని టిడిపి గోల చెయ్యటంతో, కొన్ని రోజులకు ఆ జీవో అసలు ఇష్యూ చెయ్యనట్టు, ప్రభుత్వ వెబ్సైటు లో పెట్టటంతో, మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.a

ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లలో రాజాకీయ వైరంతో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళంలో, ఈ రాజకీయ కక్షలు చూస్తున్న ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల పై కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం, శ్రీకాకుళంలో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది. టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌ పై కేసు పెట్టి, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉండటంతో, కూన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. సరిగ్గా పండగ ముందు, వరుస సెలవులు చూసుకుని, ఆయనకు బెయిల్ రాకుండా, నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచే స్కెచ్ వెయ్యటంతో, అది పసిగట్టిన కూన రవి కుమార్, అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. రేపు ఆయన పోలీసులు ముందుకు హాజరయ్యే అవకాసం ఉంది. అయితే, ఇందులో కూన రవికుమార్‌ చేసిన తప్పు కూడా పెద్దగ ఏమి లేదు.

tammineni 02092019 2

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి వలంటీర్ల నియామకంపై అధికారులను రవికుమార్‌ ప్రశ్నించిన తీరు వివాదానికి కారణమైంది. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు అంటూ, ఆయన పై కేసు పెట్టారు. మొత్తం 11 మంది కేసు పెట్టగా, 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. రవికుమార్‌ అందుబాటులో లేకపోవటంతో, శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలో రవికుమార్‌ ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారు. అంతే కాకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా తమ ఇంట్లో తనిఖీలు చేపట్టారని మహిళలమని చూడకుండా... దౌర్జన్యంగా వ్యవహరించారని, ఈ వ్యవహారం మొత్తానికి కారణం, స్పీకర్ తమ్మినేని సీతారం అంటూ, కూన రవికుమార్‌ భార్య ప్రమీల ఆరోపించారు. స్పీకర్ ఒత్తిడితోనే, ఏమి లేని చోట కూడా కేసు పెట్టి, ఇలా వేధిస్తున్నారని, పండగ పూట కూడా ఇంట్లో లేకుండా చేసారని, ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

tammineni 02092019 3

అయితే ఆమె ఆరోపణల పై స్పీకర్ తమ్మినేని ఘాటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్టు, అందరి పై నోరు పారేసుకుంటే, ఇలాగే ఉంటుంది, హద్దుల్లో ఉండాలి అంటూ మండిపడ్డారు. ఎవరో కేసు పెడితే, తనకేం సంబంధం అంటూనే, స్పీకర్ హోదాని పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేసారు కూన రవికుమార్, అచ్చెన్నాయుడుల క్రిమినల్ ట్రాక్ తీస్తే, ఎవరు ఎంతో తెలుస్తుంది అంటూ హెచ్చరించారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల పై, ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ గా ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. నేరజాబితా తీస్తే మొదట గుర్తొచ్చేది మీ అధినేత జగన్ పేరే అని గుర్తుంచుకోవాలని రామ్మోహన్ రాయుడు ధ్వజమెత్తారు. అధికారం ఉందని విర్రవీగొద్దని, మా మీద కక్ష తీర్చుకోవటం కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలని అన్నారు.

రాష్ట్రంలో సరి కొత్త వ్యవస్థ అయిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు, జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 15 నుంచి ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ను పెడుతున్నాం అని జగన్ ప్రభుత్వం చెప్పింది. అందుకు తగ్గట్టుగానే, ప్రస్తుతానికి 2 లక్షల మంది వరకు నియమాకాలు అయ్యాయి. అయితే ఇంకా దాదపుగా 10 వేల మంది, ఈ ఉద్యోగానికి రాలేదు. వీరికి 5 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఇందులో మళ్ళీ ఖర్చులకు అని చెప్పి, 500 వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లు మొత్తం వైసీపీ వారే ఉంటున్నారని, ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి దీనికి సంబంధించి, అంతరంగిక సమావేశంలో మాటలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ గ్రామ వాలంటీర్లు ఏమి చేసారో కాని, ఇప్పుడు మాత్రం, జగన్ ప్రభుత్వం వారికి కొత్త టాస్క్ ఇచ్చింది.

gram 01092019 2

ఆగష్టు 27వ తారీఖున, మైనారిటీ డిపార్టుమెంటు నుంచి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక లేఖతో కూడిన ఆదేశాలు వెళ్ళాయి. అన్ని జిల్లా కలెక్టర్లను ఆ ఆదేశాలు పాటించమని ఆ లేఖలో ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారం, "ప్రభుత్వం, ప్రతి ఊరిలో ఉన్న పాస్టర్లకు, నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వటానికి రెడీ అయ్యింది. ఇది జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశం. దీని ప్రకారం, ప్రతి పాస్టర్ కు 5 వేల రూపాయల గౌరవ వేతానం ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే, దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎంత మంది పాస్టర్లు ఉన్నారు అనే విషయం పై ప్రభుత్వానికి సమాచారం లేదు. అందుకే అన్ని జిల్లాల కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ మజిస్త్రేట్ లు, మీ పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో, ఎంత మంది పాస్టర్లు ఉన్నారో సర్వే చెయ్యాలి."

gram 01092019 3

"ఈ సర్వే కోసం, కొత్తగా నియామకం అయిన గ్రామ వాలంటీర్ల సహయం తీసుకోండి. గ్రామ వాలంటీర్ల సహాయంతో, ఆ గ్రామాల్లో ఎంత మంది పాస్టర్లు ఉన్నారో, సర్వే చేసి, 15 రోజుల లోగా ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇది చాలా తొందరగా చెయ్యాల్సిన పని" అంటూ ఆ లేఖలో పేర్కున్నారు. అయితే ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు, ప్రభుత్వం పై మండిపడుతున్నారు. గౌరవ వేతనం, అన్ని గ్రామాల్లో ఉన్న గుళ్ళలో ఉన్న బ్రాహ్మణలకు కూడా ఇవ్వాలని, ఇలా ఒక మతానికే పరిమితం చెయ్యటం దారుణమని అన్నారు. అంతే కాకుండా, గ్రామా వాలంటీర్లను ఈ పనులకు ఉపయోగించటం పై కూడా వారు తప్పుబడుతున్నారు. ఇంత అత్యవసరంగా ఈ వివరాలు కావాలని ప్రభుత్వం, ఎందుకు కోరుతుంది అంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఒక్క మతానికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం మంచిది కాదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, చంద్రబాబు, జగన, కేసిఆర్ అంతటి ఇమేజ్ ఉన్న మాజీ గవర్నర్ నరసింహన్, ఆయన పదవి నుంచి నిన్న బదిలీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తిప్పిస్తే, నిన్న తెలంగాణా గవర్నర్ పదవి నుంచి కూడా కేంద్రం ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో, తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ను నియమిస్తూ, కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే సమయంలో, నరసింహన్ కు మాత్రం, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన మోడీ, అమిత్ షాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి, ఆయనకు ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇస్తారని అందరూ భావించారు. అయితే మోడీ, షా మాత్రం, నరసింహన్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణాతో పాటు, అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. దీంతో ఇక నరసింహన్ కు, ఏ విధమైన పోస్టింగ్ రాదనే విషయం స్పష్టం అయిపొయింది.

narasimhan 02092019 2

అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, నరసింహన్ ను విడిచి పెట్టటానికి ఇష్ట పడటం లేదు. నరసింహన్ సేవలు ఎలా అయినా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న కేసిఆర్, నరసింహన్ ను, తెలంగాణా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకుని, ఆయనని, తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. నరసింహన్ కు, దాదపుగా 10 ఏళ్ళకు పైగా అనుబంధం ఉంది. తెలంగాణా రాష్ట్రంలో ఎవరు ఏంటో మొత్తం తెలుసు. రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం ఉంది. అన్నిటికీ మించి, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే నరసింహన్ ను, తెలంగాణా ప్రభుత్వ సలహాదారుడిగా చేసి, ఆయన సేవలు వినియోగించుకోవాలనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.

narasimhan 02092019 3

గవర్నర్ మార్పు వార్తలు తెలియగానే, ఆదివారం సాయంత్రం కేసీఆర్, నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఇంతకాలం రాష్ట్రానికి సేవలు అందించినందుకు అభినందించారు. తరువాత ఆయన మనసులో మాట, నరసింహన్ కు చెప్పినట్టు సమాచారం. దీని పై నరసింహన్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. నరసింహన్ తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కేసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించే వారు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో సోనియా గాంధీకి రిపోర్ట్ లు ఇచ్చే వారు. తరువాత మోడీతో కూడా, సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్ పై పాజిటివ్ రిపోర్ట్ లు ఇచ్చే వారు. అదే సమయంలో చంద్రబాబు పై నెగటివ్ రిపోర్ట్ లు ఇచ్చేవారని, అనేకసార్లు టిడిపి కూడా ఆరోపించింది. ఇంతటి సన్నిహితంగా ఉన్న నరసింహన్ ను, కేసీఆర్ వదులుకోవటానికి సిద్ధంగా లేరని, అందుకే ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.

Advertisements

Latest Articles

Most Read