చంద్రబాబు ఎంటర్ అయిన తరువాత, తెలంగాణా ఎన్నికలు కూడా, ఢిల్లీ వెర్సస్ తెలుగోడు అనే సీన్ కి మారిపోయాయి. ఎందుకంటే, చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి, కేసీఆర్, మోడీతో కలిసి వెయ్యని ఎత్తులు లేవు. అందుకే చంద్రబాబు కూడా, దీనికి విరుగుడుగా , కాంగ్రెస్ ని కలుపుకుని, ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి సహకరిస్తున్న, మన సొంత ప్రాంత ద్రొహులను శిక్షించమని పిలిపు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలు, చంద్రబాబు చేస్తుంటే, కేసీఆర్ కూడా, మోడీ సాయంతో కలిసి, దెబ్బ వెయ్యటానికి రెడీ అయ్యారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉంచిన తన కోవర్ట్ లని వాడుకున్నాడు. తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకరు కేసీఆర్ కోవర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీటి ద్వారా తన ప్లాన్ ఇంప్లెమెంట్ చెయ్యటానికి కేసీఆర్ రెడీ అయ్యారు.

kcr 13112018 2

కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో దాదాపుగా 25-30 అభ్యర్ధులను, కేసీఆర్ చెప్పిన పేర్లు ఈ కోవర్ట్ లు పెట్టించారు. అక్కడ బలమైన నాయకులని కాకుండా, వీక్ కాండిడేట్ లని, అలాగే కోవర్ట్ లని పెట్టించారు కేసీఆర్. ఈ లిస్టు ఢిల్లీకి కూడా చేరిపోయి, శనివారం ప్రకటిస్తారు అనే టైంలో, విషయం మొత్తం చంద్రబాబుకి తెలిసింది. వెంటనే చంద్రబాబు, రాహుల్ గాంధీకి విషయం మొత్తం చెప్పారు. అంతే కాదు, రాహుల్‌ గాంధీకి ఇదే విషయం రేవంత్‌ మెయిల్‌ చేసారు. రేవంత్‌తో పాటు విజయశాంతి, స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, ఒకరిద్దరు కాంగ్రెస్‌ శ్రేయోభిలాషులు కూడా అవకతవకలను ఈమెయిల్‌ ద్వారా రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వకుండా, ఎవరి ఎవరికో ఇచ్చారనే సమాచారం రాహుల్ గాంధీకి చేరింది.

kcr 13112018 3

దాంతో, ఆయన అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. అభ్యర్థులపై రహస్య నివేదికలు తెప్పించుకున్నారు. తనకు వచ్చిన సమాచారం నిజమేనని ధ్రువీకరించుకున్నారు. దాంతో, తొలి జాబితా ప్రకటనను నిలిపివేసి, హుటాహుటిన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను ఆదేశించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చిన వెంటనే జాబితాపై ఇద్దరినీ తీవ్రంగా మందలించినట్లు సమాచారం. వారు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే.. తన వద్ద ఉన్న జాబితా చూపించి.. ‘‘ఇదేం జాబితా!? నేను చెప్పిందేమిటి!? జరిగిందేమిటి.?’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పారాచూటర్లతోపాటు క్రోనీ క్యాపిటలిస్టులు, కోవర్టులకు ఎందుకు సీట్లు ఇస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం.

kcr 13112018 4

అవకతవకలు జరిగాయని చెబుతున్న కనీసం 25 మంది పేర్లను ఆయన వారి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఒక్కో పేరును ప్రస్తావించి.. వారి నేపథ్యం కూడా రాహుల్‌ చెప్పడంతో ఉత్తమ్‌, ఖుంటియా నిర్విణ్ణులైనట్లు సమాచారం. అభ్యంతరాలున్న పేర్లపై సమీక్ష చేసి మళ్లీ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాంతో, సోమవారం రాత్రి పొద్దుపోయాక మొదటి జాబితా విడుదల చేసారు. ఇదే జరక్కపోయి ఉంటే, కేసీఆర్ వ్యూహం పారేది. ఈ 30 చోట్ల, బలంగా ఉన్న నేతలు గొడవలు చేసే వారు, రెబెల్స్ గా వేసే వారు, కూటమి ఫెయిల్ అనే ప్రచారం మొదలయ్యేది. అంతే కాదు తన కోవర్ట్ ల ద్వారా, మరింత బలహీన పరిచే వారు. ఇప్పుడు కేసీఆర్ అనుకున్నది జరగలేదు. చంద్రబాబు అప్రమత్తంగా ఉండటంతో, పెద్ద ప్రమాదమే తప్పింది. చంద్రబాబు వేసిన దెబ్బతో, కేసీఆర్ చివరి రాజకీయ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇక ప్రజా తీర్పు కోసం ఎదురు చూడటమే...

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కింద పని చేస్తున్న కూలీలకు వేతనాల చెల్లింపుల పై ప్రభావం చూపుతోంది. గత 25 రోజుల్లో చేసిన పనులపై రూ.413.64 కోట్ల బకాయిలు చెల్లించాలి. వారం నుంచి పది రోజులకు మించి బకాయిల్లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్నా నిధుల కొరతతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. నరేగా అమలులో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇటీవలే గత ఏడాది (2017-18) వేతన బడ్జెట్‌ వ్యయంపై కేంద్రానికి యూసీ పంపింది. అంతేకాక ఈ ఏదాది (2018-19) ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య చేసిన ఖర్చుపైనా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు అధికారులు ఆడిట్‌ నివేదిక పంపారు.

nrega 12112018 2

దీనిపై తదుపరి ఆరు నెలలకు (అక్టోబరు నుంచి మార్చి) కేంద్రం నిధులు కేటాయిస్తుంది. నివేదికపై కేంద్రం ఈసారి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తదుపరి నిధుల విడుదలకు ప్రతిబంధకమైంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యమైనపుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యే విధానం అమలులోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సర్దుబాటు చేసినా తిరిగి వాటిని రాబట్టుకోవడం కష్టమవుతోంది. గతంలో ఇదే విధంగా సమకూర్చిన రూ.700 కోట్లకు ఇప్పటికీ ఠికానా లేదు. దీంతో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే పరిస్థితి.

nrega 12112018 3

గత అనుభవాల దృష్ట్యా అధికారులు కూడా ప్రభుత్వం ముందు ఇలాంటి ప్రతిపాదనలు పెట్టడం లేదు. ఆడిట్‌పై కేంద్రం వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర వివరాలు పంపామని, నాలుగైదు రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్‌,. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏయే అంశాలపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్న విషయాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. నరేగాలో వేతన కార్మికులు: 63.62 లక్షలు.. వీరిలో పురుషులు: 23.56 లక్షలు ... మహిళలు: 35.06 లక్షలు... ఈ ఏడాది పని దినాల లక్ష్యం: 23.54 కోట్లు.. ఇప్పటివరకు కల్పించినవి: 18.14 కోట్లు... వేతన బడ్జెట్‌ ఖర్చు: రూ.3,627.22 కోట్లు...

ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే... కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది దాదాపు 50 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ... కృష్ణా జలాలు సమృద్ధిగా అందడంతో రైతులు కరువును జయించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను గత నాలుగేళ్లుగా వేగంగా చేపడుతూ, చకచకా పూర్తి చేస్తుండటం... రెండేళ్లుగా కృష్ణాజలాలు పుష్కలంగా అందిస్తుండటం దీనికి కారణం.

kadapa 12112018 1

కడప జిల్లాలో అవుకు టన్నెల్‌ నుంచి కృష్ణా జలాలను గండికోట రిజర్వాయరుకు చేర్చి, అక్కడ నుంచి మైలవరం, సీబీఆర్‌ తదితర రిజర్వాయర్లకు చేర్చారు. ఈ జలాశయాలకు అనుసంధానంగా ఉన్న చెరువులకు ఈ జలాలు మళ్లించారు. చెరువులను పూర్తిగా నింపడం వల్ల ఒక్కసారిగా భూగర్భజలాలు పెరిగాయి. రెండేళ్ల క్రితం దాకా వట్టినే పడిఉన్న బోర్లు నోర్లు తెరిచాయి. సాగుకు సరిపడా నీటిని అవి సమృద్ధిగా అందిస్తున్నాయి. ఈ నీటిని వాడుకొంటూ, రైతులు ఉద్యానపంటల సాగును బాగా పెంచారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పండ్లు, పూల సాగు 1,13,384 హెక్టార్లలో, కూరగాయలు 25,661 హెక్టార్లు, అరటి 22,211 హెక్టార్లు, మామిడి 28,863 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువభాగం పులివెందుల, రాయచోటి వంటి పూర్తి కరువు నియోజకవర్గాల్లోనే సాగు అవుతున్నాయి.

kadapa 12112018 1

అంతేకాదు, మొత్తం జిల్లాలోనే పులివెందుల ఉద్యానవన సాగులో దూసుకెళుతుండటం గమనార్హం. ఈ నియోజకవర్గంలోని లింగాల గ్రామాన్ని చూస్తేనే మనకు ఆ విషయం అర్థమయిపోతోంది. అక్కడికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి.. గ్రామంలో ఆహ్లాదకర పరిస్థితులు కనిపించాయి. వేరుశెనగ, టమోట, పుచ్చకాయ, బొప్పాయి, అరటి, చీనీ తదితర పంటలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. రాయచోటి విషయానికి వస్తే.. ఎగువనున్న వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గత ఏడాది పెద్దగుండ్ల చెరువు, బూడిదగుంట చెరువులకు కృష్ణాజలాలను నింపారు. ఆ నీటిని పొదుపుగా వాడుకోవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో వేరుశెనగ, మల్బరీ, కూరగాయలు, టమోటా, దోస పంటను ఎక్కువగా, అక్కడక్కడ వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు తమ గ్రామం కరువును జయించిందని, మూడు కార్ల పంటలను సాగు చేయగలుగుతున్నామని బూడిదగుంటపల్లె గ్రామ రైతులు ధీమాతో పలికారు.

 

‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్‌వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా వ్యవహరిస్తే అది మనల్ని కాపాడుతుంది. అధర్మమైతే ఎప్పటికైనా నష్టమే..’ అని పేర్కొన్నారు. ‘నాకేమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో భాజపా అధికారంలోకి రావడం కల్ల’ అని స్పష్టం చేశారు.

cbn modi 12112018

ఫరూక్‌, కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో అరకు నియోజకవర్గ నేతలు, మైనారిటీ వర్గ ముఖ్యులతో చంద్రబాబు ఉండవల్లి ప్రజావేదికలో సమావేశమయ్యారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరంతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తెదేపా పాత్రను వివరించారు. ‘మోదీ లేకపోతే దేశం లేదనే ఆలోచనను ప్రజల్లో రేకెత్తించడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం కల్గిస్తోంది. ఇది వాస్తవం కాదని అందరికీ చెబుతున్నాం. ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది..’ అని చంద్రబాబు వివరించారు. ‘మోదీకంటే హేమాహేమీలు మా వైపున్నారు. మీ నాయకుడు ఎవరని విలేకరులు అడిగితే మోదీ కంటే స్టాలిన్‌ చాలా నయమని చెప్పా..’ అని వివరించారు.

cbn modi 12112018

‘మనం ఎన్డీయే నుంచి బయటకొచ్చాకే భాజపా పతనం మొదలైంది. దేశంలోని ప్రధాన పార్టీలు, ముఖ్యనేతలంతా కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు. కర్ణాటక, తమిళనాడులో ఘనంగా స్వాగతించి మద్దతిస్తామన్నారు’ అని వివరించారు. ‘భాజపా పాలనలో మతాలపట్ల అసహనం నెలకొంది. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ వ్యవహార శైలిపైనా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన రాజకీయంగా మాట్లాడితే సరే. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధానం సరికా’దని మండిపడ్డారు. ‘అందుకే మహాకూటమి ఏర్పాటుచేశాం. అక్కడ ఒక అడుగు తగ్గాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘మర్యాదగా ఉంటే మర్యాదగానే ఉంటాం. అన్యాయం జరిగినప్పుడు మనకంటే గట్టిగా పోరాడేవాళ్లు దేశంలో ఎక్కడా లేరు’ అని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read