శ్రీకాకుళం తుఫాను చర్యల పై పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయ దాడి చేస్తున్నారో చూస్తున్నాం. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తానికి పలాసకు మార్చి, అక్కడ నుంచే పరిపాల నడిపించారు. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే, తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా, అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి దాదపు 12 రోజులు, శ్రీకాకుళంలోనే పని చేస్తూ, పరిస్థితులు చక్కదిద్దారు. అంతే కాదు, రికార్డు టైంలో పరిహారం కూడా ఇచ్చారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే, ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కాని మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు, ఇంకో వాడు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతూ, కారులో కవాతులు చేసుకుంటూ, తీరిగ్గా ఆరు రోజుల తరువాత వెళ్ళాడు.

jd 12112018 2

పవన్ కళ్యాణ్ చేతనైన సహాయం చెయ్యాలి, లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందో చెప్పాలి. కాని, పవన్ ఇవేమీ చెయ్యకుండా, ఈ రోజుకీ చంద్రబాబు చేసిన సాయం పై ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా, ‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసిన సాయం వేరుశనగంత, కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ అంత' అంటూ ట్వీట్ చేసారు. అక్కడ పండుగలకు కూడా కుటుంబానికి దూరంగా ఉండి, పని చేసిన వేలాది మందిని కూడా పవన్ కించ పరుస్తున్నాడు. అయితే, పవన్ ఇలా ఏడుస్తూనే ఉంటే, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం, ఇందుకు విరుద్ధంగా నిన్న ఇచ్చిన ఈటీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు.

jd 12112018 3

జేడీ లక్ష్మీనారయణను ఆ ఇంటర్వ్యూ లో, ఇలా దిగారు "మీరేమో శ్రీకాకుళంలో ప్రభుత్వం బాగా పని చేసింది అంటున్నారు, కాని కొన్ని రాజాకీయ పార్టీలు, అసలు ఏమి జరగలేదు అంటున్నాయి" అని ప్రశ్న వేసారు. దానికి మాజీ జేడీ స్పందిస్తూ "నేను శ్రీకాకుళంలో తుఫాను వచ్చిన మూడు రోజుల తరువాత వెళ్ళాడు, అక్కడే మూడు రోజులు ఉన్నాను. అది భీకరమైన తుఫాను, అంతా దారుణంగా ఉంది. కాని తరువాత అన్నీ క్లియర్ చేసుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇదేమీ మాయాబాజార్ సినిమా కాదు కదా, అన్నీ వెంటనే అయిపొవటానికి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, అన్ని స్థాయిల్లో అధికారులు పని చేసారు. ప్రతి గ్రామానికి వచ్చి, పని చేసారు. నేను చూసినంత వరకు, అంతా సవ్యంగా జరిగింది. నేనేమీ రాజకీయ నాయకుడుని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా" అని జేడీ అన్నారు. కాని, మన పవన్ కళ్యాణ్ కి మాత్రం, నిరంతర ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. విద్యాశాఖలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు కొన్ని నెలలగా పెండింగ్‌లో ఉండడంతో ఆ విషయాన్ని కామినేని శ్రీనివాసరావు ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తమ జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు కామినేని శ్రీనివాస్‌తో పాటు సోమవారం సచివాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో పాటు మాజీ మంత్రి కామినేనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. మరో పక్క ఈ భేటీ రాజకీయంగా కూడా చర్చ అయ్యింది.

bjp 12112018 2

అయితే బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీలో చేరేందుకు కామినేని శ్రీనివాసరావు చూస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుంతుంది. ఏపీ కేబినెట్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు బీజేపీ పై జాతీయ స్థాయలో దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురందేశ్వరి, జీవీఎల్ లాంటి నేతలు, చంద్రబాబు,టీడీపీల పై విరుచుకుపడుతున్నారు. మాటల దాడి చేస్తున్నారు. ఎవరు ఏమన్నా..కామినేని మాత్రం ఏం మాట్లాడటం లేదు.

bjp 12112018 3

మరో పక్క, కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న కామినేని టీడీపీ పక్షాన అక్కడ నుంచే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. బీజేపీ నాయకుడై ఏనాడు టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కామినేని వ్యవహరించలేదు. ఇది ఇలా అంటే, కామినేని వైఖరి పై కొందరు నేతలు పనిగట్టుకుని మరీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తన సొంత నియోజకవర్గమైన కైకలూరులో టీడీపీ బలంగా ఉంది. అందుకే బీజేపీ నుంచి టీడీపీలోకి రావడానికి కామినేని ఆసక్తి చూపిస్తున్నారనే వాదన లేకపోలేదు. అయితే, ఇప్పుడు కామినేని, చంద్రబాబుతో భేటీ అవ్వటంతో, మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ, టిడిపి మధ్య ఇంత వైరుధ్యం ఉన్న నేపధ్యంలో, కామినేని చంద్రబాబుని కలవటం, సహజంగానే ఆశ్చర్యపరుస్తుంది.

తెలుగుదేశం పార్టీలో మంత్రి వర్గ విస్తరణ అంటే, ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, అన్ని కోణాలు చూసుకుని మంత్రి పదవి ఇస్తూ ఉంటారు. ఇది కొంత మందికి నచ్చదు. గతంలో కూడా అలుగుడు పర్వం చూసాం. కాని నిన్న జరిగిన విస్తరణలో ఎవరినీ నొప్పించని విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కార్యరంగం సిద్ధమైంది. మైనారిటీల నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌, గిరిజనుల నుంచి కిడారి శ్రావణ్‌ల ఎంపికకు ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తమకు ఆమోదమేనని ప్రకటించారు.

cbn 12112018 2

మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, ప్రభుత్వ విప్‌గా చాంద్‌భాషాల నియామకానికి కూడా ఈ సందర్భంగా సీఎం పచ్చజెండా ఊపారు. తన నిర్ణయమే అంతిమమైనప్పటికీ ఏకాభిప్రాయంతో ప్రకటించాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే అందరితోనూ మాట్లాడాలంటూ ఈ రెండు వర్గాల శాసనసభ్యులు, పార్టీ నాయకులకు కబురు పంపారు. శనివారం ఉదయాన్నే ఉండవల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోడానికి కారణాలను వివరించారు. దీంతో అప్పటిదాకా మంత్రి పదవులు ఆశించిన శాసనసభ్యులు చల్లబడి సీఎం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. సీఎం వద్ద సమావేశానికి వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, చాంద్‌భాషా ఒకింత అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రసారమాధ్యమాలతో మాట్లాడినప్పుడు తమకూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామని వారన్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు వేదిక వద్దకొచ్చిన చంద్రబాబు ముందుగా ఫరూక్‌, శ్రావణ్‌ను తన కార్యాలయంలోకి పిలిపించారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

cbn 12112018 3

అనంతరం మైనారిటీల నేతలు 15మందితో ప్రజావేదిక లోపలి కార్యాలయంలో సమావేశమయ్యారు. వైకాపా నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇస్తే, గవర్నరు అభ్యంతరం చెబుతారనే సంకేతాలున్నాయని వెల్లడించారు. ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తున్న ఫరూక్‌కు అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆశావహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం అభిప్రాయానికి నేతలంతా మద్దతు పలికారు. మండలి ఛైర్మన్‌ పదవి నుంచి ఫరూక్‌ను తప్పిస్తున్నందున షరీఫ్‌కు అవకాశమివ్వాలని కొందరు సూచించగా చంద్రబాబు అంగీకరించారు. తనకూ ప్రభుత్వ విప్‌గా అవకాశమివ్వాలని చాంద్‌భాషా కోరారు. అనంతపురంనుంచి ఇప్పటికే ముగ్గురు విప్‌లుగా ఉన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి చివరకు సుముఖత తెలిపారు. దీంతో ఉదయం కొంత అసంతృప్తిగా ఉన్నారన్న నేతల వైఖరిలో మార్పు కన్పించింది.

మమ్మల్ని ఎదురిస్తున్న, చంద్రబాబుని ఎలా అయినా దించాలనే ఆపరేషన్ మొదలు పెట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్ లో ప్రధాన పాత్రదరులు, ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రాన్ని, మోడీ, అమిత్ షా లను ఒక్క మాట కూడా అనకుండా, ఢిల్లీ అహంకారం పై దేశ వ్యాప్త ఉద్యమం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు అందరూ కలిసి పని చేస్తే, ప్రజలు వీరి గుట్టు పట్టేస్తారని, ఇప్పటి వరకు విడివిడిగానే ఉన్నారు. కాని ఎన్నికల్లో జగన్, పవన్ కలిసి పని చెయ్యాలని, ఢిల్లీ ఆదేశాల మేరకు, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పని చేస్తారనే వార్తలు కూడా వచ్చయి. అయితే, జగన్, పవన్ పొత్తు పై, ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

jagan 12112018 1

ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల విశాఖపట్నంలో వట్టి రవి ఇంట్లో కలిశారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర జరిగిన సమయంలో జగన్మోహనరెడ్డి పవన్‌ను కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే సీఎం సీటుపై పవన్‌కల్యాణ్‌ దృష్టి పెట్టడం వల్ల సీట్లు సర్దుబాటుకాక బయటకు వచ్చినట్టు తెలిసింది. కులం, మతం పునాదులపై వారు అధికారంలోకి రాలేరు.

jagan 12112018 1

ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఆడుతూ ఆంధ్ర ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని నమ్మించి దగా చేసింది. అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కాంగ్రె్‌సతో కలిసి ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దానిని చూసి ఓర్వలేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని కారెం మండిపడ్డారు.

 

Advertisements

Latest Articles

Most Read