బీజేపీ పై యుద్ధం ప్రకటించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. జాతీయ స్థాయిలో దూకుడు పెంచుతూ.. బీజేపీయేతర పార్టీల కూటమి కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజులుగా రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన టీడీపీ అధినేత.. ఒక్కో పార్టీని యాంటీ బీజేపీ ట్రాక్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో నెల రోజులుగా చంద్రబాబు సోషల్ మీడియా ఫాలోయింగ్ తెగ పెరిగిపోతోందంట. ముఖ్యంగా కూటమి ప్రయత్నాలు ప్రారంభించాక ఫాలోయింగ్ పెరిగిపోయింది. గత నెల రోజులుగా 18వేలమంది కొత్తగా చంద్రబాబు ట్విట్టర్అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.

aadhar 26092018 3

ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే.. 90వేలమంది కొత్త ఫాలోవర్లు. చంద్రబాబుకు (@ncbn)కు మొత్తంగా.. ట్విట్టర్‌లో 4.08మిలియన్ల ఫాలోవర్లు.. ఫేస్‌బుక్‌లో 14,87,189మంది నెటిజన్లు ఉన్నారు. సీఎం హోదాలో ఉన్న బాబు (@APCMO) ఫేస్‌బుక్ అకౌంట్‌ను 1,88,940మంది ఫాలోవర్లు.. ట్విట్టర్ ఖాతాను 4,09,866మంది ఫాలో అవుతున్నారు. అది కూడా.. చంద్రబాబు యాంటీ బీజేపీ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచి.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు సీఎంవో అధికారులు.

aadhar 26092018 3

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచి చంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ ఏడాది జూన్ నాటికి ట్విట్టర్ ఫాలోవర్లు సంఖ్య 4 మిలియన్లకు చేరగా.. ఇప్పుడు అది 4.08మిలియన్లకు పెరిగింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ట్విట్టర్‌లో 4 మిలియన్ ఫాలోవర్లు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనకు మద్దతు తెలుపుతూ.. సూచనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్‌లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుగులో ట్వీట్ చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేప్పుడు మాత్రం ఇంగ్లీష్‌ ఉపయోగిస్తున్నారు.

‘ప్రజలతో నిత్యం కలిసేలా కార్యక్రమం ప్రకటించాం. ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా కోరాం. కానీ చాలా మంది 50 శాతం మించి గ్రామదర్శిని అమలు చేయలేకపోయారు. మిగతా చాలా చోట్ల ప్రజా సంతృప్తి శాతం పెరిగింది. ఈ విషయంలో అందరూ గ్రామదర్శిని-గ్రామ వికాసంపై పూర్తి దృష్టి పెట్టాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడను. బాగా పనిచేసే వారికే పార్టీ అండగా ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయాలు ఉంటాయి’ అంటూ ఇటీవల టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా ఇచ్చిన వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామదర్శినిలో వెనుకంజలో ఉండడం సహజంగానే సీఎం చంద్రబాబుకు ఆగ్రహం రప్పించింది. ఇక ముందు వారానికో మారు కార్యక్రమాల అమలుతీరును స్వయంగా పరిశీలిస్తారని ఎమ్మెల్యేలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కాని గడచిన మూడు నెలల కాలంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో గ్రామదర్శినికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పార్టీ పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా.. ఊరంతా కలియతిరగడం, అందరినీ పలకరించడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీయడంతో సహజంగానే మంత్రులు నేరుగా పల్లెల్లో ఒకింత మంచి మార్కులు పొందారు. అయినా పూర్తి చేయాల్సిన గ్రామాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అధిష్టానం ఆదేశం మేరకు గ్రామదర్శినిని పూర్తి చేయాలనే పట్టుదలతో మంత్రులు ఉన్నారు. కాని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు.దాదాపు మూడు నెలలు గడిచినా నియోజకవర్గాల్లో గ్రామదర్శినిని పూర్తి చేయలేకపోయారు.కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అనుకున్న లక్ష్యానికి ఈ మధ్యనే చేరువగా ఉన్నారు.

మంత్రులు పితాని, జవహర్‌ దూకుడు : రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కె.ఎ్‌స.జవహర్‌లు గ్రామదర్శిని నిర్వహణలో తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు లక్ష్యానికి చేరువ అవుతున్నారు. మంత్రులుగా తమకు ఉన్న బాధ్యతలు ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల అమలు మరోవైపు ఉన్నా ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుని, ఉన్నంతలోనే గ్రామదర్శినికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ మధ్యన రోజుకు రెండు గ్రామాలను చుట్టిముడుతున్నారు. గ్రామదర్శిని పేరిట వెలువడిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే గ్రామాలను చుట్టిరావడం, పెద్ద వయస్సు కలిగిన వారిని అక్కున చేర్చుకుని.. వెయ్యి రూపాయలు పింఛన్‌ అందుతుందా, లేదా అంటూ ఆరా తీస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ గ్రామసభల్లోనే ప్రశ్నిస్తూ వాస్తవాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిటీ హాళ్ళు, రోడ్డు నిర్మాణాలు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, పీహెచ్‌సీలకు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారు. ఆచంట నియోజకవర్గంలో 52 గ్రామాలు ఉండగా ఇప్పటిదాకా 34 చోట్ల నేరుగా గ్రామదర్శినిని పూర్తి చేయగలిగారు.

ఇప్పటిదాకా నిర్వహించిన గ్రామసభలన్నింటిలోనూ మంత్రి పితానికి క్షేత్ర స్థాయి సమాచారం పూర్తిగా తెలిసొచ్చింది.మరోవైపు ఎక్సైజ్‌ మంత్రి కె.ఎ్‌స.జవహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం గ్రామదర్శిని నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ముందుగానే తెలుసుకోవడం, గ్రామదర్శిని నిర్వహించే ముందే వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి అదే విషయాన్ని గ్రామసభలో వివరించడం ద్వారా ప్రజల మద్దతు పొందుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 63 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటికే 44 చోట్ల గ్రామదర్శినిని పూర్తిచేశారు. స్వయంగా పల్లెల్లో పాదయాత్ర చేస్తూ, స్థానికులను ఊరికి ఇంకేం చేయాలని ఆరాతీస్తూ ఆయన పర్యటన సాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇంటి స్థలాలు, సొంత ఇళ్ళ కోసం ఎక్కువగా విజ్ఞాపనలు చేస్తున్నారు.

 

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతుదారులైన పారిశ్రామికవేత్తలపై ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నాయనేది తనకు వచ్చిన విశ్వసనీయ వార్త అని సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని అన్నారు. ఆపరేషన్ గరుడ విషయంలో సినీ హీరో శివాజీని లోపల వేసి, విచారణ జరిపించాలని బీజేపీ, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటారేమో అనే ప్రశ్నకు బదులుగా... విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు.

mumbaimirro 101120189

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల, జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే... ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని, గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

mumbaimirro 101120189

తనకు ఎదురు తిరిగిన వారందరినీ తొక్కేయాలనుకోవడం నియంతృత్వం అవుతుందని, అది ప్రజాస్వామ్యం కాదని తమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దొంగలైనప్పుడు ఎన్డీయేతో టీడీపీ కలిసున్నప్పుడే దాడులు చేసి ఉండవచ్చని... విడిపోయిన తర్వాతే ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇదంతా అవకాశవాదమే అని చెప్పారు. దక్షిణాదిలో పాతుకుపోవడం అంత ఈజీ కాదనే విషయం కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి తెలిసిపోయిందని... అందుకే 'ఆపరేషన్ బి'ని ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ను ఇంత వరకు విమర్శించామని... కానీ, బీజేపీ ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలోని కీలక వ్యవస్థలను కూడా తమ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని అన్నారు.

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఉన్నట్టుండి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 600 కోట్ల ‘అంబిడెంట్’ కంపెనీ స్కామ్‌ కేసులో జనార్ధన్‌రెడ్డి పేరు ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన కనిపించకుండా పోయారని అనుకుంటున్నారు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగిందనే విషయం పై జాతీయ మీడియా కధనం రాసింది. ‘అంబిడెంట్’ కేసు విచారణకు ఇంచార్జిగా ఇటీవల ఏడీజీపీ అలోక్ కుమార్‌ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఫరీద్‌ను అలోక్ తనదైన శైలిలో విచారించారు. తాను.. ప్రజలను మోసం చేసిన మాట వాస్తమేనని, తనకు డబ్బున్న స్నేహితులు ఉన్నారని, వాళ్ల సాయంతో ప్రజల డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాని ఏడీజీపీ అలోక్‌కు ఫరీద్ ప్రామిస్ చేశాడు.

gali 08112018 2

ఆ రిచ్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాలంటూ ఫరీద్‌పై సీసీబీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అలీఖాన్ పేరును ఫరీద్ బయటపెట్టాడు. అతడు జనార్ధన్‌రెడ్డికి అనుచరుడని కూడా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందుతుడు ఫరీద్.. గాలిజనార్ధన్‌రెడ్డి పేరును బయటపెట్టడంతో ఏడీజీపీ అలోక్ వర్మ ఆ విషయాన్ని వెంటనే సీఎం కుమారస్వామి తెలియజేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం బయటకు పొక్కకూడదని, ఎన్నికల సమయంలో గాలి జనార్ధన్‌రెడ్డిని అరెస్టు చేస్తే రాజకీయ లాభాల కోసం చేశారనే అపవాదు వస్తుందని, అందుకే గాలి అరెస్టును కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అలీఖాన్‌ను మాత్రం అరెస్టు చేయడానికి అవకాశం ఉందని పోలీసుల నుంచి సమాచారం రావడంతో అతడు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి మాత్రం అప్పటి నుంచి కనిపించకుండా పోయారు.

gali 08112018 3

ఫరీద్‌ను విచారిస్తున్న సీసీబీకి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫరీద్ స్నేహితుల గురించి ఆరా తీయగా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ రియల్టర్ బ్రిజేష్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అతడి ద్వారానే ఫరీద్‌కు, జనార్ధన్‌రెడ్డికి మధ్య ఫస్ట్ మీటింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో పోష్ బెంగళూరు హోటల్‌లో గాలి జనార్ధన్‌రెడ్డిని కలిసినట్లు సీసీబీ కస్టడీలో ఉన్న ఫరీద్ అంగీరించాడు. తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌కు సంబంధించి ఫరీద్ ఫోన్ నుంచి 21 ఫోటోలను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలకు జియో ట్యాగింగ్ ఉండడంతో వాటిపై డేట్, టైమ్ కూడా రికార్డ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. రూ. 18 కోట్ల లావాదేవీలకు సంబంధించి రమేష్ కొతారికి చెందిన అంబికా సేల్స్ కార్పొరేషన్‌ నుంచి ఆరు ఓచర్లను సీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో అతడు దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. దేశంలోని విమానాశ్రాయాలు, ఓడ రేవులను అప్రమత్తం చేశారు. గాలి ఆచూకీ కనుగొనేందు కోసం సీసీబీ నాలుగు ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపింది.

Advertisements

Latest Articles

Most Read