కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో చిక్కుకున్న ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతలోనే వాళ్ళ ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే పసిగట్టిన గాలి జనార్దన్‌ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఇదే కేసులో ఆయనకు సహకరించిన ఆలీఖాన్ అనే వ్యక్తికి బెంగళూరులో బెయిల్ దక్కింది.

galijump 07112018 2

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2016౼17లో స్థాపించిన అంబిడెంట్ కంపెనీ వినియోగదారులను మోసాగించినట్లు గత జనవరిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆ సంస్థపై పలుమార్లు దాడులు చేపట్టారు. ఈ కేసు నుంచి కాపాడాల్సిందిగా జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌ను అంబిడెంట్ సంస్థ ఛైర్మన్ ఫరీద్‌ కలిశారు. ఈడీ కేసుల నుంచి తప్పించేందుకు రూ.20.5కోట్ల డీల్ కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.18.5కోట్లను బెంగళూరుకు చెందిన అంబికా జ్యూయలర్స్‌ సంస్థ యజమాని రమేశ్‌ కొఠారి ఖాతా నుంచి బళ్లారికి చెందిన రాజ్‌మహల్‌ జ్యూయలర్స్ యజమాని రమేశ్‌కి పంపించాడు. ఈ సొమ్ముతో 57 కేజీల బంగారం జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌కు అందజేశారు.

galijump 07112018 3

ఒప్పందంలో భాగంగా మిగిలిన సొమ్మును నగదు రూపంలో చేరవేశారు. అంబిడెంట్ సంస్థ వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో గత 10 రోజులుగా విచారణ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఫరీద్, రాజ్‌మహల్ జ్యూయలర్స్‌ యజమాని రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను జప్తు చేశారు. పరారీలో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణా పోలీసుల సహకారంతో బెంగళూరు పోలీసులు జనార్దన్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

ఒక పక్క కేంద్ర సహకారం లేదు.. మరో పక్క కొత్త రాష్ట్రం.. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, రాష్ట్ర శ్రేయస్సు పై మాత్రం ఎక్కడా రాజీ లేకుండా, ప్రజలకు ఏది కావాలో అది చేసి చూపిస్తున్నారు చంద్రబాబు. కేంద్రం చెయ్యాల్సిన పని, వారు చెయ్యకపోవటంతో, ఒకే రోజు రెండు ప్రాజెక్ట్ లకు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున చెయ్యటానికి ఒకే చేసారు. కేంద్రం నాన్చుడు ధోరణిపై ఆగ్రహంతో రగిలిపోతున్న రాష్ట్రప్రభుత్వం కడపలో ఉక్కు కర్మాగారాన్ని సొంతంగా చేపట్టబోతోంది. అలాగే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టునూ సొంత వనరులతో పూర్తిచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కడప జిల్లాలో 100 శాతం సొంత పెట్టుబడి వ్యయంతో వచ్చే నెలలోనే ప్రతిష్ఠాత్మక ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయాలని నిశ్చయించింది.

center 07112018 2

ఈ మేరకు రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన చర్చలను సమాచార, పౌరసంబంధాల మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతరం విలేకరులకు వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఎండీగా పనిచేసి రిటైరైన పి.మధుసూదన్‌ను రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో అవసరమైతే ఈక్విటీకి వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. అయితే చివరి ప్రయత్నంగా కేంద్రానికి మరో అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం భావించిందని, ఇదే అంశంపై మూడు ప్రతిపాదనలతో కేంద్రానికి త్వరలో లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

center 07112018 3

మరో పక్క, విశాఖ మెట్రో రైలుకు అనుమతి లభించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. విభజన చట్టం హామీల్లో భాగంగా విశాఖకు మెట్రో రైలు బాధ్యత కేంద్రానిదే అయినా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా మంగళవారం ఆమోదించింది. దీంతో భారతదేశంలో పీపీపీలో నిర్మించే అతిపెద్ద రెండో మెట్రోగా విశాఖ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటికే రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌పీఎ్‌ఫ)ను ఆహ్వానించడంతో ఆ ప్రకారం ముందుకువెళ్లాలని సూచించింది. విశాఖపట్నంలో కొమ్మాది నుంచి గాజువాక వరకు మూడు కారిడార్లుగా విభజించి మొత్తం 42.55 కి.మీ. పొడవున మెట్రో రైల్వే ట్రాక్‌ నిర్మిస్తారు. వీటికి అవసరమైన చోట స్టేషన్లు, రన్నింగ్‌ సెక్షన్‌, పార్కింగ్‌ సదుపాయాలు, డిపోల ఏర్పాటుకు అవసరమైన 83 ఎకరాల భూమిని ప్రభుత్వం సమకూరుస్తుంది. మరో 12 ఎకరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైములో, మైనింగ్‌లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించటమే కాదు.. చట్టాలు తనకెంత చుట్టాలన్న విషయాన్ని నిరూపిస్తూ.. బళ్లారి ఓబులాపురం మైనింగ్‌ యజమాని.. మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఎంత హవా నడిపారో అందరికి తెలిసిందే. ఆయన్ను టచ్‌ చేసేందుకు సైతం రాజ్యాంగ శక్తులు సైతం వెనక్కి తగ్గే పరిస్థితుల్లో.. ప్రజాస్వామ్య భారతంలో ఏదైనా సాధ్యమన్న విషయాన్ని గాలి జనార్ధనరెడ్డి ఉదంతం చాలామందికి తెలియజేసిందని చెప్పాలి. సీబీఐ పుణ్యమా అని ఒక్కసారి జైల్లోకి వెళ్లిన ఆయనకు.. చట్టం తన పని తాను చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం బాగానే అర్థమైందని చెప్పాలి. తనకు బెయిల్‌ ఇవ్వటానికి వందకోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడలేదు.

galijump 07112018 2

తదనంతరం ఆయన ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఆయనకు బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఆయన దాదపుగా 2.5 ఏళ్ళు జైలు జీవితం గడిపి, ప్రస్తుతం, మన జగన్ లాగే, కండీషనల్ బెయిల్‌ పై బయట తిరుగుతున్నాడు. ఇంత జరిగినా గాలికి బుద్ధి రాలేదని విషయం అర్ధమవుతుంది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని మదమో, లేక డబ్బు మదమో కాని, వ్యవస్థలకు మ్యానేజ్ చేస్తూ మరోసారి దొరికిపోయి, పోలీసులు పట్టుకుంటారని చెప్పి పారిపోయాడు గాలి. దీని వెనుక నిజాలు తెలిస్తే మైండ్ పోతుంది. బెంగళూరులోని అంబిడెంట్ కంపెనీ విదేశీ పెట్టుబడుల విషయంలో విచారణను ఎదుర్కొంటోంది.

galijump 07112018 3

ఈ నేపథ్యంలో గాలి వర్గీయులు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కంపెనీ 57 కేజీల బంగారు కడ్డీలను రహస్యంగా అందించింది. దీంతో రంగంలోకి దిగిన గాలి జనార్దన రెడ్డి ఓ ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ముందే తెలుసుకున్న గాలి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇది వరకు సిబిఐ వాళ్లకి లంచాలు ఇవ్వటం, ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జికి లంచాలు ఇవ్వటం లాంటి కేసుల్లో ఇరుక్కున్నా, ఇప్పటికీ బుద్ధి రాని గాలి, ఏకంగా ఈడీ అధికారులకి కోటి రూపాయలు ఇచ్చారు. కేంద్ర పెద్దల సహకారం లేనిదే, ఇలాంటివి జరిగే అవకాశాలు లేవు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, గాలి వ్యవహారం బయట పడింది. లేకపోతే, ఇది కూడా సైలెంట్ గా జరిగిపోయేది.

గత కొంత కాలంగా, తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నేతల వ్యవహార శైలి పై చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్నారు. మీరు పార్టీకి బలం అవ్వాలి కాని, బలహీన కాకూడదు అంటూ, ఎప్పటికప్పుడు వారి పని తీరుతో సర్వే రిపోర్ట్ లు ఇచ్చి మరీ, వారిని హెచ్చరిస్తున్నారు. ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం మానటం లేదు. తాజగా, మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని కోరితే 12 మంది మంత్రుల నియోజకవర్గాలు సహా మొత్తం 67 స్థానాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని, ఎందుకు చేపట్టలేదో సమాధానం చెప్పాలని కోరారు. ప్రజలతో ఉంటేనే మనకు భవిషత్తు అనే విషయం మర్చిపోవద్దు అని, ప్రజల కోసం మనం ఉన్నామనే విషయం మర్చిపోతే, మన రాజకీయ జీవితం సమాధి అవుతుందని అన్నారు.

cbn 07112018 2

మీరంతా రేంద్ర మోదీ అన్నల్లా తయారవుతున్నారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉండాలనుకుంటేనే ఇక్కడ ఉండండి.. తిరగలేకపోతే ఆ మాట చెప్పి పక్కకు తప్పుకోండి. లేకపోతే నేనే తప్పించాల్సి వస్తుందని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎప్పుడూ ఇలాగే చెప్తాదులే, ఏమి చెయ్యరు అనుకోకండి, ఢిల్లీ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగుతో ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రజల్లో ఉంటే, మీకు, పార్టీకి కూడా మంచిదని అన్నారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగితే గ్లామర్‌ తగ్గుతుందనుకుంటున్నారు. కందిపోకూడదని అనుకుంటే తర్వాత అసలుకే మునిగిపోతారు. చాలా మంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. జనంతో మమేకమవడం రాజకీయ నాయకుడి లక్షణం. గ్లామర్‌సగా ఉండాలనుకుంటే వేరే రంగంలోకి వెళ్లండి’ అని స్పష్టం చేశారు.

cbn 07112018 3

గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమం కూడా చురుగ్గా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. ధర్మ పోరాట దీక్ష సభల కోసం జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు అదనంగా ఉండి నియోజకవర్గ సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలు కోరగా దానికి చంద్రబాబు అంగీకరించారు. దేశవ్యాప్తంగా ప్రభ క్షీణిస్తున్నా బీజేపీ దురుసుతనం ఇంకా తగ్గలేదని సీఎం వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గత ఎన్నికలతో పోల్చితే ఇటీవలి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు బాగా తగ్గిపోయాయని, ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనమని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read