కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి, తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల్లో కూటమి, అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పై ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపి సీఎంల భేటి జరుగనుంది. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామితో ముఖ్యమంత్రి భేటి కానున్నారు. జాతీయ స్థాయిలో భాజాపా యేతర రాజకీయ పార్టీలన్నింటినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో మంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని దేవెగౌడతోనూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

cbn photo 06112018 2

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను అభినందించారు. రోజు రోజుకీ దేశంలో భాజాపా ప్రతిష్ఠ దిగజారిపోతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఇటీవల మూడు లోక్‌సభ స్థానాలు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో భాజపాకు గట్టి షాక్‌ తగిలింది. ఈ ఫలితాల్లో నాలుగు స్థానాలను కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి గెలుచుకోగా.. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో మాత్రమే భాజపా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కుమారస్వామికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. కాగా, ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది.

cbn photo 06112018 3

కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.

అది రిపబ్లిక్ అఫ్ బళ్ళారి.. వైఎస్ఆర్ దత్త పుత్రుడు, జగన్ అన్నయ్య అయిన, గాలి జనార్ధన్ రెడ్డి సామ్రాజ్యం.. అక్కడ అంతా గాలి హవానే. ఎన్ని ప్రభుత్వాలు మారినా, గాలి బ్రదర్స్, బళ్ళారిని తమ సామ్రాజ్యంలా అనుకుంటారు. అయితే ప్రజాస్వామ్యం ముందు, ప్రజల తీర్పు ముందు, హేమా హేమీలే, తల వంచాల్సిన పరిస్థితి. ఈ రోజు కూడా బళ్ళారిలో అదే జరిగింది. ఎక్కువ మంది తెలుగు వారు ఉండే బళ్ళారిలో, గాలి సామరజ్యానికి గండి పడింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న బీజేపీకి ఈసారి ఘోరపరాభవం ఎదురైంది. ఉప ఎన్నికలో బళ్లారి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ వశమైంది. దీంతో గాలి బ్రదర్స్ ఆధిపత్యానికి కాంగ్రెస్ చెక్ పెట్టినట్లయింది. బళ్లారి లోక్ సభకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప ఏకంగా 2,43,161 ఓట్ల తేడాతో బీజేపీని మట్టికరిపించారు.

jagan 06112018 2

అయితే బళ్ళారిలో జరిగింది, రేపు పులివెందులలో కూడా జరుగుతుందా, అని విశ్లేషకులు చెప్తున్నారు. 40 ఏళ్ళు ఆ కుటుంబం, పులివెందులని ఏలింది... తాత సిల్వర్ స్పూన్ తో పుట్టాడు అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు... తండ్రి, ముఖ్యమంత్రిగా కూడా చేసారు... ఇక మనోడు అయితే, ఎంపీగా చేసి, నాలుగేళ్ల నుంచి ఎమ్మల్యేగా చేస్తున్నాడు... ఆ ఊరికి చేసింది ఏంటి అంటే, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి.. అలాంటి పరిస్థుతుల్లో, తన ప్రధాన ప్రత్యర్ధి ఊరికి నీళ్ళు ఇచ్చే, నా ఊరికి నీళ్ళు తీసుకువెళ్తా అని చెప్పిన చంద్రబాబు, చేసి చూపించారు... కరువు కాటకాలకు నిలయమైన పులివెందుల ప్రాంతంలో 40 ఏళ్ళ రైతుల నిరీక్షణ, తీరింది. పులివెందుల అంటే గుర్తు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ.... కాని వారు ఇప్పటి వరకు పులివెందులకు ఏమి చేసారు అంటే ? అక్కడి ప్రజలే చెప్తారు...

jagan 06112018 3

పులివెందుల అంటే ఫ్యాక్షనిస్టులు అనే విధంగా తయారు చేసింది వైఎస్ ఫ్యామిలీ... కాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి పులివెందుల పై ప్రత్యెక శ్రద్ధ చూపించారు... కత్తులతో కాదు, అభివృద్ధితో వశం చేసుకుంటా... నీళ్ళు ఇచ్చి వారి మనసులు కొల్లగొడతా అంటూ చెప్పి మరీ, పులివెందులకు నీళ్ళు ఇచ్చారు చంద్రబాబ... రాజకీయంగా చూసుకుంటే, పులివెందుల మెజారిటీ పైనే, కడప ఎంపీ సీటు కూడా ఆధారపడి ఉంటుంది అంటే, అంత మెజారిటీ వస్తు ఉండేది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్‌ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే జగన్ హాయంలో అంతా రివర్స్ లో ఉంది వ్యవహారం.. చివరకి సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీని స్థితికి పడిపోయాడు జగన్.. ఎప్పుడూ లేనిది వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి అంటే ఏంటో తెలిసి వచ్చింది. దీనికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఈ మైనస్ ఉండగానే, చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు. జగన వైఖరి, చంద్రబాబు అభివృద్ధితో, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు ఇప్పటికే వచ్చాయి. వైఎస్ వివేక ఓటమితోనే అది రుజువైంది. ఈ రోజు బళ్ళారి ఫలితమే, రేపు పులివెందులలో వచ్చినా ఆశ్చర్యం లేదని మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం ప్రజలు ఏ తీర్పు ఇస్తారో..

విజయవాడలో మరో సారి ఫ్లెక్సీల కలకలం రేపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు ఎక్కు పెడుతూ, టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. "మీ సినిమా రాజకీయాలకు పనికిరాదు. మీరు మద్దతు ఇవ్వకపోతే 2014లో బాబు రిటైర్ అయ్యేవరా. నేను కూయ్యాందే తెలవదు అందంట ఓ అమాయకపు కోడి అలా వుంది మీ తీరు. ఎందుకీ అహంకార పూ మాటలు. ఒక్కటి, రెండు సీట్లు వస్టే మీకు ఎక్కువే. అన్నదమ్ములు ఇద్దరూ కలిస్తే 2009 లో వచ్చినివవి 18 సీట్లే. ఇప్పుడు తల్లకిందులుగా తపస్సు చేసిన మీకు ఒక్క సీటు వచ్చే అవకాశాలు లేవు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బాబు సీఎం కావడం తద్యం" అని ఫ్లెక్స్ లో పేర్కొన్న కాట్రగడ్డ బాబు.

pk 06112018 1

నగరంలో పలు ప్రాంతాలలో పాటు, వెలగపూడి ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టారు. నగరంలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చర్చనీయంసం అయ్యాయి. మొన్న పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతూ, "చంద్రబాబు, మీ సియం సీట్ నా బిక్ష. నేను మీకు మద్దతు ఇవ్వకపోతే, ఈ పాటికి మీరు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చునే వారు. నేను మిమ్మల్ని గెలిపించాను అనే సంగతి మర్చిపోవద్దు. నేను తలుచుకుంటే, మీ వాళ్ళని కళ్ళు ఇరగొట్టి కూర్చోబెడతా" అంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యల పై నిరసనగా, ఇలా ఫ్లెక్సీల రూపంలో, కాట్రగడ్డ బాబు, ఫ్లెక్సీలు వేసారు. కోడి కూడా తాను కుయ్యకపోతే, తెల్లవారదు అనుకునేది అంటూ ఫ్లెక్స్ వేసారు.

pk 06112018 1

ప్రజలు కూడా ఈ ఫ్లెక్స్ చూసి, పవన్ మాటలు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటున్నారు. తన సొంత అన్న ఓడిపోయాడని, వచ్చింది ముక్కి ములిగి 18 సీట్లు అని, అవి కూడా అమ్మేశారని, ఇలాంటి పవన్, చంద్రబాబు లాంటి నేతకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినట్టు బిల్డ్ అప్ లు చూస్తుంటే, నవ్వు వస్తుంది అని అంటున్నారు. లోకేష్ ను అడిగే ముందు, అసలు పవన్ వార్డ్ మెంబెర్ గా అయినా గెలిచారా అని, మరి అలాంటి పవన్, ముఖ్యమంత్రిని చెయ్యండి అని ఎలా అడుగుతారని, లోకేష్ ని అడిగే ముందు, పవన్ తనను తాను ప్రశ్నించుకోవాలని అంటున్నారు. ఇందిరా గాంధీ నుంచి, ఈ రోజు మోడీ దాకా డీ కొట్టిన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, నేనే గెలిపించా అని పవన్ అంటుంటే, నిజంగానే కోడి కూత సామెత గుర్తుకు వస్తుందని అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే భాజపా విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

karnataka 06112018 2

దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి తాజా ఉపఎన్నికల్లో దక్కిన భారీ విజయం 2019 సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను సమూలంగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో మోడీ-షా చేస్తున్న నిరంకుశ పనులు, వ్యవస్థల్ని నాశనం చెయ్యటం చూసి, చంద్రబాబు ముందుకొచ్చి, అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారు. అయితే కొంత మందికి ఈ కూటమి సక్సెస్ పై అనుమానాలు ఉన్న టైంలో, కర్ణాటక ఉప ఎన్నికల తీర్పు, సరైన మెసేజ్ ఇచ్చింది. అన్ని పార్టీలు కలిస్తే, మోడీ-షా లను ఈ దేశం నుంచి తరమి తరిమి కొట్టచ్చు అనే సందేశం ఇచ్చింది.

karnataka 06112018 3

కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కర్ణాటకలో, ‘‘కమల’’నాధులకు చుక్కలు చూపించడం...అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు కర్ణాటక రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. బళ్లారి లోక్‌సభ, జమఖండి అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమి కంటే.. అక్కడ కాంగ్రెస్‌కు దక్కిన భారీ మెజారిటీనే బీజేపీని మరింత షాక్‌కు గురిచేసింది. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోటైనా విజయం సాధిస్తామని బీజేపీ కౌంటింగ్ చివరిదాకా ఎదురు చూసినా ఫలితం మారలేదు. ఇదే ఫార్ములాతో వెళ్తున్న చంద్రబాబుకు, దేశంలో మోడీ-షా కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు, ఈ ఫలితాలు స్పష్టమైన మెసేజ్ ఇచ్చాయి. మాయావతి, మమత, లాంటి వాళ్ళు కూడా, ఈ ఫలితాలు చూసి, స్పష్టమైన వైఖరితో, అందరూ కలిసి, రేపు ఎన్నికలకు వెళ్తే, ఇక మోడీ-షా లకు, ఘోర పరాభవం తప్పదు.

Advertisements

Latest Articles

Most Read