ప్లెక్సీలు కట్టే అభిమానులు లేరు... ఫ్యాన్సీ షో అని 500 లు పెట్టి టికెట్ కొనే వారు లేరు.. చేతిలో అర డజన్ల సినమాలు లేవు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే... అసలు ఆయనది మన ఆంధ్రానే కాదు.. అయినా తన సినిమాలను ఏదో సమయంలో, ఆదరించారనే మంచి హృదయం... రాజశేఖర్ దంపతులు తిత్లీ తుఫాను భాదితులకు పది లక్షల విరాళం ఇచ్చారు... జీవిత, రాజశేఖర్ రూ.10 లక్షల చెక్కును సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అందజేశారు. తుఫాను బాధితులకు మా వంతు సాయం ఇది అంటూ ఇచ్చారు. ఇప్పటికే కొంత మంది సినీ స్టార్స్ ముందుకొచ్చినా, చాలా మంది టాప్ హీరోలు, కనీసం రూపాయి ఇవ్వలేదు. బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, విజయ్ దేవరకొండ, నిఖిల్, మనోజ్, సంపుర్నేష్ బాబుతో సహా కొంత మంది చిన్న హీరోలు విరాళం ఇచ్చారు, ఇంకా ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నా, వాళ్ళు మాత్రం అడ్రస్ లేరు. ప్రతి సినిమా టికెట్ కొనే ముందు, వీడు మన ఆంధ్రుల కు ఏమైనా ఉపయోగ పడ్డాడ, లేదా అని ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి..

speaker 241020118 2

మరో పక్క, చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం విశాఖ పర్యటనలో ఉండ‌గా తిత్లీ తుఫాను బాధితుల సహయార్థం వివిధ సంస్థల యజమానులు, ప‌లువురు ప్రముఖులు చెక్కు రూపంలో రూ.35 లక్షల విరాళాలను సీఎం చంద్ర‌బాబు నాయుడుకి అందజేశారు. చెక్కులు అందించిన వారిలో… సరనివాస విద్యా పరిషత్ రూ.2 లక్షలు, వాల్తేరు క్లబ్ రూ.7 లక్షలు, ఆర్కే ఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.10 లక్షలు, సీయోన్ ఫార్మా లిమిటెడ్ రూ.2 లక్షలు, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ రూ1.50 లక్షలు, వైభవ్ రూ.1.06 లక్షలు, సీన్ లియో సిస్టమ్స్ రూ.1 లక్ష, విశాఖ ఇన్ఫ్రా సర్వీసెస్ రూ.1 లక్ష, దజకో ఇండియా లిమిటెడ్ రూ.1లక్ష, కంకటలా టెక్స్ టైల్స్ విశాఖ రూ.1 లక్ష, సన్ ఎడ్యుకేషల్ ఇనిస్టిట్యూట్ రూ.1 లక్ష

speaker 241020118 3

కొరమండల్ ప్రాజెక్ట్స్ రూ.1 లక్ష, కుమారరాజ ప్రైవైట్ లిమిటెడ్ రూ.1 లక్ష, ఎస్‌విబిసి గోల్డ్ రూ.1 లక్ష, పివిఎస్ జేమ్స్జూలియర్స్ రూ.1లక్ష, ఏ.వెంకట ప్రసాద్ రూ.50వేలు, మనోజ్ వైభవ్ రూ.50.వేలు, పళని ఎవెన్యూస్ లిమిటెడ్ రూ.50.వేలు, నోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రూ.25.వేలు, అస్ర్జిన్ ఫార్మా లిమిటెడ్ రూ.20వేలు, వి.శ్రీనివాసరావు రూ.20 వేలు, విశాఖ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ రూ.20 వేలు, అభిషేక్ పవర్ సిస్టమ్ రూ.15 వేలు అంద‌జేశారు. అదేవిధంగా హైద‌రాబాద్‌కు చెందిన భవ్య సిమెంట్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ అధినేత ఆనందప్రసాద్ తిత్లీ తుఫాను బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును మంగ‌ళ‌వారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడిని క‌లిసి అందజేశారు. అలాగే ఎంఎస్ విశాఖ ఫిలింనగర్ సెంటర్ రూ.5 లక్షల విరాళం ఇచ్చారు.

అసెంబ్లీకి ఎన్ని సార్లు రమ్మన్నా, ఇప్పటి వరకు రాని వైసీపీ నేతలను, అసెంబ్లీ స్పీకర్ ఒక కోరిక కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే కోరికే, మరి వాళ్ళు ఒప్పుకొంటారో లేదో. అదేమిటంటే, శాసన మండలి, శాసన సభ సభ్యులు తరుఫున ఒక నెల జీతాన్ని తిత్లీ బాధితులకు సాయంగా ప్రకటించామని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసన మండలి, శాసన సభ సభ్యులను కూడా వారి ఒక నెల జీతం ఇవ్వాలని కోరుతున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు స్పందిస్తే మంచి పరిణామమేనని, లేకుంటే అధికార పార్టీ శాసన మండలి, శాసన సభ్యులు జీతాలు ఇస్తామని వెల్లడించారు. తిత్లీ తుపాను నష్టాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రిక్త హస్తమే చూపించిందని అన్నారు.

speaker 241020118 2

ఇంకా కేంద్రం సర్వే బృందాలు పరిశీలకు వచ్చి అంచనాలు వేసి, లెక్కలు కట్టి సాయం అందిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయని, ఆ ప్రక్రియ ఎంత త్వరగా చేస్తే, బాధితులకు అంత ఊరట కలుగుతుందన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలాస మండలం పెద్ద గురుదాసుపురంలో మాట్లాడారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతాంగం త్వరగా కోలుకోవాలంటే మొక్కలు పెంపకంతో పాటు అంతర పంటలు వేసుకోవడం చాలా ముఖ్యమంటూ అక్కడ రైతులతో మాట్లాడుతూ సూచించారు. తన కుటుంబం తరుఫున ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మూడేళ్ళలో ఫలసాయం ఇచ్చే మొక్కలు ఉపాధి హామీ పథకం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు.

speaker 241020118 3

సోంపేట మండలంలో నేలమట్టమైన కొబ్బరి తోటలు, జీడిమామిడి, పడిపోయిన ఇళ్లను స్పీకర్ శివప్రసాద్ పరిశీలించారు. ఉద్దానానికి తీవ్రమైన నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని మరింత వేగవంతంగా పూరించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో తిత్లీ తుపానులో అపార నష్టాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలో పెట్టి చూపించిందన్నారు. ఎర్రముక్కాంలో తుపాను బాధితులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మండల ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరకులు, నీరు అందుతున్నదీ లేనిది ప్రజలను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. రాజాం దారిపోడవునా జీడితోటలు, కొబ్బరి తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తాను గుంటూరు వాసినేనని సముద్రం పక్కనే మా ఊరు ఉందని ఏనాడూ ఇంత నష్టం జరగలేదని బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడారు.

నరేంద్ర మోడీ, అమిత్ షా.. వీళ్ళద్దరూ అధికారంలోకి వచ్చిన తరువాత, ది మోస్ట్ పవర్ఫుల్.. ప్రత్యర్ధి పార్టీలు, అధికారులు, వ్యవస్థలు అన్నీ వీళ్ళ ముందు మోకరిల్లాయి. మన రాష్ట్రంలో, ఇంతకే ముందు మోడీ, షా పై విమర్శలు చేసిన వాళ్ళు, ఎలా లొంగిపోయారో చూస్తున్నాం. ఏడాది క్రితం చంద్రబాబు మోడీ-షా పై తిరుగుతుబాటు చేసే దాకా, వాళ్లకి ఎదురు లేదు. చివరకు పార్లమెంట్ సాక్షిగా, ఉతికి ఆరేసారు టిడిపి ఎంపీలు.. నువ్వో పెద్ద ఆక్టర్ వి అని అనేసారు. అప్పటి నుంచి, కొంచెం తిరుగుబాటు మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్నాయి. రాహుల్ పుంజుకుంటున్నాడు. ఈ తరుణంలో, మోడీ-షా మరింతగా రెచ్చిపోతున్నారు. రాఫెల్ డీల్ పై సిబిఐ ఎంక్వయిరీ వేస్తే ఇబ్బంది అవుతుందని, సిబిఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, మన మాట వినడాని, మనకు అనుకూలమిన ఆస్థానాను అందలం ఎక్కించటానికి ప్లాన్ చేసారు.

moditransfer 24102018

చివరకు అలోక్ వర్మ పై తప్పుడు ఆరోపణలు మోపి, ఇదే కేసులో సియం రమేష్ ని కూడా ఇరికించి, అటు అలోక్ వర్మని, ఇటు తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టె ప్రయత్నం చేసారు. ఇవన్నీ పసిగట్టిన అలోక్ వర్మ, ఆస్థానా తన పై పన్నిన కుట్రను భగ్నం చేసి, అతన్ని, అతని కింద ఉన్న డీఎస్పీని అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయం రచ్చ రచ్చ అవ్వటంతో మోడీ అనూహ్యంగా, అలోక్ వర్మను, ఇటు ఆస్థానా పై కూడా వేటు వేసి, కొత్త డైరెక్టర్ ని నియమించారు. ఆ కొత్త డైరెక్టర్ కూడా మోడీ మనిషిగా పేరు ఉంది. కొత్త డైరెక్టర్ ను నియమించగానే సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సిబిఐలో తనకు అనుకూలంగా లేని అధికారులు మొత్తాన్ని కేంద్రం ట్రాన్స్ఫర్ చేపించింది.

moditransfer 24102018

అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, ఆస్థానా కేసులో దర్యాప్తు చేస్తున్న డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీని అండమాన్ లోని, పోర్ట్‌బ్లయర్‌కు బదిలీ చేశారు. తక్షణమే ఈ బదిలీలు, మార్పులు అమల్లోకి వచ్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరో 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా కేసు విచారిస్తున్న ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. అంతేగాక.. ఆస్థానాపై ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్న బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరన్నా అధికారి చెప్పిన మాట వినకపోతే, అండమాన్ ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరిస్తారు. ఇక్కడ అచ్చంగా అలాగే జరిగింది. మోడీ మనిషి, ఆస్థానా పై విచారణ చేస్తున్న అధికారిని, అండమాన్ ట్రాన్స్ఫర్ చేసారు. మోడీ పగబడితే ఇలాగే ఉంటుంది మరి.

ఆంధ్రప్రదేశ్‌లో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విశాఖ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ, డెలాయిట్‌ మధ్య ఒప్పందం జరిగింది. గ్లోబల్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌, గ్లోబల్‌ ఎంప్లాయిస్‌ సేవలను, కన్సల్టెంట్‌‌, ఆడిట్‌ సేవలను డెలాయిట్‌ అందిస్తోంది. త్వరలో అమరావతి తాత్కాలిక భవనంలో డెలాయిట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. విశాఖలో కూడా కార్యకలాపాలను సాగించాలని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. విశాఖలో అవకాశాలపై అధ్యయనం చేస్తామని, త్వరిత గతిన కంపెనీ ఏర్పాటుపై దృష్టిపెడతామని డెలాయిట్‌ పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ట్యాక్స్ సర్వీసెస్,గ్లోబల్ ఎంప్లొయ్ సర్వీసెస్,కన్సల్టింగ్ సర్వీసెస్,ఆడిట్ సర్వీసెస్ అందిస్తున్న డెలాయిట్.

deloitte 24102018 2

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయా ఒప్పందాల ప్రతులను మార్చుకున్నారు..ఆ ఒప్పందాలివే.. హెచ్‌.డి.ఎఫ్‌.సి.బ్యాంకు విశాఖలో ‘యాక్సెలరేటర్‌’ కార్యాలయాన్ని ప్రారంభించి అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, బ్యాంకింగ్‌ రంగ ఉత్పత్తుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. డబ్ల్యు-హబ్‌ సంస్థ హాంకాంగ్‌లో ‘అంతర్జాతీయ ల్యాండింగ్‌ ప్యాడ్‌’ ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌ సంస్థలకు సహకారం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. .. సోసా అనే సంస్థ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్‌లో ల్యాండింగ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేయనుంది. సోసా సంస్థ విస్తృత యంత్రాంగం నుంచి ప్రయోజనాలు పొందడంతోపాటు మన రాష్ట్ర సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు సాగించడానికీ సహకరించనుంది. ..

deloitte 24102018 3

సింగ్‌ఎక్స్‌ సంస్థ రాష్ట్రంలో పలు అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. వాద్వాని, ఉద్యమ్‌ సంస్థలు అంకుర సంస్థలకు అవసరమైన సేవలు, శిక్షణ అందించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ..హాంకాంగ్‌ ఫిన్‌టెక్‌ సంఘం విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీ అధికారులతో ఒప్పందం చేసుకుంది. .. విశాఖలో ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్మాణానికి అవసరమైన సేవలను బైజోఫోర్స్‌ సంస్థ రాష్ట్రప్రభుత్వ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది. .. యు.కె.కు చెందిన అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ ‘ఛార్టడ్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’(సి.ఐ.ఎస్‌.ఐ.) తరపున పలు కోర్సుల నిర్వహణకు, వివిధ కోర్సుల్లో నిపుణుల తయారీకి గీతం విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Advertisements

Latest Articles

Most Read