వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ జగన్‌కు వీరాభిమాని అని అతడి సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆరడుగుల జగన్‌ కటౌట్‌ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్యాలేదన్నారు. తమది పేద కుటుంబమని, పనిచేసుకుంటే గానీ పూటగడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితుల్లో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థంకావడంలేదంటూ వాపోయారు.

jaganfan 25102018 2

నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు ఏడాదికాలంగా విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రేపు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చిన జగన్‌.. ఈ రోజు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని లాంజ్‌లో కూర్చొన్నారు. అక్కడే ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి జగన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్‌ భుజానికి గాయమైంది. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో జగన్‌ హైదరాబాద్‌చేరుకొని ఆస్పత్రిలో చేరారు.

jaganfan 25102018 3

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటనను ఏపీ డీజీపీ ఆర్పీ రాకూర్ మీడియాకు వివరించారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని తెలిసిందని, పబ్లిసిటీ కోసమే అతడు దాడిచేసినట్లు అనిపిస్తోందని ఆయన చెప్పారు. ‘‘మధ్యాహ్నం 12 గంటలకు జగన్ వీఐపీ లాంజ్‌కు వచ్చారు. అక్కడి సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 2.30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత జగన్‌తో సెల్ఫీ దిగాలని అడిగాడు. ఎడమ చేతితే సెల్ఫీ తీసుకుంటూనే.. కుడి చేతితో జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ భుజంపై దాడి చేశాడు. అక్కడున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్‌కుమార్‌తో పాటు జగన్ గన్‌మెన్‌లు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ జరగుతోంది. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగన్‌కు ఫస్ట్‌ఎయిడ్ చేశాక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు." అని డీజీపీ పేర్కొన్నారు.

జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి దాడి చేసింది, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు టీవీ9తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ కు అభిమాని. ఎలాంటి గొడవలు కూడా పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్ పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అంటూ చెప్పాడు.

jagandaadi 25102018 2

మరో పక్క ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. హోటల్ లో పని చేసే వాళ్ళు కూడా, ఆటను ఎప్పుడూ జగన్ గురించే చెప్తూ ఉండేవాడని, చంద్రబాబుని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడని, ఈ సారి మా అన్నకు తిరుగు లేదని చెప్తూ ఉండేవారని అంటున్నారు.

jagandaadi 25102018 3

జగన్‌పై దాడి ఘటనను ఏపీ ప్రభుత్వం ఖండించింది. విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికి దాడులకు ఈ సమాజంలో తావు లేదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా.. ఉంటే ఏపీ ప్రభుత్వంతో పాటు పలువురు మంత్రులు ఘటనపై స్పందించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావని పేర్కొన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ శ్రీనివాస్ అన్న చెప్పిన వీడియో చూడవచ్చు https://www.facebook.com/SaahoChandrababu/videos/274358636525989/

వైసిపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌, రేపు శుక్రవారం కావటంతో అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ రోజు ఉదయం కొంచెం సేపు తిరిగి, హైదరబాద్ బయలుదేరారు జగన్. దీని కోసం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వెయిటర్‌ ఫోర్క్‌తో జగన్‌ పై దాడి చేశాడు. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

jagan 2510208

అయితే వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు. జగన్‌కు వెంటనే చికిత్స అందించారు. ఈ దాడిలో జగన్‌ భుజానికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

jagan 2510208

దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కత్తితో లోపలకి ఎలా వచ్చాడు అనే దాని పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఫోర్సెస్ ఆధినీంలో ఉంటుంది. లోకల్ ఏపి పోలీసు ఎవరూ అక్కడ ఉండరు. ఇవన్నీ చూస్తుంటే, ఎమన్నా కుట్ర ఉందా, ఆపరేషన్ గరుడలో ఒక భాగమా అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఆ కత్తి లోపలకి వెళ్తుంటే, అక్కడ ఎయిర్ పోర్ట్ సెంట్రల్ సెక్యూరిటీ ఏమి చేస్తుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా, ఇలాంటి భౌతిక దాడులను ఎవరైనా ఖండించాలి. పోలీసు ఎంక్వయిరీలో అన్ని విషయాలు బయటకు రావాలని కోరుకుందాం...

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగింది జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయన పై దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు.

srinu 25102018 2

అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో ఏడాదికాలంగా వెయిటర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ను అమలాపురం వాసిగా గుర్తించారు. దాడి ఘటనపై నిఘా వర్గాల ఆరా తీస్తున్నాయి. ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

srinu 25102018 3

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పందించారు. జగన్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ విచారణ ప్రారంభించిందని సురేశ్‌ ప్రభు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీని కలిసి జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయనున్నారు.

Advertisements

Latest Articles

Most Read