హై కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇలా అన్ని కోర్టుల్లో కేంద్రానికి ఇబ్బంది ఎదురు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని పలు నిబంధనలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చట్ట నిబంధనలను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని పేర్కొంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

court 26062018 2

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు పన్ను మినహాయింపుతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాల్సి ఉన్నా కేంద్రం ఆ మేరకు వ్యవహరించడంలేదన్నారు.

court 26062018 3

పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకోవడం చట్ట నిబంధనకు విరుద్దమన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటు వ్యవహారంలోను నిబంధనలు అమలుకాలేదన్నారు. ఇదే తరహాలో చట్టంలోని పలు నిబంధనలు అమలుకావడం లేదన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన తెలుసుకుంటామని పేర్కొంది. నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.

మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ అని, హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేసే పని చేసాడు పవన్... అదే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వచ్చి, ఆంధ్రాలో ఊరు ఊరు తిరుగుతూ, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1 అంటున్నాడు A1... అయితే ఎప్పుడో 2015లో వచ్చిన ర్యాంకు పట్టుకుని, ఇప్పటికీ యాగీ చేస్తున్న జగన్, పవన్ కు, ఇప్పుడు అదే ఎన్-సి-ఏ-ఈ-ఆర్ ఈ సంవత్సరపు సర్వే ఇచ్చింది. ఎన్-సి-ఏ-ఈ-ఆర్ సర్వే వివిధ రాష్ట్రాల, వాస్తవ పరిస్థితికి ఇండికేటర్. 60ఏళ్లుగా ఇండిపెండెంట్‌గా పనిచేస్తున్న ప్రతిష్టాత్మకం సంస్థ. పెట్టుబడులు దగ్గర నుంచి అవినీతి దాకా, ఆయా రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ సూపర్ అని రిపోర్ట్ ఇచ్చింది.

ncaer 26062018 2

దేశ వ్యాప్తంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ‘ఎన్‌సిఎఇఆర్‌ స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పొటెన్షియల్‌ ఇండెక్స్‌-2017’ పేరుతో ఎన్‌సిఎఇఆర్‌ సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని 52.9 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు, రాజస్థాన్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం మీద సర్వేలో పాల్గొన్న పారిశ్రామికవేత్తల్లో 43.5 శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి సమస్య పెద్దగా లేదన్నారు. 30.8 శాతం మంది ఒక మాదిరిగా ఉందంటే.. 25.7 శాతం మంది మాత్రం భరించలేనంత స్థాయిలో ఉందన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు గుజరాత్‌లో అవినీతి అతి తక్కువగా ఉందని చెప్పారు. వ్యాపారాల నిర్వహణకు సంబంధించి హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌, ఒడిశాల్లోనూ అవినీతి తక్కువేనని పేర్కొన్నారు.

ncaer 26062018 3

రెండు నెలల క్రితం వచ్చిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ కూడా, అవినీతి పై ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 13 రాష్ట్రాల్లో మాత్రమే చేసిన సర్వే ఇది.. ‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపారు.

ఒక పక్క పవన్, జగన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు ఇవ్వకుండా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, కేవలం తెలుగుదేశం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. మరో పక్క, పక్క రాష్ట్రాల నేతలు వచ్చి, కడప ఉక్కు దీక్షకు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు డీఎంకే పార్టీ నాయకురాలు కనిమొళి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల లాంటి వారని చెప్పారు. రాష్ట్రాల గురించి కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందన్నారు.

kanimouli 26062018 2

బీజేపీకి హిందుత్వం తప్ప, మరో సమస్య పట్టదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల వైపు నిలబడతారని భావించి చంద్రబాబు నాయుడు ఆయనను నమ్మారని, విశ్వసించారని, అందుకే మద్దతు పలికారని ఆమె చెప్పారు. కానీ ప్రధాని అందరి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మరిచిపోయారన్నారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సీఎం రమేష్‌ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడారని గుర్తుచేశారు. కేంద్రం మాట మీద నిలబడి ఉంటే ఈపాటికి విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేవని చెప్పుకొచ్చారు.

kanimouli 26062018 3

మరో పక్క, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం నాటికి 7వ రోజుకు చేరింది. వారి ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రం దిగివచ్చి ఏదోఒకటి చెప్పేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం డాక్టర్లు వచ్చి తమను పరీక్షించారని, బీపీ తగ్గిందని దీక్ష విరమించి.. డాక్టర్ల సూచనలు పాటించాలని అన్నారని రమేష్ చెప్పారు. అయితే ఏదోఒకటి సాధించేవరకు తామ దీక్షకు విరమించేది లేదని అన్నారు. తమ దీక్షను విద్యార్థులు అర్థం చేసుకోవాలని, ఈ ఉద్యమాన్ని వారే ముందుకు తీసుకువెళ్లాలని రమేష్ కోరారు. ఢిల్లీ నుంచి కబురు వచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందన్నారు.

ఉక్కు దీక్షని ఎగతాళి చేస్తూ, పవన్‌ చేసిన వ్యాఖ్యల పై కడప వాసులు మండిపడుతున్నారు. అలాగే టిడిపి నేతలు కూడా పవన్ పై మండిపడుతున్నారు. వైసీపీ, బీజేపీ నేతల సూటిపోటి మాటలు, గాలి ప్రకటనలపై మంత్రులు మండిపడ్డారు. మాట్లాడటం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎంపీ రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘కడప పౌరుషాన్ని రెచ్చగొట్టద్దు. దీక్షను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నావు. జాగ్రత్త. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించు. నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీరు ఏం చేస్తారో ప్రకటించండి. దీక్ష పవిత్రతను వక్రీకరిస్తున్న మీ గురించి మాట్లాడాలంటే ఎంతో ఉంది. "

deeksha 260622018 2

"ఇదేమీ సినిమా కాదు. ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా కాదు. నీవు చేసిన ఆరోపణలపై మనమిద్దరమే మాట్లాడుకుందాం. కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తావా? దీక్ష అంటే ఏమనుకుంటున్నావు? అసలు నీకు రాజకీయాలు తెలుసా? దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడు. అసలు జిందాల్‌లు నీకు తెలుసా? ఉక్కు దీక్ష భావితరాల కోసం చేస్తున్న దీక్ష అని తెలుసుకో’’ అంటూ ఆవేదనాగ్రహాలతో పవన్‌పై విరుచుకుపడ్డారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లు గడించిన గాలి జనార్దన్‌రెడ్డిని రంగంలోకి దింపేందుకు మోదీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కడపను అడ్డంపెట్టుకుని ఎదిగిన జగన్‌ ఉక్కు గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవటం దారుణమన్నారు.

deeksha 260622018 3

వేలాది లోడుల ఐరన్‌ ఓర్‌ను అక్రమంగా చైనాకు రవాణా చేసి వేల కోట్లు స్వాహా చేసిన గాలి తాజాగా రంగంపైకి వచ్చి ఫ్యాక్టరీ పెడతాననటం విడ్డూరం గా ఉందన్నారు. దీక్షను మొదలు పెట్టిన తరువాత మోదీ చెప్పిటన్లు గాలి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్రమే అడ్డుకుంటుందంటూ పవన్‌ చేసిన ప్రకటన ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. గవర్నర్‌ ఆరా తీశారు, ఇంకొకరు మాట్లాడారన్నది ఇప్పటి పరిస్థితికి సరిపోదనీ, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతపరిచేలా ఉక్కుపై గట్టి హామీ ఇ వ్వాలని మంత్రి కోరారు. మరో మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌.. దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అకుంఠిత దీక్షతో చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read