ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, గత మూడు నెలలుగా పవన్ హంగామా చేస్తున్నాడు... మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని ప్రజలు అనుకుంటున్నారు... అయితే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని, కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, చంద్రబాబు పై అన్ని అస్త్రాలని ప్రయోగిస్తుందని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు.

jagan 2062018 2

ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఈ ముసుగు ఆటలు లేకుండా, పవన్, జగన్, బీజేపీ బహిరంగగా కలిసి, చంద్రబాబు పై దాడి చెయ్యటానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, వైసీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఒక అవగాహానకు వచ్చేసాయి. ఈ రోజు వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఇవన్నీ అవును అనే సమాధానం వస్తుంది. వరప్రసాద్, పవన్ కల్యాణ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బాగా అవినీతి చేస్తున్నారని, అందుకే జగన్ తో కలిసి వెళ్లి, చంద్రబాబుని ఓడించాలి అని పవన్ చెప్పినట్టు, ఈ రోజు వరప్రసాద్ మీడియాతో చెప్పారు.

jagan 2062018 3

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి జగన్మోహన్‌రెడ్డికి సపోర్ట్ చేస్తానని పవన్ చెప్పారని.. ఇది వాస్తవమని.. ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ వైసీపీ మాజీ ఎంపీ చెప్పారు. ఇన్నాళ్లూ పవన్, జగన్ కలిసి బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారన్న టీడీపీ ఆరోపణలకు వరప్రసాద్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. చంద్రబాబు అవినీతి పరుడు, జగన్ కష్టజీవి అని పవన్ అనటం చూస్తుంటే, ఆపరేషన్ గరుడ ఎంత ఫుల్ ఫ్లో లో ఉందో అర్ధమవుతుంది. కేవలం, రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అన్నందుకు, బీజేపీ, పవన్, జగన్, ఇలా ఎగబడుతూ, చంద్రబాబుని దించటానికి నానా అవస్థలు పడుతున్నారు.

ఇప్పటి వరకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక ప్లస్, అవినీతి అనేది బయటకు కనిపించక పోవటం... బయట పడినా, మీడియాలో ప్రముఖంగా రాకపోవటం... అయితే, ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం బయట పడింది... వీరు బయటకు కనిపించే అంత క్లీన్ కాదని, పాపం పండిన రోజు, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువ చేసిన స్కాంలు బయట పడతాయని అర్ధమవుతుంది. పెద్ద నోట్ల రద్దు, అమిత్ షా పాలిట వరంగా మారిందని, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా బయట పెట్టిన సమాచారం ధ్రువీకరిస్తుంది. అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ జిల్లా సహకార బ్యాంకు రద్దయిన నోట్లను జమ చేసుకున్న వ్యవహారంలో అగ్రస్థానంలో నిల్చింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు రేగాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను స్వీకరించినట్లు తాజాగా వెల్లడయ్యింది.

amitshah 22062018 2

ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. అంతే ఆ మాటున పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోదీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

amitshah 22062018 3

డీసీసీబీల ద్వారా నల్లధనాన్ని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి డీసీసీబీలను నవంబరు 14న అంటే ఐదు రోజుల తరువాత తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయల మేర జమ అయిపోయాయి. అలా జమ చేసిన నోట్లకు సంబంధించిన వారిపై నేటిదాకా ఎలాంటి విచారణా జరగలేదని ఆర్టీఐ కార్యకర్త వివరించారు. అహ్మదాబాద్‌ డీసీసీబీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం 2017 మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ 5050 కోట్లు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ 14.31 కోట్లు. విశేషమేమంటే గుజరాత్‌ రాష్ట్ర సహకార బ్యాంకు (ఎస్‌సీబీ) కంటే అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ల్లో డిపాజిట్లు అనేక రెట్లు ఎక్కువ. ఎస్సీబీలో డిపాజిట్లు రూ 1.11 కోట్లు మాత్రమే.

2014 నుంచి, ఈ సంవత్సరం మార్చ్ 13 దాకా చంద్రబాబుని ఆహా ఓహో అంటూ పొగిడిన పవన్, మార్చ్ 13 నుంచి సడన్ గా యూ టర్న్ తీసుకుని, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, అప్పటి నుంచి చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలు గురించి పెద్దగా పట్టించుకోక పోయినా, అప్పుడప్పుడు చంద్రబాబు కూడా పవన్ పై చురకలు అంటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి, ఈ రోజు ఒకే కార్యక్రమంలో పాల్గుననున్నారు. మరి ఇద్దరూ పలకరించుకుంటారో లేదో చూడాలి. విషయానికి వస్తే, శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు– విజయవాడ మధ్యనున్న నంబూరు గ్రామ పరిధిలో జరగనుంది. సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తోపాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. గణపతి సచ్చిదానంద ఉదయం ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.

pawan cbn 22062018 2

విగ్రహం 11 అడుగులు కాగా.. పీఠంతో కలిపి 12 అడుగులు ఉంటుంది. గణపతి, మహాలక్ష్మి, గరుడ ఆళ్వార్‌, విష్వక్సేనుడు విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తారు. అదే విధంగా జీవ ధ్వజం ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరుపుతారు. ఇవన్నీ ఏకకాలంలో శుభ ముహూర్తంలో జరగడం మరో విశేషం. ఈ మంగళ క్రతువులో భాగంగా అవదూత దత్తపీఠం ఆస్థాన పండితులు, మైసూరు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధానార్చకులు ముక్తేవి మాధవాచార్యులు ఆధ్వర్యంలో ఇప్పటికే 21 రోజులుగా పూజలు, హోమాది కార్యక్రమాలు ఆలయంలో జరుగుతున్నాయి. 28 మంది వైఖానస ఆగమ వేద పండితులు యంత్రానుష్ఠానం చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం గణపతి సచ్చిదానంద స్వామీజీతో చక్రార్చన, అనుగ్రహ భాషణ, యాగశాల సందర్శనతోపాటు సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణాన్ని జరిపించారు.

pawan cbn 22062018 3

ఈ నెల 24న ఇదే ప్రాంగణంలో శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి తిరుమల నుంచి ఉత్సవ విగ్రహాలను టీటీడీ ఇక్కడకు పంపనుంది. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ రోజు దాదాపు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తూ అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకూ ఆలయ ధర్మకర్తలు చొరవ తీసుకుంటున్నారు. హాజరు కానున్న సీఎం: ఉదయం 10:45 గంటలకు సీఎం చంద్రబాబు విచ్చేసి, 12 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారని భావిస్తున్నారు. సీఎం రాకపై గురువారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వెలుపల 600 మీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో 820 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.

తెల్లకాగితాలు, రిజిస్ట్రేషన్‌ చేయని ఇతర పత్రాలపై భూముల ఒప్పందాలు చేసుకున్నారా? వాటిని ఇప్పుడు ఇతరులకు విక్రయించలేకపోతున్నారా? సాదా బైనామాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అనుమతించడం లేదా? వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. మన రాష్ట్రంలో సాదాబైనామాలు (తెల్లకాగితాలపై భూముల కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు, ఒప్పందాలు రాసుకోవడం) చాలానే ఉన్నాయి. వీటితో ముడిపడిన భూములను ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. అలాగే వాటిని ఇతరులు కొనలేని.. అమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల చట్టం (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-ఆర్‌వోఆర్‌) చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2వ తేదీని కటా్‌ఫగా పెట్టుకుని అప్పటి వరకు ఉన్న సాదా బైనామాలను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వం ఆమోదించింది.

farmers 22062018 2

రాష్ట్ర విభజనకు ముందు... అంటే 2014, జూన్‌ 2నాటికి ఉన్న సాదా బైనామాల (తెల్లకాగితాలపై రాసుకున్న భూమి ఒప్పందాలు)ను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అనుమతిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు 321 నంబరుతో జీవో గురువారం జారీ అయింది. ఇందుకు రైతులు స్థానిక తహసీల్దార్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ‘‘సాదా బైనామాలు ఉన్న రైతులు తొలుత సంబంధిత మండల తహసీల్దార్‌ వద్ద 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే వర్తిస్తుంది. సాదా బైనామాల కింద 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూములను మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి. రిజిస్ట్రేషన్‌ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

farmers 22062018 3

తెల్లకాగితాలు , రిజిస్ట్రేషన్‌ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములను ఎలాంటి స్టాంప్‌ డ్యూటీ లేకుండా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2.5 ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట పొలంలోపు రైతులకే ఈ జీవో వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్రమబద్దీకరణ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ జీవో గురించి రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో జరిగిన అన్‌ రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌లకు ఈ జీవో వర్తించదని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read