కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాక ముందే, ఏయ్ చంద్రబాబు, దండయాత్రకు వస్తున్నాం అంటూ, ఛాలెంజ్ విసిరిన రాం మాధవ్ పరిస్థితి ఇప్పుడు తారు మారు అయ్యింది. అమిత్ షా తరువాత పార్టీకి నేనే అంటూ బిల్డ్ అప్ ఇచ్చిన రాం మాధవ్ ను సొంత పార్టీలోనే దూరం పెడుతున్నారు. దీని అంతటికీ కారణం మనోడు కాశ్మీర్ లో చేసిన విఫల ప్రయోగం. ఆయన చొరవతోనే కశ్మీరులో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా పేరొందిన పీడీపీ-బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే తరువాత పరిణామాలతో, శక్తిమంతుడైన నేత ఒక్కసారిగా ఫ్లాప్‌ల ఖాతాలో చేరిపోయారు. కశ్మీరు వైఫల్యంతో ఆయన ప్రభ మసకబారిపోయింది.

rammadhav 22062018 2

కశ్మీరు సంకీర్ణం సుస్థిరమని 3 నెలలుగా ఆయన చెబుతున్న మాటలన్నింటినీ అపహాస్యం చేస్తూ బీజేపీ అధినాయకత్వం కాశ్మీర్ లో సంకీర్ణ సర్కారుకు గుడ్‌బై చెప్పింది. పార్టీ అంతర్గత రాజకీయాలే కశ్మీరులో ఆయన ప్రయోగానికి గండి కొట్టాయని కొందరంటుంటే, పీడీపీ సర్కారుతో రాంమాధవ్‌ మెతకవైఖరి దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. రాంమాధవ్‌ మొదటి నుంచీ పీడీపీ సర్కారుకు అండగా నిలిచారు. దేశంలో ఒక్క కశ్మీరులోనే జాతీయ పతాకానికి అవమానం జరగలేదని, ఛత్తీ్‌సగఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకానికి ఆహ్వానం కూడా లభించదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం, రాం మాధవ్ ట్యూన్ మారింది.

rammadhav 22062018 3

రాంమాధవ్‌ పూనికతోనే జమ్ము కాశ్మీర్‌లో మిలిటెంట్లకూ, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 2017 అక్టోబర్‌ 25న ఐబీ మాజీ డైరెక్టర్‌ దినేశ్‌ శర్మను నియమించారు. ఏడాది కాకముందే పీడీపీకి మద్దతు ఉపసంహరించారు. చర్చలు ఏమయ్యాయో, దినేశ్‌ శర్మ ఏం చేశారో రాంమాధవ్‌ చెప్పలేక పోయారు. కర్ణాటకలో ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ‘‘చంద్రబాబు పని అయిపోయింది, దక్షిణాదిన బీజేపీ దండయాత్ర మొదలవుతుంది’’ అని రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. చివరకు కర్ణాటకలోనే పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న జమ్ము కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీయే స్వయంగా కూల్చేసుకుంది. సంకీర్ణ ప్రభుత్వాలను బీజేపీ నడపలేదన్న విషయంమరోసారి స్పష్టమైంది. కాశ్మీర్‌లోనే విఫలమైన రాంమాధవ్‌ దక్షిణాది దండయాత్ర ఎలా ప్రారంభిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈశాన్యం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్న రాంమాధవ్‌ దూకుడుకు కాశ్మీర్‌ వైఫల్యం తర్వాత బ్రేకులు పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకుడు జగన్ మహాన్ రెడ్డి నోటికి అడ్డు అదుపూ అనేది లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే ఉరి వేస్తా, బట్టలు విప్పుతా, కాల్చేస్తా, చీపిరితో కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఎమ్మల్యేల పై కూడా ఇలాగే విమర్శలు చేస్తున్నారు. అయితే, సిన్సియర్ ఐఏఎస్ అధికారుల పై కూడా, ఇలాంటి మాటలే మాట్లాడుతూ, సొంత పార్టీ నేతల చేత ఛీ కొట్టించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటంనేని భాస్కర్‌ సుధీర్ఘకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారని, ఆయనను ఇక్కడ ఎందుకు అంతకాలం పనిచేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి దోచుకున్న సొమ్మును కలెక్టర్‌ చంద్రబాబుకు చేరవేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

jagan 22062018 2

నాలుగేళ్లుగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ పై జిల్లా వైకాపా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన అవినీతికి పాల్పడినట్లు కానీ, చంద్రబాబుకు ముడుపులు ఇస్తున్నారని కానీ ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ విమర్శించలేదు. అత్యంత నిజాయితీపరుడైన యువ ఐఎఎస్‌ అధికారిగా భాస్కర్‌ కు పేరుంది. ఇటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తాయనే కారణంతోనే తనను బదిలీ చేయాలని ఆయన కోరుతున్నా, సిఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోవటం లేదు.

jagan 22062018 3

అయితే జగన్ కలెక్టర్ పై విమర్శలు చెయ్యటంతో, స్థానిక వైకాపా నాయకులు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తమ అధినేతను, ఎవరో తప్పుదోవపట్టించా, జిల్లా కలెక్టర్‌ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారైనా, ఆయన ఎప్పుడు కులపక్షపాతం వహించలేదని, అందరినీ ఆయన దగ్గరకు తీస్తారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ పై ఆరోపణలు చేసిన జగన్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేయడం, పోలవరం ప్రాజెక్టును ఒక కొలిక్కి తేవడం, మారు మూల ప్రాంతాలకు సైతం సుపరిపాలన అందించి ప్రజా కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న భాస్కర్‌ పై ఇటువంటి ఆరోపణలు చేయడం విడ్డూరమని వారు అంటున్నారు.

అది ఓ ఆధ్యాత్మిక ఆశ్రమం.. కానీ ప్రజలు ఎవరికీ ఎంట్రీ లేదు... అసలు అక్కడ ఓ ఆశ్రమం ఉన్నట్టే ఎవరికీ తెలియదు. కానీ ఆ ఆశ్రమం గురించి ఉత్తరాది నాయకులు అందరికీ బాగా తెలుసు అందుకే కేవలం వీవీఐపీలు మాత్రమే అక్కడకు వస్తూ ఉంటారు... ఉత్తరాదికి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వస్తుంటారు... అయితే ఇక్కడకి ఎవరు వచ్చినా అంతా సీక్రెట్ గానే వస్తుంటారు తప్ప ఎక్కడా ఫోకస్ అవ్వడానికి మాత్రం ఇష్టపడరు. మొన్న అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు కూడా, ఇక్కడ 40 నిమషాలు సీక్రెట్ గా ఉన్నారు. ఇప్పుడు దీని గురించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ సిద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా. కొన్ని నెలల క్రితం ఒకానొక అధికారి వచ్చారు! ఆ ఆశ్రమంలో స్వామీజీని సందర్శించుకున్నారు! వెళ్లారు! ఆ తర్వాత ఇరవై రోజుల్లోపలే దేశంలోని ఒక ప్రముఖ ఆర్థిక లావాదేవీల సంస్థకు ఆయన సారథి అయ్యారు.

అమిత్‌షా కంటే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితర ప్రముఖులు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్లారు. ఇక్కడకు వచ్చే చాలామంది ప్రముఖులు రెండో కంటికి తెలియకుండా, రాత్రి సమయాల్లో నే వచ్చిపోతుండటం విశేషం! దీంతో ఈ ఆశ్రమం చుట్టూ అనేక ఊహాగానాలు అలుముకుంటున్నాయి. పెద్దగా ప్రచారంలో లేని, మారుమూలన ఉండే ఆశ్రమాలను భద్రమైనవిగా భావించి.. వాటిని వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ‘అవసరాలకు’ ఉపయోగించుకుంటున్నారా.. అ నే ఊహ అందులో ఒకటి! తిరుపతి సమీపంలోని గుట్టల్లోని ఆశ్రమానికి అత్యంత ప్రముఖుల రాకపోకలు రహస్యంగా జరుగుతుండటం మాత్రం నిజం.. అయితే ఈ వార్తా బయటకు రాగానే, స్థానికులు భగ్గు మన్నారు. రామాపురం సిద్ధేశ్వరతీర్థ బ్రహ్మర్షి ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాల పై ఎదురు తిరిగారు. నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి, ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమంలోని కృష్ణ మందిరం, గోశాలను కమిటీ సభ్యులు పరిశీలించారు.

కాగా గురుదేవ్ ఏకాంత మందిరాన్ని కూడా పరిశీలించాలని లోనికి వెళ్తున్న కమిటీ సబ్యులను ఆవ్రమం సిబ్బంది అడ్డుకున్నారు. స్వామీజీ గురువానంద్ ఆశ్రమంలో లేరని ఆపడంతో కమిటీ సభ్యులు కాసేపు ధర్నా చేశారు. నిజనిర్ధారణ కమిటీ ఆందోళనకు దిగితే అంతలో వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. గురుదేవ్ లేని సమయంలో రాద్ధాంతం ఏంటంటూ విరుచుకుపడ్డారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ధీటుగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలు చేయవద్దన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకే తాము వచ్చామన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆశ్రమంలో తనిఖీలకు వెళ్లిన సందర్భంలో సి.రామాపురం గ్రామస్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వామీజీ తమ భూములను ఆక్రమించుకున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన దాదాపు ఏడేళ్లు సేవలందించారు. అయితే ఈ సందర్భంలో, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ అదిరిపోయే ట్వీట్ చేసారు... ఇది ఆయన ట్వీట్ "Justice Chelameshwar retires from SC today; he and wife packed their bags, left their Govt bungalow at 5 am for his village. Bungalow handed over exactly as he got it 6 years go! How many netas would do this? Inspiring! Salute you sir! Not everyone is trapped in VVIP culture!"

rajdeep 22062018 2

1953 జూన్‌ 23న జన్మించిన జస్టిస్‌ చలమేశ్వర్‌ స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెదముత్తేవి. మచిలీపట్నంలో పాఠశాల విద్య, చెన్నైలో కళాశాల విద్య పూర్తయ్యాక 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1995లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. ఏపీ, గువాహటి, కేరళ హైకోర్టులకు సేవలందించాక 2011 అక్టోబరు 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. . ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై సహచర న్యాయమూర్తులతో కలిసి జనవరి 12న విలేకరుల సమావేశంలో ఆయన చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అవుతుందని చరిత్రాత్మక తీర్పు ప్రకటించిన తొమ్మండుగురు న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని రద్దు చేసిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు.

కొలీజియం సిఫార్సులు అపారదర్శకంగా ఉంటున్నాయని తప్పుపట్టిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌. మరోపక్క- ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే అంశంపై డోలాయమాన పరిస్థితి మరికొంత కాలం కొనసాగడం అనివార్యంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేయగా ప్రభుత్వం దానిని తిప్పిపంపడం, జస్టిస్‌ జోసెఫ్‌ పేరునే పునరుద్ఘాటించాలని కొలీజియం భావించడం తెలిసిందే. పదవీ విరమణ చేస్తున్న జస్టిస్‌ చలమేశ్వర్‌ స్థానంలో మరో న్యాయమూర్తి కొలీజియంలోకి రావాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read