ఢిల్లీలో వైసీపీ - బీజేపీ నేతలు చర్చలు చేస్తూ దొరికిపోవటం, ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్‌ని కలిసి కీలక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇవాళ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ని కలిసి బుగ్గనపై ఫిర్యాదు చేశారు. బుగ్గన పీఏసీ ఛైర్మన్‌గా సభా హక్కులను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు.

buggana 20062018 2

బీజేపీ ఎమ్మల్యే ఆకుల సత్యన్నారాయణ, వైసీపీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి భేటీ పై వార్తలు రావటంతో, ముందు అవి ఖండించారు.. తరువాత సిసి టీవీ ఫూటేజ్ రావటంతో, కలిసి టిఫిన్ చేసాం అని చెప్పారు, కాని రాం మాధవ్ ను కలవలేదు అని చెప్పారు. రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు లాగ్ బుక్ లో ఉండటంతో, రాం మాధవ్ ఇంటికి వెళ్ళలేదు అని, రాం మాధవ్ ఇంటి దగ్గర ఒక కార్ దిగి, ఇంకో కార్ ఎక్కామని చెప్పారు. మొత్తానికి, ఇరు పార్టీలు కలిసి, రాం మాధవ్ ఇంట్లో భేటీ అయినట్టు, అక్కడ పీఏసీ చైర్మన్‌ హోదాలో, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అసెంబ్లీలోని కొన్ని కీలక పత్రాలు, రాం మాధవ్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చయి. అయితే, ఇప్పుడు ఇవి బుగ్గన మెడకు చుట్టుకుంది.

buggana 20062018 3

ఇదే విషయం పై శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల కూడా స్పందించారు. పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లి వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన భేటీ కావడం వైకాపా, బీజేపీ కుట్రలకు పరాకాష్ట అని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్‌ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్‌ ఏదైనా విషయాలుంటే స్పీకర్‌కు తెలియజేయాలని అనంతరం శాసనసభలో దాని గురించి చర్చించా లన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పాత్రలు, బీజేపీ పెద్దలకు చేరవేయడాన్ని గర్హించారు. లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెకాన్ తాజా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇటీవల దిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

cbn 20062018 2

మరో పక్క, కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేపట్టబోయే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. కడప జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో, దీక్ష జరుగుతుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుండడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమంటూ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం అందించాలని ఢిల్లికి వెళ్లి ప్రయత్నించినా ప్రధాని కార్యాలయం, పర్మిషన్ ఇవ్వకపోవటంతో కలువలేకపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి లేఖ ద్వారా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై వివరించారు.

cbn 20062018 3

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ఆ లేఖలో తెలియ జేశారు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవ డంతో ఆమరణ నిరాహారదీక్షకు ఆయన సిద్దమయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం లోటు బడ్జెట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇవ్వాలని ఉందని సియం రమేష్ పేర్కొన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి సెయిల్‌ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని చట్టంలో 13వ షెడ్యూల్‌లో మూడో పాయింట్‌లో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు.

కొన్ని దశాబ్దాలుగా ఆ కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసిన రమణ దీక్షితులు, గత కొన్ని రోజులుగా అమిత్ షా సేవలో తరించటం చూసాం, జగన్ ఇంటికి వెళ్లి ఆశీర్వదించటం చూసాం, ఇప్పుడు ఏకంగా అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న దీక్షితులు, మరోసారి తెర పైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తప్ప, అన్ని చోట్లా ప్రెస్ మీట్లు పెట్టే ఆయన, ఈ రోజు హైదరాబాద్ లో పెట్టారు. చంద్రబాబు పై మరోసారి ఆరోపణలు చేసేందుకు హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రమణ దీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని క్రిస్టియన్ ప్రతినిధి బోరుగడ్డ అనిల్ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు.

deekshitulu 20062018 2

సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఇతను.. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వెనుక అనిల్ ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ బోరుగడ్డ అనిల్, మత ప్రచారం మాత్రమే కాదు, నేరాలు కూడా చేస్తూ ఉంటాడు. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

deekshitulu 20062018 3

ప్రస్తుతం గుంటూరులోని వల్లూరివారి తోటలో… భీం సేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. భీంసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ బోరుగడ్డ అనిల్ రమణ దీక్షితులుకు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ.. శ్రీవారి సేవల గురించి ప్రెస్‌మీట్ లో అనిల్ బాధపడ్డారు. రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తారని కూడా తనే ప్రకటించారు. 24 ఏళ్లపాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణ దీక్షితులు.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకంటించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కలిశారు. నాడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.

మొన్న హోం గార్డ్ లకు, ఈ రోజు అంగన్‌వాడి కార్యకర్తలకు, చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో, వారిని ఆదుకుంటున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో తన నివాసంలోని ప్రజాదర్భార్‌ హాలులో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్‌ వాడీలపై వరాల జల్లు కురిపించారు. 7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.305 కోట్ల పైచీలుకు భారం పడుతుందని చెప్పారు.

anganvadi 20062018 2

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అంగన్‌వాడీల వేతనాలను పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే అంగన్‌వాడీలందరికీ స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒక్క ఆడపిల్లా చనిపోవడానికి వీల్లేదన్నారు. గర్భిణులు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శిశుమరణాల సంఖ్య తగ్గిందన్నారు. కేరళతో పోల్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉందని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. చిన్న పిల్లలు చనిపోకుండా ఉండాలనే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని.. ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీల సంఖ్య పెరగడంతో పాటు పిల్లలకు టీకాలు వేసే విధానంలోనూ ఇంకా మెరుగుదల రావాలని సూచించారు.

anganvadi 20062018 3

అలాగే వివిధ పధకాల పై కూడా మాట్లడారు.. "చంద్రన్న పెండ్లి కానుక ఆర్ధిక చేయూత ఇవ్వడం జరుగుతున్నది. ఏప్రిల్ 1 న ప్రారంభించిన చంద్రన్న పెండ్లి కానుక కోసం ఇప్పటి వరకు 14601 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 90 శాతం వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. పాఠశాల విద్యా కమిషనర్ విద్యా సంవత్సరం లో రూ.4800 కోట్ల తో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేసారు. బయో మెట్రిక్ హాజరు వల్ల ఉపాద్యాయులు హాజరు 98 శాతం ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు వల్ల డ్రాప్ ఔట్స్ జీరో శాతానికి చేరగలిగాము.ఇకపై విద్యార్థిని, విద్యార్థులకు ఇకపై ఇచ్చే 3 గుడ్లకు బదులు 5 గుడ్లకు పెంచడం జరుగుతున్నది. సాధికార మిత్రాల పనితీరుపై పోటీ పెడతాను. 4 లక్షల 62 వేల మంది సాధికార మిత్రాలు త్వరలో నే స్మార్ట్ ఫోన్లు అందచేస్తాను" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

Advertisements

Latest Articles

Most Read