ఎన్టీఆర్ వైద్య పరిషత్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతాలకు కూడా భారీ స్థాయిలో ఉచిత రేడియాలజీ సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రజలు, డాక్టర్ల నిష్పత్తి తక్కువని, ఉన్న డాక్టర్లలో కూడా స్పెషలిస్టులు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 8 జిల్లా, 31 ప్రాంతీయ, 132 గ్రామీణ ఆసుపత్రులు, ఎక్స్ రే యూనిట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అయితే, కార్డియాలజిస్ట్ లు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా ప్రైవేట్‌ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళుతున్నారని, అందువల్ల వారికి వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపింది.

ap health 07062018 2

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తమ ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ కార్యక్రమం కింద ఉచిత రేడియాలజీ సేవలు ప్రారంభించినట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన కేంద్రం నుంచి రేడియాలజీ కార్యక్రమం నిర్వహిస్తారని, ఇక్కడినుంచి మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందిస్తారని తెలిపింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్స్ రే ఫిల్మ్, డయాగ్నైజ్ నివేదికను ఆ కేంద్రానికి పంపుతారని పేర్కొంది. అక్కడ ఉండే నిపుణులైన రేడియాలజిస్ట్ లు ఎక్స్ రేని పరిశీలించి సవివరమైన నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. దానిని తిరిగి ఆయా ఆసుపత్రులకు పంపుతారని చెప్పింది.

ap health 07062018 3

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అమలు చేస్తున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమం కింద అన్ని వివరాలు రియల్ టైమ్ విధానంలో సమన్వయం చేస్తుంటారని పేర్కొంది. అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,61,572 ఎక్స్ రేలు తీసినట్లు, పది లక్షల మంది రోగులు ప్రయోజనం పొందినట్లు వివరించింది. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు ఖర్చు తగ్గడమే కాకుండా వారికి సమయం కూడా కలిసి వస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం కింద మార్చి నెలలో 45,973 మంది ప్రయోజనం పొందినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

బీజేపీ చీఫ్ అమిత్‌షా ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్దతు కోసం భేటీ)ప్రచారంలో భాగంగా, పార్టీ సీనియర్ నాయకులను, మిత్రపక్షాలను, ఇతరులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అమిత్‌షా ముంబై చేరుకొని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యి, అలక మీద ఉన్న శివసేన పార్టీని బుజ్జగించే ప్రయత్నం చేసారు. అయితే, ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్తా ప్రచారం జరుగుతుంది. ఆ వార్త ప్రకారం, అమిత్ షా, చంద్రబాబు వద్దకు కూడా వచ్చి, మిత్ర బంధాన్ని కొనసాగిద్దాం అని అడిగినట్టు, దానికి చంద్రబాబు ససేమీరా అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లుగానే కొట్టి పారేస్తున్న సందర్భంలో, టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చిన కధనం చూస్తుంటే, ఈ వార్తా నిజమేనెమో అనే సందేహం కలుగుతుంది.

shivsena 06062018

ఇది ఆ వార్త సారంశం "It noted that the BJP had broken contact with TDP's Chandrababu Naidu in Andhra Pradesh and questioned if building an equation with him once again will be part of Shah's outreach programme. If Naidu does not agree, YS Jaganmohan Reddy (of the YSR Congress) is available, the Sena sarcastically added. " https://timesofindia.indiatimes.com/india/will-fight-all-elections-solo-says-shiv-sena-before-uddhav-thackerays-meeting-with-amit-shah/articleshow/64477395.cms ఈ వార్త ప్రకారం, చంద్రబాబు ఒప్పుకుంటే సరే సరి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఉన్నాడు కదా, అతన్ని వచ్చి అమిత్ షా కలుస్తాడు అంటూ, ఈ రోజు శివసేన పార్టీ చెప్పింది.

shivsena 06062018

అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. "అమిత్ షా గారు !! చంద్రబాబు గారిని కలవాలనుకోవటంలో తప్పు లేదు, కానీ ముందుగా మీ వందిమాగధ బృందం చేస్తున్న తూతూ మంత్రపు బెదిరింపులు,అలివికాని అహంకార అదలింపులు, వదులుకోమని చెప్పండి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు ఆనేది నిజమే కావచ్చు, కానీ పరిధిని మించి మీరు, మీ బృందం మరచిపోవచ్చేమో, చంద్రబాబు మర్చిపోవచ్చేమో, కానీ ఆంధ్రోడు మర్చిపోడు. మా అమరావతి ని మీరు చేసిన హేళన మర్చిపోము. మీరు చంద్రబాబును రాజకీయ కోణంలో కలవచ్ఛు,కానీ రాజకీయం కన్నా ముఖ్యమైన మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.మీకు నాలుగు బిల్డింగ్స్ చాలవా అని అవహేళన గా మాట్లాడారు. మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్ఛమంటే రక్షణ బడ్జెట్ కూడా అడుగుతారేమో అని ఎకసెక్కాలాడరు.ఇవేవీ మర్చిపోలేదు, పోము కూడా.. ఇక్కడ రాజకీయంలో మీకో పాత్ర ఉండాలంటే ముందుగా మీ అహంకారానికి ఆంధ్రప్రజలకు క్షమాపణ చెప్పండి." అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమిత్ షా కి చెప్తున్నారు.

నాలుగేళ్ళు చంద్రబాబు శభాష్ అంటూ, గత మార్చ్ నుంచి ఉన్నట్టు ఉండి, చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే, ఏ ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు..

bheema 06062018 2

ఈ సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. విశాఖలో పవన్ కు స్వాగతం పలికేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. తోళెం నాగరాజు (28), భీమవరపు శివ (31) అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర స్వాగత ఫ్లెక్సీలు కట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలను రహదారి పక్కన కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో వారు షాక్‌కు గురై మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

bheema 06062018 3

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారిని ఆదుకోవటానికి ముందుకు వచ్చింది. చంద్రన్న భీమా ద్వారా వారికి సహయం చేసారు. పాయకరావుపేట ఎం.ఎల్.ఏ అనిత, ఆ కుటుంబాలని పరామర్శించి, చంద్రన్న భీమా ను పంపిణీ చేసి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం పార్టీలు చూడలేదు. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరులుగా ఈ పధకానికి అర్హులు. ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, విజయనగరంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, చంద్రన్న భీమ పధకం పేరు గొప్ప....ఊరు దిబ్బ అని ఎగతాళి చేసారు. ఇప్పుడు ఆ పేరు గొప్ప....ఊరు దిబ్బ పధకమే, రెండు కుటుంబాలకు ఆసరా అయ్యింది. ఎంతో మంది అభాగ్యులను చంద్రన్న భీమా ఆదుకుంటుంటే, పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడాలి కాబట్టి విమర్శించి చేతులు దులుపుకోవటం కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి... విమర్శలు హేతుబద్ధంగా ఉంటే, అందరికీ ఉపయోగం ఉంటుంది...

రౌడీ పార్టీగా పేరు ఉండి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీవ్ర పదజాలంతో తిడుతూ, మీ అంతు చూస్తూ, మిమ్మల్ని జైలుకి తీసుకుపోతా అంటున్నాడు A1.... A2 అయితే, కొంత మంది అధికారులు పేర్లు చెప్పి మరీ, వీరు మా హిట్ లిస్టు లో ఉన్నారు, మా A1 సియం అయిపోతున్నాడు, సియం అవ్వగానే, వీరి సంగతి చూస్తాం అంటున్నాడు.. తిరుపతిలో ఉండే ఒక స్మగ్లర్ ఏమో, ఉరికించి ఉరికించి కొడతాం అంటాడు.. ఇప్పుడు లిస్టు లో మంగళగిరి ఎమ్మల్యే చేరాడు... ఈయన విమర్శలు చేసింది, అత్యంత నీతి వంతమైన ఆఫీసర్ గా పేరు ఉన్న, ఏసీబీ డైరెక్టర్‌ ఆర్పీ ఠాకూర్ పై... బినామీ ఆస్తుల కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏసీబీ ముందు హాజరవ్వమన్నందుకు, ఈయన పై విమర్శలు చేసాడు ఆళ్ళ.. విమర్శలు చేసి, జగన్ పరువు నిలబెట్టాడు..

acb 06062018 2

ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం మండిపడింది. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పోలీసులపై ఆర్కే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక అవినీతిపరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో కనిపించడం లేదా? అన్ని ప్రశ్నించారు. ఆర్పీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

acb 06062018 3

రాజకీయాలతో పోలీసులను టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. ఐపీఎస్‌కు ఎలా సెలక్ట్‌ అవుతారో కూడా తెలియని రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎంతో సామర్థ్యం ఉంటేనే సివిల్‌ సర్వీస్‌కు ఎంపిక అవుతారని గుర్తుచేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆయన సహకరించాలన్నారు. పలు కారణాలతో రెండు సార్లు విచారణకు గైర్హాజరైన ఆళ్ల సోమవారం ఉదయం ఏసీబీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా ఏసీబీ ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. కాగా రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన ఎమ్మెల్యే మూడో సారి స్వయంగా ఏసీబీ ముందు హాజరయ్యారు.

Advertisements

Latest Articles

Most Read