ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నీ ఇచ్చేసాం, లెక్కలు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే... మీకు ఇంకా లక్షలు లక్షలు కోట్లు ఇస్తాం అంటున్నారు.. కాని యూసీలు చూపించాలి అంట... అలాగే, దొలేరా సిటీ గురించి చంద్రబాబు చేస్తున్న విమర్శలు పై వెనకేసుకుని వచ్చారు... ఈ రోజు కూడా, జీవీఎల్ అనేక ఆరోపణలు చేసారు... జీవీఎల్ వ్యాఖ్యల పై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు... ఇది లోకేష్ స్పందన "ఏపీ ప్రభుత్వం సమర్పించిన యూసిలు సరిగా లేవు అని చెప్పటానికి, జివిఎల్ ఎవరు ? సమర్పించిన యూసిలు సరిగా లేని యెడల, కేంద్రంలోని ఆ శాఖల వారు వివరణ అడగాలి. వెనుక బడిన జిల్లాలుకు కేటాయించిన రూ. 1000 కోట్లు నిధులకు, సంబందించిన యూసిలు ఇప్పటికే సమర్పించడం, అవి కేంద్ర శాఖలు ఆమోదించడం కూడా జరిగింది అని, తమరికి తెలియపరుస్తున్నాను."

gvl 04062018 2

"అమరావతిలో డ్రైనేజీ పనులకు ఏ విధమైన నిధులు విడుదల చేయలేదు. రూ. 460 కోట్లు & రూ. 540 కోట్లు విజయవాడ మరియు గుంటూరు నగరాలకు మాత్రమే విడుదల చేసారు. ఇప్పటి వరుకు అయిన పనులకు గాను, రూ. 349 కోట్ల యూసిలు సమర్పించటం జరిగింది. రెండు నగరాల్లో మిగిలిన పనులు, వచ్చే సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది. ఇప్పటివరకు కేంద్రం అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే, యూసిలు రూ. 1583 కోట్లకు సమర్పించండం, దానిని వారు ఆమోదించారు. జివిఎల్ గారు, ఏ "ఊహాజనిత ప్రాజెక్ట్" కి రూ. 8962 కోట్లు నిధులు విడుదల చేసాము అంటున్నారో, ఆ వివరాలు తెలపాలి, లేదా మీరు చెప్పినవి అబద్దాలు అని ఒప్పుకోండి. కాగ్ రిపోర్ట్ 2016 - 17 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన రూ. 83900 కోట్ల ఎడ్యుకేషన్ సెస్ లెక్కలలో అవకతవకలు జరిగినట్టు ప్రశ్నించింది. జ్యూట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, వివిధ శాఖల యూసిలు సమర్పించకపోవటం వీటిలో ముఖ్యమైనవి."

gvl 04062018 3

"ఇప్పుడు బీజేపీ వారు, కాగ్ కేంద్ర ప్రభుత్వం పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్తుందా. యూసిలు సమర్పించడం, వాటిని ఆమోదించడం అనేది పరిపాలనలో జరిగే రొటీన్ ప్రాసెస్. అది కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పరిధిలోనిది. ఈ విషయం పట్టుకుని, బీజేపీ వారు నిధులు దుర్వినియోగం జరగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పై రాజకీయం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి యూసిలు అవసరం లేదనే విషయం జివిఎల్ నరసింహ రావు గుర్తుంచుకోవాలి." అంటూ లోకేష్ స్పందించాలి. ఇక్కడ లోకేష్ చెప్పిన సూచన కూడా, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూసీలలో తప్పు ఉంటే, యూసీలు ఇవ్వకపోతే అడగటానికి జీవీఎల్ ఎవరు, అమిత్ షా ఎవరు ? కేంద్రంలోని అధికారులు కాని, ప్రధాని కార్యాలయం కాని, ప్రధాని కాని ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఎందుకు అడగలేదు ? అది అడిగితే రాష్ట్రం చెప్తుంది నిజమో, కేంద్రం చెప్తుంది నిజమో తెలుస్తుంది కదా... కొంచెం మీ కేంద్రానికి ఈ సూచన ఇవ్వండి జీవీఎల్ గారు...

టెక్ సావీ ముఖ్యమంత్రిగా, పరిపాలనలో టెక్నాలజీ జోడించి, అద్భుతమైన పరిపాలన అందించే పేరు ఉన్న, చంద్రబాబు ట్విట్టర్ లో ఒక ల్యాండ్ మార్క్ ను సాదించారు... ఆయన ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 4 మిలియన్లకు చేరింది. ట్విట్టర్‌లో తనకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ.. స్పందించిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా ‘‘చౌక దుకాణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి.. 500లకుపైగా నాణ్యమైన సరుకులు అందుబాటుధరల్లో అందించేందుకు రేషన్ షాపుల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశాం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

cbn tech 04062018 2

ఈ సందర్భంగా చంద్రబాబు ని అభినందిస్తూ పలువురు ట్వీట్లు చేశారు. 2009లో చంద్రబాబు ట్విట్టర్ లోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయన భావాలను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటనల వివరాలు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పధకాలకు సంబంధించిన విషయాలను ఆయన అభిమానులతో, ప్రజలతో పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా మలుచుకున్నారు. 2009లోనే ట్విట్టర్లో అకౌంట్ తెరిచిన చంద్రబాబు, ఇప్పటి వరకూ దాదాపు 4 వేల ట్విట్లు చేసారు. దీన్ని బట్టి ఆయన ఎంతలా సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు సాంఘిక మాధ్యమాల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను రాజకీయ అంశాలను అందరితో పంచుకుంటున్నారు.

cbn tech 04062018 3

అయితే, ఈ సందర్భంలోనే చంద్రబాబుని అభినందిస్తూ, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, సోషల్ మీడియాలో వెనుకబడిన ఉన్న అంశాన్ని, పలువురు చంద్రబాబు అభిమానులు, ఆయన ద్రుష్టికి తీసుకువస్తున్నారు. చంద్రబాబు లాంటి టెక్ సావీ నేత సారధ్యంలో పార్టీ కాని, ప్రభుత్వం కాని, విపక్షాలకు ధీటుగా సోషల్ మీడియాలో స్పందించటం లేదనే విషయం గుర్తు చేస్తున్నారు... అవతల పక్క, వైసిపీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, జనసేన దేవ్ బ్యాచ్, ప్రత్యెక టీంలు పెట్టుకుని, సోషల్ మీడియాలో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేస్తుంటే, మనం కనీసం చేసింది కూడా చెప్పుకోవటం లేదని, ఆ విషయంలో కొంచెం దూకుడుగా ఉండాలని అంటున్నారు.

గౌరవనీయులైన టీటీడీ ఈవో గారికి ఓ భక్తుడు వినమ్రంగా రాయు లేఖ. భగవంతుడిని విమర్శించే వారికి, ధర్మాన్ని, దైవాన్ని ధిక్కరించే వారికే తప్ప స్వామి పట్ల భక్తిని ప్రకటించే వారికి మీడియాలో చోటు లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా మా మనోభావాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. మాకు తెలిసి తిరుమలలో ఉన్నంత గొప్ప ఏర్పాట్లు, భద్రత, సదుపాయాలు, నిర్వహణ, ఆధ్యాతమ్మిక వాతావరణం ప్రపంచంలో మరే ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ కనిపించదు. ఇంటికి పట్టుమని పదిమంది వస్తే నానా హైరానా పడిపోతాం. అలాంటిది సగటున రోజుకు లక్షమంది వచ్చినా వేడివేడి అన్నం ఉచితంగా ఏ సమయంలో వచ్చినా పెడుతూ అతి తక్కువ ధరకు ఆశ్రయం కల్పిస్తూ టీటీడీ ఆదరిస్తోంది.

కొండ దిగుతూ ప్రతి భక్తుడు అయ్యో మరో రెండు రోజులు ఉంటే బాగుండు అనుకుంటాడు. మరల స్వామి దర్శనం ఎప్పుడు కలుగుతుందో అని ఆశగా వేడుకుంటాడు. అదీ ఆ సప్తగిరుల మహాత్యం. నిత్యం సుప్రభాతం వినిపించే చోట నేడు తిట్లపురాణం.. వేదమంత్రాలు ఘోషించే చోట కుళ్లు రాజకీయాలు..! వివాదాస్పద వ్యాఖ్యలు.. పవిత్ర పుణ్యక్షేత్రం అనే విచక్షణ, వివేకం మరచిపోతున్నారు మన రాజకీయ నాయకులు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం. స్వామి నామస్మరణ ఒక్కటే ప్రతిధ్వనించాలి. తిరుమలలో దైవారాధన తప్ప రాజకీయ దూషణ నిషిద్ధం. కానీ టీటీడీ దానిని అమలు జరపలేక పోతోంది. ఫలితంగా ప్రతి నాయకుడు ఒక టికెట్ బుక్ చేసేసుకుని తిరుమల వచ్చి దర్శనం చేసుకుని బయటకు రాగానే మీడియా గొట్టాల ముందు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు.

ఇక్కడ వార్తల సేకరణకు తెలుగుతోపాటు ఇంగ్లిషు, తమిళ చానళ్ల ప్రతినిధులు, వివిధ భాషల పత్రికా విలేకరులు అధిక సంఖ్యలో ఉన్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలను కవర్‌ చేసేందుకు బ్రేక్‌ సమయంలో మీడియా ఆలయం ముందే సిద్ధంగా ఉంటుంది. స్వామి దర్శనం ద్వారా దక్కిన పుణ్య ఫలాన్ని మరు క్షణంలో పర దూషణల ద్వారా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఆ జ్ఞానం వారికి ఉండక పోవచ్చు. పురాణాలను అవపోసన పట్టిన పండిత జనంతో అలరారే టీటీడీకి ఏది పుణ్యం ఏది పాపం తెలుసు. రాజకీయ, వ్యక్తిగత విమర్శలు తిరుమలలో చేసిన కారణంగా అమితమైన ప్రచారం లభిస్తోంది. రానురాను తిరుమలలో లక్షల మందికి జరిగే మంచి కంటే ఎవరో ఒకరు వచ్చి చెడు మాట్లాడితే అదే ప్రపంచానికి ఎక్కువ చేరుతోంది. అందుకే మా విన్నపం ఏమిటంటే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు మీడియా ముందు మాట్లాడాన్ని నియంత్రించి భక్తుల మనోభావాలను కాపాడండి. దీనిపై దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలతో చెప్పించండి. తిరుమలలో రాజకీయాలు వద్దు అని వారిని పిలుపు ఇవ్వండని చెప్పండి.

తిరుమల అర్చక స్వాములతో ఆ క్షేత విశిష్టత, అక్కడ దూషణల వల్ల సంక్రమించే పాపం గురించి చెప్పించండి. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు టీటీడీ తరపున విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయండి. ఇప్పుడు సుప్రీం కోర్టుపైనో మరో న్యాయస్థానం పైనో ఎవరైనా ఆరోపణలు చేస్తే మీడియా ప్రచురించదు. ఎందుకంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుందని. మరి ఆ భయం స్వామి విషయంలో ఉండక్కర్లేదా? అందుకే మీడియా కూడా తిరుమలలో రాజకీయ ప్రసంగాల ప్రసారాలను ఎవాయిడ్ చేస్తే బాగుంటుంది. అందుకు టీటీడీ పూనుకుని మీడియా యాజమాన్యాలకు విజ్ఞాపన లేఖ రాస్తే బాగుంటుంది. ఎవరన్నా నాయకులు కావాలంటే తిరుపతిలో మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ రాష్ట్రంలో కొదువే లేదు. ఎక్కడికి వెళ్లి అయినా ఎవరిని అయినా విమర్శించండి. రాజకీయ ప్రసంగాలు చేయండి. కానీ స్వామి వేంచేసి ఉన్న ఒక్క తిరుమలను మాత్రం మీ రాజకీయాల నుంచి మినహాయించండి. రాసిన భక్తుడు ఎవరనేది పక్కన పెట్టి దీనిలో మంచిని స్వీకరించండి.

విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుంది... దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వంగవీటి కుటుంబంలోని, ప్రముఖ వ్యక్తి జగన్ టార్చర్ భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం... వంగవీటి మోహనరంగా బావమరిది చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం అవుతోంది... ఈ నెల 7న చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం... అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సైతం ఆయనను పార్టీలోకి తీసుకురావటానికి తెర వెనుక కృషి చేసినట్టు తెలుస్తోంది..

bejawada 04062018 2

వంగవీటి మోహనరంగా ఒకప్పటి ముఖ్య అనుచరులతో ఇప్పటికే చెన్నుపాటి శ్రీను సమావేశం అయ్యారు. ఆదివారం ఐవీ ప్యాలెస్‌లో రాధా, రంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశాన్ని చెన్నుపాటి శ్రీను నిర్వహించారు. రాధా-రంగా మిత్రమండలి సభ్యులుగా ఉన్న రెండువేలకు పైగా సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న చెన్నుపాటి శ్రీను ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆ విషయం వేదిక మీద చెప్పకనే చెప్పారు. అయితే, ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతుంది. జగన్, తనని వాడుకుని వదిలేసాడు అని, తన బంధువు అయిన గౌతం రెడ్డి, రంగాని బూతులు తిట్టినా, నెత్తిన పెట్టుకోవటం, తనను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసి, కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, అన్యాయం చేస్తున్నాడు అని రాధా ఎప్పటి నుంచో, జగన్ పై కోపంగా ఉన్నారు. నాలుగు నెలల క్రితం, రాధా టిడిపిలో చేరిపోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే, మొన్న కృష్ణా జిల్లాలో జగన్ పాదయత్రలో, రాధా పాల్గునటంతో, ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

bejawada 04062018 3

అయితే, ఇప్పుడు స్వయానా వంగవీటి మోహనరంగా బావమరిది, రాధా-రంగా మిత్రమండలిలో ప్రధాన సభ్యడు, రాధాకి వెన్నెంట ఉండే చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటంతో, మళ్ళీ రాధా తెలుగుదేశంలో చేరే విషయం పై, ప్రచారం మొదలైంది.... ఒకేసారి కాకుండా, ముందుగా తన బావమరిదిని, తెలుగుదేశంలోకి పంపుతున్నారనే ప్రచారం జరుగుతుంది... జగన్ తో విసుగెత్తి పోయిన రాధా, పార్టీ మారతారని, తెలుగుదేశంలోకి వెళ్తారని, కాదు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ తీరు చూసిన తరువాత, జనసేనలో చేరే విషయం పై రాధా వెనకడుగు వేసారని చెప్తున్నారు. అందుకే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారని, కాపులకు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు చేస్తున్న పనులు, రిజర్వేషన్ కోసం ఇప్పటికే కేంద్రానికి పంపియ్యటం వంటివి పరిగణలోకి తీసుకుని, సీటు విషయంలో క్లారిటీ వస్తే, తెలుగుదేశంలోకి వచ్చేస్తారు అని, అందులో భాగంగానే ముందుగా తన బావమరిదిని పంపిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి, ఇదే కనుక జరిగితే, బెజవాడ రాజకీయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవటం ఖాయం..

Advertisements

Latest Articles

Most Read