నేను కూత పెడితేనే, ఈ లోకం అంతా నిద్ర లెగుస్తుంది అనుకుంటుంది అంట కోడి... అలాగే నేను ప్రచారం చెయ్యబట్టే, అందరూ గెలిచారు అని చెప్తున్న పవన్ కళ్యాణ్, మరింత శ్రుతిమించి చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కనిపిస్తే, కర కర తినేస్తున్నారని, ఇలా ఎలా తినాలో చంద్రబాబే నేర్పిస్తున్నారని, చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న 40 ఏళ్ళ అనుభువం ఇసుకను దోచేయ్యటానికి తప్ప, దేనికి ఉపయోగపడటం లేదని, హేళనగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై ముఖ్యామంత్రి చంద్రబాబు స్పందించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనని ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటల పై స్పందించారు..

cbn 04062018 2

నా 40 ఏళ్ల అనుభవంతో ఇసుక ఎక్కడెక్కడో అమ్ముకోవడానికి పనిచేస్తున్నానని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు. ఇసుక కావాల్సిన వారికి ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చే రూ.500-600 కోట్లను వదులుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా అడ్డుపడితే తిరగబడి ఉచితంగా తీసుకెళ్లమంటున్నాం. అంతేకానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తామంటే కుదరదు. మీ దగ్గర ఆ శక్తి ఉండి... మనుషులను పెట్టి ఎక్కడైనా.. ఎవరైనా తప్పు చేస్తే ఎదిరిస్తే... నేను సహకరిస్తా. అంతేకానీ రాజకీయం చేయవద్దు. నీతివంతమైన సుపరిపాలన ఇస్తూ... సాంకేతిక సహకారంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మాపై నిందలేస్తారా? అంటూ చంద్రబాబు మాట్లడారు...

cbn 04062018 3

ప్రత్యేక హోదాపై వీలైతే పవన్‌ భాజపాతో మాట్లాడాలి. కేంద్రంపై పోరాడాలి. ఇవన్నీ చూస్తుంటే ఓ వైపు ఆవేదన..మరో వైపు బాధ వేస్తుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. 2004లో తెదేపా ఓడిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. అదే 2014లో రాష్ట్ర విభజనకు దారి తీసింది. మళ్లీ తెదేపా ప్రభుత్వం కొనసాగితే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి...’ అని చంద్రబాబు వెల్లడించారు. ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ.వెయ్యి నిరుద్యోగభృతి ఇస్తున్నానని, అదీ వారిపై తనకున్న అభిమానమని చెప్పారు. అందరినీ రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి, అస్థిరత సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. పురావస్తు శాఖను ప్రయోగించి తిరుమల ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ‘‘వెంకటేశ్వర స్వామిపైనా కేంద్రం రాజకీయం చేస్తోంది. రమణ దీక్షితుల ద్వారా నాపై విమర్శలు చేయిస్తున్నారు. వెంకటేశ్వరస్వామి పవర్‌ఫుల్‌ దేవుడు. ఎవరితోనైనా పెట్టుకోండి. వెంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు’’ అని హెచ్చరించారు.

ధైర్యముందా ? దమ్ముందా ? రండి తేల్చుకుందాం.. అటు జగన్ కు, జగన్ వెనుక ఉన్న బీజేపీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాలెంజ్ చేసారు.. సాధారణంగా అధికార పక్షంలో నాలుగేళ్ళు ఉన్న వారు, ఎన్నికలు అంటే భయపడతారు.. అలాంటిది ఇక్కడ ఇన్ని పార్టీలు కలిసి ఏకం అయి, దాడి చేస్తున్నా, చంద్రబాబు మాత్రం ఎన్నికలకు సై అంటూ, కుట్ర దారులు అందరినీ కలిసి రమ్మంటున్నారు. ప్రజా తీర్పు ఏంటో తెలుసుకుందాం రండి అంటున్నారు... ‘భాజపాకు ఎన్ని ఓట్లు వస్తాయో? మీకు (వైకాపా) ఎన్ని ఓట్లు వస్తాయో? తేల్చాల్సింది ఎన్నికలే. వీటితోనే 2019 ఎన్నికల ఫలితాలు నిర్ణయమవుతాయి. నేను సవాల్‌ చేస్తున్నా. మేం పోటీ పెడతాం. మీకు ధైర్యముంటే ఎన్నికలకు రండి...’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీల రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తావించారు.

cbn 04062018 2

‘మీ కుట్రలు.. కుతంత్రాలు బయటపడాలంటే ఎన్నికలు రావాలి. సంవత్సరానికే ఎన్నికలు రావు. రేపు, ఎల్లుండి ఆమోదానికి పిలుస్తారంటూ ఎవరి చెవిలో పువ్వు పెడతారు. వైకాపాకు ఎన్నికలంటే భయం. ఎక్కడ ఓడిపోతారో అని డ్రామాలాడుతూ రాజీనామాలు చేసినా ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్లా నీతి గురించి మాట్లాడేది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లకు 25 సీట్లు తెదేపా గెలవడం ద్వారా వైకాపా అడ్రస్సు గల్లంతు కావాలి. భాజపా కుట్రలో పాత్రధారులను.. సూత్రధారులను చిత్తు చిత్తుగా ఓడించాలి...’ అని సీఎం పిలుపునిచ్చారు.

cbn 04062018 3

బీజేపీ కుట్రలోని పాత్రధారులు, సూత్రధారులందరినీ చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని పునరుద్ఘాటించారు. ఇక ప్రాంతీయ పార్టీలదే హవా అని స్పష్టం చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ గతంలో కేంద్రంలో చక్రం తిప్పింది. భవిష్యత్తులోనూ దేశ రాజకీయాల్లో మార్పు కోసం కృషి చేస్తుంది’’ అని చంద్రబాబు తెలిపారు. కేంద్రంపై పోరాడుతూ తాను నవనిర్మాణ దీక్ష చేపడుతుంటే, కేంద్రానికి సహకరించడానికి వైకాపా వంచన దీక్ష చేస్తోందని, దీనిపై మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు...’ అంటూ ప్రశ్నించారు.

మన రాష్ట్రంలో ఒకాయన చంద్రబాబుని కాల్చి పడేసి బంగాళాకాతంలో పడేయమంటాడు.. కొత్తగా బయలుదేరిన ఇంకో ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మా ఖర్మ అంటాడు.... చంద్రబాబు లాంటి గ్లోబల్ లీడర్ కి, ఇలాంటి వాళ్ళతో మాటలు పడుతున్నారు అంటే, నిజంగా ఆయన జీవితం ఏంటో ఇలా ఉంది అనుకోవటం తప్ప, ఏమి అనలేము... చంద్రబాబు గ్లోబల్ లీడర్ ఏంటి, అని అనే వాళ్ళు కూడా ఉంటారు... ఆయన గ్లోబల్ లీడర్ ఎందుకు అయ్యారో, బిల్ గేట్స్ ని అడగండి, బిల్ క్లింటన్ ని అడగండి, సిస్కో చైర్మెన్ ని అడగండి, ప్రపంచంలోని టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ వచ్చే దావోస్ కి వెళ్లి, ఎవర్ని అయినా అడగండి చెప్తారు, చంద్రబాబు గ్లోబల్ లీడరో కాదో... వీళ్ళని అడగటం అంత ఇబ్బంది అనుకుంటే, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ లేటెస్ట్ గా ఏమంటున్నారో వినండి...

erik 03062018 2

యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్యసమితి...అలాంటి ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్,మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఏమని ట్వీట్ చేసారో తెలుసా... "చంద్రబాబు నోటి వెంట ఇన్స్పైరింగ్ వర్డ్స్ వింటున్నా.. రియల్ టైం గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, నాలెడ్జ్, అన్నీ కలిస్తేనే, ఈ ప్రపంచం ముందుకు వెళ్తుంది.. ఇన్స్పైరింగ్ అంటూ" ట్వీట్ చేసారు... అంతే కాదు ఐక్యరాజ్యసమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి, ప్రకృతి వ్యవసాయం కోసం పని చేస్తున్నారు. దీని పై కూడా ట్వీట్ చేసారు. "Good to meet the Chief Minister of Andhra Pradesh @ncbn to discuss the state’s ambitious natural farming plans. @UNEnvironment is delighted along with partners, to support this bold initiative to protect climate, biodiversity and ensure food security "

erik 03062018 3

రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో క్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ కూడా పాల్గున్నారు. ఆయన అక్కడ కూడా మాట్లాడారు ‘‘ప్రకృతి సేద్యం విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విధానానికి తన దావోస్‌ పర్యటనలో ఆయన అమిత ప్రాధాన్యతని ఇచ్చారు. అక్కడ జరిగిన సదస్సులో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌, నాణ్యత తదితర అంశాలపై అంత ర్జాతీయ వ్యాపార సంస్థలను కదిలించడానికి ప్రయత్నించారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఎక్కువ కంపెనీలను ఆకర్షించగలిగారు’’ అని ఐరాస ఉపాధి కల్పన విభాగం ఉన్నతాధికారి ఎరిక్‌సోలెన్‌ కొనియాడారు.

హేళనగా.. అవమానకరంగా, అమరావతిని భ్రమరావతి అని మాట్లాడినవారికి అభివృద్ధే సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వీటికి అమరావతి కూడా తోడైతే ఈ ప్రాంతం విద్యా కేంద్రాల హబ్‌గా మారనుంది. అమరావతికి ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.25వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయని అంచనా. ఇది కూడా తొలి దశలోనే. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో వీటికి భూములిచ్చారు.

srm 03062018 2

ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీ తరగతలు కూడా మొదలు పెట్టాయి. అయితే, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ మొదలు పెట్టిన సమయానికి, ఇప్పటికీ చాలా నిర్మాణాలు జరిగాయి... అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ క్యాంపస్ చూస్తుంటే, కళ్ళు చెదిరేలా అతి పెద్ద నిర్మాణంలా ఉంది. చంద్రబాబు అంటున్నట్టు, వరల్డ్ క్లాస్ లా, నిర్మాణం జరిగింది.. రాష్ట్రప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 200 ఎకరాల భూమిని కేటాయించింది. పోయిన ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేవలం ఐదు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమైన అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులను నిర్మించి, మొదలు పెట్టారు. అప్పటి నుంచి, ఇప్పటికి చాలా నిర్మాణాలు జరిగాయి.

srm 03062018 3

2017-18 విద్యాసంవత్సరంలో నాలుగు బీటెక్‌ బ్రాంచ్‌లు.. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టారు. ఈ ఏడాది దాదాపు 300 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది 70 శాతం అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు, 30 శాతం అడ్మిషన్లు రాష్ట్రేతరులకు కల్పిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎంలో మేనేజ్‌మెంట్‌ కోటా లేదు. క్యాపిటేషన్‌ ఫీజు లేదు. బీటెక్‌ విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు. అమరావతిని ప్రపంచంలోనే పేరొందిన విద్యాకేంద్రంగా మలచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే క్రమంలో భాగంగా అందులో దేశ, విదేశాలకు చెందిన పలు సుప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి... పూర్తి వీడియో ఇక్కడ చూడచ్చు https://youtu.be/agLvNTOhDwQ

Advertisements

Latest Articles

Most Read