పదేళ్లుగా చినుకు జాడలేని పల్లె జొన్నగిరి... కరువు తాండవిస్తున్న ఆ ఊరిలో సీఎం చంద్రబాబు ఆదివారం పర్యటించారు... వీధులన్నీ కలియదిరిగారు. జనం జేజేలు పలికారు... అంతకు మునుపు హెలి ప్యాడ్ కు చేరుకున్న చంద్రబాబును చూసి జనం చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. డిప్యూటీ సీఎం కేఈతో కలిసి గ్రామవీధుల్లో పర్యటిస్తుండగా వృద్దులు, మహిళలు, పిల్లలు అభివాదం చేశారు. 'ఆమ్మా! నీ పెద్దకొడుకును వచ్చాను. నెలనెల పింఛన్ వస్తోందా...?' అని పలకరిస్తుంటే వృద్దులు పులకించిపోయారు. నెలనెలా ఇంటికే వచ్చి ఇస్తున్నారని వారు సమాధానం చెప్పినప్పుడు చంద్రబాబు సంతృప్తి చెందారు. 'ఏ బడిలో చదువుతున్నావు? ఎన్నో తరగతి..? బాగా చదువుకుని అమ్మనాన్నకు మంచి పేరు తేవాలి..' అని పిల్లలను పలకరిస్తూ ముందుకు సాగారు.

cbnhouse 04062018 2

'అమ్మా.. మీ చంద్రన్న ఇచ్చే పసుపు కుంకుమ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా..?' అని మహిళలను అడిగారు. 'ఖాతాలో వేశారు.. మంచి పనులను ఉపయోగించుకుంటున్నాం' అని వారు సమాధానం ఇచ్చారు. గ్రామ దర్శిని అనంతరం పదేళ్ల తరువాత నీరు చేరిన జొన్నగిరి చెరువు వద్దకు చేరుకుని జలహారతి పట్టారు. ఆ సమయంలో ఆకాశం నుంచి జల్లులు కురవడాన్ని ముఖ్యమంత్రికి ప్రకృతి ఆశీర్వాదమని పలువురు అభివర్ణించారు. 'ప్రకృతిని ఆరాధిస్తే కష్టాలు ఉండవు. ఈ వర్షమే అందుకు సాక్షం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్న డంతో రైతులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. 68 చెరువులను కృష్ణాజలాలతో నింపే పథకానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతున్నందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చిరునవ్వులు చిందిస్తూ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.

cbnhouse 04062018 3

అనంతరం చెక్ డ్యాం, పంట కుంట పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. 'భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల కింద పంటలు వేసుకుంటాం' అని రైతులు పేర్కొన్నప్పుడు సీఎం ఆనందంతో 'ఏ రైతూ బాధపడకూడదనే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తున్నాం' అని అన్నారు. బహిరంగ సభలో అనర్గళంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అన్యాయం, ప్రతిపక్ష వైఖరిపై ఎండగడుతుంటే జనం సానుకూల నినాదాలు చేశారు. వర్షం కురుస్తున్నా. సీఎం ప్రసంగం కొనసాగించారు. 'ఇక్కడ ఎక్కువసేపు ఉంటే హెలి క్యాప్టర్ పైకి లేయదు. నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది' అనడంతో జనం ఆనందంతో ఈలలు కేకలు వేశారు. అనంతరం సీఎం తన ఉపన్యాసం ముగించి హెలిప్యాడ్ కు చేరుకుని అమరావతికి బయలుదేరారు.

నవ నిర్మాణ దీక్ష ఏడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామదర్శిని, గ్రామ సభలు రెండవరోజు 13 జిల్లాలలో ఉత్సాహభరితంగా సాగాయి. నవ నిర్మాణ దీక్ష ఏడు రోజుల కార్యక్రమాల్లో ఆదివారం నాడు ‘నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం’ అనే అంశంపై గ్రామసభలలో చర్చలు నిర్వహించారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతి, చెక్ డ్యాములు, పంట కుంటలు, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు, ప్రాధాన్యక్రమంలో పూర్తిచేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భ జల సంరక్షణ, తాగునీరు, తుఫాన్లు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ గ్రామసభలలో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్చలు సాగాయి.

navaniramanam 04062018 2

జల వనరులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు, కార్యదర్శులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందాయి. నేడు వ్యవసాయం-అనుబంధ రంగాలపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, గ్రామదర్శిని కార్యక్రమాలను నిర్వహిస్తారు. 13 జిల్లాల్లోని మొత్తం 9,876 గ్రామాలలో ఆదివారం గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా సాగినట్టు సమాచారం.

navaniramanam 04062018 3

19,33,967 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వేలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు 6,770 మంది అభ్యర్ధనలు అందించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి 8,917 ప్రారంభోత్సవాలు, 3,810 శంకుస్థాపనలు జరిగాయి. 3,86,539 మందికి గ్రామసభలలో పెన్షన్లు అందించారు. 48,481 కొత్త రేషన్ కార్డులను అందించారు. కొత్తగా 36,572 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. గ్రామసభలలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. 3,450 ఎగ్జిబిషన్లను నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ యాత్ర అని మొదలు పెట్టి, దాదాపు 15 రోజులు అయ్యింది... ఈ 15 రోజుల్లో 5 సెలవలు తీసుకున్నారు... కార్యకర్తలతో మాట్లాడాలని ఒకసారి, బౌన్సర్లకు దెబ్బలు తగిలాయి కొత్త వారు రావాలి అని ఒకసారి, బౌన్సర్ లకు గాయలు తగ్గలేదు అని ఇంకో సారి, రిసార్ట్ దీక్ష అని ఒకసారి, ఇలా రకరకాల కారణాలతో సెలవు తీసుకున్నారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ చాలా ఫిట్ గా ఉన్నారని, బౌన్సర్ లు ఫిట్ గా లేని కారణంగానే, సెలవులు తీసుకోవాల్సి వస్తుందని, జనసేన వర్గాలు చెప్తున్నాయి... అయితే, చెప్పా పెట్టకుండా, నిన్న సెలవు తీసుకున్నారు పవన్... ఎందుకు సెలవు తీసుకొన్నారో, ఎవరికీ తెలీదు... ఈ రోజు కూడా సెలవు అని చెప్తున్నారు.. మళ్ళీ రేపటి నుంచి, యాత్ర కొనసాగుతుంది అని చెప్తున్నారు... ఈ రెండు రోజులుగా పవన్, ఎందుకు సెలవు తీసుకున్నారు అంటే వింత వాదన వినిపిస్తుంది.

pawan 04062018 2

రెండు రోజులుగా పవన్ అరకులోని ఒక రిసార్ట్ లో సేద తీరుతున్నారు.. విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి అరకులోయ చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పద్మాపురం గార్డెన్స్‌ సమీపంలోని ఒక ప్రైవేటు రిసార్టులో బసచేసారు. పవన్‌ను కలవడానికి పాడేరుకి చెందిన కొంతమంది జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతోపాటు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఎవ్వరినీ కలవలేదు. ఇంతకీ పవన్ ఎందుకు రెస్ట్ తీసుకున్నారు, ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా అని మీడియా అడగగా, ఎబ్బే అదేమీ లేదు, ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు అని జనసేన వర్గాలు చెప్పాయి...

pawan 04062018 3

మరి ఎందుకు దీక్ష ఆపి, రిసార్ట్ లో సేద తీరుతున్నారు అని అడగగా, ఒక వింత కారణం చెప్పారు... సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్‌.కోట పర్యటన నేపథ్యంలో పవన్‌ టూర్‌ షెడ్యూల్‌ను మార్చుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి.. అసలు చంద్రబాబు రూట్ మ్యాప్ కి, పవన్ రూట్ మ్యాప్ కి సంబంధం లేకపోయినా, ఇలా చంద్రబాబు పేరు చెప్పి, యాత్ర వాయిదా వేసి రెండు రోజుల పాటు రిసార్ట్ లో సేద తీరారు పవన్... అయితే, ఇక్కడ చెప్పిన కారణం మాత్రం వింతగా ఉంది.. పవన్ కు బాగోలేదనో, అస్వస్థతగా ఉండి రెస్ట్ తీసుకున్నారు అంటే, ఎవరికి ఇబ్బంది ? ఎవరాన్నా కాదంటారా ? ఎవరికి అయినా ఇబ్బందులు రావటం సహజం.. అలా నిజం చెప్పి రిసార్ట్ లో సేద తీరకుండా, ఇలా చంద్రబాబు మీద తొయ్యటం ఏంటో...

వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాను ఎలా రక్తికట్టిస్తున్నారో చూస్తున్నాం... వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని, మొన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైసిపీ ఎంపీలు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

jagan 04062018 2

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి, రేపు, అంటే జూన్ 5న, వైసిపీ ఎంపీలను స్పీకర్ పిలిపించారు. రాజీనామా ఆమోదించే అవకాసం లేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో, డ్రామా అంతా బయట పడి పోతుంది అని, వైసిపీ అధినేత జగన్ స్పందించారు. బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కై వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుకున్నారంటూ, నెపం మొత్తం చంద్రబాబు మీదకు నెట్టేసారూ. వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా అంతా అమిత్ షా డైరెక్షన్ లో జరిగిందే అని అందిరికీ తెలిసిన విషయమే... రేపు ఎలాగూ స్పీకర్ రాజీనామాలు ఆమోదించారు కాబట్టి, నెపం చంద్రబాబుకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్.. ఒక పక్క, చంద్రబాబు, బీజేపీ పై నిప్పులు చేరుగుతుంటే, బీజేపీతో కలిసి కుట్ర పన్నారు అంటాడు...

jagan 04062018 3

వీళ్లేమో ఎప్పుడు చూసినా, ప్రధాని ఆఫీస్ లో ఉంటారు. బీజేపీ రాష్ట్రానికి ఎంతో న్యాయం చేసింది అంటారు.. అవిశ్వాసం అంటూ, అదే అవిశ్వాస తీర్మానం పట్టుకుని ప్రధాని ఆఫీస్ లో కనిపిస్తారు. బీజేపీని ఒక్క మాట అనకుండా, ప్రత్యేక హోదా పై పోరాటం చేస్తున్నాం అంటారు. జగన్ ఎంపీల చేత రాజీనామా డ్రామా ఆడించి, ప్రజల్ని రెచ్చగొట్టి, టిడిపి ఎంపీల పై ఒత్తిడి పెంచి, వాళ్ళ చేత కూడా రాజీనామా చేయించి, వాటిని ఆమోదించి, ఎన్నికలు సంవత్సరం లోపు ఉన్నాయి కాబట్టి, ఉప ఎన్నికలు రాకుండా, పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు లేకుండా, వారు బీజేపీని ఇబ్బంది పెట్టకుండా చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా, అమిత్ షా ఆడించిన రాజీనామా డ్రామా తెలుసుకుని, చంద్రబాబు ముందే జాగ్రత్త పడ్డారు... మేము రాజీనామా చెయ్యము, పార్లమెంట్ లో బీజేపీ ని ఎండగడతాం అంటుంటే, జగన్ మాత్రం అమిత్ షా, మోడీలను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఈ డ్రామాలో భాగస్వామి అయ్యి, ఇప్పుడు చంద్రబాబు వల్లే మా రాజీనామాలు ఆమోదం పొందలేదు అని చెప్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read