పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు... చంద్రబాబు పెద్ద దొంగ అని, 420 అని, అవినీతిలో రాష్ట్రాన్ని నెంబరు-1 లో నిలిపారు అంటూ, అబద్ధపు ప్రచారం చేసారు జగన్. 2016లోనే మనరాష్ట్రం అవినీతిలో మొదటి స్థానంలో నిలిచిందంటూ, తప్పుడు ఆరోపణలు చేసారు. నిజానికి మన రాష్ట్రంలో అవినీతి తగ్గింది అని, మొన్నే ఒక కేంద్ర సంస్థ చేసిన సర్వేలో తేలింది. అంతే కాదు రాష్ట్రంలో అసలు శాంతి బధ్రతలు లేవని, మర్డర్ లు పెరిగాయని, అత్యాచార ఘటనలు పెరిగాయని, ఇలా నోటికి ఏది వస్తే అది, తన సాక్షి పేపర్ లో రోజు వచ్చే తప్పుడు వార్తలు లాగా, ఇష్టం వచ్చినట్టు చెప్పేసాడు జగన్...

lokesh jagan 0406208 2

దీని పై ఐటి శాఖ మంత్రి లోకేష్, ట్విట్టర్ లో, జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. 13 కేసుల్లో ఏ1గా ఉండి కండిషనల్‌ బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్‌.. ఏపీలో నేరాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా ఘనత వహించిన వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవాచేశారు. కిడ్నాపర్లు, బెట్టింగ్ రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులు ఉన్న పార్టీకి జగన్‌ అధినేత అంటూ మండిపడ్డారు. వైఎస్‌ హయాంలో జరిగిన నేరాల గురించి జగన్‌కు తెలియదా అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది సీఎం చంద్రబాబేనని లోకేష్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

lokesh jagan 0406208 3

ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా జగన్ పై విరుచుకు పడ్డారు... సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం జమ్మాదేవిపేటలో గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. కష్టపడి చేసింది శాశ్వతమని, అవినీతితో సంపాదించింది అశాశ్వతమని చంద్రబాబు అన్నారు. ధర్మంగా సంపాదించాలని హితవు పలికారు. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు నవనిర్మాణ దీక్ష చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జూన్ 2న తెలంగాణలో ఉత్సవాలు చేసుకున్నారు, కాని మనం చేసుకోవడానికి వీల్లేదని.. మనం నష్టం పోయాం.. ఐదుకోట్ల ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష చేశానని చెప్పారు.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. మరో పక్క ప్రాంతీయ పార్టీలు అనూహ్యంగా బలపడుతున్నాయి... సొంత పార్టీలోనే మోడీ-అమిత్ షా పై వ్యతిరేకత మొదలైంది... దీంతో ఇప్పటి నుంచే అమిత్ షా ఎన్నికల వ్యూహాలకి పదును పెట్టారు.. యోగా గురువు రాందేవ్ బాబాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం కలుసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి మద్దతివ్వాలని రాందేవ్‌ను అమిత్‌షా కోరారు. బీజేపీ చేపట్టిన 'కాంటాక్ట్ ఫర్ సపోర్ట్' (మద్దతు కోసం సంప్రదించడం) కార్యక్రమంలో భాగంగా రాందేవ్‌ను షా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ '2014 ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చిన వారినందరినీ మేము కలుస్తున్నాం.

amit shah 04062018 2

తాము సాధించిన విజయాలు, చేసిన పనులు తదితరాలను వారికి వివరిస్తున్నాం. 2019లోనూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం' అని షా తెలిపారు. రాందేవ్ బాబాను కలవడమంటే లక్షలాది మంది ప్రజలను (ఆయన అనుచరులు) కలవడమేనని, వచ్చే ఎన్నికల్లో తమ మద్దతుంటుందని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. ఇది ఇలా ఉంటే రాం దేవ్ బాబా కూడా, మోడీ- అమిత్ షా లను ఆకాశానికి ఎత్తారు. అసలు మోడీ లేకపోతే మన దేశం ఎక్కడికో వెళ్లి ఉండేది అంటూ, చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వాన్ని, గత నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను రాందేవ్ బాబా ఈ సందర్భంగా ప్రశంసించారు.

amit shah 04062018 3

దేశాన్ని మోదీ కొత్త దిశగా తీసుకెళ్లారని, గత నలుగేళ్లలో 'అంతర్జాతీయ యోగా డే' ద్వారా మనమంతా గర్వపడేలా చేశారని అన్నారు. జీఎస్‌టీ వంటి పన్నువిధానం వంటివి ప్రవేశపెట్టడం ద్వారా 'టాక్స్ టెర్రరిజం' నుంచి విముక్తి కల్పించారని, ఎల్పీజీ కనెక్షన్ల ద్వారా లక్షలాది మంది మహిళల కన్నీళ్లు తుడిచారని అన్నారు. గత 70 ఏళ్లలో అమెరికా, జపాన్, రష్యా, ఇజ్రాయెల్ సహా ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన నేతలంతా గౌరవించిన మొదటి ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. ఇంతకుముందు ఏ ప్రధాని కూడా ఇలాంటి గౌరవం పొందలేదని రాందేవ్ అన్నారు. మొత్తానికి పతంజలి రాం దేవ్ బాబా గారు, మోడీ కి జై అంటూ, ప్రజలని మళ్ళీ మోడీనే గెలిపించాలని పిలుపిచ్చారు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంటే 2019 దాకా ఆగాల్సిందే...

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ప్రధాని స్పందనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతి స్పందించారు. విభజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా?. కేంద్రం హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచాలని మీరు అనుకుంటున్నారా?. ప్రజల ఆవేదన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నానని, లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

modi lokesh 04062018 2

"Dear @narendramodi Sir, if you thought your tweet could cool down AP that's on the boil for its rights, you must read the comments section which I have attached (only a few) for your perusal. Hope it doesn't spoil your Monday #APDemandsSpecialStatus #APDemandsJustice #MondayBlues" మోడీ ట్వీట్‌పై నెటిజన్ల చేసిన స్పందనలో కొన్నింటిని లోకేష్ సేకరించి ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. 'ఏపీ భారతదేశంలో లేదామోడీ నార్త్ ఇండియాకు మాత్రమే ప్రధానిగా ఉన్నారా','విశాఖపట్నంకు రైల్వేజోన్ ఇచ్చే వరకు బీజేపీకి ఓటు వేయవద్దని మేం నిర్ణయించుకున్నాం సర్', 'గుజరాత్‌లోని దొలేరా నిర్మాణంపై కాదు, అమరావతి నిర్మాణంపై దృష్టి సారించండి', 'శుభాకాంక్షలు ఎందుకు, ప్రార్థించడం కంటే సాయం చేసే చేతులు మిన్న అంటారు. మీరు అది చేయండి'.. ఇలా పలువురు నెటిజన్ల ట్వీట్లను లోకేష్ పొందుపర్చారు.

modi lokesh 04062018 2

మరో పక్క ప్రధాని ట్వీట్ చేసిన రోజే చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్‌ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు.

బినామీ ఆస్తుల కేసులో, గత రెండు సార్లు నుంచి కుంటి సాకులతో తప్పించుకుంటున్న జగన్ ప్రియ శిష్యుడు, 12 ఓట్లతో గెలిచిన వైసిపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇక తప్పక, ఎట్టకేలకు ఏసీబీ ముందు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని 3 గంటలకుపైగా ఏసీబీ అధికారులు విచారించారు. రామకృష్ణారెడ్డి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంట్లో దొరికిన... ఆర్కే భార్య ఆస్తి పత్రాలకు సంబంధించి ఏసీబీ వివరాలు తెసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు బినామీగా రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఏసీబీకి ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని స్థిరాస్తి పత్రాలు ఆళ్ల కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు సమాచారం.

alla 04062018 2

ఈ నేపథ్యంలో ఈ నెల 22న విచారణకు హాజరవ్వాలని 16వ తేదీనఏబీసీ నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాల పేరుతో 22న విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఏసీబీ వారం సమయం ఇచ్చి 29న హాజరవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన తరపు లాయర్లు ఇంకో వారం అవకాశం ఇవ్వాలని.. తప్పకుండా హాజరవుతారని విజ్ఞప్తి చేశారు. దీంతో జూన్‌ 5 వరకూ ఏసీబీ తుది గడువు ఇచ్చింది. రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన రామకృష్ణారెడ్డి మూడో సారి స్వయంగా ఏసీబీ ముందు హాజరయ్యారు.

alla 04062018 3

రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read