గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి కష్టాలను దృష్టిలో ఉంచుకునే వేతనాలు రూ.6,565 నుంచి రూ.10,500కు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం సాయంత్రం వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏలు ముఖ్యమంత్రిని ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే వీఆర్‌ఏల వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.6,565కు, నాలుగేళ్లలో మూడింతలు పెంచామని తెలిపారు.

cbn 03062018

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తున్నామని వివరించారు. ఇదే స్ఫూర్తితో వీఆర్‌ఏలు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ‘ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ సింగపూర్‌ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధాని అమరావతి అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రవాసులకూ మంచి ప్రేరణనిస్తోంది. అందువల్లే నవ నిర్మాణ దీక్షలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలి’ అని సీఎం తెలిపారు.

cbn 03062018

వేతనాలు పెంచినందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీఆర్‌ఏల సంఘ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు కైకాల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ చౌదరి, టి.వెంకటేశ్వర్లు ఉన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 27వేల మంది వీఆర్‌ఏల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారి కుటుంబాల్లో ఆనందం నింపుతోందని రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవయవ మార్పిడి నిపుణులు భారత్ యూనివర్శిటీ చాన్స్ లర్ మహమద్ రేలా శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు. మనిషి ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రిని అమరావతిలో నిర్మించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ అమరావతిలో నిర్మించతలపెట్టినట్లు డాక్టర్ రేలా ముఖ్యమంత్రికి వివరించారు. మనిషిలోని గుండె, కిడ్నీ,కాలేయం , లంగ్స్, యూట్రిస్ వంటి ప్రధాన అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు.

drrela 03062018 2

తాను ఇంతవరకు 4,500 లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించానని డాక్టర్ రేలా ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవయవదానం చేస్తే ప్రాణ దానం చేసినట్లేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. స్వస్థ్ జీవన్ దాన్ డొనేషన్ ద్వారా ప్రజలలో అవగాహన పెరిగిందని ఆర్గాన్స్ ని డొనేట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

drrela 03062018 3

ఇటువంటి ప్రముఖమైన ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రులు అమరావతిలో నిర్మించడం వలన రాష్ట్రంలో మెడికల్ టూరిజమ్ డెవలప్ అవుతుందని , ఎంతో మందికి మంచి నాణ్యత కలిగిన వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలతో వస్తే అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ రేలాకు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అప్పారావు, డాక్టర్ రమేష్ కృష్ణన్, డాక్టర్ వి.చౌదరి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 02062018 3

దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఇప్పుడు ఒరిస్సా కూడా ఎంటర్ అయ్యింది. ఒరిస్సాలో ఎన్నికలు వస్తున్న వేళ, అక్కడ ప్రజలని రెచ్చగొట్టటానికి, అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పోలవరం పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

polavaram 02062018 2

ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖలు రాశామని, ఒడిశాకు తెలియకుండా ఎలాంటి పనులూ చేపట్టకుండా నిలుపుదల చేయాలని అప్పడు కోరినట్టు చెప్పారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్‌ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో అభిప్రాయపడ్డారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని ఆయన కేంద్ర పర్యావరణ శాఖను కోరారు. ఇంకా ఎన్ని మలుపులు తిరిగుతాయో, ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో చూడాలి...

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మోడీ ప్రభుత్వం, అది పూర్తి చెయ్యటానికి మాత్రం అనేక అడ్డంకులు పెడుతుంది. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష కోసం, రాష్ట్ర ప్రజల జీవనాడికి ఇబ్బందులు కలిగిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్‌ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.

polavaram 02062018 2

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.1089 కోట్లను రీయింబర్స్‌ చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ లిఖిత పూర్వకంగా వెల్లడించింది. రెండుసార్లు అధికారికంగా సమాచారం పంపినందున ఒకటి రెండురోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ నుంచి రూ.1089 కోట్ల నిధులు పీపీఏకు చేరుతాయని రాష్ట్ర జల వనరులశాఖ ఆశించింది. కానీ, అంతలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, నాబార్డుల మధ్య కుదిరిన మొమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఏంవోఏ)లో కొద్దిపాటి సవరణలు చేసుకోవాల్సి ఉందంటూ నాబార్డు పేర్కొంది. ఈ ఫైళ్లకు మోక్షం కలిగితే తప్ప.. మార్చి నెలలో విడుదల కావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తం విడుదల కాదు. ఇప్పటకీ ఆ నిధులు వదల్లేదు...

polavaram 02062018 3

దీంతో మన అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ప్రాజెక్టులపై సమీక్ష పేరిట కేంద్ర జలవనరుల శాఖ ఈనెల 11న ఏర్పాటు చేసిన భేటీకి హాజరు కాకూడదని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర అధికారి ముఖాన సూటిగా చెప్పేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమీక్షకు హాజరు కావాలని కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారికి ఫోన్‌ చేశారు. దీనిపై రాష్ట్ర అధికారి తీవ్రంగా స్పందించారు. ‘‘పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్రం మాటలు చెబుతోంది. ఏపీ నుంచి పంపిన ప్రతి ఫైలునూ వెనువెంటనే క్లియర్‌ చేసేస్తున్నామని పేర్కొంటోంది. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. గత 6 నెలలుగా పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క పైసా విడుదల కాలేదు. "

"2017-18 సంవత్సరానికి రావాల్సిన రూ.1089కోట్ల రీయింబర్స్‌ చేయలేదు. ఆ తర్వాత విడుదలైన రూ.1400కోట్లు, రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సిన మరో రూ.350 కోట్లు కూడా రాలేదు. వీటిని విడుదల చేసినట్లు కాగితాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కొత్త ఒప్పందాలంటూ నాటకాలు ఆడుతున్నారు. పోలవరం తుది అంచనాలు ఇంత ఎక్కువైతే ఎలా అని సీడబ్ల్యూసీ ప్రశ్నిస్తోంది. సాంకేతిక అంశాలను పరిశీలించాల్సిన సీడబ్ల్యూసీకి.. భూ సేకరణ చట్టం, సహాయ పునరావాస కార్యక్రమాల గురించి ఏం పని?’’ అని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారి ఒకరు కేంద్ర అధికారిని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ‘ఈ సమావేశానికి మేమెందుకు రావాలి? మీరు చెప్పే హరికథలను వినడానికి రావాలా? మీ మాటలు విని సంబరపడాలా’ అని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read