జూన్ 16న, ప్రధాని మోడీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుస్తారా ? చంద్రబాబు వెళ్తారో లేదో కాని, మోడీ మాత్రం అందరి ముఖ్యమంత్రులను జూన్ 16న, కలుద్దాం రండి అంటున్నారు. ఆర్థిక అంశాల పై వివిధ రాష్ట్రాల నుంచి తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో వచ్చే నెల 16వ తేదీన ఢిల్లీలో నీతి అయోగ్ కీలక సమావేశం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశ అజెండా అంశాలను కూడా రాష్ట్రాలకు పంపించారు. ఈ ఆహ్వానంలో ప్రధానంగా సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా స్పందించడం విశేషం. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. 2022 సంవత్సరం వరకు అభివృద్ధి అనే అంశం పై కొన్ని రంగాల పై చర్చించనున్నారు.

modi cbn 29052018 2

మూడో విడత నీతి ఆయోగ్ సమావేశాల్లో చర్చించిన అంశాల పై తీసుకున్న చర్యలపై ముందుగా ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం వ్యవసాయ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడం పైనా చర్చ ఉంటుంది. ఇ-నామ్, భూసార ఆరోగ్య పరీక్షలు, గ్రామీణ వ్యవసాయ పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం, జల సంరక్షణపై ఉపాధి హామీ ప్రభావం పైనా చర్చిస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వాస్య సురక్ష మిషన్ గురించి అజెండాలో పొందుపరిచారు. కీలక అవసరాలున్న జిల్లాలకు అందించాల్సిన ప్రత్యేక సాయం, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్ర ధనుష్ సహా మహాత్మాగాంధీ 150 జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల సలహాలు తీసుకోనున్నారు.

modi cbn 29052018 3

కేంద్ర రాష్ట్రాల మధ్య ఇటీవల సన్నగిల్లుతున్న సత్సం బంధాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర, తూర్పు రాష్ట్రాలు కేంద్రం పై విరుచుకుపడుతున్నాయి. సహకార సమాఖ్య విధానానికి కేంద్రం తూట్లు పొడుస్తోందన్న ఆందోళన ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. కేవలం కొన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం మిగిలిన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదనే అసంతృప్తిని రాష్ట్రాలు వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితి పై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు సహకార సమాఖ్య విధానం పైనే ఎక్కువగా స్పందించడం, దీని పైనే కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజెపికి ఎదురుదెబ్బ తగలడం, ఇతర రాష్ట్రాల్లో కూడా అసంతృప్తి పెరుగుతుండడంతో కేంద్రం దిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగో నీతి అయోగ్ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రం సహకార సమాఖ్య విధానానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్రాలకు రాసిన ఆహ్వాన లేఖలో పేర్కొనడం విశేషం.

పోలవరం ప్రాజెక్ట్ పై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం డబ్బులు టైంకి ఇవ్వకపోయినా, సొంత బడ్జెట్ తో పనులు పూర్తి చేస్తుంటే, మరో పక్క ప్రాజెక్ట్ పూర్తి కాకుండా వెనక్కు లాగుతున్నారు. ఇప్పటికే సవరించిన అంచనాలు, కొన్ని డిజైన్ లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. డబ్బులు ఇవ్వటం కోసం, కేంద్రం నెలలకు నెలలు టైం తీసుకుంటుంది. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ లో మూసేసిన కేసులు రీ ఓపెన్ చేస్తున్నారు. దాంతో పాటు, కొత్త కేసులు కూడా వేస్తున్నారు. అన్ని విధాలుగా, ప్రాజెక్ట్ ఆపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ కారణంగా మత్స్యకారుల జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని, నష్టపరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విచారణకు స్వీకరించింది.

polavaram 29052018 2

నాగేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ జావేద్‌ రహీంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణం కారణంగా నదీ ప్రవాహాన్ని మళ్లించారని తద్వారా మత్స్యకారులకు చాలా నష్టం వాటిల్లుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రగ్యా సింగ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకోచ్చారు. కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 31కి వాయిదా వేసింది. అయితే ఈ ఆరోపణల పై పోలవరం అథారిటీ స్పందించింది, ఎలాంటి ఆటంకం ఉండదని, అన్ని విషయాలు గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరిస్తామని చెప్పారు. మరో పక్క, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సవాల్ చేస్తూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, పునరావసం, పరిహారం ఇవ్వకుండా, ఎగువ రాష్ట్రాల అంగీకారం లేకుండా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని పిటిషన్ల వేసారు.

polavaram 29052018 3

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తెలిపారు. పిటిషన్ స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేశాయి. జూలై మూడో వారానికల్లా సమాధానం చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగు నీరు, విశాఖ పట్నానికి తాగునీరు, పారిశ్రామిక జల అవసరాలు తీర్చాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ల విషయంలో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, ఎవరు ? ఇవి ఎవరు చేపిస్తున్నారు అనే విషయం ఇప్పటికే ప్రజలకు తెలిసినా, వెళ్ళు ఇంకా ఇంకా దిగజారి రాజకీయం చేస్తున్నారు.

ఇప్పుడు జిల్లాలకు, వ్యక్తుల పేర్లు పెట్టే ట్రెండ్ నడుస్తుంది.. ఆ వ్యక్తి మీద ప్రేమతో కాదు, ఆ వ్యక్తి కులం ఓట్లు కోసం.. ఈ ట్రెండ్ తీసుకువచ్చింది మన ఘనత వచించిన ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాను అంటూ, ఆయా సామాజిక వర్గాల ఓట్లు కోసం, దిగాజారుడు రాజకీయం చేస్తున్నాడు జగన్... ఇప్పుడు, ఇదే జగన్ బాటలో, నడుస్తుంది అన్నగారి కూతురు,కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు అన్నగారి పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ.రామారావు పుట్టిన కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు... ఆ జగన్ కంటే బుద్ధి లేదు కాబట్టి అలా అన్నారు, మరి పురంధేశ్వరి గారికి ఏమైంది ?

purandheswari 28052018 2

ఎన్టీఆర్ ఒక జిల్లాకు పరిమితమైన నేతా ? ఇలా మాట్లాడుతూ, పురంధేశ్వరి గారు, ఏమి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ? చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఆ మహా నాయకుడుని, ఒక జిల్లాకు పరిమితం చెయ్యటం ఏంటి ? ఇది మీకు చాలా అనుకూలం కాబట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి ఇలా అంటున్నారు. మరి, ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పై, ఎందుకు మాట్లాడ లేదు ? కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వమని ఎందుకు అడగరు ? మీ స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఎందుకు అడగరు, పురంధేశ్వరి గారు ?

purandheswari 28052018 3

ఇది పక్కన పెట్టండి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా, రాజశేఖర్ రెడ్డి అంత అవమానం చేస్తే, ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ఏమి చేసారు ? అయినా, సొంత తండ్రిని అడ్డం పెట్టుకుని, ఈ చెత్త రాజకీయాలు ఏంటి ? ఆ జగన్ మోహన్ రెడ్డి కంటే, రాజకీయం తప్ప ఏమి అవసరం లేదు, మరి మీరు కూడా అంతేనే ? ఎలాగూ జగన్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి, ఇప్పటి నుంచి, జగన్ చెప్పిన మాటలు పలుకుతూ, మీ తండ్రినే అవమాన పరుస్తున్నారా ? మీకు అంత ప్రేమ ఉంటే, మీ అమిత్ షా, మోడీ తో లాబీయింగ్ చేసి, ఆ మాహానుభావుడికి, భారత రత్న ఇప్పించింది...

చంద్రబాబు ఎన్డీయే నుంచి వెళ్ళిపోవటం పై, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పొతే పోనివ్వండి అన్నట్టు మాట్లాడుతుంటే, వాళ్ళ పార్టీ సీనియర్ నాయుకులు మాత్రం, వేరే విధంగా స్పందిస్తున్నారు.. నిన్న అమిత్ షా మాట్లాడుతూ, చంద్రబాబు ఏమన్నా పెద్ద లీడరా ? మిగతా రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేస్తే, ఎవరన్న చంద్రబాబు మాట వింటారా ? ఒరిస్సా వెళ్లి చంద్రబాబు ప్రచారం చేస్తే మాట వింటారా ? అంటూ చంద్రబాబు పై ఎగతాళిగా మాట్లాడారు.. అంతే కాదు, అమరావతి పై, నిధుల పై, UCల పై కూడా అమిత్ షా స్పందిస్తూ, అసలు అమరావతిలు ఏమి ఉంది ? మేము ఇచ్చిన దాంట్లో పైసా ఖర్చు పెట్టలేదు.. UCలు ఇవ్వలేదు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ, చంద్రబాబు అసలు ఒక నాయకుడే కాదు, అన్నట్టు స్పందించారు..

rajnadh 29052018 2

ఇది ఇలా ఉంటే కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌ మాత్రం, మరో రకంగా స్పందించారు. ‘‘ఎన్డీయే నుంచి తెలుగు దేశం పార్టీ వైదొలగి ఉండాల్సింది కాదు. అది సంతోషించదగిన పరిణామం కాదు. చంద్రబాబు బయటికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది’’ అని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎకనామిస్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘ఎన్డీయేలోని పార్టీలు బీజేపీ వైఖరిపట్ల సంతృప్తితో లేవు. శివసేన తొలి నుంచి వ్యతిరకేతతో ఉంది. ఇటీవల టీడీపీ కూడా బయటికి పోయింది. వాజపేయి హయాంలో ఇప్పుడు లేదు. ఎందుకిలా?’ అని ప్రశ్నించగా... ‘‘ఆ పార్టీలపై కొన్ని ఒత్తిళ్లు ఉండవచ్చు. కానీ అవేమంత పెద్దవి కాదు. ప్రతీ కుటుంబంలో ఇలాంటివి జరుగుతాయి’’ అని తెలిపారు.

rajnadh 29052018 3

ఒక పక్క అమిత్ షా, రాం మాధవ్, జీవీఎల్ లాంటి నాయకులు, చంద్రబాబు పై విరుచుకు పడుతుంటే, చంద్రబాబు వెళ్ళిపోవటం వల్ల, ఎంతో మంచి జరిగింది అని చెప్పుకుంటుంటే, రాజ్‌నాథ్‌ సింగ్ మాత్రం, చంద్రబాబు వెళ్ళిపోవటం సంతోషించదగిన పరిణామం కాదు అంటూ, చంద్రబాబు ఎలాంటి నాయకుడో చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో, బీజేపీకి ఎలాగూ మెజారిటీ రాదు... ప్రాంతీయ పార్టీలు అవసరం ఎంతో ఉంటుంది. మరో పక్క అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్న తరుణంలో, మమత లాంటి నేతలే, చంద్రబాబుని ఆ ఫ్రంట్ కు నేతృత్వం వచించమని కోరుతున్నారు. ఈ పరిణామాలు, బీజేపీకి ఎంతో ఇబ్బంది అని తెలిసినా, కొంత మంది బీజేపీ నాయకులు మాత్రం, పైకి బిల్డ్ అప్ ఇస్తున్నారు.. సంవత్సర కాలం ఉంది, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నవి ఇచ్చేస్తే, చంద్రబాబు మన వెంటే ఉంటారు అనే స్పృహ మాత్రం, ఒక్క బీజేపీ నాయకుడుకి లేదు.. పవన్, జగన్ లాంటి నేతలతో, కులాల కుంపటి రగిలించి, లబ్ధి పొందటానికి చూస్తున్నారు..

Advertisements

Latest Articles

Most Read