పవన్ కళ్యాణ్ ను, బీజేపీ నడిపిస్తుంది అనే ప్రచారం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉంది.. పవన్ తీరు కూడా, ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.. ప్రత్యెక హోదా పై ప్రధాని మోడీని ఒక్కటంటే ఒక్క మాట అనకపోవటం, నాలుగేళ్ళు చంద్రబాబుని ఆహా ఓహో అని, రాత్రికి రాత్రి చంద్రబాబుని తిడుతూ, మోడీ నాకు ఆదర్శం అని చెప్పటం, అవిశ్వాస తీర్మాన సమయంలో నేషనల్ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరచటం, ఇలా అనేక ఉదహారణలు, పవన్ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు అని ప్రూవ్ చేసాయి... ఇప్పుడు కూడా, చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేసి, మోడీని ఎండగడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, ఎందుకు అలా చేస్తున్నారు అంటూ హడావడి చేస్తున్నారు.. మరో పక్క విజయసాయి రెడ్డి కూడా, ఇలాగే మోడీ పై ఈగ కూడా వాలనివ్వటం లేదు...

somu 24052018 2

ఇప్పుడు మరో సారి, పవన్ బీజేపీకి ఎంత దగ్గరగా ఉన్నారో, తెలియచేస్తూ, సోము వీర్రాజు, తాజాగా చెప్పారు... ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్ మా లైన్ లో నే ఉన్నాడు అంటూ, కుండ బద్దలు కొట్టారు.. మా ఉమ్మడి శత్రువు చంద్రబాబు అని, అందుకోసం కలిసి పని చేస్తామని అన్నారు.. పవన్ కల్యాణ్ స్పందించే తీరు, మా బీజేపీ ఆలోచనకు దగ్గరగా ఉందని, ఇది శుభ పరిణామం అంటూ, సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ మా అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగానే టీడీపీ పాలన పై స్పందిస్తున్నారని, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.

somu 24052018 3

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న సందేహాలను నివృతి చేసి, ఆయనకు నచ్చజెప్పే బాధ్యత తనకు గానీ, మరే ఇతర బీజేపీ నేతలెవరికైనా అప్పజెపితే తాను సందర్భం వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేస్తామని ఇంటర్వ్యూలో సోము వీర్రాజు చెప్పారు. జనసేనతో పొత్తు విషయమై స్పందిస్తూ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని సోము వీర్రాజు కామెంట్ చేశారు.. వాటికి ఇంకా టైం ఉందని, చంద్రబాబు మాకు ఉమ్మడి శత్రువు అయినప్పుడు, కలిసి పని చేస్తే తప్పు ఏమి లేదని అన్నారు.. మొత్తానికి, పవన్ కళ్యాణ్, బీజేపీ లైన్ లో, బీజేపీ ఆలోచనలకు తగ్గాటే ఉన్నారని సోము వీర్రాజు చెప్పారు.. ఇప్పుడు ప్రజలకి అర్ధమైంది, పవన్ పై మోడీని ఒక్క మాట కూడా ఎందుకు అనటం లేదో... https://youtu.be/ax9-OKQV4rA

గత మూడు రోజుల నుంచి, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, అక్కడ ఉన్న కిడ్నీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ, అసలు ప్రభుత్వం ఏమి చెయ్యటం లేదని, చంద్రబాబుకు ఇంగితం లేదు అని, మానవత్వం లేదని, ఇలా కొన్ని సినిమా డైలాగులతో, సీన్ పండించారు... శ్రీకాకుళంలో సమస్య ఇప్పటిది కాదు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కడ సమస్య గురించి ఎన్నో రీసెర్చ్ లు చేసారు, చేస్తున్నారు.. అలాగే, అక్కడ ఇప్పటికే జబ్బు బారిన పడినవారికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు... ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ హార్వర్డ్ నుంచి కొంత మంది డాక్టర్ లను తీసుకువచ్చి, ప్రభుత్వానికి ఎదో నివేదిక ఇచ్చారు.. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న పరిస్థితుల పై అధ్యయనం చేస్తున్నారు... ఇన్ని జరుగుతున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం, ఒక నాలుగు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు వచ్చి, నాలుగు డైలాగులు కొట్టి, చంద్రబాబుకి ఇంగితం లేదు అనే స్థాయికి మాట్లాడుతున్నాడు...

lokesh pk 23052018 2

నిజానికి పవన్ ఆపరేషన్ గరుడలో, బీజేపీ పావు అని, అతనకి అనవసర ప్రాధాన్యత ఇచ్చి, అతను మాట్లాడే మాటలకు రియాక్ట్ అవ్వద్దు అని, జగన్ లాగే, ఇతన్ని కూడా వదిలేయమని టిడిపి నాయకులకు ఆదేశాలు వెళ్ళాయి.. అయితే, పవన్ మరీ దిగాజారి, ఆరోపణలు చెయ్యటం, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉండటంతో, లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు... ఇవి లోకేష్ ట్వీట్లు... "పవన్ కళ్యాణ్ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు... కిడ్నీ సమస్య ఉన్న పలాస,వజ్రపు కొత్తూరు,కవిటి,సోంపేట,కంచిలి,ఇచ్ఛాపురం,మందసా ల్లో సుమారుగా 16 కోట్ల నిధులతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసాం... వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతుంది..."

lokesh pk 23052018 3

"136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం.ఇందులో 109 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు పూర్తి అయ్యింది. మరో 27 యూనిట్స్ ఈ నెలాఖరుకి పూర్తి కాబోతున్నాయి... ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైయాలిసిస్ సెంటర్లలో డైయాలిసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 2500 రూపాయిల పెన్షన్ అందిస్తున్నాం... 4 నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి,ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా స్క్రీనింగ్ జరిగింది.సోంపేట లో ఎన్టీఆర్ వైద్య పరీక్షల్లో భాగంగా నూతన ల్యాబ్ ఏర్పాటు చేసాం... ప్రజలకు అందుబాటు లో ఉండేలా పలాస,సోంపేట,పాలకొండ లో 3 రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసాం ఇప్పటి వరకూ 64,816 సెషన్స్ ఈ సెంటర్లలో జరిగాయి... డయాలసిస్ సెంటర్లకు వచ్చే ఖర్చులు కూడా లేకుండా చంద్రన్న సంచార వాహనాలు ఏర్పాటు చేసి డయాలసిస్ తో పాటు ఇతర సేవలు అందిస్తున్నాం... జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్టేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాల పై పరిశోధన,వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యల పై అధ్యయనం ప్రారంభం అయ్యింది... ఒక నిర్ణయానికి వచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను బేరీజు వేసుకోవాలి అని పవన్ కల్యాణ్ గారిని కోరుతున్నాను.." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.. పవన్ కళ్యాణ్, ఇవన్నీ అబద్ధం అయితే, ఎలాగూ శ్రీకాకుళంలోనే ఉన్నాడు కాబట్టి, వీటి పై ప్రజలను అడిగి, నిజమో కాదు తెలుసుకుని, స్పందిస్తే మంచింది...

నోటికి ఏది వస్తే అది.. మంచి చెడు... ఉచ్చం, నీచం, మర్చిపోయి, గత కొన్ని రోజులగా A2 విజయసాయి రెడ్డి ఎలా పెలుతున్నాడో చూస్తున్నాం... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుని, నువ్వు ఒకే అమ్మకు, అబ్బకు పుట్టావా అంటూ, ఎంత చౌకబారు మాటలు మాట్లాడాడో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.. తన వయసుని కూడా పక్కన పెట్టి, వక్ర బుద్ధితో సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.. ఇప్పుడు తాజగా, మరో చౌకబారు ఆరోపణలు చేసాడు.. ఇందాకా చెప్పుకున్నట్టు, వీళ్ళ రాజకీయానికి ఉచ్చం, నీచం, మర్చిపోయి, చివరకు వెంకన్న విషయంలో కూడా పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు... తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ విజయసాయి అన్నారు..

lokesh 23052018 2

ఇంతటితో ఆగలేదు...12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయి అంటూ వ్యాఖ్యలు చేసారు.. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, తన నీచ్ఛ రాజకీయం కోసం, దేవుడితో ఆటలు ఆడుతున్నాడు.. ఈ పిచ్చ వాగుడు పై, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించారు.. తన సహజ శైలికి భిన్నంగా, చాలా అంటే చాలా ఘాటుగా, విజయసాయి రెడ్డిని లాచి కొట్టినట్టు, సమాధానం చెప్తూ, తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు లోకేష్...

lokesh 23052018 3

ఇది లోకేష్ ట్వీట్ "గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ,లోటస్ పాండ్, యలహంకా కోటలో ఉన్న నేలమాళిగల్లో నుండి సిబిఐ తవ్వి తీస్తుంది. ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2 లు పోరాటం చేస్తున్న టీడీపీ పై బీజేపీ తో కలిసి క్విడ్ ప్రో కో రాజకీయాలకు తెర లేపారు.గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు. " అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.. రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇలాగే ట్విట్టర్ లో చురకలు అంటించారు... దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి, ఇలాగే సమాధానాలు చెప్పాలి...

అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరి ట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు. ‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

alla 23052018 2

రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.

alla 23052018 3

ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి.

Advertisements

Latest Articles

Most Read