రాష్ట్రంలో శాంతి బధ్రతలకు విఘాతం కలిగించటానికి, ప్రజల్లో ఆందోళన కలిగించటానికి, ఒక అనిశ్చితి పరిస్థితి నెలకొల్పటానికి, గత కొన్ని రోజులుగా, కొన్ని పక్షాలు చెయ్యని పని లేదు... ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్స్ అప్, ఉపయోగించుకుని, పల్లెల్లో ఉన్న వారకి కూడా విష ప్రచారం ఎక్కించేస్తున్నారు... తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి, పల్లెల్లో ఉన్న వారికి, ఈ సైకో గ్యాంగ్, భయంకరమైన ప్రచారం చేస్తుంది... పార్ధీ గ్యాంగ్‌ కదలికలు ఉన్నాయని అసత్య ప్రచారాలు సోషల్‌ మీడియాలో ప్రచారం చూసి, ప్రజానీకం భయ భ్రాంతులకు గురి అవుతున్నారు... మొన్న చిత్తూరు జిల్లా, నిన్న ప్రకాశం, నేను కృష్ణా జిల్లా, ఎక్కడ చుసినా పల్లెల్లో ఇదే ఆందోళన.. ప్రజానీకం భయ భ్రాంతులకు గురై వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా రోడ్లు వెంట యువకులు కాపలా కాస్తున్నారు.

vadantulu 21052018 2

అనుమానంగా తెలుగు భాష రాని వ్యక్తులు కనబడితే చితక బాదుతున్నారు. అదే క్రమంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళేవారు తిరుగుతున్నారని అపోహలతో అట్టడుకి పోతుంది. పిల్లలను ఎత్తుకెళ్ళి, అవయవాయలు కోసేసి, అమ్ముకుంటున్నారు అని, కొన్ని ఫోటోలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు... గ్రామాలలో ఎస్సైలు తమ సిబ్బందితో పల్లె నిద్ర చేసి గ్రామస్తులకు అసత్య ప్రచారాలపై అవగాహన కల్పిస్తు న్నారు. అన్ని గ్రామాల్లో పోలీసులు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయడంతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాన్ని పూర్తి చేసేందకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగి ప్రశాంతంగా నిద్రపోవడం ప్రారంభించారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల అనేక మంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

vadantulu 21052018 3

ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎస్సై తమ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, మహిళలను సమావేశ పరిచి వదంతులు నమ్మవద్దని చెబుతున్నారు. అంతే కాకుండా ఆ రాత్రంతా ఆ గ్రామంలో పోలీసులు నిద్రపోవడంతో గ్రామస్తుల్లో ఆత్మ స్థయిర్యం పెరిగింది. సోషల్‌ మీడి యాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అలాంటి విషయాలు ప్రచారం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వివరిస్తున్నారు. మూడురోజులుగా పోలీసులు చేస్తున్న యత్నాలు ప్రజల్లో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. వారం రోజులుగా కంటిమీద కునుకు లేని పల్లెలు ప్రశాంత వాతావరణంలోకి చేరుకున్నాయి.

అలిపిరి అయినా, అమెరికా అయినా, ఆంధ్రోడు అంటే, బీజేపీ నేతలు భయపడుతున్నారు.. మాకు అన్యాయం జరిగింది, చూడండి అంటే, వీరి అహంకారపు మాటలు, ఆంధ్రుడికి మరింత ఆగ్రహం తెప్పిస్తుంది... మీకు అన్నీ ఇచ్చేసాం అని ఒకడు... మీకు ఇదే ఎక్కువ అని ఒకడు... మీకు మయసభ కావాలా అని ఒకడు.. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు, అహంకారపు మాటలతో ఆంధ్రా వాడిని చులకన చేసి మాట్లాడుతున్నారు.. దీని పర్యవసానమే, అమిత్ షా లాంటి నేతకు కూడా అలిపిరిలో, తీవ్ర నిరసన... చివరకు మా అమిత్ షా మీద దాడి చేసారు అని చెప్పుకుని, సింపతీ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి... మొన్నటికి మొన్న, అమెరికా వెళ్ళిన జీవిఎల్ నరసింహరావుకు కూడా, అక్కడ ప్రవాసాంధ్రులు నిరసనల స్వగతం పలికారు...

rammadhav 21052018 2

మాకు అన్యాయం జరిగింది, మా సంగతి ఏంటి అని అడిగినప్పుడు, మేము ఇది చేసాం, మేము అది చేసాం అని జీవీఎల్ చెప్తుంటే, అక్కడ ఉన్న ఆంధ్రులు అబద్ధాలు చెప్పవద్దు, మేము విసిగిపోయాము అని చెప్పి, అక్కడ నిరసన తెలియచేసారు.. ఇప్పుడు అమెరికా వచ్చిన రాం మాధవ్ వంతు... దక్షిణాది దండ యాత్ర మొదలైంది, ఇక కాచుకోండి, అని కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే, హడావిడి చేసిన రాం మాధవ్, అమెరికాలోని విర్జినియా నగరానికి వచ్చారు.. ఈ సందర్భంగా అక్కడ ఆంధ్రావారు, రాం మాధవ్ మీటింగ్ జరుగుతున్న ఆడిటోరియం దగ్గరకు వెళ్లారు..

rammadhav 21052018 3

అయితే, అక్కడ ఉన్న కొంత మంది బీజేపీ నేతలు, మీరు తెలుగుదేశం వారు, మిమ్మల్ని లోపలకి పంపించము అని అడ్డుకున్నారు... మేము తెలుగుదేశం కాదని, ఆంధ్రా వారిమని, మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు, తెలుగుదేశం వారు ఎలా అవుతారని, మేము రాం మాధవ్ ను కలిసి, మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, సాటి తెలుగువాడిగా ఆయనకు చెప్తామని ఎంత చెప్పినా, అక్కడ బీజేపీ వారు వినలేదు.. ఇది ఓపెన్ ఈవెంట్ కదా, ప్రతి భారతీయుడు రమ్మని, ఆహ్వానం పంపారు కదా అని చెప్పినా, అక్కడ పోలీసుల చేత అడ్డుకున్నారు... అయితే మన వారు అక్కడే బయట ఉండి, నిరసన వ్యక్తం చేసారు... బీజేపీకి ఆంధ్రా వాడు కనిపిస్తుంటే భయం వేస్తుందని, జరిగిన అన్యాయం గురించి అడిగితే, సమాధానం చెప్పలేక పారిపోతున్నారని, కనీసం లోపలకి కూడా రానివ్వటం లేదు అంటే, రాం మాధవ్ కు ఆంధ్రా వాళ్ళు అంటే ఎంత భయమో అర్ధమవుతుంది అని, అక్కడ ప్రవాసాంధ్రులు అన్నారు.. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా, బీజేపీ నాయకులకు ఆంధ్రోడి సెగ తగులుతుంటే, తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

తిరుమలలో ఒక వర్గం కుట్ర పన్ని చేస్తున్న ఆరోపణల పై ముఖ్యమంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులు ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న కొన్ని ముఖ్యాంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు 65 ఏళ్లకే పదవీవిరమణగా నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల్లో రేగిన అలజడిని, అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేసే నిర్ణయాలు వెల్లడించింది. రాష్ట్రంలోని అర్చకులందరికీ రిటైర్మెంట్‌ వర్తించదని, పే స్కేలు అమలుచేస్తూ, పెన్షన్లు ఇస్తున్న 11 పెద్ద ఆలయాల్లోని వారికే ఇది పరిమితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీటీడీ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే టీటీడీలో రిటైర్మెంట్‌ విధానం అమలు చేసినట్లు పేర్కొంది. అర్చక సంక్షేమం, వారికి సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్షించారు.

cbn tirumala 20052018 2

విజయవాడలో అర్చక సంక్షేమ భవన్‌ నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అర్చకుల వారసత్వ హక్కు సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. రూ.2లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలపై దేవదాయశాఖ నియంత్రణ లేకుండా అర్చకులు, దాతలకే వదిలేసే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకే పదవీ విరమణ వయసు వర్తిస్తుందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత వారికి రూ.4లక్షలు గ్రాట్యుటీ వస్తుందన్నారు. దాతలు భూ సదుపాయం కల్పించిన ఆలయాలకు, కాంట్రాక్టు అర్చకులకు రిటైర్మెంట్‌ వర్తించదన్నారు. ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్‌, దేవదాయ కమిషనర్‌ అనూరాధ పాల్గొన్నారు.

cbn tirumala 20052018 3

అర్చక సంక్షేమ నిధి నుంచి వేతనాలు... సుప్రీం కోర్టు ఉత్తర్వులు, 2014 డిసెంబరులో ప్రభుత్వం ఇచ్చిన జీవో 417 ప్రకారం రూ.250 కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఆ వడ్డీతో 1680 మంది ధార్మిక సిబ్బందికి కొందరికి రూ.10 వేలు, మరికొందరికి రూ.5 వేలు వేతనాలు చెల్లిస్తున్నాం. రూ.50 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాటిలో 1400 చోట్ల ధూపదీప నైవేద్యం పథకం కింద ఖర్చులు ఇస్తున్నాం... అర్చకులందరినీ చంద్రన్న బీమా కిందకు తీసుకొచ్చాం. వారు బీమా వసతి పొందుతున్నారు. అర్చక అకాడమీ ఏర్పాటైంది. సిలబస్‌ సిద్ధమయింది. పరీక్షలు నిర్వహించనున్నారు... చిన్న ఆలయాల్లో అర్చకులకు జీతాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన సిబ్బందికి జీతాలు ఇవ్వాలనే నిబంధన పెట్టాం. ప్రతి చోట అసిస్టెంట్‌ కమిషనర్‌లు మచ్చుకు తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలి. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న చోట ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అదనపు హుండీలు ఏర్పాటు చేయవద్దని సయితం ఆదేశించాం.

సీఆర్‌డీఏ ప్రతినిధులకు అరుదైన గౌరవం లభించింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రఖ్యాత ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ముందుకొచ్చింది. అమరావతిలో ఇటీవల నిర్వహించిన ‘సంతోష నగరాల సదస్సు’ దరిమిలా జరిగిన ముఖ్య పరిణామంగా దీనిని భావిస్తున్నట్టు సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ప్రొఫెసర్లు ప్రస్తుతం ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు’కు రూపకర్తలుగా ఉన్నారు. ఆర్థిక, రాజనీతి, వాణిజ్య శాస్త్రాలకు సంబంధించి ‘ఎల్ఎస్ఈ’ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. ఈ స్కూలులో ముఖ్య విభాగం ఉన్న ‘ఎల్ఎస్ఈ సిటీస్’ నగర, పట్టణీకరణకు సంబంధించిన అనేక అంశాలపై నిరంతర పరిశోధనలు జరుపుతుంది.

amaravato2005218 2

అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఈ స్కూల్ ఆసక్తిగా ప్రదర్శిస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి చెప్పారు. అభివృద్ధి, ఆర్థిక వనరులు, భవిష్యత్ రవాణా వ్యవస్థ తదితర అంశాలపై ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ విద్యార్థులు రెండు నెలల పాటు అధ్యయనం చేయడానికి వస్తున్నట్టు తెలిపారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అక్కడ తమ విద్యార్థులకు లెక్చర్ ఇవ్వడానికి సీఆర్‌డీఏ తరఫున నలుగురు ప్రతినిధులకు ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ఆహ్వానం పంపిందని చెప్పారు. జూన్ 4 నుంచి 8 వరకు వీరక్కడ లెక్చర్లు ఇవ్వనున్నారని తెలిపారు. అలాగే, ఆగస్టులో ‘ఎల్ఎస్ఈ సిటీస్’ విద్యార్థులు అమరావతి సందర్శిస్తారని, రెండు నెలల పాటు ఇక్కడ అధ్యయనం చేస్తారని వివరించారు. కొసమెరుపు ఏంటి అంటే, ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ లో, మన ప్రతిపక్ష నేత కూతురు చదువుతుంది.

amaravato2005218 3

వచ్చే నెలలో ‘డెవలపర్స్ కాంక్లేవ్’.. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటివారంలో అమరావతిలో ‘రియలెస్టేట్ డెవలపర్స్ కాంక్లేవ్’ జరగనున్నది. ఈ సదస్సులో పలు, జాతీయ, అంతర్జాతీయ రియలెస్టేట్ సంస్థలు పాల్గొంటున్నట్టు సీఆర్డీయే కమిషనర్ చెప్పారు. డీఎల్ఎఫ్, ఆర్ఎంజెడ్, మైహోమ్, మహీంద్రా లైఫ్ స్పేసెస్, అపర్ణ కనస్ట్రక్షన్స్, సాలార్‌పురియా సత్వా, దివ్యశ్రీ, షాపూర్జీ, పల్లోంజీ తదితర సంస్థలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం ఇచ్చాయని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read