కర్ణాటకలో అమిత్ షా, మోడీ చేస్తున్న దారుమైన ప్రజాస్వామ్య ఖూనీ అడ్డుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి సుప్రీమ్ కోర్ట్ మెట్లు ఎక్కింది. దీంతో కర్ణాటక రాజాకీయలు నేపధ్యంలో హైడ్రామా చోటు చేసుకుని. ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నరు ఆహ్వానించడం పై కాంగ్రెస్‌ సుప్రీం కోర్టుకెక్కింది. కోర్ట్ కి వెళ్ళకుండా రాత్రి 9 గంటలకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి, ఉదయం 9:30కి ప్రమాణస్వీకారం చేస్తున్నారని, అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కాంగ్రెస్‌ సీనియరు నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టును కోరారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం రాత్రి 11:47 గంటలకు అత్యవసరంగా ఓ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై అప్పటికప్పుడే వాదనలు వినాలని అభ్యర్థించింది. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనుసింఘ్వి, వివేక్‌ తనఖా, పార్టీ లీగల్‌సెల్‌కు చెందిన లాయర్లు- కృష్ణ మీనన్‌ మార్గ్‌లో ఉన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నివాసానికి రాత్రి 12:28 గంటలకు చేరుకున్నారు.

supreme 17052018 2

కర్ణాటకలో ఓ అనైతిక ప్రభుత్వం కొలువుదీరబోతోందని, గురువారం ఉదయం 9:30కే ప్రమాణస్వీకారమని, దీన్ని తక్షణం ఆపాలని, సుప్రీం జోక్యం అనివార్యమని అభ్యర్థించారు. గవర్నర్‌ నిర్ణయం చెల్లదని ప్రకటించాలని, ఈ ప్రక్రియ నిలుపుచేయాలని అభిషేక్‌ మనుసింఘ్వి కోరారు. సీజే తొలుత విముఖత ప్రదర్శించినా తరువాత వెంటనే వాదనలు వినడానికి అంగీకరించారు. అర్ధరాత్రి 1:45కి ఆరో నెంబరు కోర్టులో విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. జస్టిస్‌ ఏకీ సిక్రీ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన బెంచ్‌కు ఈ వ్యవహారాన్ని కేటాయించారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంయుక్తంగా వేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజే దీనికి సంబంధించిన వాదనలను లిఖిత పూర్వకంగా వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

supreme 17052018 3

కోర్టులో న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఉన్నవారినే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని వాదనలు వినిపించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశమిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యవహారంలో గతంలో కోర్టు 48 గంటల సమయమే ఇచ్చిందని చెప్పారు. ‘‘కాంగ్రెస్-జేడీఎస్ ల బలం 116 మంది ఎమ్మెల్యేలు. బీజేపీ బలం 104. మరి గవర్నర్‌ ఎందుకు మెజారిటీ ఉన్న కాంగ్రె్‌స-జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు? గవర్నర్‌ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, సంప్రదాయ విరుద్ధం. ఈ నిర్ణయం చెల్లదని ప్రకటించాలి. మెజారిటీ ఉన్న కూటమి నేత హెచ్‌డీ కుమారస్వామిని ఆహ్వానించేట్లు గవర్నర్‌ను ఆదేశించాలి’’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా కోర్టు అడ్డుకోగలదా? అని కూడా అడిగింది. అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? అని ప్రశ్నించింది. గతంలో గవర్నరు చర్యను అడ్డుకున్న సందర్భముందని సింఘ్వీ సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన తీర్పులు గవర్నరుకు వ్యతిరేకంగా, ఆయనను అడ్డుకోవడానికి ఇచ్చినవి కావని కోర్టు అభిప్రాయపడింది. రెండు గంటలు వాదనలు విన్న కోర్ట్, గవర్నర్ అధికారాలని అడ్డుకోలేము అని, తేల్చి చెప్పింది. దీంతో ఈ రోజు ప్రమాణస్వీకారం ఏ అడ్డంకులు లేకుండా జరగనుంది... అయితే, కేసు ఇంకా డిస్మిస్ చెయ్యలేదు. రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు మళ్ళీ విననుంది. అంతకంటే ముందు, గవర్నర్ కు ఎడ్యురప్ప ఇచ్చిన లేఖ, ఎంత మంది మద్దతు ఉంది, ఇవన్నీ చూపించాలని సుప్రీం కోర్ట్ కోరింది. ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడే ఉంటుందని కోర్ట్ చెప్పింది.

ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వచ్చయి. ఇక దీన్ని పట్టుకుని బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు.. చూసారా, మీ చంద్రబాబు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా, మేము మీకు ఎంత చేస్తున్నామో, మా మోడీకి మీరు అంటే అంత ఇష్టం అంటూ ఊదరగొడుతున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం జిల్లా జంతలూరులో యూనివర్శిటీని నెలకొల్పేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ.902 కోట్ల వ్యయంతో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించనుందని, ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు..

bjp 16052018 2

యూనివర్శిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో యూనివర్శిటీని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. నిధులు విడుదల చేసే ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. అయితే, ఈ వార్తా పట్టుకుని, బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అయితే, దీని వెనుక ఉన్న వాస్తవం చూద్దాం.. ఇదేదో, బీజేపీ, మోడీ మన మీద ప్రేమతో ఇచ్చేది కాదు. ఇది రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో పలు కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇందులో భాగంగానే సెంట్రల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉంది.

bjp 16052018 3

దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా జంతలూరులో, 2015లోనే భూమి కేటాయించింది. దీని కోసం 1100 కోట్లు విలువ చేసే, 491.23 ఎకరాలు భూమి అప్పట్లోనే ఇచ్చింది. అంతే కాదు, ఈ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది.. కేంద్రం ముందుగా చెయ్యల్సింది, సెంట్రల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు. అప్పుడు కాని, యూనివర్సిటీ పెట్టటం కుదరదు. ఈ చిన్న పని, 4 ఏళ్ళు అయినా చెయ్యలేదు.. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ లో కేసు, ప్రజల ఆందోళన చూసి, కనీసం ఆ బిల్ అయినా పెట్టి, పనులు మొదలు పెట్టాలని చూస్తుంది. దీని కోసం, ఎదో చేసేసినట్టు, మనకి ఎదో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు హడావిడి చేస్తున్నారు. వీళ్ళు ఆ చట్టంలో సవరణ తెచ్చి, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలకు ఇస్తున్నట్టు డబ్బులి ఇస్తూ పొతే, ఇది కూడా మరో 50ఏళ్ళు పడుతుంది... దీనికి ఎదో చేసేసినట్టు బిల్డ్ అప్ ఇస్తారేంటి ?

12 ఓట్లతో గెలిచాను, ఇక నియోజకవర్గ సమస్యలు ఎందుకు అనుకున్నాడో ఏమో, పనీ పాట ఏమి లేనట్టు, ఎక్కడ లిటిగేషన్ ఉంటే, అది పట్టుకుని కేసులు వేసి, ఎప్పుడూ కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటా ఉంటాడు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి... అమరావతి మీద ఎన్ని కేసులు వేసాడో చూసాం, పేదలకు ఇచ్చే ఫైబర్ నెట్ మీద కేసులు, సాధావర్తి భూముల పై కేసులు వేసి, ప్రభుత్వానికి రూపాయ్ ఆదాయం రాకుండా చేసాడు... అయితే, ఇప్పుడు రివర్స్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పైనే కేసు వేసే పరిస్థితి వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి భాగోతాలు బయటకు లాగటానికి ఏసీబీ రంగంలోకి దిగింది.

alla 16052018 2

ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం, అంటే జనవరి 18, 2017లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఒకవైపు, ఏ కేసు నిమిత్తం వెళ్లినా లంచాలు తెమ్మని పీడిస్తారన్న ఫిర్యాదులు మరోవైపు వెల్లువెత్తడంతో, ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఇళ్లపై నేడు ఏసీబీ దాడులు చేసింది.

alla 16052018 3

గుంటూరు, ఒంగోలు, చీరాల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆయన, ఆయన బంధువుల ఇళ్ల పై ఏకకాలంలో దాడులు చేసారు. ఒక్క గుంటూరులోనే 11 చోట్ల 11 బృందాలు దాడులు చేయగా, భారీ ఎత్తున అక్రమాస్తులు, నగదు బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే , విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈయన వల్ల గతంలో ఇబ్బందులు పడినవారు, ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ఘరానా మోసాగాడిగా పేరు ఉన్న అధికారికి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ ఆస్తుల కేసులో దొరికాడని, ఏసిబి విచారణకు రమ్మంది. ఇలా అధికారులు, జగన్ పార్టీ ఎమ్మల్యేలు కలిసి, ఇంకా ఎన్ని బినామీ ఆస్థులు సంపాదించారో, ప్రభుత్వమే విచారణ చేసి బయట పెట్టాలి.

మొన్న అమిత్ షా పై నిరసన తెలిపితే, చించుకున్న బీజేపీ నేతలు, ఈ రోజు మన హక్కులు అడుగుతున్నందుకు, హీరో శివాజీ పై దాడి చేసారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీకి రాజీనామా చేసి, వైసిపీలో చేరిన, కన్నా లక్ష్మీనారాయణ విజయవాడకు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు బీజేపీ శ్రేణులు వచ్చాయి. ఇదే టైంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వద్దకు వచ్చిన శివాజీని చూసి ఆయనకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

sivaji 16052018 2

ఈ నేపథ్యంలో మోదీపై విమర్శలు చేస్తావా? అమిత్ షా ను విమర్శలు చేస్తావా ? మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటూ కొందరు భాజపా కార్యకర్తలు ఆయనపై దుర్భాషలాడుతూ అడ్డుకున్నారు. ఆయన కారును అడ్డుకొనే ప్రయత్నం చేశారు. శివాజీ కూడా కార్ కిందకు దిగి, అదే స్థాయిలో వారి పై తిరగబడ్డారు... నేను రాష్ట్రం ప్రయోజనాల కోసం అడుగుతున్నాని, అడుగుతూనే ఉంటానని, మీలాంటి ఉడత ఊపులకు భయపడను అంటూ శివాజీ కూడా వారికి సమాధానం చెప్పారు..

sivaji 16052018 3

నిన్ను చంపుతాం, ఇక్కడే పాతేస్తాం అంటూ, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళలేవు అంటూ, కొంత మంది కార్యకర్తలు శివాజీ పై దాడి చేసారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నటుడు శివాజీకి రక్షక కవచంగా నిలిచారు. అనంతరం ఆయనను కారులో పంపించేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే మొన్న అమిత్ షా పై కొంత మంది నిరసన తెలిపితే, మెము ఎంతో శాంత మూర్తులం అని బిల్డ్ అప్ ఇచ్చిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఏమి చెప్తారో మరి... అయినా, శివాజీ ఒక్కడే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు అడుగుతున్నారు... మోడీని నిలదీస్తున్నారు.. అందరినీ కొడతారా ?

Advertisements

Latest Articles

Most Read