కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నిబంధలకు విరుద్ధంగా గవర్నర్ వాజూభాయ్ వాలా నియమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్‌తో కూడిన కాంగ్రెస్ న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాతంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని తమ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీనిపై తక్షణ విచారణ జరపాలని న్యాయవాదుల బృందం ఆ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌ సీజేఐ కార్యాలయానికి చేరడంతో సీజేఐ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దీని పై విచారణ చేస్తామని చెప్పారు.

jds 19052018 3

2010లో ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించిన బోపయ్య అప్పట్లో యడ్యూరప్పపై విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా ఆయన వ్యతిరేక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, తద్వారా ఆయనకు అనూకూలంగా వ్యవహరించారని, అయితే బోపయ్య నిర్ణయాన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషన్‌లో న్యాయవాదుల బృందం పేర్కొన్నట్టు తెలుస్తోంది. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్‌పాండేకు బదులు మూడుసార్లు మాత్రమే ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేను, అందులోనూ గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ వాజూభాయ్ నియమించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

 

jds 19052018 2

బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ తీసుకున్ని నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరింది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు యడ్యూరప్ప బలపరీక్ష సమయంలో నిబంధనల ప్రకారం ప్రోటెం స్పీకర్ నిర్ణయం కీలకమవుతుంది. స్పీకర్‌కున్న అన్ని అధికారాలూ ప్రోటెం స్పీకర్‌కూ ఉంటాయి. ఇప్పటికే అమిత్ షా మోడీ అండతో, గవర్నర్ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. దీని పై సుప్రీం కోర్ట్ కూడా, మొట్టికాయలు వేసింది. అయినా సరే, మళ్ళీ ప్రోటెం స్పీకర్‌ విషయంలో నిబంధనలు తుంగలోకి తొక్కి, గవర్నర్ వ్యవహరించారు. మరి, తరువాత ఏమి అవుతుందో చూడాలి.

మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ అని, హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేసే పని చేసాడు పవన్... ఎప్పటిదో పాత రిపోర్ట్ తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారే లేరు, అంటూ ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మడు... అంతే కాదు, ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, లోకేష్ అవినీతి చేస్తున్నాడు అని చెప్పాడు పవన్... ఆధారాలు చెప్పండి అని అడిగితే, నా దగ్గర ఆధారాలు లేవు, ఎవరో చెప్తే విన్నాను, అదే మీకు చెప్తున్నాను అంటూ, గాల్లో ఆరోపణలు చేసి, గుడ్డ కాల్చి మొఖాన వేసాడు.. ఇలా చెప్పటం ద్వారా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని, ఇండస్ట్రియల్ సర్కిల్ లో చంద్రబాబు ఇమేజ్ ని పాడు చెయ్యవచ్చు అని, బీజేపీ ప్లాన్... కాని, అది జరగలేదు, తరువాత హీరో హోండా వచ్చి శంకుస్థాపన చేసింది, అశోక్ లేల్యాండ్ వచ్చి శంకుస్థాపన చేసింది... ఇది చంద్రబాబు మీద ఉండే నమ్మకం...

pk 18052018 3

తాజగా, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ, అవినీతి పై ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 13 రాష్ట్రాల్లో మాత్రమే చేసిన సర్వే ఇది.. ఇండియా 2018 అవినీతి అధ్యయన నివేదికను సీఎంఎస్(సెంటర్ ఫర్ మీడియా స్టడీస్) శుక్రవారం విడుదల చేసింది. సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని భాస్కర్ రావు తెలిపారు.

pk 18052018 3

ఈ రిపోర్ట్ తో ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం... సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారంతో, ప్రజలు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎంతో నెగటివ్ గా ఫీల్ అవుతున్నారు అని రిపోర్ట్ చెప్పింది... కాని వారి దాకా వచ్చే సరికి, వ్యక్తిగతంగా జరిగిన పనులు గురించి మాత్రం, ఏపి ప్రభుత్వం అద్భుతం అంటున్నారు... గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు అనే చెప్తున్న రిపోర్ట్ ఇది... ఈ సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 72%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 17 % మందే... అదే తెలంగాణాలో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 13%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 73 % మంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ప్రచారం ఇలా ఉంది... రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ మీడియా మ్యనేజేమేంట్ లో ఎలా ఫెయిల్ అయ్యారో ఈ సర్వే చెప్తుంది.. విష ప్రచారం ప్రజలు నమ్మారు, కాని వారి దాకా వస్తే కాని, ఆ విష ప్రచారం తప్పు అని తేలలేదు.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, ఇందుకేనేమో తెలంగాణాకి 6 మార్కులు, చంద్రబాబుకు 2.5 మార్కులు వేసింది... ఈ రిపోర్ట్ గురించి, ఇంకా మీకు ఎవరూ చెప్పలేదా పవన్ గారు ? కొంచెం మీ తెలంగాణా రాష్ట్రం గురించి చూసుకోండి, మా ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన సాగుతుంది అని రిపోర్ట్ చెప్తుంది. http://cmsindia.org/cms_ics18/CMS_ICS_2018_Report.pdf

ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు, 100 కోట్లు కాదు, ఎమ్మల్యేకు 150 కోట్లు.. ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. ప్రజా స్వామ్య చరిత్రంలో ఒక మైనింగ్ మాఫియా డాన్ చేస్తున్న అరాచకాలు ఇవి.. సహజ సంపద కొల్ల గొట్టిన ఒక దొంగని ప్రధాని స్థాయి వ్యక్తి నెత్తిన ఎక్కించుకుంటే జరిగే పరిణామాలు ఇవి... ఒక్కో ఎమ్మల్యేకు 150 కోట్లు.. వామ్మో వాయ్యో, అనుకుంటం తప్ప, మనం ఏమి చెయ్యలేము.. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో బీజేపీ బండారం బట్టబయలైంది. శనివారం 4 గంటలకు అసెంబ్లీలో సీఎం యడ్యూరప్పకు విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు వల వేస్తున్నారు.

gali 18052019

ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి జనార్దన్‌ రెడ్డి బేరసారాలు జరిపారు. దీనికి సంబంధించి ఆడియో టేప్ లీక్ అవడం కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలతో జనార్దన్‌రెడ్డి మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్‌నేత ఉగ్రప్ప శుక్రవారం విడుదల చేశారు. ఆడియో టేపులో రాయచూర్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి బేరమాడారు. యాడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్‌ సెటిల్‌ చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన బసవన్న గౌడ.. ‘‘మీపై నాకు గౌరవం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేను’’ అని బదులిచ్చారు.

gali 18052019

బీజేపీ అధిష్ఠానం సూచనతో మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చే బాధ్యతను బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన రెడ్డి ఆయన సోదరులతో పాటు స్నేహితుడు బి.శ్రీరాములు స్వీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా మెజార్టీకి అవసరమైన కాం గ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల మద్దతును కూడ గట్టాలని వీరిద్దరికీ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ వాదనను బలపరిచేలా గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుభాష్‌ ఐకార్‌ రంగంలోకి దిగారు. గౌరిబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్‌ రెడ్డిని, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్పను ఫోన్‌లో సంప్రదించారు. బీజేపీకి సహకరిస్తే మంత్రి పదవితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు, మోడీ, అమిత్ షా చేస్తున్న నీఛ రాజకీయం, గవర్నర్ ఆడుతున్న నాటకాలు, సుప్రీం కోర్ట్ తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు... "గౌరవ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రోటెం స్పీకర్ ఎన్నికలో గవర్నర్, రాజ్యాంగం చెప్పిన విధంగా పాటించాలని చెప్పారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు, స్పూర్తి నిలబడాలని చెప్పారు.. "We respect & welcome the verdict of Hon'ble Supreme Court. Governor should have followed the Democratic conventions in appointing protem speaker. We expect that the spirit of Supreme Court judgement will be protected."

cbn tweet 18052018 2

ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్యను గవర్నర్ నియమించటం వివాదాస్పదం అవ్వటంతో, చంద్రబాబు ట్వీట్ చేసారు. కర్ణాటక విధానసౌధ ప్రోటెం స్పీకర్‌‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆర్‌వీ దేశ్‌పాండేను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే గవర్నర్ వాజూభాయ్ వాలా ఊహించని రీతిలో బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరును తప్పుబట్టింది. కర్ణాటక గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం జరుగుతుందని.. ఈ ప్రకారం చూసుకుంటే దేశ్‌పాండే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆయన చెప్పారు.

cbn tweet 18052018 3

ఇది ఇలా ఉండగా, జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గురువారం చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. 1984లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పారు. ‘161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్టాటకలోని నంది హిల్స్‌లో క్యాంప్‌కు వెళ్లాం. అసెంబ్లీలో బల నిరూపణ సమయం వరకూ ఒక్కరు కూడా మా నుంచి విడిపోలేదు. మీరు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామికి సలహా ఇచ్చారు. జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ ఉన్నా తమను కాదని.. ప్రభుత్వ ఏర్పాటుకు అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారని జేడీఎస్‌ నేత ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.

Advertisements

Latest Articles

Most Read