ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత రెండు నెలలుగా ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఇటు రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చింది.... అన్ని విపక్షాలను, ఈ విషయంలో చంద్రబాబు ఏకం చేసి, ఢిల్లీని ఇబ్బంది పెడుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ, కేసులు పెడతాం అంటూ భయపెడుతున్నా, చంద్రబాబు మాత్రం, ఈ కుట్రలని ఎదుర్కుని ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు.. ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సినీనటుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి మాత్రం, అసలు ఇక్కడ జరుగుతుంది ఏమి పట్టనట్టు, తన పని తాను చేసుకుపోతున్నారు.

అవిశ్వాసం పెట్టిన వేళ, నెల రోజులు రాజ్యసభకు సెలవలు కావలి అంటూ, చిరంజీవి రాజ్యసభ చైర్మన్ ను కోరారు. ఆ మరుసటి రోజే, సినిమా ఫంక్షన్ లో ప్రత్యేక్షం అయ్యారు... గత కొన్ని రోజులుగా, తన తమ్ముడి కోసం, ఆయనకు రాజకీయంగా లబ్ది చేకూరటం కోసం సినీ ఇండస్ట్రీని ఏకం చేసి, మీడియాను బ్యాన్ చేసే పనిలో ఉన్నారు... రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టైములో, ఒక్క రోజు కూడా ప్రత్యెక హోదా కోసం, ఒక్కటంటే ఒక్క పని కూడా చెయ్యని చిరంజీవి, తన సొంత పనులు మాత్రం చేసుకుంటూ, తనని ఇంత వాడిని చేసిన రాష్ట్రం కష్టాల్లో ఉంటే మాత్రం, ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.. ఇప్పుడు అమెరికా పర్యటనకు బయలుదేరాడు.. ఈ శనివారంనాడు, ఏప్రిల్ 28 వ తేదీన డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను మాజీ కేంద్రమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిగారు, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలుసుకుని, డల్లాస్ ప్రవాసాంధ్రులు ఒకింత ఆశ్చర్యపోయారు.. మరో పక్క, ఇదే వేదికలో, నిధుల సేకరణ కార్యక్రమం కూడా జరగనుంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చెయ్యనున్నారు... ఒక ప్రవాసాంధ్రుడు మాట్లాడుతూ "వేలమైళ్ళ దూరంలో ఉండి కూడా మేము, జన్మభూమి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాము. మన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంపట్ల బాధ పడుతున్నాము. ఇలాంటి సమయంలో టికెట్లకు భారీ ధరలు పెట్టి, తమకు బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి మా కష్టార్జితాన్ని కొల్లగొట్టడానికి చిరంజీవిగారు, ఇతర సినిమాతారలు ఈ ఉత్సవాలను జరపడం ఎంతవరకు సబబు ? ఇది ఖచ్చితంగా ప్రత్యేకహోదా కోసం తపన పడుతున్న రాష్ట్రప్రజలను, ప్రవాసాంధ్రుల ఆత్మగౌరవాన్ని అవహేళన చేయడమే కదా ?" అంటూ తమ ఆవేదన తెలిపారు.

చిరంజీవి, ఇతర సినిమా వాళ్ళు డల్లాస్ లో జరిపే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను బహిష్కరిస్తున్నామని, ఇప్పటికే టికెట్లు కొన్నవాళ్ళు, అదే ప్రాంగణంలో, వేదిక వద్ద నల్లరిబ్బన్లు ధరించి, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి, మా బాధ చిరంజీవికి అర్ధం అయ్యే విధంగా నిరసనలు తెలుపుతామని ప్రవాసాంధ్రులు పిలుపు ఇచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి. మన జన్మభూమిని అవమానించే విధంగా మన ఆంధ్రులే కృతఘ్నతతో వ్యవహరిస్తే ఊరుకోబోమని, మా నిరసన చూసైనా, చిరంజీవి గారు, ఇతర సినిమా తారలు మద్దతు పలుకుతారేమో చూస్తామని అంటున్నారు.

ఆయన ఒక కూలి... అలాంటి పెద్దయిన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా ? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తానూ కష్టపడి దాచుకున్న సొమ్మును విరాళంగా అందించటానికి వచ్చారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు... చంద్రబాబు పిలుపు మేరకు, ప్రజా రాజధాని నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాల నుండి విరాళాలు అందుతున్నాయి... కూలీపని చేసుకునేవారు సైతం ప్రజా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలులో జరిగింది.

కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలు మండలం కుల్లికోళ్ల గ్రామానికి చెందిన నారిశెట్టి పుల్లయ్య(68) s/o ఆంజనేయులు రాజధాని నిర్మాణానికి రూ.22,210లు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేశారు. కూలీపని చేసుకునే నారిశెట్టి పుల్లయ్య రాజధాని నిర్మాణానికి విరాళం ఇచ్చిన స్ఫూర్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తనకున్నంతలో ఎదుటివారికి సహాయపడాలి అనే తెలుగువారి సేవా గుణానికి ఇదొక నిదర్శనమని ముఖ్యమంత్రి శ్రీ నారి శెట్టి పుల్లయ్యను కొనియాడారు... అమరావతికి, తానూ భాగస్వామి అవ్వటానికి వచ్చినందుకు సంతోషం అన్నారు... కేంద్రం చేస్తున్న అన్యాయానికి, ప్రజల్లో ఎంత కసి ఉందో, ఈ ఘటనే నిదర్శనమని చంద్రబాబు అన్నారు..

మరో పక్క, ఇలాంటి వారిని చుసైనా, పవన్, జగన్, మనసు మార్చుకోవాలని, నిత్యం అమరావతి పై చేసే కుట్రలు ఆపాలి.. జగన్, విజయవాడ పాదయత్రకు వచ్చి, భ్రమరావతి అంటూ యెగతాళి చేసాడు.. మంగళగిరిలో పాదయాత్ర చేసినా, కూత వేటు దూరంలో ఉన్న అమరావతికి రావటానికి మాత్రం ఇష్టపడలేదు... ఇక జగన్ మీడియా, పార్టీ, అమరావతి పై చిమ్మే విషం గురించి చెప్పే పని లేదు... ఇక పవన్ విషయానికి వస్తే, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తాకాలు వదులుతాడు.. అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు అంటాడు... వీరందరూ కలిసి, అదే స్టేజి పై, అమరావతి రైతుల త్యాగాలను కూడా అవహేళన చేస్తారు... కానీసం ఇలాంటి వారిని చూసైనా, బుద్ధి తెచ్చుకుని, రాజధానికి అడ్డు రాకుండా, సహకరిస్తారని ఆశిద్దాం..

వైసిపీ, బీజేపీ బంధం ఓపెన్ అయిపోతుంది... ఇక విజయసాయి రెడ్డి, ఏ మీడియా వాడు చూస్తాడా అని దొంగ చాటుగా వెళ్లి మోడీని కలవాల్సిన పని ఉండదు... జగన్ మోహన్ రెడ్డి, కేసుల గురించి భయపడాల్సిన పని లేదు... ఇక ముసుగులో గుద్దులాటలు లేవు... అంతా ఓపెనే... ఈ రోజు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే విజయవాడలో పర్యటించారు... ఈ సందర్భంలో ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు అదిరేలా ఉంటే, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు బెదిరేలా ఉన్నాయి... మొత్తానికి, అనుకున్న ప్లాన్ ప్రకారం, స్టెప్ బై స్టెప్, వైసిపీ - బీజేపీ త్వరలోనే కలిసిపోతున్నాయి... విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవ్వటం, జగన్ కేసులు ఒక్కోటి వీగిపోవటం, మనం చూడ బోతున్నాం... ఈ రోజు విజయావాడలో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి.

jagna nda 26042018

ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. జగన్‌పై ఉన్న కేసుల్లో ఏవీ ఇంకా నిరూపితం కాలేదని రాందాస్‌ అథవాలే చెప్పుకొచ్చారు. అవి కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన కేసులని, అవి ఇంకా నిరూపితం కాలేదని అన్నారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరో పక్క ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం బాధించిందంటూనే 2019లో చంద్రబాబు తిరిగి ఎన్డీయేలోకి వస్తే బాగుంటుందని అన్నారు. అలా జరగని పక్షంలో జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని అన్నారు.

jagna nda 26042018

వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే, ఇదంతా అందరూ ఊహించిన పరిణామమే... కాకపోతే, ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతరానని అనుకోలేదు... మరో పక్క, పవన్ ఉండనే ఉన్నాడు... ఈ నేపధ్యంలో, ఆపరేషన్ గరుడ, అనుకున్న ప్రకారమే నడుస్తుంది... ఇప్పటి వరకు పార్ట్ వన్ లో, అన్నీ గ్రౌండ్ లెవెల్ లో సెట్ చేసి పెట్టారు.... ఇప్పటికే కర్ణాటకలో, గాలి పై ఉన్న కేసులన్నీ ఎలా వీగిపోయాయో చర్చించుకుంటూ ఉన్న సమయంలో, ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏలో చేరి, తన కేసులు కూడా మాఫీ చేసుకుంటాడు అని, అవసరం అయితే ఎన్నికలు అయిన తరువాత తన పార్టీ, బీజేపీలో విలీనం చేస్తాడు అని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, మీడియా పై ట్వీట్లు చేస్తూ, కొన్ని మీడియా చానల్స్ ని బ్యాన్ చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో, కొన్ని మీడియా చానల్స్ పై మరీ పర్సనల్ గా వెళ్ళిపోయాడు పవన్... శ్రీ రెడ్డి, పవన్ తల్లిని తిడుతూ చెప్పిన వీడియో, ఏ మీడియా ఛానల్ కూడా డైరెక్ట్ గా వెయ్యలేదు... ఆ పదాన్ని బీప్ చేసి వేసాయి... కాని పవన్ మాత్రం, ఒక ఛానల్ వీడియో పోస్ట్ చేసి, ఆ పదం బీప్ లేకుండా ఉన్న వీడియో ఒక పోస్ట్ చేసారు... అయితే, ఈ విషయం పై ఆ ఛానల్ వెరిఫై చేసుకోగా, వారి వీడియోస్ లో, ఆ పదం బీప్ చేసిన తరువాతే ప్రసారం చేసినట్టు తేలింది... దీంతో పవన్, ఆ వీడియోని ట్యాంపరింగ్ / ఆడియో మార్ఫింగ్ చేసి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది...

pawan kalyan 26042018 2

మూడు రోజుల క్రితమే ఈ విషయం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఇదే విషయం పై, జర్నలిస్ట్ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి... కుట్రతోనే, పవన్ ఇలా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాయి... జర్నలిస్ట్ సంఘాలు అందరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు... కేసు నమోదు చెయ్యాలని, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు... ఈ విషయం పై పోలీసులు ప్రాధమిక విచారణ చేసారు... ప్రాధమిక విచారణలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ వచ్చారు... దీంతో, పవన్‌పై ఐపీసీ 469, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు...

pawan kalyan 26042018 3

ఇప్పుడు పోలీసులు మరింత లోతుగా విచారణ చెయ్యనున్నారు... ఈ విచారణలో పవన్, ఇలా ఎందుకు చేసారు, దీని వెనుక కుట్ర ఎమన్నా ఉందా ? పవన్ ఒక్కడే ఈ కుట్రలో ఉన్నాడా ? అనేది పోలీసుల విచారణలో తెలుస్తుంది... అయితే, ఈ సెక్షన్ల్ కింద పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం, గరిష్టంగా ఏడేళ్లు, కనిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్షతో పాటు జరిమానా దీనికి అదనం... మరి పోలీసులు ఈ విచారణ ఎటు వైపు తీసుకువెళ్తారు ? లేక పవన్, మీడియా కంప్రోమైజ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది... మరో పక్క ఈ కేసు తెలంగాణాలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది కాని, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే, ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎంత గోల చేసే వాడో...

Advertisements

Latest Articles

Most Read