ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు, అధికారులు రూల్ అఫ్ లా పాటించకుండా చేస్తున్న పనులకు, న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. అయినా కొంత మంది మారటం లేదు. ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక అయుదు ఆరు సార్లు అయినా హైకోర్టు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా తీవ్ర పదజాలంతో, ఆధికారులు చేస్తున్న తప్పులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా మార్పు మాత్రం రావటం లేదు. ఈ నేపధ్యంలోనే మళ్ళీ హైకోర్టులో , ఏపి అధికారులకు షాక్ తగిలింది. ఈ సారి ఏకంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు హైకోర్టు శిక్ష వేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం అనే చెప్పాలి. వారం క్రితం ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు తొమ్మిది రోజులు శిక్షతో పాటుగా, వెయ్యి రూపాయాల జరిమానా విధించింది. అయితే తమ పై మానవత్వం చూపాలని, ఇన్నాళ్ళు తాము చేసిన సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలని వీరు కోరటంతో, హైకోర్టు స్పందిస్తూ, జైలు శిక్షను తీసి వేసి, కోర్టు పనిగంటలు ముగిసే వరకు కూడా కోర్టులోనే ఉండాలని, అదే విధంగా వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని శిక్ష విధించింది. జరిమానా కట్టకపోతే మాత్రం, మూడు రోజులు జైలు శిక్ష వేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.

hc 07072021 2

ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తో పాటుగా, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి ఈ శిక్ష విధించింది హైకోర్టు. విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి జనవరి 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రక్రియ మొత్తం మధ్యలో ఉండగా, నిబంధనలు మార్చేసారు. ఇలా ఎందుకు మార్చారో తెలియరు. అయితే దీని వల్ల ఇబ్బందులు పడ్డ 36 మంది హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేసి, నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసి, ఈ 36 మందిని కూడా ఆ పోస్టుల్లో భర్తీ చేసే అవకాసం కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు అమలు కాకపోవటంతో, అభ్యర్ధులు మళ్ళీ కోర్టుకు వచ్చి కోర్టు దిక్కరణ పిటీషన్ వేసారు. దీంతో ఇది విచారణ జరిపిన కోర్టు, తాము ఆదేశాలు ఇచ్చినా, కావాలనే ఉత్తర్వులు అమలు చేయనట్టు అర్ధం అవుతుందని, అందుకే కోర్టు దిక్కరణ నేరంక్ కింద ఇద్దరు అధికారులకు శిక్ష విధించారు.

డీజీపీ సవాంగ్ గారికి, ఇతర పోలీస్ అధికారులకు పోలీస్ శాఖలోని ఖాళీల భర్తీకి సంబంధించి, కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని, తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందని, తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిగానే తాను తన సందేహాలను పోలీస్ శాఖ ముందుంచుతున్నాను తప్ప, పోలీస్ శాఖనుంచి రిటైరైన ఉద్యోగిగా కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా కంటే, ఒక రాజకీయ నాయకుడిగా,మంత్రిగా, లేక ప్రభుత్వ సలహాదారు మాట్లాడినట్టుగా సవాంగ్ నిన్న మాట్లాడారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం బ్రహ్మండంగా పనిచేసిందని, సీఎంకు కీర్తి కిరీటం డీజీపీగా ఉన్న వ్యక్తి ఇవ్వవచ్చా? పోలీస్ మాన్యువల్ ప్రకారం, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన వ్యక్తి, డీజీ స్థానంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ తప్పటడుగులు వేస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం, ఈ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఉత్తమ పని తీరు కనబరిచిందని డీజీపీగా ఉన్న వ్యక్తి చెప్పడమేంటి? లక్షా84వేల264 రెగ్యులర్ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ద్వారా 3లక్షల99వేల791ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యో గాలు కలిపి, మొత్తం 6లక్షల05వేల949 ఉద్యోగాలు ఇచ్చారని సవాంగ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అదలా ఉంటే రికార్డులను పరిశీలిస్తే, గతప్రభుత్వం 5సంవత్సరాల్లో కేవలం 34,563 ఖాళీలను మాత్రమే భర్తీచేసిందని చెప్పడానికి డీజీపీ ఎవరు? ఆయన పెత్తనం ఇదేనా? అదేనా ఆయన విధినిర్వహణ? సవాంగ్ డీజీపీనా...లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డా...లేక అజయ్ కల్లం రెడ్డా...? లేక అంబటి రాంబాబా? అసలు ఈ మాటలన్నీ డీజీపీ కెందుకు? భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచీ, ఏ డీజీపీ కూడా, ఇలా గత ప్రభుత్వాన్ని తప్పు పడుతూ మాట్లాడిన దాఖాలాలు లేవు. సంబంధం లేకుండా మాట్లాడి, సీనియర్ పోలీస్ అధికారి, డీజీపీగా ఉన్న వ్యక్తి తన హోదాను తానే కించపరుచుకున్నాడు. ప్రభుత్వాన్ని అభినందించే పని డీజీపీకి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా? రేపు ప్రభుత్వం తప్పుచేస్తే, ఈ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోరుగా? ఎందు కంటే ఆయన ఈప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారిపోయారు.

డీజీపీ తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. గతప్రభుత్వంలో ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో.. ఈప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో బహిరంగంగా చర్చించడానికి డీజీపీ వస్తారా. ఆయనతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. 15వేలమంది మహిళా పోలీసులు కొత్తగా పోలీస్ శాఖలో చేరారని, ఈ విషయం అందరూ గుర్తించాలని కూడా డీజీపీ చెప్పారు. 15 వేల మంది మహిళలను ఏ ప్రాతిపదిక ప్రకారం పోలీస్ శాఖలోకి చేర్చుకున్నారో డీజీపీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అనేది ఉంది...దానికొక అడిషనల్ డైరెక్టర్ జనరల్ అధికారి బాధ్యులుగా ఉన్నారు. ఆ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మహిళా పోలీసులను నియమించిందా? కొత్తగా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లను నియమించాలన్న బోర్డు నిబంధనల ప్రకారమే జరగాలి. 15వేలమంది మహిళా పోలీసులు పోలీస్ శాఖలో చేరారని డీజీపీచెప్పారు. వారిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమించిందా...లేక వైఎస్సార్ పార్టీ నియమించిందా? ఏ అర్హతలప్రకారం వారిని నియమించారు? డీజీపీ సవాంగ్ తనవ్యాఖ్యలువెనక్కు తీసుకోకుంటే, చట్టప్రకారం కోర్టులను ఆశ్రయించే ఆయనపై చర్యలకు ఉపక్రమిస్తాం. అక్కడే తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నాం. డీజీపీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తప్పయిందని చెబితే ఓకే, లేకపోతే, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు, న్యాయ స్థానాలను ఆశ్రయించడం తథ్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీకి ఐటి అధికారులు షాక్ ఇచ్చారు. వైసీపీ ఎంపీ, రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి ఇల్లు, ఆఫీస్ ల పై, ఏక కాలంలో ఐటి అధికారులు దాడులు చేయటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీకి, తమ కోటరీలో అతి ముఖ్యమైన వ్యక్తి పై ఐటి దాడులు చేయటం విస్మయానికి గురి చేస్తుంది. అయోధ్య రామి రెడ్డి, దేశంలోనే సంపన్నుల ఎంపీల్లో టాప్ లో ఉండి, ఇప్పటికే దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. రాంకీ కార్యాలయంలో, ఐటి అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని తన సంస్థతో పాటుగా, అనుబంధ సంస్థల పై కూడా సోదాలు జరుగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ ల పై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, గతంలో వీళ్ళు చేసిన నిర్మాణ ప్రాజెక్ట్ లు, లావాదేవీల పై ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ లో ఉన్న అన్ని కంపెనీల లావాదేవీల పై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ఈ సంస్థ ఐటి సంస్థకు అడ్వాన్స్ గానే టాక్స్ కూడా చెల్లించింది. ఆ అడ్వాన్స్ కు సంబంధించిన ఐటి రిటర్న్స్ పైన కూడా ఆరా తీస్తున్నట్టు మీడియాకు సమాచారం ఉంది.

itraids 06072021 2

రెండేళ్ళ క్రితం కూడా రాంకీలో ఐటి సోదాలు జరిగాయి.అప్పట్లో 250 కోట్ల ఆస్తులు కూడా అటాచ్ చేసారు. ఇప్పుడు జరుగుతున్న ఐటి సోదాల్లో, ఏమి బహిరంగ పరుస్తారో చూడాలి. అయితే ఇది ఇలా ఉంటే, సెబి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే, రాంకీలో ఐటి దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా షేర్ ధర అసహజంగా పెరగటంతో, సెబి అంతర్గంగా విచారణ చేసింది. ఇక్కడ నుంచి మలేషియాలో ఉన్న కంపెనీకు నిధులు మళ్ళించినట్టు గుర్తించింది. దీని పై ఐటికి సెబి ఫిర్యాదు చేసిన తరువాతే, ఐటి రంగంలోకి దిగినట్టు సమాచారం. అయతే ఈ సోదాలు ఎప్పటి వరకు జరుగుతాయి అనేది చూడాలి. ఈ సోదాల్లో ఏమి దొరికాయి, ఎంత నిధులు గోల్ మాల్ జరిగింది అనేది, ఐటి అధికారులు చెప్పే దాకా తెలిసే అవకాసం లేదు. అయితే అయోధ్య రామిరెడ్డి, జగన్ కేసుల్లో కూడా ఒక నిందితుడుగా ఉన్నారు. ఆయన పై సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా సిబిఐ కోర్టులోనే విచారణా లో ఉంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిన్న జరిగింది. ప్రజలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చించి తీర్మానాలు చేసారు. మొదటిది.. "జగన్ రెడ్డి అసమర్ధత, బలహీనతల వల్లే రాయలసీమ పొలాలకు పారాల్సిన కృష్ణా జలాలు నేడు సముద్రం పాలవుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తుంటే ఉత్తుత్తి లేఖలతో సీఎం కాలక్షేపం చేస్తున్నారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక విమానాలల్లో ఢిల్లీకి వెళ్లే సీఎం ఇంత పెద్ద సమస్యపైన ఎందుకు ఢిల్లీ వెళ్లి పీఎం, జలశక్తి మంత్రిని కలవడం లేదు? తమపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, నిరుద్యోగ వ్యతిరేకత, యువత వ్యతిరేకత నుండి, హోల్ సేల్ అవినీతి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూడబలుక్కొని సెంటిమెంట్ రెచ్చగొట్టే కపటనాటం ఆడుతున్నారు. అందుకే ఉత్తుత్తి లేఖలకు పరిమితమయ్యారు. తెలంగాణలోని అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న న్యాయ బద్దమైన హక్కులను వదిలేసి రైతులను రోడ్డు మీద పడేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన హక్కుల్ని, లోయర్ రైపేరియన్ స్టేట్ హక్కుల్ని, అపెక్స్ కౌన్సిల్ లో చేసుకొన్న ఉమ్మడి తీర్మానాన్ని రక్షించాల్సిన బాధ్యత , అధికారం జగన్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఉంది. తన బాధ్యతను గాలికొదిలేసి ప్రతిపక్షాలపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తే ప్రజలు బుద్ది చెప్పకమానరు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.13వేల కోట్లు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదు. రాయలసీమ ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం 5 ఏళ్లల్లో రూ.9,500 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లల్లో జగన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం ఉందా? గండికోట, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఇవ్వకుండా వారిని నీట ముంచారు. పురుషోత్తపట్నం ట్రిబ్యునల్ లో ఆగిపోవడానికి వీరి అసమర్ధత కారణం కాదా? జల యజ్ఞంలో ధనయజ్ఞానాన్ని కప్పి పెట్టుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చి రాయలసీమ ద్రోహం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జ్యోతిబసు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేయించి ఆల్ మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకోవడం జరిగింది. జగన్ రెడ్డి శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసి పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారు.

చంద్రబాబు కృషి వలన కె.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడ తరలించడానికి అపెక్స్ కౌన్సిల్ లో చర్చకు పెట్టారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. కె.ఆర్.ఎం.బి కూడా తరలింపుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నోట్ విడుదల చేయడమే కాకుండా ఛైర్మన్ స్వయంగా విజయవాడ వచ్చి కార్యాలయానికి అనువైన భవనాలను పరిశీలించి వెళ్లడమైంది. దీన్ని సాకారం చేయకుండా జగన్ రెడ్డి వేరే చోటకు తరలించాలని ప్రయత్నించడం వలన అది హైదరాబాద్ లో ఉండిపోయింది. కె.ఆర్.ఎం.బీ ఏపీ ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా తెలంగాణకు అనుకూలంగా ఉందని ఈ రోజు సీఎం లేఖలో ప్రస్తావించారు. కె.ఆర్.ఎం.బి విజయవాడకు వచ్చి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదా? ఈ స్థితికి కారణం సీఎం కాదా? ముచ్చుమర్రి ప్రాజెక్టు రాయలసమీకు మరో జీవనాడి. 792 అడుగుల నుండి నీరు తీసుకోవచ్చు. దీని నుండి రాయలసీమలోని అన్ని కెనాల్స్ కు నీరు ఇవ్వొచ్చు. దీనిపై వివాదాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ముచ్చుమర్రిలో మూడు తూముల్లో నీరు విడుదల చేశారు. మిగిలిన 13 తూములు ఏ వివాదం లేకుండా ఈ రెండేళ్లల్లో పూర్తి చేసి ఉండవచ్చు. ముచ్చుమర్రి నుండి బనకచర్ల క్రాస్ రెగ్గులేట్ కు అనుసంధానం అవకాశం కల్పించి ఉన్నారు. దీని ద్వారా హంద్రీ నీవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, కెసికెనాల్, తెలుగుగంగకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని రెండేళ్లైనా పూర్తి చేయకుండా జగన్ రెడ్డి పుట్టిన గడ్డకు ద్రోహం చేశారు. దీనికి కారణం కేసీఆర్ తో లాలూచి కాదా? ఏమీ చేయకుండానే ఏదో చేయబోతుంటే ఎవరో అడ్డుకున్నారనే బ్లేమ్ గేమ్ తో, సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే కుట్రే నేటి జల జగడం. దీన్ని అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు రాయలసీమ ప్రజలు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్రింది కార్యక్రమాలు చేపట్టాలి. 1. కృష్ణా జల వివాదంపై వెంటనే సీఎం: అఖిలపక్షాన్ని ప్రధాని, జలశక్తి మంత్రి వద్దకు తీసుకెళ్లాలి. 2. నదుల అనుసంధాన ప్రణాళికకు నిధులు కేటాయించి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలి. కృష్ణా, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరించాలి. 3. ముంపు రైతులకు, ఆదివాసీలకు పరిహారం, పునరావాసం కల్పించి అన్ని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్ధ్యం పెంచాలి. 4. ముచ్చుమర్రి పెండింగ్ పనులు పూర్తి చేసి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలి. 5. గోదావరి – పెన్నాలో భాగమైన వైకుంఠపురం ప్రాజెక్టు బొల్లా రిజర్వాయర్ పూర్తి చేసి, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ తో లిండ్ చేయాలి. 6. గుండ్రేవుల, వేదవతి పూర్తి చేయాలి. తుంగభద్ర హైలెవల్ కెనాల్ కు ప్యారలల్ కెనాల్ నిర్మించాలి. 7.వెలిగొండ రెండు టన్నళ్లు, రిజర్వాయర్లు, సప్లై చానల్స్ పనుల పూర్తి చేయాలి. 8. హంద్రీ నీవా, గాలేరు నగరి పెండింగ్ పనులకు నిధుల కేటాయింపులు పెంచాలి.

Advertisements

Latest Articles

Most Read