తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తూరులో, శబరి వంతెన వద్ద, ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. శబరి వంతెనకు లాంచీ వచ్చి గట్టిగా తగలటంతో, లాంచీ రెండు ముక్కలు అయినట్టు చెప్తున్నారు.  ప్రమాద సమయంలో లాంచీలో నలుగుర సిబ్బని ఉన్నారు అని చెప్తున్నారు సిబ్బంది. ప్రమాదంలో నలుగురు నదిలో కొట్టుకుపోగా, ముగ్గురు సిబ్బందిని కాపాడారని తెలుస్తుంది. ఒకరు గల్లంతు అయ్యారని చెప్తున్నారు. అయితే సరైన సమాచారం అక్కడ నుంచి రావటం లేదు. విషయం తెలుసుకున్న పోలీస్ రెవెన్యు సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశం వద్దకు బయలుదేరినట్టు సమాచారం. చీకటి కావటంతో, రెస్క్యు ఆపరేషన్ కష్టంగా మారిందని తెలుస్తుంది. గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు జరుగుతున్నట్టు సమాచారం. గోదావరి వరదల్లో చిక్కుకున్న బాధితులకు, సరకులు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనకు గల కారణాలు ఏమిటి అనే  వివరాలు తెలియాల్సి ఉంది.

అమరావతి విషయంలో జోక్యం చేసుకోండి, ఫోన్ ట్యా-పింగ్ లో జోక్యం చేసుకోండి అనే అభ్యర్ధనలు కాదు ఇది. మన దేశ ప్రతిష్టకు సంబందించిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీఏల వివాదం గురించి అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, సోలార్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చాలా కంపనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో మన రాష్ట్రానికి తక్కువ రేటుకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వీలు వచ్చింది. అయితే ప్రభుత్వం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి పీపీఏ సమీక్ష చేస్తాను అంటూ, ఆ కంపెనీలకు పేమెంట్లు ఆపేసి, కొన్నిటికి ప్రొడక్షన్ కూడా ఆపేసారు. అయితే, ఇందులో కొన్ని విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో జపాన్ లాంటి దేశాలు, ఏపి పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసాయి. దీంతో అప్పట్లోనే కేంద్రం ఈ విషయం పై జోక్యం చేసుకుంది. మీ తీరు వల్ల దేశ ప్రతిష్ట పోతుంది అని, పీపీఏల పై సమీక్షల విషయంలో వెనక్కు తగ్గాలని, కేంద్రం రాష్ట్రానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో, దాదాపుగా 40 కంపెనీలు పైగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కోర్టుకు వెళ్ళాయి. దీంతో హైకోర్టులో ఈ విషయం పై విచారణ ప్రారంభం అయ్యింది. కొన్ని వాయిదాలు కూడా నడిచాయి. డిసెంబర్ లో ఇచ్చిన తీర్పులో, ఈ విషయం సెట్ అయ్యే వరకు, సోలార్ విద్యుత్ కు యూనిట్ రూ.2.44, విండ్ కు యూనిట్ రూ.2.43 చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 40 శాతం బకాయలు మాత్రమే తీర్చింది ఇదే విషయం పై మళ్ళీ కోర్టుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసినా, లేట్ అవుతూ వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వచ్చి పడటంతో, మొత్తం స్థంబించి పోయిన విషయం తెలిసిందే. కోర్టులు కూడా రోజు వారీ కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాయి. కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే, వాదనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ పీపీఏల కేసు మరుగున పడిపోయింది. ఈ పరిస్థితిలో, నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ అఫ్ ఇండియాతో పాటు వివిధ కంపెనీలు, కేంద్రం వైపు చూస్తున్నాయి. కోర్టులో విషయం లేట్ అవుతూ ఉండటంతో, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్దించాయి. ప్రధాని పిలుపు మేరకు, ఆత్మనిర్భార్ భారత్ లో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, పీపీఏ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ తో నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరాయి. మరో పక్క క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం, ఏపి నిర్ణయంతో, ఈ సెక్టార్ లో, రూ21 వేల కోట్లు రిస్క్ లో పడ్డాయని తెలిపింది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని తెలిపింది.

విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన నేపధ్యంలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లక్ష్యంగా జరుగుతున్న దర్యాప్తు వేగం పుంజుకుంది. గుంటూరులోని రమేష్ ఆసుపత్రి స్థలం లీజు వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. క్రిస్టియన్ మిషనరీ (ఎఈఎల్‌సి) సంస్థకు చెందిన స్థలాన్ని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో రమేష్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంకు, రాయపాటి సోదరులకు బంధుత్వం ఉంది. రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత గుంటూరు రమేష్ ఆసుపత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సాంబశివరావు సోదరుడి కూతురు రాయపాటి శైలజ విజయవాడ రమేష్ ఆసుపత్రి చైర్మన్‌గా ఉన్న రామ్మోహనరావుకు కోడలు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు సహకారంతోనే గుంటూరులో డాక్టర్ రమేష్ ఆసుపత్రిని నెలకొల్పారు. స్వర్ణ ప్యాలెస్ ఘటన నేపధ్యంలో రాయపాటి సోదరుల వ్యవహారాల పైనా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. సాంబశివరావు కుటుంబ సభ్యులు రమేష్ ఆసుపత్రికి సబ్ లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు నగర నడిబొడ్డున ఈ స్థలం ఉండటంతో ఆసుపత్రికి బాగా ఉపయోగపడింది.

ఇందుకు సంబంధించిన వ్యవహారాలను ఆరా తీసేందుకు ఇప్పటికే రాయపాటి మమతను విచారించిన విజయవాడ పోలీసులు తాజాగా మంగళవారం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఆయన సోదరుడి కూతరు అయిన శైలజను విచారించారు. ఆమె అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారన్న సమాచారంతో కొంత మంది వైసిపి నాయకుల సలహాతో రాయపాటి కుటుంబంపై దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని కానీ ఇంతలా కొంత మందిని లక్ష్యం చేసుకుని వేధింపులు ఎక్కడా ఎప్పుడూ చూడలదేని రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె శైలజ పేర్కొన్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కేర్ సెంటర్లను ఎక్కడైనా పరిశీలించారా అని తనను పోలీసులు అడిగారని కానీ తాను 8 నెలలుగా వైద్య వృత్తికి దూరంగా ఉన్నానని చెప్పారు. నా పుట్టుపూర్వోత్తరాలు కూడా అధికారులు అడిగారని తెలిపారు. 30 ఏళ్లుగా పేరు తెచ్చుకున్న ఒక సంస్థను లక్ష్యంగా చేసుకుని కులం పేరుతో దుష్ప్రచారం చేయడం తగన్నారు. రమేష్ బాబును రమేష్ చౌదరిగా ప్రచారం చేస్తుంటే ఒక టార్గెట్ గానే తమకు కనబడుతుందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీ మీద వస్తే, భుజాలు తడుముకుంటూ, జీవీఎల్ వచ్చి చేసిన హడావిడి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ మీద ఏ ఆరోపణ వచ్చినా, వచ్చేసి హడావిడి చేసే జీవీఎల్, ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి ఏమి సంబంధం ? కేంద్రం పరిధిలోకి రాదు అంటూ, అందుకున్నారు జీవీఎల్. అయితే జీవీఎల్ వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చారు రఘురామరాజు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి లేఖ రాసాను కాబట్టి, తాను ఈ విషయం పై స్పందిస్తున్నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ "ఈ రోజు నేను ఈ వార్త సాక్షి పేపర్ లో చదివాను. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన సూచన చూసాను. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి, ఆయన ఏ రాష్ట్రానికైనా సూచన ఇవ్వచ్చు. సూచన ఇవ్వటంలో తప్పు లేదు కానీ, చంద్రబాబు గారు రాసిన లేఖ ప్రధానికి, అంటే గవర్నమెంట్ అఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే నేను ఆయన మాట్లాడిన వీడియో చూడలేదు. సాక్షిలో వచ్చింది చూసాను. రెండూ వేరు అవ్వచ్చు. అయితే ఈ రోజు నేను చేసిన కధనం ప్రకారం, చంద్రబాబు గారికి అవసరం ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాని, ముఖ్యమంత్రికి కానీ లేఖ రాసుకోవచ్చు అని జీవీఎల్ గారు సూచన అయితే ఇచ్చారు."

"చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసారు, అయితే వేరే పార్టీ అధికార పార్టీ సూచన వినాల్సిన పని లేదు, అయినా జీవీఎల్ ఎదో చెప్పారు. కానీ నేను అయితే, ఈయన మాటలు పాటించను. ఎందుకంటే స్టేట్ ఇంటలిజెన్స్ నా ఫోన్ ట్యాప్ చేస్తుంది అని, అదే రాష్ట్రానికి రాయటం భావ్యం కాదు కాబట్టి, నేను కేంద్ర ప్రభుత్వానికి రాసాను. అలాగే చంద్రబాబు గారు కూడా కేంద్రానికి రాసారు. ఆయనే కాదు, ఎవరైనా కేంద్రానికే రాస్తారు. అనుమానమే వారి మీద ఉన్నప్పుడు, వారికే ఎలా రాస్తాము. కేంద్రం జోక్యం చేసుకోదు అని, జీవీఎల్ అనటం పై నేను క్లారిటీ ఇవ్వాలి, నేను కేంద్రానికి ట్యాపింగ్ పై లేఖ రాసాను కాబట్టి. ఈ విషయం కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తుంది. కేంద్రానికి సంబంధం లేదు అనంతం, అసంబద్ధంగా ఉంది. రాజస్తాన్ లో ఒక విధానం, కర్ణాటకలో ఒక విధానం, ఇక్కడ ఒక విధానం ఉండదు. రాజస్తాన్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీజీపీ ఆరోపిస్తూ సిబిఐ కోరింది. ఏడాది క్రితం, కర్ణాటకలో కూడా బీజేపీ ఇలాగే కేంద్రాన్ని కోరింది. మరి ఏపిలో మాత్రం కేంద్రానికి సంబంధం లేదు, ఇక్కడ రాయకూడదు అని చెప్పటం ఏమిటి ? ఒక జాతీయ పార్టీకి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండదు కదా. అది జీవీఎల్ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుంది." అని రఘరామరాజు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read