ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు ఏదో ఒక రాజ్యాంగా ఉల్లంఘన కేసులతోనే గడిచిపోతుంది. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, ఏకంగా ఎన్నికల కమీషనర్ ని తప్పించటం, మాస్కు అడిగిన డాక్టర్ పై వేధింపులు, ఇలా ప్రతి రోజు ఏదో ఒక కేసుతో కోర్టుల్లో నానుతూ వచ్చాయి. ఇప్పుడు గత నెల రోజులుగా రాజధాని అమరావతి చుట్టూ, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకారణ బిల్లు పై, హైకోర్టులో రైతులు కేసు వెయ్యటం, ఆ కేసు పై, ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ, హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. ముందుగా పది రోజులు కేసు వాయిదా వేసిన హైకోర్టు, మళ్ళీ 27 వరకు వాయిదా వేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చెయ్యాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. అయితే, ప్రభుత్వం వేసిన పిటీషన్ లో తప్పులు ఉండటంతో, పిటీషన్ ను కోర్టు తిప్పి పంపించింది. మళ్ళీ సవరించి సుప్రీం కోర్టు ముందు మళ్ళీ ఫైల్ చేసారు.

అయితే మొన్న సోమవారం సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూతురు, అమరావతి రైతుల తరుపున హైకోర్టులో వాదించారు అని తెలియటంతో, సిజీ ఈ కేసు నుంచి తప్పుకుని వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. వేరే బెంచ్ కు వచ్చిన ఈ కేసు, ఈ రోజు విచారణకు వచ్చింది. జస్టిస్ రోహింటం నారిమాన్ ఉన్న త్రిసభ్య ధర్మాసనం బెంచ్ ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ జడ్జి నారిమాన్ కూడా నాట్ బిఫోర్ అంటూ, కేసు నుంచి తప్పుకుని, వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. జస్టిస్ రోహింటం నారిమాన్ తండ్రి అమరావతి రైతుల తరుపున వాదనలకు నియమించుకోవటంతో, జస్టిస్ నారిమాన్ నాట్ బిఫోర్ మీ అంటూ కేసు నుంచి తప్పుకుని, వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. మొత్తానికి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు, మరో బెంచ్ ముందు ఎప్పుడు వస్తుందో చూడాలి.

భారత రాష్ట్రపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు ప్రసాద్ కు, పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన విషయం పై స్పందించిన రాష్ట్రపతి రాం నాద్ కొవింద్, ఈ విషయం పై చాలా సీరియస్ గా ఉన్నారు. సహజంగా రాష్ట్రపతి , గవర్నర్ లు నేరుగా కల్పించుకోరు. ఏదైనా అసాధారణ కేసు తప్పితే, ఏ విషయమైనా ప్రభుత్వాలకు రిఫర్ చేస్తారు. అయితే సీతానగరం ఘటనలో మాత్రం రాష్ట్రపతి జోక్యం చేసుకుని, ఆయనే ఆదేశాలు ఇవ్వటం సంచలనం అనే చెప్పాలి. ఆ ఘటన జరిగిన తీరు ఎలాంటిదో అర్ధం అవుతుంది. ఇసుక లారీలు ఆపినందుకు, స్థానిక నేతలు, ప్రసాద్ అనే దళితుడిని, పోలేస్ స్టేషన్ లోనే గుండు కొట్టించటం అప్పట్లో సంచలనంగా మారింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటంతో, డీజీపీ కొంత మందిన సస్పెండ్ చేసారు. అయితే, అసలు వాళ్ళని వదిలిపెట్టారని, తనకు న్యాయం చెయ్యాలి అంటూ, ప్రసాద్ ఆందోళన చేసారు. ప్రభుత్వం స్పందించక పోవటంతో, రాష్ట్రపతికి లేఖ రాసారు.

తనకు అన్యాయం జరిగిందని, న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదని, తానే న్యాయం చేసుకుంటాను అని, నక్సల్స్ లో చేరేందుకు పర్మిషన్ అడుగుతూ లేఖ రాసారు. దీని పై ఇప్పటికే రాష్ట్రపతి స్పందించి, రాష్ట్ర జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్ బాబును, ఈ కేసు పై దర్యాప్తు చేసి చెప్పమన్నారు. అయితే ఆయన వద్దకు వెళ్ళినా స్పందన లేదు అని ప్రసాద్ తెలపటంతో, రాష్ట్రపతి ఈ ఫైల్ ను సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా, ఈ కేసుని అత్యవసర కేసుగా భావించి, వెంటనే పూర్తీ విచారణ జరిపి, తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్, దీనికి సంబదించిన ఆదేశాలు ఇచ్చారు. ఈ కీలక పరిణామంతో, ఏమి జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. సహజంగా ఇలాంటి కేసుల పై రాష్ట్రపతి, ప్రభుత్వాలకు ఫార్వర్డ్ చేసి, వారినే చూడమంటారు. ఇక్కడ రాష్ట్రపతి కలుగ చేసుకుని, ఆయనే విచారణఅధికారిని నియమించటం సంచలంగా మారింది.

గత 16 నెలలుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు అనేక లేఖలు రాసారు. అయితే 99 శాతం, ఆ లేఖల పై ఎలాంటి చర్యలు లేవు, లేదా చంద్రబాబుకి తిరిగి ఉత్తరం రాయటం లేదు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు రాసిన లేఖలను ప్రెస్ ముందు ప్రస్తావించారు డీజీపీ. అయితే మొదటి సారి డీజీపీ, చంద్రబాబు రాసిన లేఖకు రియాక్ట్ అయ్యారు. అయితే, ఇది చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖ కాదు, ప్రధానికి రాసిన లేఖ. ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు, ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై స్పందించిన డీజీపీ చంద్రబాబుకు లేఖ రాసారు. మీరు ప్రధానికి రాసిన లేఖ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది, మీరు ప్రధానికి రాసిన లేఖ విషయానికి సంబంధించి, తమకు మీదగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వాలి అంటూ డీజీపీ లేఖలో తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం, అందరి హక్కులు కాపాడతామని డీజీపీ తెలిపారు.

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ, ఆరోపణలు వస్తుందే మీ మీద అని, అందుకే అత్యున్నత విచారణ కోరుతున్నామని, మీకు సాక్ష్యాలు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. అలాగే డీజీపీ రాసిన లేఖ పై చంద్రబాబు కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం పై నేను ప్రధానికి లేఖ రాస్తే, దానికి డీజీపీ హడావిడిగా స్పందించటం విచిత్రంగా ఉంది. మీ మీద ప్రధానికి లేఖ రాస్తే, ఆధారాలు మీకు ఇవ్వాలి అని అడగటం విడ్డురంగా ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నో లేఖలు ఆయనకు రాస్తే, దానికి స్పందన లేదని అన్నారు. ఆయన విచారణ చెయ్యకుండా, నన్ను ఆధారాలు ఇవ్వమని అడగటం ఏమిటి అని ప్రశ్నించారు. నన్ను విశాఖలో అడ్డుకుంటే ఏమి చేసాడు ? ఆత్మకూరు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపాడు ? కోర్టులో నిలబడి చట్టం చదివే పరిస్థితి తెచ్చుకుని, ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వమంతున్నారు అని మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ముందు నుంచి వాళ్లకు ఉన్న అలవాటే అని, గతంలో సిబిఐ జేడీ లక్ష్మీనారయణ ఫోన్ కూడా ఇలాగె ట్యాప్ చేసారని అన్నారు.

ఇప్పటి వరకు రాజధాని తరలిపోతే అమరావతి వాసులే ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేది. నిజానికి అమరావతి తరలిపొతే రాష్ట్రం మొత్తం ఇబ్బందే అయినా, ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష ఇబ్బంది, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు. అయితే ఇప్పుడు అమరావతి రైతులకు గన్నవరం రైతులు కూడా తోడయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగటంతో సెంటర్ ప్లేస్ అయిన విజయవాడలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఎయిర్పోర్ట్ రాష్ట్రం మధ్యలో ఉండటంతో, గన్నవరం చుట్టు పక్కల ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో కేంద్రం భూమి సమీకరణ చేసి ఇస్తే, ఎయిర్ పోర్ట్ విస్తరణ చేస్తాం అని చెప్పటంతో, రంగంలోకి దిగిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మాట్లాడింది. అయితే అప్పటికే భూములు రేటు ఎక్కవగా ఉండటంతో, రైతులు ముందుకు రాలేదు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో రాజధాని తరహా ప్యాకేజి ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవటంతో, రైతులు 700 ఎకరాలు ఇచ్చారు.

దీంతో విస్తరణ పనులు మొదలయ్యాయి. 80 శాతం మందికి అమరావతిలో ఫ్లాట్లు కూడా ఇచ్చారు. మిగతా వారికి భూములు ఇచ్చే క్రమంలో, ప్రభుత్వం మారింది. అంతే మొత్తం తలకిందులు అయ్యింది. మిగతా వారికి ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇంకా ప్యాకేజిలో చెప్పినట్టు చెయ్యలేదు. ఈ లోపు అమరావతి మూడు ముక్కలు అయ్యింది. దీంతో అమరావతి రేట్లు పడిపోయాయి. ఈ క్రమంలో గన్నవరం రైతులు ఎదురు తిరిగారు. ఎంతో రేటు ఉన్న భూమి, అమరావతి అభివృద్ధి అయితే, అక్కడ ఫ్లాట్ రేటు ఉంటుందని ప్యాకేజికి ఒప్పుకుంటే, ఇప్పుడు నాశనం చేసారని రైతులు ఎదురు తిరిగారు. తమ భూముల్లో వారి సాగు మొదలు పెట్టారు. దుక్కి దున్ని, నాట్లు వేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎయిర్ పోర్ట్ కు ఇచ్చిన భూముల్లో తిరిగి సాగు మొదలు పెట్టారు. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. అటు ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదని, ఈ సమయంలో కోర్టుకు వెళ్తే సమస్య మరింత జటిలం అవుతుందని వాపోతున్నారు. ఇక రైతులు తమకు జరిగిన అన్యాయం పై న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read