రాష్ట్రంలో ఎన్నికల అధికారి తొలగింపు విషయంలో ఒక్కపక్క వివాదం కొనసాగుతుండగా మరోపక్క హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుండగా అనుమతి లేకుండా 30 మంది న్యాయవాదులు వీడియోలో చొచ్చుకురావడం మరో సమస్యగా మారింది. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ గా తీసుకుంది, పాస్వర్డ్ ఎవరికి ఇస్తారో వారు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కు రావాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల అధికారిగా తొలగించిన విషయంపై గత రెండు రోజులుగా హైకోర్టులో విచారణ జరగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉండటంలో సిజె ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం వాదనలు ప్రారంభమయ్యాయి. . ఇప్పటి వరకు ఆరుగురు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనను వివరించారు. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ తన వాదనలు ప్రారంభించారు.

అయితే ఈ సమయంలో అనూహ్యగా అనుమతించిన వారు కాకుండా సుమారు 30 మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ లోకి చొచ్చుకువచ్చారు. ఒకేసారి స్క్రీన్ పై ఎక్కువ మంది న్యాయవాదులు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో సీక్రెట్ గా ఉండాల్సిన పాస్వర్డ్ ఇతరులకు ఎలా చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్ గా వాదనలు జరుగుతున్న తరుణంలో క్రాస్ టాక్ రావడం సరికాదని ఆయన అన్నారు. దీనితో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని నేరుగా కోర్టులోనే విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులకు లాక్ డౌన్ నుంచి మినహాయిస్తూ పాసులు జారీ చేయాలని డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావల్సి ఉండటంతో ఈ విషయంలో డిజిపితో సంప్రదించనున్నట్లు సిజె తెలిపారు.

సోమవారం అందరూ సామాజిక దూరం పాటించి విచారణకు హాజరుకావాలని ఆయన కోరారు. ఎన్నికల అధికారిగా విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లో పాటు ఆరుగురు ప్రజావాణ్యం పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల కార్యాలయం కౌంటర్లు దాఖలు చేశాయి. మొత్తం వది మంది ఈ పిటిషన్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే విచారణ సోమవారానికి వాయిదా పడటంతో, అప్పటి వరకు కొత్త ఎలక్షన్ కమీషనర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని, ఆదేశాలు ఇవ్వాలని, రమేష్ కుమార్ తరుపు న్యాయవాది కోర్ట్ ని కోరారు. అయితే ఈ విషయం పై మాట్లాడిన హైకోర్ట్, లాక్ డౌన్ ముగిసిన తరువాత, మూడు వారాల లోపు, అన్ని ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు తొలగించే వరకు, ఎన్నికలు జరపటానికి వీలు లేదని, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసారు. రంగులు తొలగించకుండా, ఎన్నికలకు వెళ్తే, అప్పుడు కోర్ట్ ఏమి చెయ్యాలో అది చేస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కేసులు పెరిగిపోతూ ఉండటం, సరిహద్దు రాష్ట్రాల్లో కేసులు తగ్గుతూ ఉండటం, కాని ఏపిలో పెరుగుతూ ఉండటంతో, కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రకారం, కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానుంది. వస్తున్న సమచారం ప్రకారం, మే 4న ఏపీకి కేంద్ర బృందం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటన చేయ్యనున్నట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి, లాక్ డౌన్ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, రోగులకు అందే వైద్యంపై కేంద్ర బృందం సమీక్ష చేయ్యనుంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే విపక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు దాస్తుందని, టెస్టులు విషయంలో కూడా పీసీఆర్ టెస్టులు చెయ్యకుండా, మాములు రాపిడ్ టెస్టులు చేసి, ఎక్కువ చేసినట్టు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ ఉండటం, ఏకంగా గవర్నర్ బంగాళాలో కూడా రావటం పై, ఆందోళన వ్యక్తం చేసారు.

కేంద్రం ఎంటర్ అవ్వాలని, నిజాలు బయటకు చెప్పాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కన్నా కూడా, ఈ విషయం పై, కేంద్రానికి లేఖ రాసారు. అయితే నిన్న కేంద్ర హోం శాఖ సహయమంత్రి కిషన్ రెడ్డి కూడా, కేంద్రం నుంచి టాస్క్ ఫోర్సు, ఏపికి వస్తుందని చెప్పారు. అలాగే, అధికార పార్టీ నేతలకు కూడా చురకలు అంటించారు. కొన్నాళ్ళు బయట తిరగకుండా, సంయమనం పాటించాలని కోరారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పినట్టే, కేంద్రం బృందం, ఏపి పర్యటనకు వస్తుంది. అయితే ఇది సహజంగా అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే జరుగుతుందా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, ప్రభుత్వం దాస్తుంది అనే విషయాల పై కూడా, ఏమైనా ఆరా తీస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇక మరో పక్క, వరిస్థితులను అనుగుణంగా గ్రీజోన్లలో మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గ్రీజోన్లలో పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుమతిం చామని ఆయన స్పష్టం చేశారు. విమనాలు, రైల్వే ఇప్పుడే నడిచే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా రవాణాకు ఇప్పట్లో అవకాశం ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసిందని, అందులో కేంద్రం ఇచ్చిన 5 కేజీలు, రాష్ట్రానికి సంబంధించి 7 కేజీలు ఉన్నాయని ఆయన వివరించారు. బుధవారం నుంచి రెండో విడత బియ్యం వంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిందని తెలిపారు. గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వస్థలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 54 బస్సుల్లో గుజరాత్ నుంచి బుధవారం తెల్లువారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారని చెప్పారు. ఇందుకుసహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఈ రోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు పిటిషన్‍పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నిన్న ఆరుగురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం, ఇవాళ మరికొందరు పిటిషనర్ల తరపు వాదనలు వినటానికి రెడీ అయ్యింది. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభం చేసారు. అయితే, ఈ సమయంలో, హైకోర్ట్ సీజేకు ఒక సంఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు కాకుండా ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న సీజే ప్రశ్నించారు. పాస్‍వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్‍టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు.

దీంతో, నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తాం అని అన్నారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు. అయతే, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ, చర్చ మొదలైంది.

నిన్న, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమి షనర్ తొలిగింపు అంశం పై కేసు విచారణను ఈ రోజుకి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం నూతన సంస్కరణల సాకుతో ఆర్డినెన్స్ ద్వారా తొలిగించింది అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ వ్యక్తిగతంగాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాతో పాటు ఆరు గురు ప్రజావ్యాజ్య పిటిషన్లును హైకోర్టులో దాఖలు చేసారు. ఈ పిటీషన్లకు సంబంధించి ఫిర్యాదుదారులు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్ని కల సంఘం కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాద, ప్రతివాదనలు కొనసాగాయి. ధర్మాసనానికి ఆరుగురు వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో కేసులు దూసుకుపోతున్నాయి. ఏపీలో క-రో-నా పాజిటివ్ కేసులు 1,403 కి చేరుకున్నాయి. నేడు కొత్తగా 71 పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 321 మంది డిచ్చార్జ్ కాగా,31 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1,051 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 43, కృష్ణా 10, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, చిత్తూరు 3, తూ.గో 2, నెల్లూరు జిల్లాలో రెండు పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి రోజు 70 నుంచి 80 కొత్త కేసులు వస్తున్నాయి. అయితే, ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది. ఇందుకు అను గుణంగా బుధవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లాక్ డౌన్ నిబంధనలకు సంబంధించి కొన్ని సడలింపులను చేసింది, ఆర్థిక రంగానికి మినహాయింపు కలిగించింది.

ఈ సడలింపులను అనుసరించి లాక్ డౌన్ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవరైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు లభించింది. వ్యవసాయరంగం, ఉద్యాన పనులు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ రంగా లకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకునేం దుకు మినహాయింపును ఇచ్చింది. వలస కార్మి కులకు రాష్ట్ర వరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకునేందుకు వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించటంతో, ఏపి ప్రభుత్వం కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కరోనా లక్షణాలు లేని వారు మాత్రమే పనులు చేయాలని స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, స్టేషనరీ దుకాణాలకు మినహయింవును కల్పించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజరును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, మార్కెటింగ్ కాంప్లెక్స్ లకు అనుమతి లభించింది. కావాల్సిన అనుమతులతో ఈ-కామర్సు కంపెనీలకు, వారు వాడే కార్లుకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్లో కల్పించిన సడలింపుల విషయంలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అనుసరించి మార్పులు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో నెలకొని పరిస్థితులను గమనించిన తరువాత ఈ సడలింపులను అమలు చేస్తారు. అయితే అన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే, విపరీతంగా పెరిగిపోతున్న కేసుల టైములో, మినహాయింపుల పై విమర్శలు వస్తున్నాయి. కేసులు కంట్రోల్ అయ్యేదాకా, పటిష్టంగా లాక్ డౌన్ పెట్టటమే నయం అని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read