ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా కేసులు పెరిగిపోతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 70 నుంచి 80 కేసులు వస్తూ దూసుకుపోతుంది. ఈ రోజు మాత్రం, కొంచెం నెమ్మదించింది. ఈ రోజు కేవలం 60 కేసులు వచ్చాయి. అయితే ఇది పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంది. 45 రోజుల లాక్ డౌన్ తరువాత కూడా, ఇలా కేసులు పెరగటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క గత పది రోజులుగా, తెలంగాణా, కేరళ, కర్ణాటక, ఒరిస్సా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణాలో అయితే కేవలం ఆరు ఏడు కేసులు మాత్రమే వస్తున్నాయి. ఇక కేరళ, ఒరిస్సా అయితే మరీ తక్కువ. వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలతో, అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చి, కర్వ్ ఫ్లాట్ అవుతూ వచ్చింది. చాలా తక్కువ కేసులు వస్తూ వచ్చాయి. అయితే ఇదే క్రమంలో, ఏపిలో మాత్రం, అటు కేసులు, ఇటు మరణాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే, తమిళనాడు రాష్ట్రంలో సరిహద్దు దగ్గర గోడలు కట్టారు, అలాగే ఒరిస్సా సరిహద్దులో రోడ్డు తవ్వేసారు, ఇక తెలంగాణాలో అయితే, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళవద్దు అంటూ హెచ్చరించారు. ఎంత ఎమర్జెన్సీ అయినా, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వెళ్ళవద్దు అన్నారు. ఈ క్రమంలోనే, ఈ రోజు తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర ఒక అడుగు ముందుకు వేసి మరీ, ఏపి పై వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసి ఉండకపోతే. పక్కన ఉన్న ఒక కర్నూలు లాగా, ఒక గుంటూరులా తయారయ్యేది అంటూ, ఏపి సరిగ్గా చెయ్యటం లేదు, తెలంగాణ మెరుగ్గా చేస్తుంది అనే విధంగా తెలంగాణ మంత్రి మాట్లాడారు. కర్నూల్, గుంటూరు లాంటి పరిస్థితి మనకు లేదని అన్నారు.

మర్కజ్ కాంటాక్స్ పట్టుకోక పోతే.. దేశంలో హైదరాబాద్ లో ఎక్కువ కేసులు ఉండేవి. మేము అవి మార్చి 16నే పట్టుకుని, కాంట్రోల్ చేసాం కాబట్టే, ఇప్పుడు మెరుగ్గా ఉన్నాం అని అన్నారు. అలాగే టెస్టింగుల పై మాట్లాడుతూ, మేము పనికి వచ్చే టెస్టులు మాత్రమే చేస్తున్నాం. ఆర్టీ పీసీఆర్ టెస్టులు ఏదైతే ప్రామాణికమో అవే చేస్తున్నాం, రాపిడ్ టెస్టులు, మిగతా టెస్టులు చేసినా అనవసరం, అవి ప్రామాణికంగా కాదు అని, ఇప్పటికే ఐసీఎంఆర్ చెప్పింది, ఊరికే గొప్పలు చెప్పుకోవటానికి, అన్ని టెస్టులు చేసి, చెప్పుకోవాల్సిన పని లేదు, అంటూ ఈటేల చెప్పుకొచ్చారు. ఈ అంశం వచ్చిన దగ్గర నుంచి, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో అందరూ చూస్తున్నారని, ఈటెల అన్నారు. అయితే ఇదే సందర్భంలో, ఏపి పై చేసిన వ్యాఖ్యల పై, వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి. దేశం మొత్తం మా జగన్ వైపు చూస్తుంది అని చెప్తున్న వైసీపీ నేతలు, ఎలా స్పందిస్తారో మరి.

మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 2 ముగుస్తున్న వేళ, లాక్ డౌన్ పొడిగింపు పై, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా, లాక్ డౌన్ పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మే 4 నుంచి మరో రెండు వారాలు, లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పై, కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఈ లాక్ డౌన్, ఈనెల 17వరకు ఉండనుంది. అలాగే జోన్లవారీగా నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో నిబంధనల మేరకు కొన్ని సడలింపులు చేసింది. ఏప్రిల్‌ 30న ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల గుర్తింపు చేయాలని సూచించింది. వరుసగా 21 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాని జిల్లాలు గ్రీన్‌ జోన్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది.

రవాణా, పాఠశాలలు, కళాశాలలు, సినిమాహాళ్లు మూసివేసి ఉంటాయని వెల్లడి. క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, హాటళ్లు, సాంస్కృతిక కేంద్రాలు మూసివేత. మతపరమైన కేంద్రాలు మూసివేసి ఉంటాయని తెలిపిన కేంద్రం. అత్యవసరం కాని పనులకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు అనుమతి లేదన్న కేంద్రం. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల పిల్లలు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలన్న కేంద్రం. రెడ్ జోన్లలో సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్ లు, ట్యాక్సీలకు అనుమతి ఉండదన్న కేంద్రం. సెలూన్లకు కూడా అనుమతి లేదని తెలిపిన కేంద్రం. అంతర్ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటన. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వ్యవసాయ పనులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.

రెడ్ జోన్లలో ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్ సెంటర్లకు అనుమతి. ఆరెంజ్ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్, ఒక సహాయకుడి సాయంతో అనుమతి. గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడి. గ్రీన్ జోన్లలో 50 శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతి. ఇక అన్నిటికంటే, మందుబాబులకు మజాను ఇచ్చే వార్తా చెప్పింది కేంద్రం. కాకపోతే ఇది కేవలం గ్రీన్ జోన్ వాళ్ళకే. గ్రీన్ జోన్ల పరిధిలో మందుబాబులకు ఊరట ఇచ్చింది. గ్రీన్ జోన్ ల పరిధిలో పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చ. షాపుల దగ్గర 5 కంటే ఎక్కు వ ఉండకూడదు, 5 గురు కూడా ఒక్కరి మధ్య రెండుగజాల దూరం ఉండాలి అంటూ కేంద్ర హోం శాఖ చెప్పింది.

అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ ఈ రోజు ఒక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న జోన్లు విషయం పై , చేపట్టాల్సిన చర్యల పై ఆ లేఖలో పలు ఆదేశాలు ఇచ్చారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వివరించారు. నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా జోన్లు విభజించామని తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూదన్ వెల్లడించారు. కొత్తగా వచ్చిన లిస్టు ప్రకారం దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్లలో ఉన్నాయి. ఆరెంజ్ జోన్‌లో 284, గ్రీన్‌ జోన్‌లో 319 జిల్లాలు ఉన్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెడ్ జోన్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరంజ్ జోన్ లో ఏమి చెయ్యాలి, గ్రీన్ జోన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పై, పూర్తీ వివరాలతో లేఖ రాసారు. అలాగే ప్రతి చోట, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే, నడుచుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రెడ్‌జోన్‌ జిల్లాల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ ఉన్నాయి. గ్రీన్‌జోన్‌ జిల్లాల్లో కేవలం విజయనగరం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈ రోజు విడుదలైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ చెప్పింది. కొత్త కేసులతో కలిపి ... మొత్తం సంఖ్య 1463కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్​లో తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. గత 24 గంటల్లో 7902 మంది నుంచి నమునాల సేకరించి పరీక్షలు చేయగా, వారిలో 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇక మే 3తో లాక్ డౌన్ ముగుస్తు ఉండటంతో, కేంద్రం ప్రభుత్వం తరువాత ఏమి చెయ్యాలి అనే దాని పై కసరత్తు చేస్తుంది. దీని పై రేపు ప్రధాని మాట్లాడే అవకాసం ఉంది.

అధికారంలో ఉంటేనే, ప్రజలు గురించి పట్టించుకునే వారు ఎక్కువ. ఈ మధ్య అది కూడా లేదు. రాజకీయం అలా తయారు అయ్యింది. కాని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. అలంటి వారిలో ఒకరు చంద్రబాబు కావటం మన తెలుగు ప్రజలకు గర్వ కారణం. చంద్రబాబు పది పదిహేను రోజుల క్రితం, తాను గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) అనే ఒక ఫోరం పెట్టినట్టు చెప్పారు. అందులో ఉండే నిపుణులతో చర్చించి, ఈ కరోనా నేపధ్యంలోనే, ఎలా అరికట్టాలి, తరువాత వచ్చే ఆర్ధిక పరమైన విషయాలు ఎలా ఎదుర్కోవాలి, ఇలా అన్ని విషయాల పై కొన్ని సూచనలతో ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. అయితే, అప్పట్లో వైసీపీ పార్టీ దీన్ని విమర్శించింది. చంద్రబాబు అన్నీ ఇలాగే డబ్బా కొట్టుకుంటారు, అక్కడ జరిగిదే ఒకటి ఈయన చెప్పేది ఒకటి అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. కొంత మంది అయితే, అసలు చంద్రబాబుని మోడీ దగ్గరకు కూడా రానివ్వరు, ఈయన ఏదో అబద్ధాలు చెప్తున్నారు అంటూ కొట్టిపారేశారు.

nitiyog 01052020 1

ఇలాంటి సమయంలో రాజకీయం చేసే వారికి, మోడీ, చంద్రబాబు లాంటి వారికి తేడా ఉంటుంది కదా. మోడికి, చంద్రబాబుకి ఎంత పర్సనల్ విరోధం ఉన్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సీనియర్ నేతలగా, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. ఈ రోజు ఇదే విషయం నీతీ అయోగ్ కూడా ప్రశంసించింది. చంద్రబాబుకి ఒక లేఖ రాసింది నీతి అయోగ్. మీరు రాసిన లేఖ, అందులో ఎంతో రీసెర్చ్ చేసి రాసిన అంశాలు, అన్నీ బాగున్నాయి. మీ టీంని అభినందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, ఇలా టెక్నాలజీ, డేటా డ్రివెన్ అప్రోచ్ ని, కరోనా కట్టడిలో ఉపయోగించటాన్ని సమర్ధిస్తుంది. మీరు ఇచ్చిన సూచనలు అన్నీ, స్టడీ చెయ్యమని, మా నీతీ అయోగ్ ప్రతినిధులకు చెప్పం. ముఖ్యంగా మీరు ప్రతిపాదించిన రియల్ టైం డ్యాష్ బోర్డు గురించి తెలుసుకుంటాం. త్వరలోనే మీ రీసెర్చ్ అనెలెటిక్స్ టీం ని వచ్చి, దీని పై చర్చిస్తాం. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు, తప్పుకుండా, ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాం అంటూ, ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయం పై గతంలో చంద్రబాబు ఏమి చెప్పారు అంటే, ‘‘అధికారంలో ఉన్నవాళ్లకే బాధ్యత ఉంది, మా ఇష్ట ప్రకారం మేమే చేస్తామనడం’’ కరెక్ట్ కాదు. మేము ఇటీవల సిబిఎన్ ఫౌండేషన్ తరఫున గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ వ్యాప్తిపై దీనిలో అధ్యయనం చేశాం. పరస్పర విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత, అధ్యయనాలు చేస్తున్నాం. వర్ట్యువల్ సమావేశాల ద్వారా వందలాది నిపుణులు, సాంకేతిక వేత్తలు, శాస్త్రవేత్తలతో ప్రతిరోజూ చర్చిస్తున్నాం. వీటన్నింటిపై ఏప్రిల్ ప్రధానికి లేఖ రాశాం. టెస్ట్ లు పెంచాలి, కరోనా రోగులను వేరు చేయాలి, ప్రత్యేక చికిత్స చేయాలి. 14రోజులు ఆప్రాంతంలో ఒక్క కేసు కూడా రాకపోతే ఆ ఏరియాను లాక్ డౌన్ నుంచి మినహాయించండి. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి, వైరస్ తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ, దేనికిదానికి కొన్ని నిబంధనలు పెట్టాలని కోరాం. రెడ్ జోన్ లో విధిగా లాక్ డౌన్ అమలు చేయాలని, ఆరెంజ్ జోన్ లో, గ్రీన్ జోన్ లో ఉండాల్సిన సడలింపులపై ఆ లేఖలో సూచనలు ఇచ్చాం. సమాజం పట్ల మనందరికి బాధ్యత ఉంది. 40ఏళ్లుగా ప్రజాజీవితంలో నేను ఉన్నాను. పదిమందితో మాట్లాడాలి, చర్చించాలి, వాటిని విశ్లేషించాలి, ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయాలి. ఈ రోజు ఉదయం 8.30గం కు ప్రధానితో ఫోన్ లో మాట్లాడాను. ఈ సమస్య వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు, లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాం. ఫౌండేషన్ చర్చలలో వచ్చిన వివిధ నిపుణుల అభిప్రాయాలను ఆయనకు వివరించాను. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, కేంద్రమంత్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు ప్రధాని చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం కూడగడుతున్నారు. ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన అంశం. అధికారంలో ఉన్న ఎవరైనా ఈవిధంగా చర్యలు తీసుకోవాలి, ఏకాభిప్రాయం కూడగట్టాలి. నాకన్నీ తెలుసు అనే అహంభావం మంచిది కాదు. కంటికి కనబడని శత్రువు ఈ వైరస్, దీనికి ఎవరేమిటి అనేది ఉండదు. ఇలాంటి సున్నితమైన అంశంలో ప్రభుత్వాలు, ప్రజలు, సమాజం బాధ్యతగా తీసుకోవాలి. ఎవరికి తోచినవిధంగా వారు సాయపడటం మన బాధ్యతగా తీసుకోవాలి. సాటి మనిషిని ఆదుకోవడం మన బాధ్యతగా, కర్తవ్యంగా భావిద్దాం. " అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read