kerala lottery 2796151f

ఇదేదో సినిమా సీన్ అనుకోమాకండి, ఇది నిజం. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యకు రూ.65లక్షల కేరళా లాటరీ వరించింది. అయన వృత్తి యాచకుడు. లాటరీలో రూ. 65లక్షల రావడంతో పొన్నయ్యకి పట్టపగ్గాలు లేవు.

పొన్నయ్య అనంతపురంలో కులీ పని చేసుకుని బ్రతికేవాడు. ఐతే, ప్రమాదవసాత్తు ఆయన కాలు పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పోషించటం కోసం కేరళకు వలస వెళ్లి అక్కడ బిక్షగాడిగా మారాడు. వచ్చిన సొమ్ముతో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దాంతో లాటరీ టికెట్లు కొంటాడు.

కేరళలో ఈ లాటరీ టికెట్లు ప్రభుత్వ అనుమతితో జరుగుతాయి. పొన్నయ్య లాటరీ కుడా పోలీసులు అధ్వర్యంలో దెగ్గర ఉండి పూర్తీ చేసారు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో ఆ డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసులు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య.

అయితే ఇంత డబ్బు వచ్చినా, యాచక వృత్తి మాత్రం మానను అంటున్నాడు.

{youtube}a1wZafd66m4|500|250|1{/youtube}

Advertisements

అనంతపురం బిచ్చగాడికి రూ.65లక్షల లాటరీ... Last Updated: 01 April 2016